Srivas
-
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్
‘‘శ్రీవాస్గారితో ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలు చేశాను. మూడో సినిమాగా ‘రామబాణం’ చేద్దామనుకున్నప్పుడు ఆ రెండు సినిమాల్లా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ‘రామబాణం’ వంటి మంచి సినిమా తీసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగార్లకు థ్యాంక్స్. అందరికీ మా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీవాస్ మాట్లాడుతూ– ‘‘రామబాణం’ ఔట్పుట్ చూశాక నమ్మకంగా ఉన్నాం. ఇంటర్వెల్, క్లయిమాక్స్ హైలెట్ అవుతాయి. సెకండ్ హాఫ్లోని భావోద్వేగ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. ‘‘ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
గోపిచంద్తో శ్రీవాస్ హ్యాట్రిక్ పక్కా! ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది..
‘‘గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల తరహాలోనే ఫ్యామిలీ, యాక్షన్, బ్రదర్ సెంటి మెంట్ నేపథ్యంలో ‘రామబాణం’ ఉంటుంది. ఈ చిత్రంతో గోపీచంద్– శ్రీనివాస్ హ్యాట్రిక్ హిట్ కొడతారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా జగపతిబాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ చెప్పిన విశేషాలు. ► సినిమాలపై ఉన్న ప్యాషన్తో సాఫ్ట్వేర్ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పరిశోధన చేసి, ఫ్యాక్టరీ మోడల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. మిగతా కొత్త నిర్మాతల్లాగా ఒకట్రెండు సినిమాలు కాకుండా ఎక్కువ తీస్తున్నాం. మంచి విజయాలతో విజయవంతమైన సంస్థగా ఎదగడం హ్యాపీ. ► శ్రీవాస్ ‘రామబాణం’ కథ చెప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందనిపించింది. క్రియేటివ్ సైడ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. మంచి ఔట్పుట్ తీసుకొచ్చారు. ► కాన్సెప్ట్ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు నిర్మిస్తున్నాం. అయితే సినిమా విజయం అనేది మన చేతుల్లో ఉండదు.. కానీ వంద శాతం మన ప్రయత్నం చేయాలి. మేం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి సినిమాపై ఆసక్తి ఉంది. శర్వానంద్తో చేస్తున్న సినిమా విషయంలో తన ప్రమేయం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, అల్లు అర్జున్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు నిర్మించాలనుంది.. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. -
మాస్ మసాలా స్టార్ట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటరై్టన్మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో డైరెక్టర్ శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్రదర్శకుడు తేజ తొలి షాట్ డైరెక్షన్ చేశారు. ‘‘మాస్ మసాలా ఎంటరై్టనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సోమవారమే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తేజ, కాజల్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ రెండోసారి నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి దానం నాగేందర్, నటుడు అభిమన్యు సింగ్ పాల్గొన్నారు. సోనూ సూద్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శీర్షరే, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు. -
పంచభూతాలే ఈ సినిమా చేయించాయి
‘‘నేను మాట్లాడాల్సిందంతా నా థియేట్రికల్ ట్రైలర్, పంచభూతాల సాంగ్ మాట్లాడేశాయి. కొత్త కథలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని ఈ స్క్రిప్ట్ని ఎంచుకున్నాను. పంచభూతాల సపోర్ట్తోనే ఈ సినిమా జరిగిందనుకుంటాను. పంచభూతాలే నాతో ఈ సినిమా చేయించాయి అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీవాస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్లో జరిగింది. ట్రైలర్ను, ఆడియో సీడీలను పార్లమెంట్ సభ్యులు, టీ న్యూస్ ఎండీ సంతోశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ –‘‘నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. బడ్జెట్ ఎక్కువైనా సరే నిర్మాత అభిషేక్ కథను నమ్మి కాంప్రమైజ్ అవ్వలేదు. హర్షవర్ధన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్థర్ విల్సన్ కెమెరా, చంటిగారి ఎడిటింగ్, అనంత శ్రీరామ్ లిరిక్స్ హైలైట్స్గా నిలుస్తాయి. విలన్స్ చాలా పవర్ఫుల్గా ఉండాలని జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణాని సెలెక్ట్ చేసుకున్నాం. ఒక దర్శకుడికి శ్రీనివాస్లాంటి హీరో దొరికితే హ్యాపీగా ఉంటుంది. ఏం చెప్పినా చేసేవాడు. ఫ్యూచర్లో పెద్ద స్థాయికి వెళ్తాడు. పూజా హెగ్డే సౌందర్యలహరి క్యారెక్టర్కి మౌల్డ్ అయిపోయింది’’ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘ఇంత మంచి సినిమాను నాకిచ్చినందుకు శ్రీవాస్ గారికి థ్యాంక్స్. కెరీర్ స్టార్టింగ్లోనే ఇలాంటి సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి కథను నమ్మి నిర్మించినందుకు నిర్మాత అభిషేక్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శ్రీవాస్గారు ఇందులో డిఫరెంట్ రోల్ ఇచ్చారు. సాయి చాలా హార్డ్వర్కింగ్ పర్సన్. అభిషేక్ గారికి చాలా డబ్బులు రావాలి’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘ఇలాంటి ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అనంత శ్రీరామ్గారి సపోర్ట్ లేకపోతే పంచభూతాల సాంగ్ ఇలా వచ్చేది కాదు’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘సాంగ్ చూడగానే ‘లెజెండ్’ సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ బ్లాక్బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘శ్రీనివాస్తో ఓ సినిమా తీశాను. చాలా ఎనర్జిటిక్. కోపరేటివ్. ఈ సినిమా విజువల్ ఫీస్ట్లా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘సినిమాను ఇష్టపడే వ్యక్తి శ్రీవాస్. బ్లాక్బస్టర్ కొట్టి టాప్ రేంజ్కి వెళ్లాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు దశరథ్. -
డూప్ లేకుండా...
యస్... ఫైట్ ఓకే అన్నారు శ్రీవాస్. శ్రీనివాస్ కూల్ అయ్యారు. మరి అలాంటి ఇలాంటి ఫైట్ కాదది. రిస్కీ ఫైట్. గాల్లో ఎగిరి తన్నడం, పెద్ద గోడ మీద నుంచి దూకడం.. వాట్ నాట్ ఎన్ని రిస్కులు తీసుకోవాలో అన్ని రిస్కులూ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్తో చేయించారు ఫైట్మాస్టర్ పీటర్ హెయిన్. దర్శకుడు శ్రీవాస్ పక్కా ప్లాన్తో ఈ ఫైట్ తీశారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి సంబంధించిన ఫైట్ ఇది. ప్రస్తుతం పొల్లాచ్చీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రనిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘బలమైన కథ–కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలుతో నిర్మిస్తున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా పొల్లాచ్చీలో 15 రోజుల షెడ్యూల్లో పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీశాం. సాయిశ్రీనివాస్ డూప్ లేకుండా ఈ ఫైట్ సీక్వెన్స్లో పాల్గొనడం విశేషం. ఈ ఫైట్ సినిమాకి కీలకంగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
సరికొత్తగా...
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్పై అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఓ వైవిధ్యమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీనివాస్ను సరికొత్తగా చూపించనున్నా. బాలీవుడ్ హీరోయిన్ను శ్రీనివాస్ సరసన సెలక్ట్ చేస్తాం. ఒక మేజర్ షెడ్యూల్ను ఫారిన్లో ప్లాన్ చేస్తున్నాం. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత పీటర్ హెయిన్స్ ఫైట్స్ సమకూర్చుతున్నారు’’ అన్నారు. ‘‘శ్రీవాస్ కథ బాగా నచ్చింది. శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండేది. ఇప్పుడు మా కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం సంతోషంగా ఉంది. శ్రీనివాస్, శ్రీవాస్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది’’ అన్నారు నిర్మాత. జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి (కన్నడ నటుడు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ ప్రారంభం
-
డిక్టేటర్ డైరెక్టర్తో నాగచైతన్య
యంగ్ హీరో నాగచైతన్య యమ స్పీడు మీద ఉన్నాడు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్లో నటిస్తున్నాడు. మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి చిత్రాలను కూడా ఫైనల్ చేస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఇటీవల డిక్టేటర్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. కమర్షియల్ డైరెక్టర్గా మంచి పేరున్న శ్రీవాస్, నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చైతన్యకు కథ వినిపించిన శ్రీవాస్, అతని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు చైతు. -
సంక్రాంతి సక్సెస్ ఈ నలుగురిదీ!
