vegetable market
-
ఒంగోలు కూరగాయల మార్కెట్లో బీభత్సం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని దామోదరం సంజీవయ్య ప్రధాన కూరగాయల మార్కెట్లో మంగళవారం పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు బీభత్సం సృష్టించారు. 2019 కరోనా సమయంలో ఉన్న బకాయిలు, వాటిపై వడ్డీ చెల్లించలేదంటూ దుకాణదారులపై విరుచుకుపడ్డారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణాలు తెరిచి కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుందామని అన్నీ సిద్ధం చేసుకునే సరికి ఒక్కసారిగా అధికారులు, పోలీసులు మార్కెట్ను చుట్టుముట్టారు. తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులను కూలదోసేందుకు ముప్పేట దాడి మొదలెట్టారు. ఇదేం దౌర్జన్యం అని అడిగేలోగానే దుకాణాలు నేలమట్టమయ్యాయి. ముందస్తు సమాచారంగానీ, నోటీసులు గానీ ఇవ్వకుండానే దాదాపు 200 మందికి పైగా మార్కెట్ను చుట్టుముట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. కూరగాయలను బురదపాల్జేశారు. మార్కెట్లో దాదాపు 200కు పైగా హోల్సేల్, రిటైల్ దుకాణాలున్నాయి. ఇవి కాక మరో వంద వరకు చిరు వ్యాపారులు నేలపై పట్టలు పరుచుకుని కూరగాయలు అమ్ముకుంటుంటారు. ప్రతి దుకాణంలో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కూరగాయలను నష్ట పోయామంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. దుకాణాలను ధ్వంసం చేసిన అధికారులు.. టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లకపోవడంతో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాధితుల నిరసన కూరగాయల మార్కెట్లోని దుకాణాలపై ఉన్న పట్టలు, తడికలకు మంట పెట్టి అందులో కూరగాయలను దహనం చేసి బాధిత వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలకు నిరసనగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు కూర్చొని అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో చెల్లించాల్సిన అద్దెబకాయిలకు రెండింతలు వడ్డీ వేసి మరీ కట్టాలని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘శారదా మార్కెట్’ స్వాదీనంపై హైకోర్టు స్టే
నెహ్రూనగర్: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్లో ఉన్న షాపుల లీజు కాలపరిమితి ముగియడంతో గత కొద్ది రోజుల క్రితం గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు షాపుల స్వా«దీనానికి నోటీసులిచ్చారు. దీని విషయమై లీజుదారులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది. 13వ తేదీలోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని పేర్కొంది. కొల్లి శారదా మార్కెట్లో 1999లో 88 షాపులు నిర్మించారు. 25 ఏళ్ల లీజుతో షాపులను లీజుదారులకు అప్పగించారు. ఇటీవల గడువు ముగియడంతో వాటి స్వా«దీనానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఆ షాపులను కాపాడుకునేందుకు లీజుదారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతం బస్టాండ్ దగ్గరలో ఉండటం.. అదీగాక హోల్సేల్ మార్కెట్ కావడంతో రైతుల క్రయ, విక్రయాలు, వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడ రోజుకు కొన్ని రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, కొంత మంది రెవెన్యూ అధికారులే లీజు దారుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అడ్డదారిలో షాపుల నిర్వహణకు సంబంధించి లూప్ హోల్స్ చెప్పి.. ఆ షాపులను నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ!
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ! -
వెజిటబుల్స్ ఆన్ వీల్స్.. మొబైల్ మార్కెట్ రెడీ
మార్కెటింగ్ శాఖ ప్రారంభించిన మొబైల్ కూరగాయల మార్కె ట్లకు మంచి స్పందన లభిస్తోంది. తాజా కూరగాయలను రైతులే తమ ప్రాంతానికి తెచ్చి అమ్ముతుండటం, ధరలు కూడా ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుండటంతో వినియోగదారులు సంచార వాహనాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా చాలావరకు కూరగాయలు అమ్ముడుపోతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి విశేష స్పందన నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ఫోన్ లేదా ఈమెయిల్ చేస్తే వినియోగదారులు కోరుకున్న ప్రాంతానికి ఈ మొబైల్ రైతు బజార్లను పంపించే వెసులుబాటు కల్పించింది. కూరగాయలు సైతం వివిధ యాప్ల ద్వారా ఆల్లైన్లో డోర్ డెలివరీ అవుతుండటం, వారానికో రోజు మండే మార్కెట్, ట్యూస్డే మార్కెట్ల వంటివి వీధి మలుపుల్లోనే కొనసాగుతుండటం, ఇళ్లకు సమీపంలోనే భారీ దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో ఇటీవలి కాలంలో రైతుబజార్లకు వెళ్లే వారి సంఖ్య కొంత తగ్గింది. గతంలో మాదిరి కిటకిటలాడటం లేదు. చాలా సందర్భాల్లో శ్రమకోర్చి తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక రైతులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు పాడైన కూరగాయలను అక్కడే పారబోసి వెళ్ళాల్సి వస్తోంది. పరిస్థితిని గమనించిన మార్కెటింగ్ శాఖ వినూత్నంగా ఆలోచించింది. వాహనాలు సమకూర్చి రైతులే కూరగాయల్ని బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ సముదాయాలకు తీసుకెళ్లి విక్రయించుకునే ఏర్పాటు చేసింది. రైతుబజార్లకు వచ్చే రైతులు అక్కడినుంచి కూరగాయలను వాహనాల్లో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు వెళతారన్నమాట. ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని మూడు ప్రధాన రైతుబజార్ల నుంచి మార్కెటింగ్ శాఖ వాహనాలు పంపిస్తోంది. రైతులు వాహనాలకు సంబంధించిన డీజిల్, ఇతరత్రా ఖర్చులు ఏవీ భరించాల్సిన అవసరం లేకుండా తానే వ్యయాన్ని భరిస్తోంది. ప్రస్తుతం ఎర్రగడ్డ, ఫలక్నుమా, మెహిదీపట్నం రైతుబజార్ల నుంచి రైతులు వాహనాల్లో కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఆన్లైన్లో వచ్చే కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తాజా కూరగాయలు కళ్లెదుటే కని్పస్తుండటం వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. రైతుబజార్లకు తగ్గిన తాకిడి.. నగరవాసులు అన్ని వస్తు వులు ఆన్లైన్ ద్వారా డోర్ డెలివరీ పొందుతున్నారు. దీంతో రైతుబజార్లకు తాకిడి తగ్గింది. రైతులు కష్టపడి తెచ్చిన కూరగాయలు పూర్తిగా అమ్ముడవ్వక నష్టపోతున్నారు.దీంతో రైతులు వాహనాల్లో బస్తీలకు తీసుకెళ్లి విక్ర యించుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ ధరలు తక్కువ ఉంటున్నాయ్.. మా ఏరియాలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ కానీ రైతుబజార్ కానీ లేదు. దీంతో కూరగాయలు కొనాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేంది. ధరలు కూడా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వారానికి రెండుసార్లు బాలానగర్ బస్తీకి మొబైల్ రైతుబజార్ వస్తోంది. ధరలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. – గణపతి, బాలానగర్ నివాసి నిర్ధారించిన ధరలకే.. కూరగాయల ధరలను మార్కెటింగ్ శాఖే నిర్ణయిస్తోంది. ఆయా ధరలను రైతులు తమ వాహనం వద్ద బోర్డుపై ప్రదర్శిస్తున్నారు. ఆయా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. రైతులు ఇష్టమొచి్చన ధరలకు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తు తం ఒక్కో రైతుబజార్ నుంచి 10 చొప్పున మొత్తం 30 వాహనాలు ఈ విధంగా బస్తీలకు కూరగాయలు తీసుకెళుతున్నాయి. ప్రజల నుంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో మొత్తం 11 రైతుబజార్లు ఉండగా..మరికొన్ని ప్రధాన రైతుబజార్ల నుంచి మొత్తం 125 వాహనాలు నడిపే ఆలోచనలో మార్కెటింగ్ శాఖ ఉంది. కూరగాయల కోసం కాల్ చేయాల్సిన నంబర్లు.. ఎర్రగడ్డ రైతుబజార్.. 7330733746 ఫలక్నుమా.. 7330733743 మెహిదీపట్నం.. 7330733745 ఈమెయిల్.. ఎర్రగడ్డ రైతుబజార్.. MRB.E.HYD@Gmail.com మెహిదీపట్నం.. MRB.M.HYD@Gmail.com ఫలక్నుమా.. MRB.F.HYD@Gmail.com -
Lemon Prices: జనాల జేబుల్ని పిండేస్తున్న నిమ్మ!
