Shah Rukh Khan
-
'సల్మాన్, షారూఖ్ నన్ను చూసి నవ్వారు'.. హీరోయిన్ కామెంట్స్
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్ను సింగిల్ టేక్లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్కు గుడ్బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది. -
షారుక్ మరోసారి తీన్మార్ ?
-
షారుఖ్ ఖాన్ సినిమా రీమేక్ లో ప్రభాస్
-
'ఈ వయసులో మీలా చేయలేను'.. సౌత్ హీరోలపై షారూఖ్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది హీరోలను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్లో షారూఖ్ మాట్లాడారు. సినీరంగంలో తన కెరీర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, యష్, తలపతి విజయ్. రజనీకాంత్ లాంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులని అన్నారు. అంతే కాదు సౌత్ హీరోల డ్యాన్స్ గురించి కూడా షారూఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.షారూఖ్ మాట్లాడుతూ.. 'దక్షిణ భారత్ నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, యష్, మహేష్ బాబు, తలపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారికి నాది ఒకటే విజ్ఞప్తి. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి. డ్యాన్స్ విషయంలో వారిని ఫాలో కావడం చాలా కష్టమైన పని. ఈ వయసులో నేను మీలా డ్యాన్స్ చేయలేను.' అంటూ సరదాగా మాట్లాడారు.అంతేకాకుండా షారూఖ్ ఖాన్ తన నటుడు తన రాబోయే చిత్రం కింగ్ గురించి మాట్లాడారు. గతంలో బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తన కుమార్తె సుహానా ఖాన్తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్కుమార్ హిరానీ తెరకెక్కించిన డుంకీలో కనిపించాడు.కింగ్ మూవీ గురించి షారూఖ్ ఖాన్ చెబుతూ..'ఈ చిత్రం గురించి నేను మీకు పెద్దగా చెప్పలేను. అయితే ఇది వినోదాత్మకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. నేను ఇంతకు ముందు చాలా టైటిల్స్ వాడాను. ఇప్పుడు మన దగ్గర మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాం. రాజు ఎప్పటికీ రాజే' అని వేదికపై నవ్వులు పూయించారు. .@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025 -
సఖి.. ఫస్ట్ ఆ హీరోహీరోయిన్లతో తీద్దామనుకున్నా: మణిరత్నం
సఖి సినిమా (Sakhi Movie) అప్పట్లో సెన్సేషనల్ హిట్. పేరుకే డబ్బింగ్ మూవీ కానీ తెలుగులోనూ ఈ సినిమాను తెగ ఆరాధించారు. ఇంతకీ ఈ చిత్రం ఒరిజినల్ వర్షన్ ఏదో తెలుసా..? అలై పాయుతే (Alai Payuthey Movie). అలై పాయుతే అనే తమిళ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. ఆర్ మాధవన్, శాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. థియేటర్లలో వంద రోజులకు పైనే ఆడిన ఈ మూవీని తర్వాత హిందీలో సాతియా పేరిట రీమేక్ చేశారు. ఇంకేముంది అక్కడ కూడా బ్లాక్బస్టర్ అయింది.మాధవన్కు బదులుగా..తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్ హీరోహీరోయిన్లను అనుకున్నట్లు తెలిపాడు. మణిరత్నం మాట్లాడుతూ.. నేను ఫస్ట్ షారూఖ్, కాజోల్తో ఈ సినిమా తీయాలనుకున్నాను. షారూఖ్ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ అప్పటికి క్లైమాక్స్ సరిగ్గా కుదర్లేదు. అందుకని దాన్ని పక్కనపెట్టేసి షారూఖ్తో దిల్సే సినిమా చేశాను. ఆ మూవీ అయిపోయేసమయానికి సఖి క్లైమాక్స్ను ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచన తట్టింది అని చెప్పుకొచ్చాడు. మణిరత్నం చివరగా పొన్నియన్ సెల్వన్ 2 తెరకెక్కించాడు.చదవండి: సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్బాబు సహా అందరితో అగ్రిమెంట్! -
షారూఖ్ ఖాన్ చేతికి అరుదైన గోల్డ్ వాచ్.. ధర ఎంతో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కనిపించారు. ఆ సమయంలో ఆయన చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. ఇంతకీ అది ఏ బ్రాండ్ వాచ్ అని చాలామంది సెర్చ్ చేయడం కూడా మొదలెట్టేసారు.షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్.. ఆడేమర్స్ పిగుఎంట్ (Audemars Piguet) బ్రాండ్ అని తెలుస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్. ఎందుకంటే ఇలాంటి వాచీలు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 250 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 76 లక్షల వరకు ఉంటుందని సమాచారం.ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కనిపించిన షారుఖ్ ఖాన్.. నలుపు రెండు డ్రెస్సులో ఆకర్షణీయంగా కనిపించారు. ఈయన చేతికి ఖరీదైన వాచ్.. చెవికి ఇయర్ కఫ్ కూడా ధరించి ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాచ్ ప్రత్యేకతలుషారుఖ్ ఖాన్ చేతికున్న ఆడేమర్స్ పిగుఎంట్ వాచ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది 18 క్యారెట్ల సాండ్ గోల్డ్తో తయారైనట్లు తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ధర కూడా కొంత ఎక్కువగా ఉంది. View this post on Instagram A post shared by SHAH RUKH KHAN (@shahrukh__khan__fanclub)షారుఖ్ ఖాన్ వాచ్ కలెక్షన్నటుడు షారుఖ్ ఖాన్ వద్ద ఆడేమర్స్ పిగుఎంట్ బ్రాండ్ వాచ్ మాత్రమే కాకుండా.. పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ క్రోనోగ్రాఫ్ 5968ఏ, పాటెక్ ఫిలిప్పే నాటిలస్ 58811/1జీ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ ఆఫ్షోర్ 2640ఐపీఓ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ పర్ఫెటుల్ క్యాలెండర్, బెల్గరి ఆక్టో రోమా టూర్బిల్లాన్ సఫైర్ 103154, ట్యాగ్ హ్యూయర్ క్యాలిబర్ 1887 స్పేస్ఎక్స్, ట్యాగ్ మొనాకో సిక్స్టీ నైన్ సీడబ్ల్యు911 వంటి ఖరీదైన వాచీలు చాలానే ఉన్నాయి.ఇదీ చదవండి: 80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే.. -
షారుఖ్ ఖాన్కి రూ.9 కోట్లు వెనక్కి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్కి (Sharukh Khan) మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్' (Mannat) లీజును యాజమాన్యంగా మార్చుకునేందుకు అధికంగా చెల్లించిన రూ.9 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది.2019లో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని పురాతన ఆస్తిని 'క్లాస్ 1 పూర్తి యాజమాన్యం'గా మార్చారని, దాని కోసం కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారని రెసిడెంట్ సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. ప్రీమియం లెక్కింపులో ట్యాబులేషన్ లోపాన్ని గుర్తించిన తర్వాత, షారుఖ్ ఖాన్ దంపతులు ఇటీవల మంజూరైన రీఫండ్ కోసం రెవెన్యూ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.మన్నత్ భవనం లీజ్ కన్వర్షన్ కోసం షారుఖ్ ఖాన్ దంపతులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అన్నది అధికారులు ధ్రువీకరించలేదు.ఇంద్ర భవనమే!బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా మన్నత్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఈ భవనాన్ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ అని పేరు పెట్టారు. గౌరీ ఖాన్ తన భర్త షారుఖ్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో భారీ లగ్జరీ హోమ్ థియేటర్ ఉంది. ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు.మన్నత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం లేదని చెప్పడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. -
IIFA అవార్డ్స్ విలేకరుల సమావేశంలో షారుఖ్ ఖాన్,నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
-
ఆ స్టార్ హీరో ఇంట్లో చోరీకి ప్లాన్.. వర్కవుట్ కాకపోవడంతో సైఫ్ ఫ్లాట్లో!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత.. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడట! షారూఖ్ నివాసమైన మన్నత్లో జనవరి 14న చోరీకి పథకం రచించాడట! కానీ అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడని తెలుస్తోంది. దీంతో అతడు పటిష్ట భద్రత లేని సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకున్నాడు.ఏం జరిగిందంటే?బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసముండే బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి జనవరి 16న గుర్తు తెలియని దుండగుడు దూరాడు. సైఫ్ చిన్న కుమారుడు జెహ్ (Jehangir Ali Khan) గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను గమనించిన పనిమనిషి బిగ్గరగా కేకలు వేసింది. ఆ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో దుండగుడు సైఫ్ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆరు కత్తిపోట్లతో రక్తమోడుతున్న సైఫ్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారు కూడా సిద్ధంగా లేకపోవడం శోచనీయం. దీంతో నటుడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో తండ్రిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరగ్గా ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్పై దాడి.. దుండగుడి డిమాండ్ ఏంటంటే.? -
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్కు, ఈవెంట్స్కు, ప్రమోషన్స్కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
పెళ్లిలో డ్యాన్స్.. షారూఖ్ ఎంత తీసుకున్నాడేంటి?