స్టార్ టాక్ దర్శకులు సుకుమార్, శ్రీవాస్, మేర్లపాక గాంధీ, కల్యాణ్కృష్ణ - నలుగురూ ఇప్పుడు హాట్ టాపిక్. వీళ్ళ నలుగురి సినిమాలూ ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగిన సినిమా పందెంకోళ్ళు. వివిధ హీరోల అభిమానులు, పరిశ్రమలోని వర్గాలు కత్తులు నూరుకుంటున్న టైమ్లో ఈ నలుగురు దర్శకులనూ ‘సాక్షి ఫ్యామిలీ’ ఒకే దగ్గర కూర్చోబెట్టి, వాళ్ళతో ముచ్చటించింది. తీసిన సినిమాలు, నటించిన హీరోలు వేరైనా, పరిశ్రమలో అందరూ ఒకటేనని నిరూపించింది. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తులైన నలుగురు దర్శకులతో ‘సాక్షి’ జరిపిన ఎక్స్క్లూజివ్ డబుల్ ‘డబుల్ ధమాకా’ ఇది... మీ నలుగురు దర్శకులకూ ఒకరికొకరు పరిచయమేనా? లేక ఇప్పుడే కలిశారా? శ్రీవాస్ - నాకు సుక్కు (సుకుమార్) బాగా తెలుసు. సంక్రాంతికి వచ్చిన మా ‘డిక్టేటర్’, సుక్కు ‘నాన్నకు ప్రేమతో’ పనులు ప్రసాద్ ల్యాబ్స్లో పక్కపక్కనే జరిగాయి. ‘ఎక్స్ప్రెస్ రాజా’ మేర్లపాక గాంధీ, ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో దర్శకుడైన యువకుడు కల్యాణ్కృష్ణ గురించి విన్నాను. గాంధీ - నేను, సుకుమార్ గారు యాక్టర్ బ్రహ్మాజీ గారింట్లో ఒకసారి కలిశాం. సుకుమార్- నాకు శ్రీవాస్ గారు బాగా తెలుసు. ఇక, మా కాకినాడ అబ్బాయి కల్యాణ్కృష్ణను బన్నీ పార్టీలో కలిశా. ఇక, గాంధీ వాళ్ళ నాన్న గారు మేర్లపాక మురళి నవలా రచయిత కదా! ఆయన సాహిత్యంతో పరిచయముంది. మీ నలుగురిలో గాంధీ (చిత్తూరు జిల్లా) మినహా మిగిలిన ముగ్గురూ తూర్పుగోదావరి జిల్లా వాసులే? శ్రీవాస్ - అవును. మేమూ ముందు గమనించలేదు. ఇందాకే ఎవరో ఈ మాట అన్నారు. మా గోదావరి జిల్లాల్లో ఉండే ఆప్యాయతలు, వెటకారాలు అన్నీ మాలో ఉన్నాయి. ఇంకో మాటేమిటంటే, మీ నలుగురూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవాళ్ళు. పల్లె సంస్కృతికి ప్రతిబింబమైన సంక్రాంతికే మీ నలుగురి సినిమాలూ రావడం... శ్రీవాస్ - యాదృచ్ఛికమే అయినా ఆనందంగా ఉంది. సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? శ్రీవాస్ - మా ఊరు సీతానగరంలో రామదుర్గా పిక్చర్ ప్యాలెస్ అనే సినిమా హాలుండేది. సంక్రాంతి అనగానే... సినిమాలు, హాలులో జనం కొట్టే విజిల్స్ గుర్తొస్తాయి. బాలయ్య లాంటి మాస్ హీరో దొరకడంతో, అనుకోకుండా సరిగ్గా అలాంటి సినిమానే తీశా. సుకుమార్ - ఆ... ఇదీ కారణం! (నవ్వులు...) గాంధీ - మాది తిరుపతి దగ్గర రేణిగుంట. నాకు కూడా సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి సినిమాలే. ఫ్రెండ్స్తో కలసి రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళి, అక్కడ సినిమాలు చూసేవాళ్ళం. ‘నరసింహనాయుడు’ లాంటి సినిమాలు సంక్రాంతికి చూసి, ఎంజాయ్ చేసిన రోజులు మామూలువి కావు. సుకుమార్ గారూ! మరి, మీరు చెప్పండి? సుకుమార్ - ముందుగా తమ్ముడు కల్యాణ్కృష్ణ చెబుతాడు. కల్యాణ్కృష్ణ - మా అమ్మమ్మ గారిదీ, నాయనమ్మ గారిదీ పల్లెటూరే. అందుకే, సంక్రాంతి అంటే - అందరం కలవడం, ఆనందంగా గడపడం అలవాటు. బేసిక్గా నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టం. మా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా అలాగే వచ్చింది. అందరి మూలాలూ గ్రామాల నుంచే మొదలవుతాయి. అందుకే, మా సినిమా ఎక్కువగా కనెక్ట్ అయింది. సుకుమార్ - (సరదాగా... బుంగమూతి పెడుతూ...) మా సినిమాలు కూడా కనెక్టయ్యాయండీ... (నవ్వులు...) శ్రీవాస్ - (నవ్వేస్తూ...) {పతిసారి లాగా కాకుండా ఈసారి విశేషం ఏమిటంటే, సంక్రాంతి సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. ఈసారి ‘డిక్టేటర్’ ఫుల్ మాస్... ‘నాన్నకు ప్రేమతో క్లాస్ నిండిన మాస్... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్యామిలీస్... ‘ఎక్స్ప్రెస్ రాజా’ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమాలపరంగా ఈ మధ్య ఇంత విభిన్నమైన సంక్రాంతి మరొకటి రాలేదేమో! శ్రీవాస్ - మేమందరం కలసి ఒక మాట చెబుతాం. (మిగిలినవాళ్ళ వైపు తిరిగి...) మీరు కూడా ఓటేయాలి. ఇలా వివిధ రకాలైన సినిమాలు ఒకే సీజన్లో రావడం ప్రేక్షకుల అదృష్టం. మా దురదృష్టం. ఎందుకంటే, సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల నుంచి తెలుగు సినిమాకు రూ. 150 కోట్లు వసూలవుతాయనుకుంటే, అదే మొత్తాన్ని నాలుగు సినిమాలూ పంచుకోవాల్సి వచ్చింది. నాలుగు సినిమాలొచ్చాయి కదా అని ఎక్స్ట్రా ఎమౌంట్ ఎక్కడ నుంచీ రాదు కదా! సినిమాల కోసం ఎంత ఖర్చు చేయాలని జనం ప్రిపేర్ అయ్యారో, అంతే ఖర్చు చేస్తారు. రెండు సినిమాలు రిలీజైతే, ఇదే మొత్తం ఆ రెండిటికీ వచ్చేది. సుకుమార్ - కానీ, నాలుగు రిలీజైతే నాలుగూ సక్సెస్ అనిపించుకోవడం విశేషం. నిజంగానే ఆనందించాల్సిన విషయం. ఎక్కువ మందిని సినిమా హాలులోకి ఆకర్షించాం. శ్రీవాస్ - ఒక్కోసారి రాజకీయాల లాంటివి ఎక్కువుంటాయి. వాటన్నిటి నుంచి పక్కకు తెచ్చి, సినిమా హాలులో కూర్చోబెట్టాం. సుకుమార్ - (ఛలోక్తిగా...) జనమంతా సినిమాల హడావిడిలో మునిగిపోయి, హాళ్ళలో ఉండిపోవడం వల్ల బయట క్రైమ్ రేటు బాగా తగ్గింది. అందుకు, పోలీసులతో సహా అందరూ మా సినిమా వాళ్ళను అభినందించాలి. (నవ్వులు...) శ్రీవాస్ - నిజం చెప్పాలంటే, ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాలు తీసేవాళ్ళూ అవసరం. ఇలా డిఫరెంట్ జానర్స్లో