దేశంలో నిమ్మకాయ జనాల జేబుల్నిపిండేస్తోంది. ఎండకాలం కావడంతో ధర పైపైకి ఎగబాకుతోంది. మొన్నటిదాకా 50-60 రూపాయలకు కేజీ పలికిన నిమ్మ.. ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు అధికంగా పలుకుతోంది. పట్టణాల్లో, నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్లో నిమ్మకాయల రేట్లు వాయించేస్తున్నాయి. ప్రధానంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కిలో నిమ్మకాయల ధర రూ. 200 కనిష్టంగా పలుకుతుండడం విశేషం. ఖుల్లా విషయానికొస్తే.. కాయకో రేటు, పండుకో రేటు లాగా అమ్ముతున్నారు. విడిగా ఒక్కో కాయను ఏడు నుంచి పది రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల.. కిందటి ఏడాది ఇదే సీజన్ (మార్చి) పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. ఇప్పుడు ఇలా ఉంటే.. ఏప్రిల్-మే నెలలో పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సామాన్యుడి ‘కిచెన్ బడ్జెట్’లో నిమ్మ చిచ్చు పెడుతోంది. ఎండకాలం కావడంతో డైట్ తప్పనిసరి లిస్ట్లో కనిపించే నిమ్మ.. బడ్జెట్ పరిధిని దాటించేస్తోంది. ధరలు ఎప్పుడు దిగుతాయో అని ఎదురు చూడడం వినియోగదారుల వంతు అవుతోంది. మార్కెట్లో దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అయితే నిమ్మ ధరలు Lemon Prices ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటోంది. ఇంతకు ముందులా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోతున్నారు కొందరు. నాణ్యతను కూడా పట్టించుకోకుండా కొనేస్తున్నారు ఇంకొందరు. నిమ్మను గుత్తగా అమ్మేవ్యాపారులే కాదు.. రోడ్ల మీద తోపుడు బండ్లపై రసాలు, నిమ్మసోడా అమ్మేవాళ్ల మీదా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆఖరికి టీ పాయింట్లలో లెమన్ టీ కొరత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే.. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిమ్మకాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సీజన్ను క్యాష్ చేసుకునేందుకు ముందస్తుగానే.. ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేస్తున్నారు. అయినా కూడా ధరలను లెక్కచేయకుండా జనాలు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. బల్క్ మార్కెట్లో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల కారణంగా తక్కువ పరిమాణంలో నిమ్మకాయల్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే అధిక ధరలకు అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగితేనే.. ధరలు దిగొచ్చేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
విషాదం: బిడ్డను గమనించని తండ్రి.. వాహనాన్ని ముందుకు నడపడంతో
గీసుకొండ: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు.. పొరపాటున తండ్రి నడిపించే గూడ్స్ వాహనం కిందపడి తనువు చాలించింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ కాలనీలో మంగళవారం జరిగింది. బొలెరో గూడ్స్ వాహనం డ్రైవర్గా పనిచేస్తున్న వల్లెపు రమేశ్కు కూతురు చందన (5), కుమారుడు ఉన్నారు. రమేశ్ ఉదయం ఇంటి నుంచి గూడ్స్ వాహనాన్ని వరంగల్ కూరగాయల మార్కెట్కు తీసుకుని వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. దివ్యాంగురాలైన చందన పాకుకుంటూ ఆ వాహనం వెనుక టైరు వద్దకు చేరింది. కూతురుని గమనించని తండ్రి వాహనాన్ని ముందుకు నడపడంతో టైరు కిందపడి చందన అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దేవేందర్ తెలిపారు. (చదవండి: హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఢీకొట్టిన లారీ) -
నకిలీ సొసైటీ పేరుతో రూ.14కోట్ల స్థలానికి ఎసరు!
చంచల్గూడ: అక్రమార్కులు కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తూ కోట్ల విలువ చేసే స్థలానికి ఎసరు పెడుతున్నారు. ఒక సొసైటీలోని కొందరు వ్యక్తులు చట్ట విరుద్ధంగా మరో సొసైటీ ఏర్పాటు చేసి రూ.14 కోట్లు విలువ చేసే స్థలాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు పథకం పన్నారు. ♦ కుర్మగూడ డివిజన్ మాదన్నపేటలో దయానంద వెజిటెబుల్ మార్కెట్ పేరుతో 4 ఎకరాల్లో కూరగాయల మార్కెట్ 1980లో స్థాపించారు. ♦ ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు అసలైన సంస్థకు ‘శ్రీ’జోడించి శ్రీ దయానంద పేరుతో మరో నకిలీ సొసైటీ ఏర్పాటు చేశారు. స్థలం కాజేసేందుకు పథకం రచించారు. ♦ కమిటీకి సంబంధం లేని బయటి వ్యక్తికి దాదాపు 2500 గజాలు నకిలీ సొసైటీ పేరుతో అప్పజెప్పారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను మోసం చేసి చట్ట విరుద్ధంగా ఈ చర్యలకు పాల్పడ్డారని అసలు కమిటీ ఆరోపణలు చేస్తోంది. ♦ స్థలం తీసుకున్న వ్యక్తి, నకిలీ సొసైటీ పేరుతో స్థలం అప్పజెప్పిన వారు పరస్పర కేసుల పేరుతో కుమ్మకై మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నకిలీ కమిటీ ఏర్పాటు చెల్లదంటూ సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు నకిలీ సొసైటీని రద్దు చేసింది. ♦ స్థలాన్ని మోసపూరితంగా కాజేసేందుకు యత్నించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అసలు కమిటీ సిద్ధమైనట్లు సమాచారం. -
ఈమె మా అమ్మ
మధుప్రియ పేదింటి అమ్మాయి. కష్టపడి చదివింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడిక ప్రమోషన్ కూడా వచ్చింది. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంటుందని చుట్టుపక్కల అందరికీ తెలుసు. అయితే ప్రియకు తన తల్లి గురించి ఈమధ్యే .. అదీ నాన్న చెబితే.. ఒక నిజం తెలిసింది. అంత నిజం తెలిశాక మధుప్రియ ఊరుకుంటుందా? ‘చూడండి ఈ తల్లి కూతుర్నే నేను..’ అని లోకానికి చెప్పడం కోసమే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చుని తక్కెడ పట్టుకుంది. ఇంతకీ ప్రియకు తెలిసిన నిజం ఏమిటి? మధుప్రియకు పెద్ద ప్రమోషనే వచ్చింది. గత రెండేళ్లుగా చెన్నైలోని ఎఫ్.పి.ఎస్. ఇన్నొవేషన్స్ ల్యాబ్లో సీనియర్ హ్యూమన్ రిసోర్స్ అసోసియేట్గా పని చేస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు అదే కంపెనీకి అసోసియేట్ మేనేజర్ అయింది. యూఎస్ కంపెనీ అది. పెద్ద జీతం. ఇక ప్రమోషన్ అంటే ఇంకా పెద్ద జీతం. మధుప్రియ ఇంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆడపిల్లలెవరూ లేరు. తనే మొదటి అమ్మాయి. డిగ్రీ చదువుతుండగానే క్యాపస్ ప్లేస్మెంట్స్లో సెలక్ట్ అయింది. ఎఫ్.పి.