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఇటీవల ఢిల్లీలో ఓ పెళ్లికి హాజరయ్యాడు. వధూవరులతో ముచ్చటించడంతో పాటు స్టేజీపై డ్యాన్స్ కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పెళ్లికూతురి మేకప్ ఆర్టిస్ట్ అమృత కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కాగా పెళ్లికూతురు ఎంతో అదృష్టవంతురాలని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.అతిథిగానా? లేదా..ఓ వ్యక్తి.. వివాహ వేడుకకు వచ్చేందుకు షారూఖ్ ఎంత తీసుకున్నాడు? అని అడగ్గా అతడు ఫ్యామిలీ ఫ్రెండ్ అని అమృత బదులిచ్చింది. అతడు అతిథిగా వచ్చాడా? లేదా స్టేజీపై పర్ఫామ్ చేయడానికి వచ్చాడా? అని మరొకరు ప్రశ్నించగా అఫ్కోర్స్.. స్టేజీపై సందడి చేసేందుకే వచ్చాడని అమృత రిప్లై ఇచ్చింది.సినిమాసినిమాల విషయానికి వస్తే షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారూఖ్ కూతురు సుహానా కూడా భాగం కానుంది. అలాగే ముఫాసా: ద లయన్ కింగ్ అనే యానిమేటెడ్ సినిమాలో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Amrit kaur (@amritkaur_artistry) చదవండి: వీడియో లీక్పై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్ -
పుష్ప-2 అడ్వాన్స్ బుకింగ్స్.. 12 గంటల్లోనే షారూఖ్ సినిమాను దాటేసింది!
మరో మూడు రోజుల్లో థియేటర్స్ షేక్ కానున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూడేళ్ల కష్టం ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై కనిపించనుంది. 2021లో సృష్టించిన రికార్డులన్నీ మొదటి రోజే బద్దలయ్యేలా కనిపిస్తోంది. పుష్పకు సీక్వెల్గా తెరకెక్కించిన పుష్ప-2 ఈనెల 5న థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే ఓవర్సీస్ టికెట్స్ బుకింగ్స్ పూర్తి కాగా.. ఇప్పుడు తెలంగాణలోనూ మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా ఒక రోజు గడవకముందే రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. టికెట్స్ విడుదలైన కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్- 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్బస్టర్ చిత్రాలను అధిగమించింది.పుష్ప 2 ది రూల్ అడ్వాన్స్ బుకింగ్ కొన్ని గంటల్లో రూ.10 కోట్లను దాటేసింది. పుష్ప 2 బుకింగ్ మొదలైన 12 గంటల్లోనే 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గతేడాది షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి 2 లక్షల టిక్కెట్లు మాత్రమే బుకింగ్స్ అయ్యాయి. పుష్ప- 2 కన్నడ బ్లాక్బస్టర్ కేజీఎఫ్-2ను సైతం మించిపోయింది. 2022లో ఈ మూవీ టికెట్స్ 12 గంటల్లో 1.25 లక్షలు మాత్రమే సేల్స్ సాధించింది. యష్ నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ-సేల్స్లో రూ.80 కోట్లు వసూలు చేసింది.రాజమౌళి బాహుబలి-2 తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్లో రూ.90 కోట్ల వసూళ్ల మేర టికెట్స్ విక్రయించారు. తొలి 12 గంటల అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే పుష్ప- 2 హిందీలో రూ.5.5 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే తొలి రోజు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులను అధిగమించే ఛాన్స్ ఉంది. -
పుష్పకు ఆదరణ కరువు.. రూ.1 కోటి కూడా రాలే!