తీసేవాళ్ళుంటేనే, ప్రేక్షకులకూ బాగుంటుంది. ఇండస్ట్రీకీ బాగుంటుంది. అన్ని ఒకటే రకంగా ఉంటే చూడలేరు, చూడరు. కల్యాణ్కృష్ణ - అవును. అందరం అన్నీ చేయాలి. శ్రీవాస్ - గాంధీని కేవలం ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడనీ, కల్యాణ్కృష్ణను ఫ్యామిలీ చిత్రాల దర్శకుడనీ అనుకోనక్కర లేదు. కల్యాణ్ లైఫ్ అంతా ఇంతా ఇలాంటి సినిమాలే చేస్తూ కూర్చోరు కదా! రేపు అఖిల్తో ఒక క్యూట్ లవ్స్టోరీ చేయాల్సి వస్తే, చేస్తారు. అలాగే, గాంధీ ఒక మాస్ తరహా చిత్రం చేయాల్సి వస్తే చేస్తారు. నన్నడిగితే, అసలు డెరైక్టర్స్ ఎప్పుడూ ఒకే రకం సినిమాలు తీయాలని అనుకోరు. నా సంగతే చూస్తే, ‘లౌక్యం’ మంచి హిలేరియస్ కామెడీ ఉండే సినిమా. ఆ వెంటనే బాలయ్యబాబుతో సినిమా అనగానే ‘డిక్టేటర్’ లాంటి మాస్ స్టైల్ యాక్షన్ ఫిల్మ్ చేశాను కదా! సుకుమార్ - అవును. నేను ‘లౌక్యం’ చూశాను. చాలా క్లాస్గా ఉంటుంది. మేకింగ్ కూడా బాగుంటుంది. గమనిస్తే మీ నలుగురు దర్శకులకూ రచనా నేపథ్యం ఉంది. సుకుమార్, కల్యాణ్కృష్ణలైతే... మొదలైందే రచయితలుగా! దాని వల్ల సినిమాకు ఎంత ఉపయోగపడింది? శ్రీవాస్ - రైటరే దర్శకుడు కావడం వల్ల ఉపయోగమే. ఉదాహరణకు దాసరి గారు. ఇక, మా గురువు గారు కె. రాఘవేంద్రరావు రైటర్ కాకపోయినా, కథను అల్లుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. పెద్ద ఎన్టీయార్తో ‘అడవిరాముడు’ గురించి ఆయన చెబితే ఆశ్చర్యపోయా. ఎన్టీయార్ అప్పటి దాకా చేయని నేపథ్యంలో సినిమా అయితే బాగుంటుందని అటవీ నేపథ్యం ఎంచుకున్నారు. దానికి తగ్గట్లే హీరోను ఫారెస్ట్ ఆఫీసర్ను చేశారు. కానీ, ఆయన ఫలానా అని ముందే అది చెప్పేస్తే, డ్యూయెట్లకి కుదరదు కాబట్టి, ఆ సంగతి ఇంటర్వెల్కి చెబుదామనుకున్నారు. ఒక రైటర్ కాకపోయినా, కమర్షియల్ దర్శకుడు ఎలా ఆలోచించి, కథ అల్లుకోవాలో చెప్పడానికి అంతకు మించి ఇంక ఉదాహరణేం కావాలి! కానీ, ఈ మధ్య దర్శక - రచయితలు కూడా ఇతరుల స్క్రిప్ట్ల మీద ఆధారపడడం కూడా జరుగుతోంది! మరి, మీ రైటింగ్ స్కిల్స్ వృథా అవుతున్నట్లేగా? శ్రీవాస్ - అలా కాదు. గతంలో ‘లక్ష్యం’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రాలకు నేనే కథలు రాసుకున్నా. కానీ, మనమే కథ రాసుకొని, స్క్రిప్ట్ చేసుకోవాలంటే దానికి ఆరు నెలల నుంచి ఏడాది దాకా పడుతుంది. ఒక సినిమా అయిపోయిన వెంటనే, దాని మీద వచ్చిన విమర్శలు, రివ్యూల్లో పేర్కొన్న తప్పొప్పుల్ని అర్థం చేసుకొని, మళ్ళీ అవి జరగకుండా ఉండేలా కొత్త సినిమా స్క్రిప్ట్కి కూర్చోవాలి. ఇలా కొత్త సినిమా ఏమిటనేది - ఆలోచించుకోవడానికే 4 నెలల టైమ్ పడుతుంది. ఒక లైన్ అనుకొని, ఏ హీరో దగ్గరకు వెళ్ళినా, అప్పటికే అతను కనీసం రెండు సినిమాలు చేస్తూ ఉండి ఉంటాడు. దాంతో, మళ్ళీ వెయిటింగ్. అందుకే, దర్శకులైన మేము ఎక్కువగా బయటివారి కథలు తీసుకొని, సినిమాకు తగ్గట్లు తీర్చిదిద్దుకుంటాం. కానీ, బయటివాళ్ళ కథను జడ్జ్ చేయడానికి కూడా దర్శకుడికి రైటింగ్ స్కిల్స్ కావాల్సిందే. అది తప్పనిసరి. సుకుమార్ - ఇది కరెక్ట్. శ్రీవాస్ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. నన్నడిగితే - దర్శకుడిగా మమ్మల్ని పెట్టుకొనేది మా క్రియేషన్కి కాదు... మా జడ్జిమెంట్కి! ఫలానా కథ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది జడ్జ్ చేయడాన్ని బట్టి మా సక్సెస్ ఉంటుంది. ఎవరైతే, కథను సరిగ్గా జడ్జ్ చేయగలుగుతారో వాళ్ళకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ఫుల్ డెరైక్టర్ అవుతారు.గాంధీ గారూ! సంక్రాంతి బరిలో హేమాహేమీలైన ముగ్గురు పెద్ద హీరోల చిత్రాల మధ్య వస్తున్నప్పుడు దేన్ని నమ్మి, ధైర్యం చేశారు? మేర్లపాక గాంధీ - కంటెంట్ను నమ్ముకున్నా. వినోదంతో సాగే ‘ఎక్స్ప్రెస్ రాజా’ కథతో అందరూ కనెక్ట్ అవుతారనుకున్నాను. అనుకున్నట్లుగానే ఇవాళ చాలామంది కనెక్ట్ అయినట్లు బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ అయింది. కల్యాణ్కృష్ణ గారూ! మొదటి మూడు సినిమాలూ రిలీజైపోయాక, ఆఖరున జనవరి 15న మీ ‘సోగ్గాడి చిన్ని నాయనా’ వస్తుంటే, మీరు ఏమైనా టెన్షన్ ఫీలయ్యారా? సినిమా రిజల్ట్ ఎప్పుడు తెలిసింది? కల్యాణ్కృష్ణ - రిలీజ్కు ముందు నుంచి గట్టి నమ్మకం ఉంది. నాగార్జున గారు తన ఫ్రెండ్స్కీ, మరికొందరికీ షో వేశారు. చూసినవాళ్ళ రెస్పాన్స్ చూశాక, ‘తప్పు జరగదు’ అనే నమ్మకం మాకుంది. అయితే ఎంతైనా, సినిమా రిలీజ్కు ముందు రోజు చిన్నపాటి టెన్షనైతే ఉంది. ఇక్కడ రిలీజ్ కన్నా కొద్ది గంటల ముందే మన అర్ధరాత్రి టైమ్కే లండన్ లాంటి చోట్ల షోలు పడతాయి. అక్కడ నుంచే ఫస్ట్ హిట్ టాక్ వచ్చింది. ఇక్కడ కూడా షో పడ్డాక రెస్పాన్స్తో రిజల్ట్ తెలిసిపోయింది. శ్రీవాస్ - నిజం చెప్పాలంటే, ఇక్కడ రిలీజ్ రోజున పొద్దున్న మనం నిద్ర లేచే టైమ్కే ఓవర్సీస్ నుంచి సినిమా టాక్ వచ్చేస్తుంది. ఫోనుల్లో మెసేజ్లు, కాల్స్ వచ్చేస్తాయి. సుకుమార్ - అందుకే మేము లేట్గా నిద్ర లేస్తుంటాం (నవ్వులు...). ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకైతే రిలీజ్కు ముందు దాదాపు 500 గంటలు కంటిన్యుయస్గా పనిచేశా. అరగంట నిద్రపోవాలంటే, పెద్ద డిస్కషనే! మధ్య మధ్యలో 10 నిమిషాలు చిన్న కునుకు తీయడమే తప్ప, కంటి నిండా నిద్ర కూడా లేదు. రిలీజ్ ముందు రోజు రాత్రి కూడా ప్రింట్స్, కరెక్షన్స్ - అవన్నీ చూసుకోవడమే సరిపోయింది. వర్క్ అంతా పూర్తయ్యాక ఎప్పుడు పడుకున్నానో, నిద్ర లేచానో నాకే తెలీదు. తీరా నిద్ర లేచే సరికి ‘ఇవాళే సినిమా రిలీజ్ కదా’ అని గుర్తొచ్చింది. ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలీదు కానీ, మెమరీ 20 మిస్డ్ కాల్స్కే కాబట్టి, అవి నోట్ అయి ఉన్నాయంతే! అన్ని ఫోన్లు వచ్చాయంటే, సినిమా సక్సెస్ అన్న మాట అని అర్థమైంది. శ్రీవాస్ - రిలీజ్ రోజున మన ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంటే సినిమా హిట్. మోగకపోతే, ఫట్ అన్న మాట. సుకుమార్ - ఫోన్ మోగలేదంటే, పొరపాటున సెలైంట్ మోడ్లో పెట్టేశామేమోనని ఒకటికి, రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిందే. (నవ్వులు...) శ్రీవాస్ - ‘డిక్టేటర్’ సినిమా విషయానికొస్తే - సహ నిర్మాతగా, దర్శకుడిగా నాది డబుల్ వర్క్. అయితే, టెన్షన్ పడలేదు. సర్వసాధారణంగా సినిమావాళ్ళందరికీ రిలీజ్ ముందు రోజున బయ్యర్లు సినిమా కొనడానికి కమిటైన డబ్బులో ఎంత తగ్గించి తెస్తారో అని టెన్షన్. ‘డిక్టేటర్’ విషయానికి వస్తే - డిస్ట్రిబ్యూటర్లుఒక వారం ముందే వచ్చి, ‘నాన్నకు ప్రేమతో’ సహా మరికొన్ని సినిమాలు కూడా ఒకేసారి వస్తున్నాయి కాబట్టి, డబ్బు అనుకున్నంత సమకూరడం లేదని చెప్పారు. వాళ్ళ ఇబ్బందులు కూడా గ్రహించి, ఈరోస్ వాళ్ళతో, బాలకృష్ణ గారితో మాట్లాడాం. ముందుగా వాళ్ళు ‘డిక్టేటర్’ కొనడానికి కమిటైన డబ్బులో నుంచి 15 శాతం డిస్కౌంట్ ఇచ్చాం. దాంతో, మాకు జరగాల్సిన వ్యాపారంలో కొన్ని కోట్లు తగ్గినా, సినిమా పరిశ్రమలో అందరి క్షేమం కోసం చూశాం. డిస్ట్రిబ్యూటర్లు కూడా మిగిలినదంతా మిస్ కాకుండా కట్టారు. పరిశ్రమ క్షేమం దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ చర్యతో బాలకృష్ణ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అనుకున్నట్లుగానే, రిలీజవగానే ‘డిక్టేటర్’ హిట్ అయింది. కానీ, సినిమా రిలీజ్ రోజున సరైన టాక్ తెలుస్తుందంటారా? శ్రీవాస్ - ఏ హీరో అభిమానులైనా తమ హీరో సినిమా రిలీజ్ రోజునే చూసేస్తారు. ఫ్యాన్స్ డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. పైగా, బాలయ్యబాబు లాంటి మాస్ హీరోతో చేసే సినిమా అంటే పెద్ద ఎడ్వాంటేజ్. ఫ్యాన్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ, ముందుగా ఆనందంతో అరిచేస్తారు. ఒక్కోసారి మన సినిమా నిజంగా ఇంత హిట్టయిందా అనిపిస్తుంది. అందుకే, ఎవరమైనా సరే - ఫస్ట్ డే టాక్ నిజమా, కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటాం. మాకు డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలుసు కాబట్టి, వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతుంటాం. వాళ్ళు అబద్ధం చెప్పరు. అందుకని రెండోరోజు నుంచి నిజాలు తెలిసిపోతాయి. నాలుగైదు రోజుల తర్వాత పరిస్థితి స్పష్టంగా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే, మాటల్లో బుకాయించగలమే కానీ, డిస్ట్రిబ్యూటర్లు చూపించే అంకెలను కాదనలేం కదా! సుకుమార్, గాంధీ, కల్యాణ్కృష్ణ - అవును... అది నిజం. ఇంతకీ, మీ నలుగురికీ మిగతా ముగ్గురు దర్శకుల సినిమాల్లో, సినిమా మేకింగ్లో నచ్చిందేమిటి? శ్రీవాస్ - సుక్కుది చాలా డిఫరెంట్ స్టైల్. రెగ్యులర్ ఫార్మట్లో కాకుండా కొత్తగా తీస్తాడు. ఆ సీన్ చూసేవాళ్ళకూ, చూసేవాళ్ళకూ కొత్తదనం అనిపిస్తుంది. ‘ఆర్య’ సినిమా అలాంటి డిఫరెంట్ స్టైల్కు ఒక ఉదాహరణ. ఇక, మేర్లపాక గాంధీ ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ చూశాను. అతని ఎంటర్టైన్మెంట్ టైమింగ్ బాగుంటుంది. కల్యాణ్కృష్ణ మా తూ.గో. జిల్లా వాడేగా! మా సహజమైన గోదావరి శైలిలో సినిమా తీస్తాడు. ‘సోగ్గాడే...’ బాగుందని విన్నా. కల్యాణ్కృష్ణ - సుకుమార్ గారిలో నాకు నచ్చేది ఏమిటంటే - ‘ఆర్య’లోని వన్సైడ్ లవ్ మొదలు ఏది చెప్పినా, తనదైన లాజిక్తో కన్విన్స్ చేస్తారు. శ్రీవాస్ గారి ‘లక్ష్యం’ నుంచి అన్ని సినిమాలూ చూస్తూ వచ్చా. ఎమోషన్ని ఆయన బాగా హ్యాండిల్ చేస్తారు. ఇక, గాంధీ గారి కామెడీ టైమింగ్ నాకు బాగుంటుంది. మేర్లపాక గాంధీ - నాకు శ్రీవాస్ గారి సినిమాల్లో అటు ఎంటర్టైన్మెంట్, ఇటు ఎమోషన్ - రెండూ డీల్ చేయడం బాగుంటుంది. సుకుమార్ గారు మంచి క్రియేటివ్ డెరైక్టర్. సుకుమార్ - శ్రీవాస్ సినిమాల గురించి ఇందాకే చెప్పేశాను. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ నాకు నచ్చింది. కల్యాణ్కృష్ణకు ఇది తొలి సినిమానే కాబట్టి, ఇంకా బాగా వృద్ధిలోకి వస్తాడు. ఇతర దర్శకుల సినిమాలు చూసినప్పుడు అలా మనమూ తీయాలన్నంత అనిపించిన సందర్భాలు? కల్యాణ్కృష్ణ - కొన్ని సీన్స్ చూసినప్పుడు అలా అనిపిస్తుంది. శ్రీవాస్ గారు తీసిన ‘లక్ష్యం’లో హీరో అన్న క్యారెక్టర్ జగపతిబాబును చూసినప్పుడూ, ‘ఆర్య’లో తాజ్మహల్ గురించి చెప్పే సీన్ లాంటివి చాలా ఇష్టం. గాంధీ - ఏ సినిమా చూసినా, ఫలానాది చాలా బాగుంది అనుకొనే సందర్భాలు చాలా ఉన్నాయి. సుకుమార్, శ్రీవాస్ గార్ల సినిమాలూ అంతే! కానీ, నాకు తెలిసింది, నేను చేయగలిగినదే చేద్దామని ఫిక్సయ్యా. కానీ, పక్కవాళ్ళ సినిమా చూసినప్పుడు ఇలాంటిది మనం తీయలేకపోయామనో, మన సినిమాయే బాగా ఆడాలనో జెలసీ ఉండదా? సుకుమార్ - సెకన్లో వెయ్యోవంతు ఒక చిన్నపాటి జెలసీ ఫీలింగ్ రావడం మానవ సహజం. క్రియేటివ్ ఫీల్డ్లో మరీ! (నవ్వులు...). కానీ, వెంటనే