ఎస్. (ఫుల్ పొటెన్షియల్ సొల్యూషన్స్) లోనే. సాఫ్ట్వేర్ కంపెనీ అది. అయితే ఇప్పుడొచ్చిన ప్రమోషన్ కన్నా పెద్ద ప్రమోషన్ ఆమె జీవితంలో మరొకటి ఉంది. ‘‘ఈమె మా అమ్మ’’ అని గర్వంగా చెప్పుకోవడమే ఆమె తనకు తను ఇచ్చుకున్న ప్రమోషన్. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంది. తండ్రికి చిన్న ఉద్యోగం. వాళ్లిద్దరి రోజువారి సంపాదనను బట్టి చూస్తే ప్రియ పేదింటి అమ్మాయే. కష్టపడి చదివింది. మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో విశేషం ఏమీ లేదు. ‘‘ఇప్పుడు నేను సాధించిన ప్రమోషన్లో కూడా విశేషం లేదు’’ అంటోంది ప్రియ! అలా ఆమె అనడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం కూడా తండ్రి చెబితేనే ఆమెకు తెలిసింది. చిన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్కి తండ్రి వెళ్లేవాడు. తల్లి ఆలస్యంగా వెళ్లేది! ఆలస్యంగా అంటే.. మీటింగ్ అయిపోయాక. ఎప్పుడూ అంతే. ‘‘ఎందుకమ్మా ఆలస్యంగా వస్తావ్’’ అని ప్రియ అడిగేది. ‘‘ఇప్పటికి పనైందమ్మా’’అని తల్లి చెప్పేది. అయితే.. తన బిడ్డ కూరగాయలమ్మే ఆమె కూతురు అని తక్కిన పిల్లలకు తెలియకుండా ఉండటం కోసం ఆమె కావాలని ఆలస్యంగా చేసేదని తండ్రి చెప్పినప్పుడు ప్రియ కళ్ల వెంబడి నీళ్లు తిరగాయి. వెళ్లి తల్లిని కావలించుకుంది. అక్కడితో ఆగలేదు. ‘ఈమె మా అమ్మ’ అని చెప్పాడానికే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చొని తక్కెడ పట్టుకుంది. ప్రమోషన్ వచ్చి ఇప్పుడు పెద్ద మేనేజర్ అయినా కూడా అమ్మతో కలిసి కాసేపైనా కూరగాయలు అమ్ముతుంది! ఈ అమ్మ కూతుర్నని చెప్పుకోవడాన్ని మించిన ప్రమోషన్ ఏముంటుంది అని నవ్వుతుంది. ‘‘ఈ ప్రమోషన్ మా అమ్మకే అంకితం’’ అంటోంది. ∙ -
కోవిడ్ పేషెంట్ కలకలం.. మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ..
సాక్షి, నల్గొండ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా వేల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఆరిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్, కఠిన ఆంక్షలు అని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.అదే క్రమంలో వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్, పౌష్టికాహారాలను తీసుకోవాలని సూచిస్తోంది. ఇంతలా చర్యలు తీసుకుంటూ, అప్రమత్తం చేస్తున్నా.. కొందరు మాత్రం ఏ భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా కొందరు బయట నిర్లక్ష్యంగా తిరుగడం, భౌతిక దూరం పాటించకపోవడం లాంటివి చేస్తూ వైరస్ వ్యాప్తికి దారులు తెరుస్తున్నారు. మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ.. ఇంకొందరు అయితే కరోనా సోకి కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండకుండా.. బయట యధేచ్చగా తిరుగుతూ వారే ప్రాణాలే కాక ఇతర ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా కరోనా సోకిన ఓ మహిళ మార్కెట్లో సాఫీగా కూరగాయలు అమ్ముతోంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ క్వారెంటైన్లో ఉండకుండా బయట రోడ్లపై తిరుగుతుంది. ఇటీవల ఆమెకు పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఇలా బయటకు వచ్చింది. అవగాహన లేమితో కారణంగా కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతోంది. ఇది గమనించిన అధికారులు ఆ మహిళను మార్కెట్ నుంచి ఐసోలేషన్కు తరలించారు. అయితే అప్పటికే ఆ మహిళ వద్ద చాలామందే ఆకుకూరలు కొన్నట్లు తెలిపింది. దీంతో వారితో పాటు.. మార్కెట్కు వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
రామభద్రపురం.. వేలాది కుటుంబాలకు వరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర కేంద్రంగా అంతర్ రాష్ట్ర అతిపెద్ద కూరగాయల మార్కెట్గా విరాజిల్లుతోంది రామభద్రపురం వెజిటబుల్ మార్కెట్. విజయనగరం జిల్లా రామభద్రపురంలో గల ఈ మార్కెట్ వేలాది మంది చిరు వ్యాపారులను అమ్మలా ఆదుకుంటోంది. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలు, పండ్లను నిత్యం వీరభద్రపురం మార్కెట్ నుంచి ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. కూరగాయలు పండించే కూరాకుల కులస్తులు దాదాపు 600 కుటుంబాల వరకు ఇక్కడ ఉండటంతో ఈ మార్కెట్కు ప్రాచుర్యం వచ్చింది. రామభద్రపురంతో పాటు, ఆరికతోట, కొత్తరేగ, బాడంగి మండలం ముగడ, కోడూరు తదితర ప్రాంతాల్లో కూరాకుల కులస్తులు ఉన్నారు. ప్రతి కుటుంబం 25 సెంట్ల విస్తీర్ణంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తూ జీవనోపాధి పొందుతోంది. వీరితో పాటు రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతి నగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల నుంచి రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఈ మార్కెట్కు తెస్తుంటారు. పండ్లకూ కొదవ లేదు ఇక్కడ మామిడి, బొప్పాయి, జామ, పనస, అనాస, బత్తాయి, సపోటా, దానిమ్మ, ద్రాక్ష, అరటి తదితర పండ్లు కూడా లభ్యమవుతాయి. వీటిని దాదాపు 150 మంది వరకూ విక్రయిస్తుంటారు. స్థానికంగా పండేవే కాకుండా తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి అరటి గెలలు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి టమాటా రామభద్రపురం వస్తుంటాయి. అనాస, పనస పండ్లు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, సీతంపేట నుంచి తీసుకువచ్చి ఈ మార్కెట్లో విక్రయిస్తుంటారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా కేంద్రాల్లోని అన్ని హోటళ్లకు ఇక్కడి నుంచే కాయగూరలు రోజూ ప్రత్యేక వ్యాన్లలో వెళ్తుంటాయి. ఈ మార్కెట్ వల్ల ఏటా సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆశీళ్ల ఆదాయం వస్తోంది. విపత్తు వేళా ఠీవీగా.. కరోనా ప్రభావంతో అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ రామభద్రపురం అంతర్ రాష్ట్ర కూరగాయల మార్కెట్ తట్టుకుని నిలబడగలిగింది. కూరగాయ రైతులు యథావిధిగా సాగును కొనసాగించడం ఇందుకు ఎంతో దోహదపడింది. రైతు భరోసా పథకం ద్వారా కూరగాయ రైతులకు సైతం ఏటా రూ.13,500 సాయం అందించడంతో మరింత ఉత్సాహంతో పంటల సాగు చేపడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ మార్కెట్టే ఆధారం మా తాతల కాలం నుంచి కూరగాయల సాగే మా వృత్తి. అప్పటి నుంచి ఈ మార్కెట్కే కూరగాయలను తెస్తున్నాం. ఈ ఏడాది రెండెకరాల్లో కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. వాటిని రామభద్రపురం మార్కెట్లోనే విక్రయిస్తున్నా. – కర్రి అప్పారావు, మెట్టవలస, బొబ్బిలి మండలం ఎందరో కార్మికులకు ఉపాధి రామభద్రపురం కూరగాయల మార్కెట్ మా లాంటి ఎందరో కార్మికులకు ఉపాధినిస్తోంది. నేను పదేళ్ల నుంచి కళాసీగా పనిచేస్తున్నాను. రోజూ రూ.300 నుంచి రూ.400 వరకు కూలీ రావడంతో జీవితం సాఫీగా వెళ్తోంది. – ఎరుసు రామకృష్ణ, కళాసీ, రామభద్రపురం 40 ఏళ్లుగా వ్యాపారం ఈ మార్కెట్లో సుమారు 40 ఏళ్ల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడ పండిన కాయగూరలు, పండ్లను ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తాను. అక్కడ పండే టమాటా, మునగకాడలు, దుంపలు, క్యారెట్, బీట్రూట్ను ఇక్కడికి తెస్తుంటాను. – మామిడి చిన్న, వ్యాపారి, రామభద్రపురం -