క్లాసిక్, బ్లాక్బస్టర్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ పుష్పను ఇటీవలే మళ్లీ విడుదల చేశాడు. నవంబర్ 22 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్ థియేటర్లలో ఆడుతోంది. దీనితో పాటు హిందీ కల్ట్ క్లాసిక్ కరణ్ అర్జున్ కూడా ఒకేరోజు రిలీజైంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1 కోటి వసూలు చేసింది.ఏ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?పుష్ప కేవలం రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. రీరిలీజ్ ట్రెండ్లో కరణ్ అర్జున్, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్ ఖాన్ 'కల్ హో నా హో' సినిమా కూడా నవంబర్ 15న రీరిలీజ్ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.పుష్ప 2ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. -
తండ్రికున్న చరిష్మా ఈమెకెక్కడిది?.. షారూఖ్ కూతురిపై ట్రోలింగ్
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈజీగా రాణించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు! ఎంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటారు. పైగా వారి అంచనాలు కూడా ఆకాశాన్నంటేలా ఉంటాయి. వాటిని అందుకోవడానికి సెలబ్రిటీ కిడ్స్ మరింత కష్టపడాల్సి ఉంటుంది.ఆదిలోనే ట్రోలింగ్ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ కాన్ కూతురు సుహానా గతేడాది 'ద ఆర్చీస్' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తను పోషించిన వెరోనికా పాత్రకు గానూ విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా సుహానా ఓ సెల్ఫోన్ యాడ్లో నటించింది. ఇందులో ఆమె ఓ డైలాగ్ చెప్పి తర్వాత వచ్చే మ్యూజిక్కు స్టెప్పులేస్తుంటుంది. ఇప్పుడు మరోసారిఈ యాడ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తండ్రికున్న చరిష్మా కూతురికి లేదని విమర్శిస్తున్నారు. 'తన స్క్రీన్ ప్రెసెన్సే నెగెటివ్గా అనిపిస్తోంది, 10 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆ యాడ్ చూడలేకపోతున్నా..', 'తను సైడ్ క్యారెక్టర్లకే పనికొస్తుంది తప్ప ప్రధాన పాత్రలకు కాదు' అని హేళన చేస్తున్నారు. అందరి నోళ్లు మూయిస్తుంది!కొందరు మాత్రం తన హెయిర్ స్టైల్ బాగోలేదని, డైరెక్షన్ కూడా సెట్టవలేదని.. అందుకు పూర్తిగా సుహానాదే తప్పని నిందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సుహానా ప్రస్తుతం తన తండ్రితో కలిసి కింగ్ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో అయినా తనను విమర్శించేవారి నోళ్లు మూయిస్తుందేమో చూడాలి!చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్
చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకోవడాన్ని మించిన బాధ మరొకటి లేదంటున్నాడు హీరో షారూఖ్ ఖాన్. ద గ్లోబల్ ఫ్రెయిట్ సమ్మిట్ వేదికలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. నా చిన్నతనంలోనే అమ్మానాన్న మరణించారు. నాన్న 14 ఏళ్ల వయసులో, అమ్మ 24 ఏళ్ల వయసులో చనిపోయారు. పదేళ్ల వ్యవధిలోనే ఇద్దర్నీ కోల్పోయాను. ఎక్కడికెళ్లాలో తెలియలేదు. పేరెంట్స్ కోసం కష్టపడ్డా..నాతో పాటు అక్క కూడా ఉంది. మా ఇద్దరినీ ఈ ప్రపంచంలో వదిలేసి పోయారు. ఆకాశంలోని నక్షత్రాల్లో కలిసిపోయారు. ఎప్పటికైనా ఆ నక్షత్రాల్ని అందుకోవాలనుకునేవాడిని. బహుశా అక్కడ కూడా వాళ్లు మా గురించి కంగారుపడేవారేమో! అందుకనే జీవితంలో సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడ్డాను. ఎక్కడున్నా నా పేరెంట్స్ బాధపడకూడదని ప్రయత్నించాను. చివరకు అనుకున్నది సాధించాను. గిల్టీగా ఫీల్ అయ్యేవాడినివాళ్లకన్నా ముందు నేను చనిపోయుంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నేను తిరిగి రాలేనన్న బాధలో నుంచి వారు బయటపడేవారు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ చివరగా డంకీ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి షారూఖ్ కూతురు సుహానా ఖాన్తో పాటు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.చదవండి: విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే? -
ఇదేం పిచ్చి సామీ.. హీరో కోసం 95 రోజులుగా!