దాన్ని పాజిటివ్గా, ఆనందంగా మార్చుకోవాలి. మారుతుంది. శ్రీవాస్ - చాలామందికి తెలియనిదేమిటంటే, సినిమా పరిశ్రమలో నడిచేది ఒక చైన్ రియాక్షన్. మన ముందు సినిమాలు ఆడకూడదనుకొంటే, అక్కడ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ దగ్గర మన సినిమా కొనడానికి డబ్బులెక్కడ ఉంటాయి? కాబట్టి, ఆ ఎఫెక్ట్ మన సినిమా మీద పడుతుంది. కాబట్టి, ప్రతి ఒక్కరి సినిమా ఆడాలి. ఫిల్మ్నగర్లో కూర్చొని, మన హీరో, మన సినిమా ఒక్కటే గొప్ప.. మనదొక్కటే ఆడితే చాలు. అవతలివాడి సినిమా బాగోలేదు... పోవాలి అనుకుంటే, తప్పు. సుకుమార్ - అవును. ఇది చాలా మంచి లాజిక్. ప్రాక్టికల్ కూడా! శ్రీవాస్ -నిజానికి, సినిమా బిజినెస్ అనేది గుడ్డిగా ఆడే ఒక ఆట. ఇటీజ్ ఎ ఫేక్ గేమ్. ఒక పేకాట లాగా ఉంటుంది. డబ్బులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో చెప్పలేం. సుకుమార్ - ఇవాళ సంక్రాంతి రిలీజ్లు నాలుగూ సినిమాలూ ఆడుతున్నాయీ అంటే, థ్యాంక్స్ టు ‘బాహుబలి’. ఆ సినిమా కొన్నేళ్ళుగా బయటకు రాని జనాన్ని ఇళ్ళల్లో నుంచి సినిమా హాలుకి మళ్ళీ రప్పించడం మొదలుపెట్టింది. గాంధీ - ఇవాళ నిజంగానే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. శ్రీవాస్ - సినిమాలు చూసి 15 - 20 ఏళ్ళయిన అత్తయ్యలు, మామయ్యలు కూడా ఇప్పుడు మళ్ళీ థియేటర్ల వైపు వస్తున్నారు. సినిమా బాగుందని వింటే, వచ్చి చూస్తున్నారు. కల్యాణ్కృష్ణ - అందుకే, ఈసారి కలెక్షన్స్ కూడా బాగున్నాయి. శ్రీవాస్ - ఏమైనా, పక్కవాడి సినిమా ఫెయిలవ్వాలి, మనం పాసవ్వాలి అనుకుంటే, వాడికి 34 మార్కులొస్తాయి. మనకు 35 మార్కులొస్తాయి. పక్కవాడికి 99 మార్కులు రావాలి, మనం అంతకన్నా ఇంకొద్దిగా బాగుండాలి అనుకుంటే, మనకు 100 మార్కులొస్తాయి. అప్పుడే అందరం బాగుంటాం. సుకుమార్, గాంధీ, కల్యాణ్కృష్ణ - అవును. బ్రహ్మాండంగా చెప్పారు. మీ మీద ప్రభావం చూపిన సినిమాలు, దర్శకులంటే? శ్రీవాస్ - నా మీద కె. రాఘవేంద్రరావు గారి ప్రభావం చాలా ఉంది. ఆయన లాగా అన్ని రకాల కోవల సినిమాలూ ట్రై చేయాలి, ఎలాంటివైనా చేయగలడనిపించుకోవాలని కోరిక. ప్రభావం చూపిన సినిమాలంటే, తమిళ దర్శకుడు శంకర్ సినిమాలు బాగా ఇష్టం. హిందీలో ‘లగాన్’. సుకుమార్ - {పత్యేకించి కొన్ని సినిమాలని చెప్పడం కష్టం. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు చూస్తూ ఉండేసరికి, రోజుకో సినిమా ఇష్టమై, ప్రభావం మారిపోతుంటుంది. అయితే, బేసిగ్గా రామ్గోపాల్ వర్మ, కృష్ణవంశీ, మణిరత్నం అంటే నాకు బాగా ఇష్టం. మరీ ముఖ్యంగా, వర్మ గారి సినిమాలంటే! నేను టీచింగ్ వదిలేసి, దర్శకత్వం వైపు వచ్చేయాలని నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా మణిరత్నం ‘గీతాంజలి’. కల్యాణ్కృష్ణ - ‘సీతారామయ్య గారి మనవరాలు’ నుంచి ‘నరసింహనాయుడు’ దాకా చాలా సినిమాలు ఇష్టం. సహజంగానే వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. దర్శకుల్లో నాకు కృష్ణవంశీ గారు బాగా ఇష్టం. మేర్లపాక గాంధీ - నాకు జంధ్యాల గారు ఇష్టం. ఆయన అన్ని సినిమాలూ చూశా. బేసిక్గా ఆయన పాత్రల క్యారెక్టరైజేషన్ నాకు ఇష్టం. సంక్రాంతి అంటే ఆడవాళ్ళ ముగ్గులు, గొబ్బెమ్మలు, అలంకారాలు, పిండివంటలు - అన్నీ! కానీ, సినిమాలకొచ్చేసరికి ఎంతసేపటికీ, హీరోల సినిమాలేనా? హీరోయిన్ల సినిమాలతో సంక్రాంతి సీజన్ చేయొచ్చుగా? శ్రీవాస్ - (నవ్వేస్తూ...) హీరోలందరూ ఒక ఏడాది సెలవు తీసేసుకుంటే, అప్పుడు హీరోయిన్ల సినిమాలే చేయొచ్చు. సుకుమార్ - మాకైతే, జెండర్ తేడా లేదు. ఆడా, మగా ఒకటే! (నవ్వులు...). గతంలో విజయశాంతి గారి లాంటివాళ్ళకు ప్రత్యేక మార్కెట్ ఉండేది. ఇప్పుడు ఎందుకనో చాలా కారణాల వల్ల హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అన్ని రావడం లేదు. అలాంటి సినిమాలతో సంక్రాంతి వస్తే... అదో వెరైటీ. ఇంతకీ మీరు మీ సినిమాలు కాకుండా, సంక్రాంతికొచ్చిన ఇతర రిలీజ్లు చూశారా? శ్రీవాస్ - అసలు మీరు మా సినిమాలన్నీ చూశారా? సుకుమార్ - అవునవును. చూశారా? ‘సాక్షి’ - (నవ్వుతూ...) చూడకుండా ఎలా ఉంటాం! చూశాం. రివ్యూలు రాశాం. ఇంటర్వ్యూలు చేశాం, చేస్తున్నాం. శ్రీవాస్ - (నవ్వేస్తూ...) కానీ, చాలామంది చూడకుండానే, ట్రైలర్లు చూసేసి, ‘హీరో స్టైల్ బాగుంది’ లాంటి మాటలతో మసిపూసి మారేడుకాయచేసి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేస్తుంటారు. కానీ, నా మటుకు నేను సంక్రాంతి రిలీజ్లన్నీ ఇంకా చూడలేదు. ఎక్కడండీ! ఇప్పటి దాకా మా సినిమాల పనులు, రిలీజ్ హంగామా, ఇప్పుడేమో ప్రమోషన్ హడావిడిలో ఉన్నాం. కొద్దిగా తీరిక దొరికిన తరువాత ఇప్పుడిక వెళ్ళాలి. సుకుమార్, మేర్లపాక గాంధీ, కల్యాణ్కృష్ణ - మా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. శ్రీవాస్, సుకుమార్- ఇప్పుడిక ఫ్యామిలీలు తీసుకొని, మిగిలిన సినిమాలకు కూడా వెళతాం. మేర్లపాక గాంధీ - నేను మా ‘ఎక్స్ప్రెస్ రాజా’ రిలీజ్ ముందు రోజు బాగా టెన్షన్ పడ్డా. మా కన్నా ఒక రోజు ముందే జనవరి 13న ‘నాన్నకు ప్రేమతో’ వచ్చేసింది. పైగా, నేను సుకుమార్ గారి ఫ్యాన్ని. ఆ మధ్య ఆయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ‘నాన్నకు ప్రేమతో’కి వెళుతూ, నన్ను రమ్మన్నారు. ‘నేను రానురా బాబూ! ఈ టెన్షన్లో సుకుమార్ గారి సినిమా చూశానంటే, నాకిక నా సినిమా నచ్చదు. నా సినిమా రిలీజయ్యాక, కొంచెం ఆగి చూస్తాను’ అని చెప్పాను. ఇప్పటి వరకూ చూడడం కుదరలేదు. ఇప్పుడు వెళతాను. సుకుమార్ - అవును. ‘కుమారి 21 ఎఫ్’ బాగుందని గాంధీ నాకు చాలా మంచి ఎస్.