పీపీఈ కిట్ ధరించి.. కూరగాయలు కొనడానికి వచ్చిన నటి
కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. కేసుల సంఖ్య ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే నటి రాఖీ సావంత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రాజకీయ నాయకులకంటే మీరు వంద రేట్లు మేలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. రాఖీపై ఇంతలా ప్రశంసలు కురవడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. తాజాగా రాఖీ సావంత్ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్కి వెళ్లారు. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ బయట కనిపించింది అంటే చాలు.. జనాలు ఎలా గుమిగూడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్ ధరించి మార్కెట్ వెళ్లారు రాఖీ సావంత్. చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్ ధరించిన రాఖీ సావంత్.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొన్నారు. ఈ సమయంలో సదరు కూరగాయలమ్మే వ్యక్తిని మాస్క్ సరిగా ధరించమని సూచించారు. ఇక ఆమె షాపింగ్ అయిపోయిన తర్వాత రాఖీ ఒక్కసారిగా అరిచారు. ‘‘ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు రాఖీ సావంత్. అంతేకాక బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు. ఈ వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మాటలు చెప్పే రాజకీయ నాయకుల కన్నా మీరు చాలా బెటర్.. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
కూరగాయల ధరలు కుతకుత
సాక్షి, సిటీబ్యూరో: వంటింట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత నెలలో కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట చేతికందకుండానే నేలపాలైంది. వాస్తవానికి ప్రతి చలికాలంలో కూరగాయల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ధరలు మాత్రం రెట్టింపయ్యాయి. గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ మోండా, మాదన్నపేట వంటి మార్కెట్లతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న 11 రైతుబజార్లకు రోజువారీగా దిగుమతి కూరగాయలు రాక తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: కూరగాయల ధరలు 37% అప్! ► నగర జనాభా ప్రకారం ప్రతిరోజు దాదాపు మూడు వేల టన్నుల కూరగాయలు అవసరం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలే 60 శాతం తీరుస్తాయి. ► మిగతా కూరగాయలు కర్నూలు, చిత్తూరు, అనంతపురంతో పాటు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ నుంచి దిగుమతి అవుతాయి. ► కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లతో ఏజెంట్లదే పెత్తనం. దీంతో వారు నిర్ణయించిన ధరే ఖరారు అవుతోంది. ► వ్యాపారులంతా సిండికేట్ కావడంతో రైతులకు కూడా నష్టం వాటిల్లుతోంది. ► గ్రేటర్ పరిధిలో కూరగాయలు నిల్వ చేయడానికి ఎక్కడా కోల్డ్ స్టోరేజీ లేదు. దీంతో రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక ఎంతో కొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది. కూరగాయలు గత ఏడాది ప్రస్తుత ధరలు గతేడాది నవంబర్లో ప్రస్తుత ధరలు(కిలోకు) టమాటా రూ. 15 రూ. 30 బెండకాయ రూ. 30 రూ. 60 బిన్నీస్ రూ. 40 రూ. 80 వంకాయ రూ. 20 రూ. 40 దొండకాయ రూ. 20 రూ. 40 క్యాబేజీ రూ. 30 రూ. 60 కాప్సికం రూ.40 రూ. 80 పచ్చిమిర్చి రూ. 20 రూ. 50 -
కూరగాయల సంతలో ఎస్సై విధ్వంసం
లక్నో: పోలీస్ జీపుతో కూరగాయల మార్కెట్లో హల్చల్ చేసి భయాందోళనలు సృష్టించిన సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడమే కాక ప్రయాగ్రాజ్ జిల్లా నుంచి బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లా గూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుమిత్ ఆనంద్ గురువారం నాడు జరిగిన వారాంతపు సంతలో పోలీస్ జీపుతో కూరగాయల మార్కెట్లో విధ్వంసం సృష్టించాడు. అమ్ముకునేందుకు పోసిన కూరగాయలను పోలీస్ జీపుతో అతివేగంగా వచ్చి వరుసగా తొక్కించాడు. అంతటితో ఆగక వెహికల్ను రివర్స్ చేసి మిగతా కూరగాయల పైనుంచి పోనిచ్చాడు. మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలని, కూరగాయలు అమ్మొద్దన్న తన ఆదేశాలు పాటించని కారణంగా ఆగ్రహించిన ఎస్సై ఇలా చేసినట్లు సమాచారం. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఉన్నతాధికారులు సుమిత్పై చర్యలు చేపట్టారు. (సొంతంగా రెండు చక్రాల సవారీ..) ఈ క్రమంలో ప్రయాగ్రాజ్ ఎస్ఎస్పీ సత్యార్థ్ అనిరుద్ పంకజ్ శుక్రవారం నాడు మీడియా ఎదుట మాట్లాడుతూ... సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశాము. ఇది హేయమైన చర్య. దర్యాప్తుకు ఆదేశించాము’ అని పేర్కొన్నారు. వాస్తవానికి బుధవారం, శుక్రవారం నాడు సంతకు అనుమతి ఉంది. కానీ గ్రామస్తులు గురువారం సైతం సంతను నిర్వహించారు. దాంతో మార్కెట్ను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా సుమిత్ వారికి తెలిపాడు. వారు వినకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డట్లుగా తెలిసిందన్నారు. లాక్డౌన్ కొనసాగింపు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వారాంతపు సంతకు అనుమతి తెలపగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. (15 రోజుల్లోగా పంపేయండి) -
కూరగాయల రైతుకు నష్టాల దిగుబడి