సినీ ఇండస్ట్రీలో హీరోలకు క్రేజే వేరు. హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ వీరికే ఉంటుంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా ఒకరు. ఆయనకు వరల్డ్ వైడ్గా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలవడం కోసం చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను షారూఖ్ ఖాన్ను కలిసేందుకు దాదాపు 95 రోజుల పాటు ఆయన నివాసమైన మన్నత్ బయటే ఉన్నాడట. జార్ఖండ్కు చెందిన వీరాభిమాని షారూఖ్ను కలవాలన్న ఆశతో ఇంటి బయటే వేచి చూశాడు. చివరికీ షారూఖ్ను కలిసి తన కోరిక నెరవేర్చుకున్నాడు. అభిమాన హీరోతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. నవంబర్ 2న షారూక్ ఖాన్ తన 59వ బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు.గతేడాది బ్యాక్-టు-బ్యాక్ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్ కింగ్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయన కుమార్తె సుహానా ఖాన్ నటించనున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ
సినిమాలో ఏ హీరోయిన్ను సెలక్ట్ చేసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారంటోంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ ధావన్ 'జుడ్వా', షారూఖ్ ఖాన్ 'డుంకీ' సినిమాలు డబ్బు కోసం చేశానని అందరూ అనుకుంటారు. ఈ చిత్రాల వల్ల నేను ఎంతో సంపాదించానని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవం.. మీ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.పెద్ద సినిమాల్లో ఎక్కువ పారితోషికం?నా చుట్టూ కథ తిరిగే సినిమాల్లోనే నాకు ఎక్కువ పారితోషికం లభిస్తుంది. ఉదాహరణకు హసీన్ దిల్రుబా వంటివి. మిగతా చిత్రాల్లో అంత డబ్బేమీ ఇవ్వరు. పైగా నన్ను పెద్ద సినిమాలో సెలక్ట్ చేసుకుని నాకే ఏదో ఉపకారం చేసినట్లు ఫీలవుతారు.హీరోలే డిసైడ్ చేస్తున్నారుఒక సినిమాలో ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు అంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్ను తీసుకోవాలనుకోరు. అంతేకాదు, ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు. ఎవరో కొందరు సక్సెస్ఫుల్ దర్శకులు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్ను తీసుకుంటారు.ట్రెండింగ్లో ఉన్నవారే కావాలి!ఎక్కువగా హీరోలు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటారు. లేదా తమను డామినేట్ చేయని నటీమణులు పక్కన ఉండాలని ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది. కాగా తాప్సీ పన్ను చివరగా ఖేల్ ఖేల్ మే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె వో లడ్కీ హై కహా సినిమా చేస్తోంది.చదవండి: ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..? -
ఇండియన్ రిచ్చెస్ట్ హీరో 'షారుఖ్ ఖాన్' ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఇండియన్ రిచ్చెస్ట్ సినీ నటుడు ఎవరని అడిగితే వెంటనే షారుఖ్ పేరే చెబుతారు. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు ఆయన జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్తోనే కెరియర్ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్ బాలీవుడ్ బాద్షా అవడమే కాకుండా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇండియాలోమ రిచ్చెస్ట్ హీరోగా షారుఖ్ ఉన్నారు.ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోషారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 7300 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు.18 ఏళ్ల వయసులోనే ప్రేమ.. హిందూ సాంప్రదాయంలో పెళ్లిషారుక్ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్ను 1991లో సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్ తమ ప్రేమకథను పంచుకున్నారు. షారుక్ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్ గౌరీ ఫోన్ నెంబర్ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు. -