ఎం.ఎస్. పెట్టాడు. శ్రీవాస్ - మేము ఇతర సంక్రాంతి రిలీజ్లు చూడలేదన్న మాటే కానీ, చూసినదాని కన్నా చాలా ఎక్కువే విన్నాం. (నవ్వులు...) ఇంతకీ ఈ సంక్రాంతి మీకు ఏమిచ్చింది? శ్రీవాస్, గాంధీ, కల్యాణ్కృష్ణ, సుకుమార్ - (నలుగురూ ఒక్కసారిగా...) సక్సెస్ ఇచ్చింది. సుకుమార్ - మీకు మాత్రం మా నలుగురి నుంచి మంచి ఇంటర్వ్యూ ఇచ్చింది (నవ్వులు...) ఇంతకీ, ఫైనల్లీ ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో... ‘...అండ్ ది అవార్డ్ గోస్ టు...’? శ్రీవాస్ - (వెంటనే అందుకుంటూ...) ఆడియన్స్! అన్ని సినిమాలనూ ప్రేక్షకులు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ టేస్ట్ను బట్టి, నాలుగు కోవల సినిమాలనూ ఆదరించారు. పరిశ్రమ పచ్చగా కళకళలాడడానికి ఇంతకన్నా ఏం కావాలి! సుకుమార్ - ఈ మాట నిజం. శ్రీవాస్ చెప్పినదానికే మా ఓటు (నవ్వులు...). గాంధీ, కల్యాణ్కృష్ణ - అవునవును. నిజం. చివరిగా మీ నలుగురూ కలసి ఒక్కొక్కరూ ఒక్కో భాగం చొప్పున గొలుసుకట్టుగా ఒక సినిమా స్టోరీ ఇప్పటికిప్పుడు అల్లేసి, మా ‘సాక్షి’ పాఠకుల కోసం చెబుతారా? శ్రీవాస్ - (నవ్వేస్తూ...) ఏదో ఎందుకు... ఇదే చెబుతాం... కల్యాణ్ నువ్వు స్టార్ట్ చెయ్యి! ‘సాక్షి ఇంటర్వ్యూకు వచ్చాం’ అని చెప్పు. (కల్యాణ్ నవ్వుతూ... అలాగే చెప్పారు). సుక్కు గారూ! మీరేమో... సుకుమార్ - భలే ఇంటర్వ్యూ మొదలైంది... మధ్యలో రెండు టీలు తాగాం... (నవ్వులు...) శ్రీవాస్ - పత్రికల్లో రివ్యూల ఫక్కీలో చెప్పాలంటే... మధ్యలో కాస్తంత నిదానించినా, మంచి ఇంటర్వ్యూలో భాగమై, హ్యాపీగా ఫీలయ్యాం. గాంధీ గారూ! క్లైమాక్స్ మీదే! గాంధీ - వదిలేస్తే... ఇంటికి వెళ్ళిపోతాం. (నవ్వులు... నలుగురూ దర్శకులూ ఆత్మీయంగా కౌగిలించుకుంటూ, సెల్ఫీ దిగారు). - రెంటాల జయదేవ -
కాలం వెంట వెళ్లను...కాలం నా వెంటే రావాలి!
- బాలకృష్ణ ‘‘బిడ్డను అనాథను చేసినట్లుగా రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. ఎంతో చరిత్ర ఉన్న అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేయడం ఆనందం. బుద్ధుడు నడయాడిన భూమి ఇది. మా నాన్నగారు నందమూరి తారక రామారావుగారు రాజకీయ చరిత్రను తిరగ రాశారు. తెలుగు జాతికి గర్వకారణం అమరావతి’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్తో కలసి వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై తొలిసారి శ్రీవాస్ నిర్మాతగా మారి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తమన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆడియో సీడిని ఆవిష్కరించి, బాలకృష్ణకు ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘నేనెప్పుడూ కాలం వెంట వెళ్లను. కాలం నా వెంట రావాల్సిందే. నా స్వభావానికి తగ్గ టైటిల్ ‘డిక్టేటర్’. ఒక్కోసారి మంచి మార్పు తీసుకు రావాలంటే జులుం తప్పదు. ఈ చిత్రకథాంశం ఇదే. శ్రీవాస్ నాలానే ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. తమన్ మంచి పాటలిచ్చారు’’ అంటూ ‘సింహం కూడా దాహం వేస్తే తలదించుకుని నీళ్లు తాగుతుంది. అంత మాత్రాన తలదించినట్లు కాదు. కొట్టడానికి తొడా ఉండదు... ఎత్తడానికి తలా ఉండదు’ అని సినిమాలోని డైలాగ్ చెప్పారు. ఇది ఓ అభిమాని పంపించిన డైలాగ్ అని బాలకృష్ణ చెప్పారు. ఏమీ ఆశించికుండా అభిమానులు ఆదరిస్తున్న తీరు చాలా ఆనందంగా ఉందనీ, నాడు తన తండ్రి పార్టీ పెట్టినప్పుడు అభిమానులే అండగా నిలిచారనీ బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికీ, పార్టీకి అభిమానులు అండగా నిలుస్తున్నారనీ, వాళ్లకు ఇప్పటికే కావాల్సినవి చేశాననీ, మున్ముందు ఇంకా చేస్తానని ఆయన అన్నారు. నాన్నగారి అభిమానులే కాకుండా భవిష్యతులో పార్టీ పరంగా నా అభిమానులు కూడా ముందుంటారని ఆశిస్తున్నానని బాలకృష్ణ అన్నారు. పదవులు ఎప్పుడూ మనకు అలంకారం కాకూడదనీ, మనమే పదవులకు అలంకారం కావాలని కూడా అన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ - ‘‘98 చిత్రాల్లో ఎన్నో పాత్రలు చేసిన బాలయ్యగారిని 99వ చిత్రంలో ఎలాంటి పాత్రలో చూపిస్తే బాగుంటుందా? అని రచయితలు గోపీ-కోనవెంకట్ , శ్రీధర్ సీపాన, ఎమ్.రత్నంలతో కలిసి బాగా డిస్కస్ చేసి, ఈ కథ తయారు చేశాం. బాలయ్యగారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చాలామంది చెప్పారు. ఆయనకు నిజాయతీగా ఉంటే నచ్చుతుంది. ఆయనతో నేను సినిమా చేయాలన్న మా నాన్నగారి కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. తమన్ మట్లాడుతూ- ‘‘నేను బాలయ్యగారి ‘భైరవద్వీపం’ సినిమాలోని ఓ సన్నివేశానికి ఆర్ఆర్ ఇచ్చాను. అందుకుగాను నేను తీసుకున్న జీతం 30 రూపాయలు. నా తొలి సంపాదన ఆయన సినిమాతోనే స్టార్ట్ అయింది’’ అని చెప్పారు. నిర్మాతలు అంబికా కృష్ణ, సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, రామ్ ఆచంట, కథానాయికలు అంజలి, సోనాల్ చౌహాన్, ఈరోస్ వైస్ ప్రెసిడెంట్ చింటు, గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్బాబు తదితర రాజకీయ రంగ, చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
స్టైల్గా... కూల్గా..!