సాక్షి, హైదరాబాద్: రైతుల రోజువారీ ఆదాయ మార్గమైన కూరగాయల సాగు సంక్షోభంలో పడింది. సాగు పనులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. మార్కెట్లో అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నా, ధరలు పతనం కావడంతో లాభాలు మడిలోనే ఆవిరవుతున్నాయి. టమాట, బీర, బెండ, దొండ, దోస తదితర పంట దిగుబడులు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు భగభగమండేవి. పెళ్లిళ్లు, శుభకార్యాలతో డిమాండ్ బాగా ఉండేది. అయితే, కరోనా, లాక్డౌన్ ప్రభావాలతో కూరగాయల విక్రయాలకు గండిపడింది. రైతుబజార్లలో కూరగాయల మార్కెట్లు మూతబడ్డాయి. దాదాపు నెలన్నరగా రైతులు దిగుబడులను సగానికి సగం తగ్గిస్తూ విక్రయిస్తుండడంతో నష్టాలపాలవుతున్నారు. రవాణా చార్జీలు సైతం గిట్టుబాటు కాక దిగాలు పడుతున్నారు. కొనేవారు లేక.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగా రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లకు తాళం పడింది. ఇప్పటివరకు కూరగాయల దిగుబడులను నేరుగా రైతుబజార్కు తెచ్చి హోల్సేల్, రిటైల్గా విక్రయించే రైతులకు తాజా పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. దిగుబడులను ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. రిటైల్ విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. ఇంటింటి విక్రయాలు జరిపినప్పటికీ కరోనా భయంతో కొనుగోళ్లకు వినియోగదారులు ముందుకు రావట్లేదు. దీంతో మధ్యవర్తులకు దిగుబడులను అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేసిన రైతులు కూలీలతో దిగుబడులను వేరు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కూలీలకు రోజుకు సగటున రూ.500 వరకు చెల్లించాలి. అయితే కూలీలకు చెల్లించే మొత్తం కూడా దిగుబడుల విక్రయంతో దక్కడం లేదు. దీంతో కొందరు రైతులు గిట్టుబాటు కావడం లేదని పంట దిగుబడులను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు కావడం లేదనే కారణంతో రైతులు కూరగాయల సాగును వదిలేయడమే మంచిదనే భావనతో ఉన్నారు. అదే జరిగితే ఇబ్బందులు తప్పవు. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గితే డిమాండ్కు సరిపడా దిగుబడులు మార్కెట్లోకి రావు. దీంతో ధరలు పెరిగిపోతాయి. రాబడి 60 శాతం తగ్గింది అరెకరంలో టమాట, మరో అరెకరంలో దొండ సాగుచేస్తున్నా. మరో రెండు మడుల్లో గోకర, బీర వేశాం. దిగుబడి బాగుంది. కానీ ధరల్లేవు. గతేడాది ఇదే సమయంలో రోజుకు సగటున రూ.1,000 రాబడి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.400 దాటడంలేదు. ఇది పెట్టుబడికే సరిపోవట్లేదు. మా కుటుంబసభ్యులతోనే సాగు పనులు చేస్తున్నాం. కూలీలను పెట్టుకుంటే నష్టాలు తప్ప పెట్టుబడి కూడా దక్కదు. – సిలువేరు మల్లయ్య, రైతు, సర్వేల్, యాదాద్రి జిల్లా పంటను పొలంలోనే వదిలేశా.. రెండెకరాల్లో టమాట, ఎకరంన్నరలో క్యాబేజీ, మరో రెండెకరాల్లో మునగ పంటలు వేశా. కూరగాయలకు ధరల్లేకపోవడం, కూలీలను పెట్టుకుంటే గిట్టుబాటు కాదని పంటంతా పొలాల్లోనే వదిలేశా. పొలం పక్కనున్న వారికి అవసరమైన కూరగాయలను తెంపుకోమని చెప్పా. – రొక్కం భీంరెడ్డి, రైతు, తుర్కయాంజాల్, రంగారెడ్డి జిల్లా -
అతి తక్కువ ధరలకే కూరగాయాల విక్రయం
-
రైతుబజార్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
-
కూరగాయాల మార్కెట్ పరిశీలన
-
రైతు బజార్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు
-
కూరగాయలకు పోటెత్తిన ప్రజలు
-
కొండెక్కిన కూరగాయల ధరలు
-
విజయవాడలో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్
సాక్షి, విజయవాడ : విజయవాడలో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రైతు బజార్లకు వినియోగదారులు పోటెత్తుతున్నారు. రేపు(ఆదివారం) జనతా కర్ఫ్యూకి ముందస్తుగా కూరగాయల కొనుగోళ్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు రావటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. థర్మల్ సెన్సార్తో వినియోగదారులకు పరీక్షలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. రేపు పెట్రోల్ బంకులు కూడా మూతపడుతుండటంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కొత్తపేట గడ్డి అన్నారం కూరగాయల మార్కెట్కు ప్రజలు భారీగా వస్తున్నారు. భారీ స్థాయిలో ప్రజలు రావడంతో కొద్ది రోజులతో పోల్చుకుంటే వ్యాపారం బాగా జరిగిందంటూ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తెచ్చిన సరుకంతా అమ్ముడుపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. (‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’) కృష్ణా జిల్లా : కరోనాను నివారించడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్బాబు సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 15 రోజులపాటుగా స్వీయ నిర్బందనలో ఉండాలన్నారు. జనతా కర్ఫ్యూ ప్రజల క్షేమం కోసమేనని, పోలీస్ వారి నుంచి ఎలాంటి బలవంతపు నిర్బంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. (ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!) జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటల బంద్! -
కూరగాయల మార్కెట్ వద్ద రైతుల ఆందోళన
-
వెజిట్రబుల్!
సాక్షి సిటీబ్యూరో: నగర జనాభా కోటిదాటింది. ఇంతమందికి సరిపడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్ల కోసం తగినన్ని మార్కెట్లు అవసరం. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన నగరంలో కనీసం 50 మార్కెట్లు ఉండాలనేది నిపుణుల అభిప్రాయం. పోనీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున అనుకున్నా 27 ఉండాలి. కానీ గ్రేటర్లో కేవలం11 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నగరవాసులు 5–6 కిలోమీటర్లు ప్రయాణించి, 3–4గంటల సమయం వెచ్చించి రైతు బజార్లలో కూరగాయలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు గిట్టుబాటు ధర, సిటీజనులకు తాజా కూరగాయలు అందించాలనే సంకల్పంతో 1999లో రైతుబజార్లు ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేయగా... జనాభా అంతకంతకూ పెరగగా, రైతు బజార్లను మాత్రం పెంచలేదు. మార్కెటింగ్ శాఖ కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ నగరంలో ఖాళీ స్థలం దొరకడం లేదు. కనీసం ఎకరం స్థలం ఉంటేనే రైతు బజార్ ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్ శాఖ పేర్కొంటోంది. నగరంతో పాటు శివార్లలో చాలా ప్రాంతాల్లో ఎకరం కంటే తక్కువ స్థలాలున్నా వాటిని ఉపయోగించుకోవడం లేదు. మో‘డల్’ మార్కెట్లు.. రైతుబజార్లు ఏర్పాటు చేసినప్పుడు గ్రేటర్ జనాభా 40 లక్షలు. ఇప్పుడు కోటి దాటింది. జాతీయ పోషకాహార సంస్థ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ 300 గ్రాముల తాజా కూరగాయలు, 100 గ్రాముల పండ్లు తీసుకోవాలి. ఈ లెక్కన కోటి మందికి 3వేల టన్నుల కూరగాయలు