పడిలేచిన కెరటం.. చిల్లిగవ్వ లేకుండా ముంబైకి.. ఇప్పుడేమో వేలకోట్లు ఆస్తి! (ఫొటోలు)
-
సినిమాలు మానేద్దామని అనుకున్నా.. అంతా షారూఖ్ వల్లే: కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ ప్రస్తుతం దో పట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ చిత్రంలో కాజోల్ తొలిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆదిపురుష్ భామ కృతి సనన్ కూడా నటిస్తోంది. తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న కాజోల్ అలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్తో తనతో చెప్పిన అనుభవాన్ని వివరించింది.సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే నటనను విడిచి పెట్టాలనుకున్నట్లు కాజోల్ తెలిపింది. నా మూడో సినిమాకే చాలా అలసిపోయినట్లు అనిపించింది.. దీంతో నటనకు గుడ్ బై చెప్పాలనుకున్నా అని వెల్లడించింది. కానీ షారూఖ్ ఖాన్ మాటల వల్లే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్నానని పేర్కొంది.కాజోల్ మాట్లాడుతూ..' చాలా ఏళ్ల క్రితం ఉధార్ కి జిందగీ అనే సినిమా చేశా. అదే నా మూడో సినిమా. ఆ సమయంలో ఇండస్ట్రీ చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు నా వయసు దాదాపు 18 ఏళ్లు ఉంటుంది. నేను ఆ సినిమాను పూర్తి చేశా. ఇప్పటికీ నాకు గుర్తుంది. నీకు నటన తెలుసు.. కానీ మీరు ఇంకా నేర్చుకోవాలి' అని సలహా ఇచ్చారని తెలిపింది.కాగా.. కాజోల్ 1992లో బేఖుడి మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాజీగర్ , కరణ్ అర్జున్ , దిల్వాలే దుల్హనియా లే జాయేంగే , గుప్త్ , ఇష్క్ , కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం దోపట్టి మూవీతో కనిపించనుంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
పెళ్లి కోసం షారుఖ్ ఖాన్ పేరునే మార్చుకున్నాడా?
బాలీవుడ్ లో అందమైన జంటలలో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ఒకరు. విరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1991లో షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. ఓ పార్టీలో గౌరిని చూసిన షారుఖ్.. తొలి చూపుతోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడట. తన భార్యగా గౌరీనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడట. అప్పటికి షారుఖ్ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. చాలా కాలం తర్వాత షారుఖ్ ప్రేమను గౌరి అంగీకరించింది. అయితే వీరి వివాహానికి గౌరి ఫ్యామిలీ వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో షారుఖ్ పేరుని అభినవ్గా మార్చి ఫ్యామిలీ వాళ్లకి పరిచయం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని గౌరీ గతంలో ఓ ఇంటర్యూలో చెప్పింది.‘ఇద్దరి మతం వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. దీంతో రిజిస్ట్రైషన్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత షారుఖ్కి అభినవ్ అని పేరు మార్చి ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాను. అలా పరిచయం చేస్తే షారుఖ్ హిందువు అని భావించి.. పెళ్లికి ఒప్పుకుంటారనుకున్నాను. అది చాలా సిల్లీ, చైల్డీష్ ఆలోచన’ అని గౌరి ఓ ఇంటర్యూలో చెప్పింది.చాలా గొడవల షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. 1991 అక్టోబర్ 25న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత గౌరి మతం మార్చుకుంటుందని అంతా భావించారు. కానీ ఆమె మారలేదు. షారుఖ్ కూడా ఈ విషయంలో గౌరిని బలవంతం పెట్టలేదు. ‘నాలాగే షారుఖ్ కూడా అన్ని మతాలకు గౌరవం ఇస్తాడు. తన మతంలోని మారమని ఎప్పుడూ నన్ను అడగలేదు’అని ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ చెప్పొచ్చింది. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. ఆర్యన్ ఖాన్ , సుహానా, అబ్రం ఖాన్. పెళ్లి తర్వాత గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియాలోని టాప్ ఇంటీరియర్ డిజైనర్లలో గౌరీ ఖాన్ ఒకరు. -