హీరోలను స్టైలిష్గా చూపించడంలో కొంతమంది దర్శకులకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. శ్రీవాస్ కూడా తన హీరోలను సరికొత్త స్టైల్లో ఆవిష్కరిస్తుంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణను ‘డిక్టేటర్’ సినిమాలో అలానే చూపిస్తున్నారాయన. ఇలా కూల్గా.. స్టైల్గా కనిపిస్తున్న బాలకృష్ణ లుక్ అభిమానులకు పండగ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ పాటలు స్వరపరిచారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆడియో ఆవిష్కరణ వేడుక జరగనుంది. -
బాలీవుడ్లో బాలయ్య 'డిక్టేటర్'..?
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 99వ చిత్రం డిక్టేటర్. ఎనౌన్స్ అయిన దగ్గర నుంచే బాలయ్య లుక్తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాను, అదే స్ధాయిలో సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మరో వార్త ఈ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇంకా రిలీజ్ కూడా కాకపోయినా బాలయ్య డిక్టేటర్ సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇందుకు ప్రయాత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించిన శ్రీవాస్ బాలీవుడ్లోనూ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. బాలకృష్ణ నటించిన స్టైలిష్ డాన్ పాత్రలో అజయ్ దేవగన్ను ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు డిక్టేటర్ బాలీవుడ్ రీమేక్పై చిత్రయూనిట్ ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. -
తన బ్లడ్కే హిస్టరీ ఉందంటున్న బాలయ్య
నందమూరి అభిమానులకు పండుగ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. దసరాకు ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' టీజర్తో పండుగ తీసుకువస్తే, దసరా తరువాత రోజు కూడా సెలబ్రేషన్స్ను కంటిన్యూ చేస్తున్నాడు బాలకృష్ణ. శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'డిక్టేటర్' టీజర్ను ఈ రోజు (శుక్రవారం) రిలీజ్ చేశారు. ముందు నుంచి చెపుతున్నట్టుగానే శ్రీవాస్ ఈ సారి బాలయ్యను ఫుల్ స్టైలిష్ గా చూపించాడు. బాలయ్య అభిమానులు కోరుకునే పంచ్ డైలాగ్లను టీజర్ లోనే చూపించి ఆకట్టుకున్నాడు శ్రీవాస్. 'నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్కే హిస్టరీ ఉంది. మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి వాళ్లన్ని రెచ్చగొట్టడం నీ జీవితానికే ప్రమాదకరం' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలకృష్ణ 99వ సినిమాగా తెరకెక్కుతున్న డిక్టేటర్లో అంజలి హీరోయిన్గా నటిస్తుంది. బాలయ్య సరసన లెజెండ్ లో హీరోయిన్గా నటించిన సోనాల్ చౌహాన్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, భారీ తారాగణంతో పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీవాస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్స్ బ్యానర్తో పాటు వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్' చిత్రం ప్రారంభోత్సవం
-
ఒక సెకనులో మాటిచ్చేశారు..
హైదరాబాద్ : హీరో బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్' చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు బోయపాటి శ్రీను శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ముహుర్తపు షాట్ క్లాప్ కొట్టారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా మారినప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా తీయాలని చాలాసార్లు అనుకున్నానని, ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. సినిమా చూస్తే ఈ దర్శకుడు ఏ హీరోతో అయినా సినిమా తీయగలడు అనిపించుకోవటమే తన లక్ష్యమన్నారు. 'లక్ష్యం' చిత్రం తర్వాత బాలయ్యతో సినిమా తీయాలనుకున్నా... కుదరలేదని, అయితే ఇన్నిరోజులకు తమ కాంబినేషన్ కుదిరిందన్నారు. లౌక్యం సినిమా అనంతరం తాను బాలయ్యబాబును కలిసి సినిమా చేయాలనే చెప్పగానే... 99వ సినిమాకు నువ్వే దర్శకుడివి అని ఆయన ఒక్క సెకనులో మాటిచ్చేశారని శ్రీవాస్ తెలిపారు. ఇప్పటివరకూ బాలకృష్ణ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూసే సినిమాలు వచ్చాయని, టైటిల్కు తగ్గట్టుగా డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటుందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ, హీరోయిన్ అంజలి మాట్లాడుతూ ఈ సినిమాలో తమ క్యారెక్టర్స్ గత సినిమాల కన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు. -
శ్రీవాస్ దర్శకత్వంలో 99వ సినిమా...?
చకచకా నూరో సినిమా వైపు అడుగులేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన 98వ చిత్రం నిర్మాణ దశలో ఉంది. సత్యదేవాను దర్శకునిగా పరిచయం చేస్తూ బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి ‘లయన్’ అనే టైటిల్ విస్తృత ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇదే వేడిలో తన 99వ చిత్రానికి కూడా రంగం సిద్ధం చేసేశారు బాలయ్య. ఇటీవల ‘లౌక్యం’ చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిజానికి తన తొలి చిత్రం ‘లక్ష్యం’ తర్వాతే శ్రీవాస్, బాలకృష్ణతో సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే ‘లౌక్యం’ సినిమా చూసి మెచ్చుకొన్న బాలకృష్ణ, శ్రీవాస్తో సినిమా చేయాలని భావించారు. ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపీమోహన్లు ఈ కొత్త ప్రాజెక్ట్కు స్క్రిప్టు సమకూర్చే పనిలో ఉన్నారు. వీళ్లిద్దరూ బాలకృష్ణ చిత్రానికి పనిచేయడం ఇదే ప్రథమం. బాలకృష్ణతో ‘ఆదిత్య 369, వంశానికొక్కడు, భలేవా డివి బాసు, మిత్రుడు’ చిత్రాలు నిర్మించిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వినికిడి. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ఫిలిమ్నగర్ సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే తెలుస్తాయి. -
'లౌక్యం' ఫ్లాటినమ డిస్క్ వేడుక
-
స్మయిలే అతని స్టయిల్!
ఈ ప్రపంచంలో స్మయిల్కి ఉన్నంత పవర్ ఇంక దేనికీ ఉండదు. చిన్నపాటి చిరునవ్వుతో ఎదుటివారిలో కొండలా పేరుకున్న కోపాన్ని దూదిపింజెలా చేసిపారేయొచ్చు. అది ఆ యువకునికి బాగా తెలుసు. స్మయిలే అతని స్టయిల్. లౌక్యం, చాకచక్యం మిక్స్ చేస్తే పుట్టినట్టుండే అతగాడు తన స్మయిల్తో ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొన్నాడు. ఎన్నో విజయాలను సాధించాడు. అలాంటి కుర్రాడిగా గోపీచంద్ కనిపించబోతున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తోన్న తాజా చిత్రంలో గోపీచంద్ పాత్ర చాలా శక్తిమంతంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుందట. ఆ విశేషాలను శ్రీవాస్ తెలియజేస్తూ -‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే గోపీచంద్ శైలిలో యాక్షన్ ఉంటుంది. బ్రహ్మానందం పాత్ర కూడా మెయిన్ హైలైట్గా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ నెల 17 నుంచి మరో షెడ్యూల్ చేస్తున్నాం. దాంతో టాకీ పూర్తవుతుంది. ఆగస్టులో పాటలను చిత్రీకరించి, సెప్టెంబర్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రకుల్ ప్రీత్సింగ్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, కెమెరా: వెట్రి, సంగీతం: అనూప్ రూబెన్స్. రెగ్యులర్ షూటింగ్లో యువి క్రియేషన్స్ చిత్రం: ప్రభాస్తో ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన యువి క్రియేషన్స్ సంస్థ అధినేతలు వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తాజాగా గోపీచంద్తో ఓ సినిమా చేస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ప్రారంభ వేడుక జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని నిర్మాతలు నమ్మకం కనబరిచారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఎమ్. అశోక్కుమార్ రాజు, ఎన్.సందీప్.ఇవాళ గోపీచంద్ పుట్టిన రోజు కావడంతో, సెట్స్ మీద ఉన్న ఈ రెండు చిత్రాల దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లోని గోపీచంద్ ఫస్ట్ లుక్ స్టిల్స్ను విడుదల చేశారు. -
సూటిగా..ధాటిగా...