అవసరం. ఆ మధ్య ప్రారంభించిన మేడిపల్లి, ఎల్లమ్మబండ రైతుబజార్లతో కలిపితే మొ త్తం 11 రైతుబజార్లు ఉన్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటే కిలోమీటర్ల ప్రయాణం తప్పడం లేదు. ప్రతి 10వేల మందికి ఒక మార్కెట్ ఉండాలని... నగర వ్యాప్తంగా మోడ ల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ తూకమే... ఇప్పుడంతా డిజిటల్ యుగం. కానీ మార్కెటింగ్ శాఖ పరిధిలో ఇంకా తరాజు సిస్టమ్ కొనసాగుతోంది. ఇదే అదనుగా కొన్ని మార్కెట్లలో తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు. హోల్సేల్ మార్కెట్కు వచ్చే కూరగాయల ఆధారంగా మార్కెటింగ్ శాఖ «అధికారులు రోజూ ధరలు నిర్ణయిస్తారు. ఆ ధరలకు అనుగుణంగానే రైతుబజార్లలో విక్రయాలు జరగాలి. కానీ అలా ఎప్పుడూ జరగడం లేదు. రైతుబజార్ బోర్డుపై రాసిన ధరలకు, అమ్మే ధరలకు పొంతన ఉండడం లేదు. రైతుబజార్లలో ధరలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వినియోగదారుల నుంచి నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక రైతుబజార్లలో అరకిలో కంటే తక్కువ విక్రయించరు. ఒకవేళ అడిగినా తూకాలు లేవని చెబుతారు. డిజిటల్ తూకాలు ఉంటే ఈ సమస్య ఉండదు. దళారుల దందా... నగరంలోని దాదాపు అన్ని రైతుబజార్లలో రైతులు నామమాత్రంగానే కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇక్కడ ఏడాది పాటు దళారుల పెత్తనమే సాగుతోంది. కొన్ని సందర్భాల్లో రైతులకు స్థలాలు లేక రైతుబజార్ల బయట విక్రయాలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని రైతుబజార్లలో 150–250 వరకు షాపులు ఉన్నాయి. ఒక్కో బజారులో సాధారణ రోజుల్లో 1,500–2,000 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు జరుగుతాయని మార్కెటింగ్ శాఖ అధికారుల అంచనా. ఇక పెద్ద రైతుబజార్లయిన ఎర్రగడ్డ, కూకట్పల్లి, సరూర్నగర్, మెహిదీపట్నం మార్కెట్లలో రోజూ 3,500 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒక్కో రైతుబజార్ÆŠకు రోజూ 10వేల మంది వస్తారు. దాదాపు రోజుకు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి. ఇక ఆదివారాల్లో అయితే 25వేల మంది వస్తారని.. రూ.50 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ విక్రయాలన్నీ రైతుల పేర్లతో జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి విక్రయించేది మాత్రం దళారులు. దీంతో ఇంత మొత్తంలో వ్యాపారాలు జరుగుతున్నా వాణిజ్య పన్ను ఎవరూ చెల్లించడం లేదు. స్టాళ్ల సంఖ్య పెంపు గ్రేటర్ పరిధిలో రైతుబజార్ల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలు లభించడం లేదు. రైతుబజార్ల ఏర్పాటు కోసం కనీసం ఎకరం అవసరం. కొత్తగా రైతుబజార్ల ఏర్పాటుకు ప్రణాళికలు వేశాం. నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చాడాకి ‘మన కూరగాయలు’ స్టాళ్ల సంఖ్యను పెంచుతున్నాం. – లక్ష్మిబాయి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ -
అర్ధరాత్రి ఎగసిన అగ్నికీలలు
తగరపువలస ప్రాంతంలో అతిపెద్ద ప్రైవేటు మార్కెట్ ఇది. కూరగాయల నుంచి అన్ని నిత్యావసర వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రోజూ రూ.5 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఆశీలు రూపంలో నిర్వాహకులకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇక్కడ ఉండరు. సాయంత్రం ఆరు.. ఏడు గంటల తరువాత వ్యాపారులంతా దుకాణాలు కట్టేసి వెళ్లిపోతారు. ఆ తరువాత ఆకతాయిలు చొరబడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి తరువాత పెద్ద ఎత్తున అగ్నికీలలు చుట్టిముట్టి సర్వం బూడిదైంది. సాక్షి, తగరపువలస (భీమిలి) : ఇక్కడి ప్రైవేట్ మార్కెట్ గురువారం అర్ధరాత్రి తరువాత అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో 73 దుకాణాలు కాలి బూడిదైనట్టు రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం రూ. 47.29 లక్షల ఆస్తి నష్టం నష్టం సంభంవించినట్లు ప్రాథమిక అంచనా. ఇందులో కాలిపోయిన వస్తువుల విలువే రూ.27.29 లక్షలు, షెడ్ల విలువ రూ. 20 లక్షల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెప్పారు. రాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో మొదలైన మంటలు తెల్లవారు జామున నాలుగు గంటల వరకు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ముందుగా మెయిన్ రోడ్డుకు చేరువలో ఉన్న తట్టలు, చాపలు అంటుకుని ఆరు లైన్లలో ఉన్న దుకాణాలను చుట్టుముట్టడంతో అగ్నికీలలు మార్కెట్ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో కాయగూరలు, ఉల్లి, ఫ్యాన్సీ, గాజులు, అరటిపండ్లు, కోడిగుడ్లు, నూనె, కిరాణా, మిర్చి, పసుపు, కుంకుమ, చీపుళ్ల దుకాణాలు కాలిపోయాయి. ఒక్కో వ్యాపారి రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోయారు. ఇది గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే చేసిన పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ఫైరింజన్లు శ్రమించినా.. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ సిబ్బంది తాళ్లవలస అగ్నిమాపక సిబ్బందిని వెంట పెట్టుకుని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే నీరు అయిపోవడంతో నగరం నుంచి మరో ఫైరింజన్ను తీసుకువచ్చారు. సమయానికి నీరు అందుబాటులో లేకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు మార్కెట్ను మిర్చి, మసాలా కాలిన ఘాటు పొగతో నిండిపోయింది. దీంతో రెండు బాబ్కాట్లు, జేసీబీతో మార్కెట్లో బూడిద తరలించడానికి అంతరాయం ఏర్పడింది. తరచూ అగ్ని ప్రమాదాలు.. మార్కెట్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. వ్యాపారులకు సరైన గిడ్డంగి వసతులు లేకపోవడంతో దుకాణాల్లోనే సామగ్రి భద్రపరచుకుని వెళ్లిపోతుంటారు. ఆరు మండలాలకు కేంద్రంగా ఉన్న ఈ మార్కెట్కు ఆశీళ్ల రూపంలో రోజుకు రూ.40 వేలు, ఆదివారం సంత సమయంలో రూ.1.50 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ప్రతిరోజు రూ.2 కోట్ల విలువైన వస్తువులు ఉంటున్నా ప్రయివేట్ యాజమాన్యం కాపలాదారులను ఉంచకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మందుబాబులు రాత్రి 8 దాటితే మార్కెట్లో దుకాణాలను బార్లుగా మార్చేస్తుంటారు. తిని తాగి దుకాణాలపై ప్రతాపం చూపిస్తుంటారు. ఈ అగ్ని ప్రమాదానికి కూడా మందుబాబులే కారకులై ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. -
ఏమ్మా... గిరాకీలు ఎట్లా ఉన్నయ్ ?