‘వాచ్’ దిస్ ట్రెండ్ : కాలం కలిసొస్తోంది
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చేతికి ఒకసారి సుమారు 4.75 కోట్ల విలువ చేసే నీలంరంగు ఆడెమర్స్ పిగ్యూట్ వాచ్తో మెరిపించాడు. కోట్ల నుంచి ఐదు లక్షల విలువ చేసే టగ్ హెయర్ వరకు ఏడెనిమిది వాచ్లతో కనిపిస్తాడు ఎస్ఆర్కే. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే నాలుగు కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె ఎఫ్ 1లో టైమ్ చూసుకుంటాడు. రామ్చరణ్ దగ్గర మూడు కోట్ల విలువ చేసే రిచర్డ్ మిల్లె నుంచి ఆరు లక్షల విలువ చేసే రోలెక్స్ యాచ్ మాస్టర్ వరకు అరడజనుకు పైగా వాచ్లున్నట్లు సమాచారం. ఇక నటీమణుల విషయానికి వస్తే నయనతార కోటికి పైగా ధర పలికే రిచర్డ్ మిల్లె ఆర్ ఎమ్ 11 వాచ్తో కాలాన్ని వాచ్ చేస్తుంది.స్మార్ట్ ఫోన్ వచ్చినా రిస్ట్ వాచ్లకు ‘కాలం’ చెల్లలేదు. నిజమే, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రిస్ట్ వాచ్లకు కాలం చెల్లిందనిపించింది. ఓ దశాబ్దం పాటు వాచీల మార్కెట్ డీలా పడిన మాట కూడా నిజమే. అయితే ఆ రోజుల్లో కూడా సెలబ్రిటీలు, సంపన్నులు, తరచూ విదేశీ టూర్లు చేసే వాళ్లు లక్షల ఖరీదు చేసి వాచ్లు పెట్టుకోవడం మాత్రం కొనసాగింది. మన సినీ సెలబ్రిటీలైతే రిచర్డ్ మిల్లె, టగ్ హెయర్, హబ్లాట్, ఫ్రాంక్ ముల్లర్, ఆడెమర్స్ పిగ్యూట్, రాడో, పటేక్ ఫిలిప్పె, ఓమెగా, రోలెక్స్ నుంచి ఐడబ్ల్యూసీ వరకు ఐదు కోట్ల విలువ చేసే వాచ్ల నుంచి ఐదు లక్షల రూ΄ాయల వాచ్లు వాడుతున్నారు. ఈ ట్రెండ్ సెలబ్రిటీల దగ్గరే ఆగి΄ోకుండా గడచిన రెండేళ్లుగా కామన్ మ్యాన్ వరకు విస్తరించింది. ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి కూడా యాభై వేల నుంచి లక్షల రూ΄ాయల రిస్ట్ వాచ్లు కొనుగోలు చేస్తోంది. ప్రపంచ గడియారాల తయారీ కేంద్రం స్విట్జర్లాండ్ నుంచి మనదేశానికి దిగుమతి అవుతోన్న వాచ్ల సంఖ్య ఏడాదకేడాదికీ పెరుగుతోంది. 2026 నాటికి స్విస్ నుంచి వాచ్లు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ టాప్టెన్లో ఉంటుందని చెబుతున్నారు ఆ దేశ మార్కెట్ నిపుణులు. ఉంగరంలా మనదేశంలో 40 ఏళ్లుగా వేళ్లూనుకుని ఉన్న టైటాన్తో΄ాటు దాదాపు 30 కంపెనీలున్నాయి. వీటి మార్కెట్ వీటికి ఉంది. మనదేశీయ కంపెనీలు వందల నుంచి లక్షల విలువ చేసే గోల్డ్ వాచ్లు కూడా తయారు చేస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సంపన్న మహిళలు బంగారు వాచ్ ధరించి మురిసి΄ోయేవాళ్లు. ఇప్పుడు రోలెక్స్, రాడో కపుల్ వాచ్లు, రోజ్గోల్డ్ మీద మనసు పడుతున్నారు. యూఎస్కి చెందిన ఫాజిల్ కంపెనీ మహిళల కోసం తయారు చేస్తున్న రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వాచ్ల మీద మనసు పారేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇండియా నుంచి యూఎస్కి మైగ్రేషన్ ఎక్కువ కావడమే. యూఎస్లో సెటిలైన యువత వాళ్ల తల్లులకు ఈ వాచ్లను బహుమతిగా ఇస్తున్నారు. దాంతో వేడుకల్లో మహిళల మణికట్టుకు రోజ్గోల్డ్ వాచ్ మెరుస్తోంది. మొత్తానికి మనదేశంలో వాచ్ల ప్రేమికులు ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వాచ్లు కొంటున్నారు. యువతులు మాత్రం వాచ్ అంటే మణికట్టుకే ఎందుకు పెట్టుకోవాలంటూ వేలికి ఉంగరంలా ధరించే వాచ్లకు మొగ్గుచూపుతున్నారు.– వి.ఎమ్.ఆర్. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
‘ధూమ్ 4’లో విలన్గా సూర్య.!