భీముని కండబలం, కర్ణుని గుండెబలం, కృష్ణుని బుద్ధి బలం... ఈ మూడూ ఒక్కడిలోనే ఉంటే అతని విజయాల ధాటి ఏ స్థాయిలో ఉంటుంది? గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం కథాంశం ఈ రీతిలోనే ఉంటుంది. ఇదే కాంబినేషన్లో వచ్చిన ‘శౌర్యం’ చిత్రం... గోపీచంద్ కెరీర్లోనే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ విజయాన్ని అధిగమించాలనే పట్టుదలతో నిర్మాత వి.ఆనంద్ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్కి ‘లక్ష్యం’ లాంటి హిట్ని ఇచ్చిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్సింగ్ కథానాయిక. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో నిర్విరామంగా జరుగుతోంది. ఈ నెల 29 వరకూ ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇందులో గోపీచంద్ పాత్ర చిత్రణను భిన్నంగా డిజైన్ చేశారు శ్రీవాస్. ఎక్కడ బుద్ధిబలం చూపించాలో, ఎక్కడ కండబలం చూపించాలో బాగా తెలిసిన స్థితప్రజ్ఞుడిగా ఇందులో గోపీచంద్ కనిపిస్తారు. ఏం చెప్పినా సూటిగా చెబుతాడు. ఎంతటి ప్రమాదాన్నయినా ధాటిగా ఎదిరిస్తాడు.. గోపీచంద్ పాత్ర చిత్రణ ఇలా ఉంటుంది. యువతరం మెచ్చే అంశాలతో పాటు, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: వెట్రి. -
గోపీచంద్ ఈసారి బాగా నవ్విస్తాడు
‘‘సాధారణంగా గోపీచంద్ సినిమా అనగానే యాక్షన్ ఎక్కువ ఆశిస్తారు. కానీ మా సినిమాలో పూర్తి స్థాయిలో వినోదం కురిపిస్తాడు. ప్రతి సీన్లోనూ బాగా నవ్విస్తాడు’’ అని దర్శకుడు శ్రీవాస్ చెప్పారు. గోపీచంద్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆనంద్ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, రచయిత శ్రీధర్ సీపాన క్లాప్ ఇచ్చారు. గోపీచంద్ మాట్లాడుతూ -‘‘భవ్య నాకు సొంత సంస్థ లాంటిది. ‘లక్ష్యం’ తర్వాత శ్రీవాస్తో మళ్లీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. హీరోయిజం ఉంటూనే నా పాత్ర అందర్నీ వినోదపరుస్తుంది’’ అన్నారు. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ -‘‘మేగ్జిమమ్ మైండ్ వాడతాడు. అవసరమైనప్పుడు హ్యాండ్ వాడతాడు అని ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ఇదే ఈ సినిమా హీరో పాత్ర చిత్రణ’’ అని చెప్పారు. ఈ నెల 18 నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ మొదలుపెడతామని, ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. రకుల్ ప్రీత్సింగ్, గోపీమోహన్, వెట్రి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కథ-మాటలు: శ్రీధర్ సీపాన. -
లక్ష్యాన్ని మించే స్థాయిలో...
క్లాస్, మాస్ కలగలిసిన హీరో గోపీచంద్. ఈ రెండింటినీ మేళవించి దర్శకుడు శ్రీవాస్ తీసిన ‘లక్ష్యం’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ ‘లక్ష్యం’ కాంబినేషన్లో సినిమా మొదలైంది. గోపీచంద్తో గతంలో ‘శౌర్యం’ తీసిన వి.ఆనంద్ ప్రసాద్ భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. గోపీచంద్ చిత్రానికి అనూప్ పనిచేయడం ఇదే ప్రథమం. బుధవారం హైదరాబాద్లో ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ పూజతో మొదలయ్యాయి. గోపీచంద్లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే విధంగా పక్కా వాణిజ్య విలువలతో, ‘లక్ష్యం’ చిత్రాన్ని మించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి శ్రీవాస్ కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఇందులో గోపీచంద్ సరసన ఓ ప్రముఖ కథానాయిక నటించనున్నారు. శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం చేయనున్నారు. -
ఆ విషయంలో నేను లక్కీ
‘‘సినీ పరిశ్రమలో పేరెన్నికగన్న కుటుంబాలు నాలుగైదుంటాయి. వారు తమ ఫ్యామిలీస్తో సినిమాలు చేస్తే... ఓ నాలుగైదు సినిమాలొస్తాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఓ సినిమా చేసే అవకాశం నాకొచ్చింది. ఆ విషయంలో నేను లక్కీ’’ అని దర్శకుడు శ్రీవాస్ అన్నారు. ఆయన దర్శకత్వంలో మోహన్బాబు, విష్ణు, మనోజ్, వరుణ్సందేశ్, తనీష్, హన్సిక, ప్రణీత కలిసి నటించిన చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. గత వారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని శ్రీవాస్ ఆనందం వ్యక్తం చేస్తూ మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. ‘‘మోహన్బాబు లాంటి లెజెండ్తో పనిచేసేటప్పుడు ఏదైనా తేడా వస్తే మళ్లీ మొహం చూపించలేం. అందుకే.. ముగ్గురు రచయితలతో కలిసి కష్టపడి ఈ చిత్రానికి పనిచేశాను. మోహన్బాబు కూడా ఎంతో సహకరించారు. జనరేషన్కి తగ్గట్టుగా మాడ్యులేషన్ మార్చుకుని ప్రేక్షకుల్ని మెప్పించారు’’ అని శ్రీవాస్ తెలిపారు. ‘‘నా తొలి చిత్రం ‘లక్ష్యం’, తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’. ఇప్పుడు ఇది. నా మూడు సినిమాలూ మల్టీస్టారర్లే కావడం యాదృచ్ఛికం’’ అన్నారు శ్రీవాస్. సినిమా బాగా తీశావ్ అని కొందరంటే... ఇంతమంది హీరోల్ని బాగా హ్యాండిల్ చేశావ్ అని ఇంకొందరు అన్నారని, తనకు బెస్ట్ కాంప్లిమెంట్ అదే అనిపించిందని శ్రీవాస్ ఆనందం వ్యక్తం చేశారు. కథా విస్తరణ సమయంలోనే మనోజ్తో లేడీ గెటప్ వేయించాలనే ఆలోచన వచ్చిందని, మనోజ్కి ఈ విషయం చెప్పగానే ఎగిరి గంతేశాడని, ‘నర్తనశాల’ స్ఫూర్తిగా ద్వితీయార్ధాన్ని తీర్చిదిద్దామని, బృహన్నల పాత్రే మనోజ్ స్త్రీ వేషానికి ప్రేరణ అని శ్రీవాస్ చెప్పారు. మోహన్బాబు సలహా మేరకు లక్ష్మీప్రసన్నతో ఓ పాట అనుకున్నామని, పాట రికార్డింగ్ కూడా చేశామని, కానీ ఆ పాటను సినిమాలో చేర్చడం కుదర్లేదని శ్రీవాస్ చెప్పారు.