గజ్వేల్: ఏమ్మా... బాగున్నారా.. గిరాకీలు ఎట్లా ఉన్నయ్? సౌలత్లకు ఇబ్బంది లేదు కదా? అంటూ మహిళా కూరగాయ రైతులను మంత్రి హరీశ్రావు ఆత్మీయంగా పలకరించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్–పాతూరు కూరగాయల మార్కెట్ను ఆయన సందర్శించారు. మహిళా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ మార్కెట్తో మంచి ఫలితాలు రావడం ఆనందంగా ఉందన్నారు. మహిళా రైతులు మంత్రితో మాట్లాడుతూ.. సార్ మీరు రాక చాలా రోజులవుతుందంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూరగాయలు కొనడానికి వచ్చిన వారిని కూడా మంత్రి పలకరించారు. దీంతో హరీశ్తో పలువురు వినియోగదారులు సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. -
ఉప్పల్ వెజిటెబుల్ మార్కెట్లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లోని వెజిటెబుల్ మార్కెట్ లో శుక్రవారం అర్ధ రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. యాదాద్రి, మేడ్చల్ జిల్లాల రైతులు చాలా మంది ఇక్కడకు కూరగాయలు తీసుకొచ్చి విక్రయం చేస్తుంటారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మార్కెట్ లో మంటలు అలుముకున్నాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో ఐదు కూరగాయల షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఎలా చెలరేగాయి అనే సంగతి తెలియలేదు. ఎవరైనా కావాలని చేశారా ? లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదాని గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
ఉప్పల్ కూరగాయల మార్కెట్లో అగ్నిప్రమాదం
-
ఒట్టి ఫోజులేనా?
- మూడేళ్ల తర్వాత నేడు మార్కెట్కు భూమిపూజ - హాజరు కానున్న ఎమ్మెల్యే బాలకృష్ణ - టెండర్ కాలేదు.. నిధులు రాలేదు హిందూపురం అర్బన్: హిందూపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ కూల్చివేసిన మూడేళ్ల తర్వాత పాలకులు భూమిపూజకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం హిందూపురం రానున్నారు. వాస్తవ పద్ధతిలో ఏదైనా నిర్మాణ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు మంజూరైన తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. అనంతరం నిధులు సమకూర్చుకుని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని కాంట్రాక్టు ఖరారైన తర్వాత నిర్మాణానికి భూమి పూజలు చేస్తారు. అయితే బాలకృష్ణకు ఇవేవీ సంబంధం లేదు. దినం బాగుంటే చాలు సినిమాల్లో కెమెరా ముందు యాక్షన్కు దిగే బాలయ్య భూమిపూజ అనగానే ఫొటోలకు ఫోజులిచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రకటనలన్నీ గాలికే? పట్టణంలోని పాత మార్కెట్ స్థలమైన 2.24 ఎకరాల్లో రూ.100 కోట్లతో హైటెక్ రీతిలో త్రీఫ్లోర్ కాంòప్టెక్ నిర్మించి రెండు సెల్లార్స్ హోల్సేల్ వ్యాపారాలు, గ్రౌండ్ఫ్లోర్ కూరగాయల విక్రయాలు, రిటైల్స్ వ్యాపారాలు, కోల్డ్ స్టోరేజ్తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, ఆడిటోరియం, ఏసీ గోదాములు, మూడోఫ్లోర్లో మల్టీఫ్లెక్స్ థియేటర్లు రెండు నిర్మించి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా అదరహో.. అనే రీతిలో నిర్మిస్తామని గొప్పలు చెప్పారు. అయితే ఆ ప్రకటనలన్నీ గాలికి ఎగిరిపోయాయి. విశాలమైన రోడ్లు లేవని రాష్ట్ర టౌన్ ప్లానింగ్, డీఎంఏ అధికారులు అనుమతులు నిరాకరించారు. తర్వాత రూ.55 కోట్లతో రెండస్తుల భవన సదుపాయం నిర్మించాలని చేసిన ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చలేదు. చివరకు రూ.33 కోట్లతో అది కూడా గుడ్విల్ రూపంలో వ్యాపారులు నిధులు సమకూర్చుకుని, మున్సిపాల్టీ భాగస్వామ్యంతో రెండంతస్తుల భవనంలో 225 గదులతో మార్కెట్ నిర్మాణం ఖరారైంది. నిర్మాణం చేయాలి ఇలా.. మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం ప్రకారం రూ.10 కోట్లు ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఇవ్వగా రూ.10 కోట్లు వ్యాపారుల నుంచి గుడ్విల్ రూపంలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు మున్సిపాల్టీ రూ.3 కోట్లు తనవంతు భాగం కలిపి మొత్తం రూ.33 కోట్లతో మార్కెట్గదుల నిర్మాణం చేయాల్సి చేపట్టాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వగానే మార్కెట్ కట్టేస్తున్నామనే రీతిలో పాలకులు భూమిపూజకు సిద్ధమైపోయారు. అయితే ఈç నిర్మాణానికి ఇంకా టెండరు ఖరారు కాలేదు. గుడ్విల్ ఎంత మొత్తంలో వసూలు చేస్తారు. ఎన్నేళ్లు లీజుకు ఇస్తారు అనేది తేల్చలేదు. మున్సిపాల్టీ తన ఖజానా నుంచి రూ.3 కోట్లు కేటాయించాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఏ నిర్మాణమైనా ప్రారంభానికి పూజలు చేయడం పరిపాటి. కానీ అధికార పార్టీ నాయకులు మసిపూసి మారేడుకాయ చూపినట్లు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ల్లపై పడేశారు : షానవాజ్, మార్కెట్ అధ్యక్షుడు వ్యాపారాలు బాగా జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి మార్కెట్ కూల్చి రోడ్లపై పడేశారు. రైతుబజారు ప్రాంతంలో ఉండాలని చెప్పారు. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు. రైతులు తీసుకువచ్చిన సరుకులకు భద్రతలేదు. ఎండ వానకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మార్కెట్ కట్టించి ప్రస్తుతం ఉన్న రేట్లతో బాడుగలు కేటాయిస్తే చెల్లించగలం. మాకు న్యాయం చేయాలని ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించాం. ఆరు నెలల అడ్వాన్సు మున్సిపాల్టీలో ఉంది : శ్రీనివాసులు, మార్కెట్ ఉపాధ్యక్షుడు. పాతమార్కెట్లో ఉన్నప్పుడు ఆరునెలల అడ్వాన్సులు ఇచ్చి ఉన్నాం. వాటిని జమ వేసుకుని ఇప్పుడున్న రేట్లకు అనుగుణంగా గదుల బాడుగలు నిర్ణయించాలి. మార్కెట్ వ్యాపారుల పరిస్థితులను అడిగిన నాయకులు లేరు. ఎమ్మెల్యేను కలిసి మా బాధలు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. అప్పుల్లో కూరుకుపోయి చాలామంది వ్యాపారులు వలసలు వెళ్లారు. గుడ్విల్ లేకుండా ప్రభుత్వమే గదులు నిర్మించి వ్యాపారులకు జీవనం కల్పించాలని కోరుతున్నాం. -
హైదారాబాద్లో అర్దరాత్రి అగ్నిప్రమాదం
-
ఖమ్మం కూరగాయల మార్కెట్పై నోట్ల రద్దు దెబ్బ
-
కూరగాయల మార్కెట్ రైతు బజార్కు తరలేనా..!
నూతన కలెక్టర్ చొరవ చూపాలి ఏకైక కూరగాయల మార్కెట్ ఆధునీకరించినా సమస్యలే జగిత్యాల అర్బన్ : జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రంగా అవతరించింది. పట్టణంలో ఏకైక ప్రధాన కూరగాయల మార్కెట్ ఉంది. మార్కెట్ ఒకటే ఉండటంతో అటు వ్యాపారులు, ఇటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మార్కెట్ను ఆధునీకరించారు. అయినప్పటికీ స్థలం చిన్నదిగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని పట్టణంలోని విద్యానగర్లో సుమారు రూ.50 లక్షలతో మార్కెట్ను ఏర్పాటు చేశారు. అది నిరుపయోగంగానే మారింది. ఇటీవల సబ్కలెక్టర్ కూరగాయల మార్కెట్ను రైతుబజార్కు తరలించేలా రైతులతో మాట్లాడారు. మార్కెట్ ఆధీనంలో ఉన్న రైతుబజార్ను బల్దియాకు అప్పగించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్కు లేఖ సమర్పించారు. విశాలమైన రైతుబజార్ను నిరుపయోగంగా ఉండకుండా మార్కెట్ను ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రతిపాదనలకే పరిమితం గతంలో సైతం రైతుబజార్కు ప్రధాన కూరగాయల మార్కెట్ను తరలిద్దామని అధికారులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ రైతులు ఒప్పుకోకపోవడంతో రైతుబజార్ శిథిలావస్థకు చేరింది. జనసాంద్రత ఉన్న చోట మార్కెట్ అయితే లక్షకు పైగా ఉన్న పట్టణంలో ఒకే కూరగాయల మార్కెట్ కాకుండా జనం ఉన్న చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జగిత్యాలలో మంచినీళ్లబావి, అంగడిబజార్లో, ధరూర్ క్యాంపులోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూరగాయల మార్కెట్ ఒకటే కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ను రైతుబజార్కు తరలిస్తే ఎంతో వీలుగా ఉంటుంది. నూతన కలెక్టర్ చొరవ చూపేనా? జగిత్యాల జిల్లాగా అవతరించగా నూతన జిల్లా కలెక్టర్ శరత్ చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రైతుబజార్కు తరలిస్తే ఎంతో ఉపయోకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. -
చినుకు పడితే చిత్తడే
→ ఎక్కడికక్కడే నిలిచిన వర్షపు నీరు →ఇబ్బందులు పడుతున్న పురం ప్రజలు హిందూపురం అర్బన్ / టౌన్ : పట్టణంలో రెండురోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మేళాపురం, హస్నాబాద్, ముక్కడిపేట, త్యాగరాజనగర్ ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల జీవనానికి తీవ్ర అవరోధంగా మారింది. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, కాల్వలను శుభ్రం చేయకపోవడంతో వర్షపునీరు ముందుకు ప్రవహించకుండా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వీధులన్నీ మురికిమయంగా మారాయి. పాదచారులు సైతం వీధుల్లో నడవలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల మార్కెట్లో కాలు పెట్టడానికి కూడా వీలులేకుండా పోయింది. దీంతో పాటు ఆటోనగర్, ముద్దిరెడ్డిపల్లి ధన్రోడ్డులోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే దుస్థితి ఉంటున్నా పాలకుల్లో స్పందన కరువైందని ప్రజలు వాపోతున్నారు. రెండురోజుల్లో సుమారు 64మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా మేళాపురం దీప్తిస్కూల్ వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో వర్షపునీరు కొలనులా నిలిచింది. దీంతో విద్యార్థులు ఈ దారి గుండా వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా పట్టించుకునే వారు కరువయ్యారు. -
ఇబ్రహీంపట్నంలో కూరగాయల మార్కెట్ దగ్ధం
- రూ.10లక్షల ఆస్తి నష్టం ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలోని మంచిర్యాల రోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్ మంగళవారం వేకువజామున దగ్ధమైంది. గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో తడికెలతో నిర్మించుకున్న 16 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.10లక్షల రూపాయల ఆస్థి నష్టం సంభవించిందని భావిస్తున్నారు. -
నయా మార్కెట్
కుమార్పల్లి మార్కెట్ ఆధునీకరణ పూర్తి రేపు పునఃప్రారంభం హన్మకొండ : వరంగల్ నగరంలో కూరగాయలు, మాంసం ఉత్పత్తులకు కుమార్పల్లి మార్కెట్ ప్రసిద్ధిగాంచింది. హన్మకొండ వాసులకు మొదటి కూరగాయల మార్కెట్ ఇదే. మారుతున్న అవసరాలకు తగినట్లుగా కుమార్పల్లి మార్కెట్ ఆధునీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా మార్కెట్ ఆధునీకరణపై ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ కుమార్పల్లి మార్కెట్ ఆధునీకరణ పనులను పూర్తి చేయించారు. రూ.45 లక్షలతో చేపట్టిన మార్కెట్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కలిసి కుమార్పల్లి మార్కెట్ నూతన ఆవరణను బుధవారం ప్రారంభించనున్నారు. వ్యాపారులు, రైతులు కలిసి మొత్తం 110 మంది తమ ఉత్పత్తులను అమ్ముకునే మార్కెట్ను ఆధునీకరించారు. పెగడపల్లి, ముచ్చర్ల, నాగారం, గుంటూరుపల్లి, కంఠాత్మకూర్, బైరాన్పల్లి, ఆరెపల్లి, అన్నసాగరం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు మార్కెట్కు వచ్చేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల కూరగాయలు నేరు గా మార్కెట్కు వచ్చి అందుబాటు ధరల్లో నగరవాసులకు లభ్యమవుతాయి. వినియోగదారుల కాళ్లకు ఉండే దుమ్ము, బుదర వంటికి కూరగాయలకు అంటకుండా విక్రయ ప్లాట్ఫారంలు రెండున్నర అడుగుల ఎత్తుతో నిర్మించా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ తరహాలో నిర్మించారు. మార్కెట్ ఆవరణలోనే తాజా పండ్లు విక్రయించనున్నారు. మటన్, చికెన్, చేపలు, ఇతర మాంసం ఉత్పత్తుల విక్రయాలు పూర్తిగా మార్కెట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవరణలో అందుబాటులో ఉంటాయి. మార్కెట్ ఆవరణలో ఐదు హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు. మార్కెట్ సమీపంలో నిరంతరం పరిశుభ్రంగా ఉండే మల మూత్ర విసర్జన వసతి(టాయిలెట్ నిర్మాణం) కల్పించారు. మహా నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన నల్లాతో ఉచిత మంచినీటి వసతి ఉంటోంది. త్వరలోనే మంచినీరు శుద్ధిచేసే యంత్రం, కూలర్లనూ అమర్చనున్నారు. మార్కెట్కు రెండు వైపులా మార్కెట్ ఆవరణలోనే ఉచిత పార్కింగ్ సదుపాయం ఉండనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. మార్కెట్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫిర్యాదు, సలహాల పెట్టెలను ఏర్పాటు చేశారు. సహకార సంఘ నిర్వాహకుల మొబైల్ నంబర్ను ప్రకటించనున్నారు. -
జైజై గణేశా!
త్రిశక్తివుయు మోక్ష గణపతి.. అవరోహణ క్రవూనికి ఈ ఏడాది నుంచి సిద్ధమయ్యూడు. ఇకపై ఏటా ఒక్కో అడుగు తగ్గుతూ 2074 నాటికి ఒక్క అడుగు బుల్లి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. కుడివైపు గజేంద్ర మోక్షం.. ఎడమవైపు వరంగల్ భద్రకాళి విగ్రహాలతో... 59 అడుగుల ఎత్తులో గణనాథుడు భక్తులను కనువిందు చేయనున్నాడు. సర్వజనుల సంక్షేవుం కోసం నీలివర్ణంలో దర్శనమివ్వడం ఇదే తొలిసారి. మహా గణపతి చేతిలో 6 టన్నుల బరువైన లడ్డూ ఏర్పాటు చేయనున్నారు. సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ వినాయకచవితి సంబరాలకు సిద్ధమైంది. గురువారం నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతుండటంతో బుధవారం నుంచే నగరంలో సందడి మొదలైంది. పండుగ గిరాకీని దృష్టిలో పెట్టుకొని నగరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పండ్లు, పత్రిని తీసుకొచ్చి ప్రధాన కూడ ళ్లు, రోడ్ల పక్కన, రైతుబజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద విక్రయించారు. వివిధ వర్గాల వారు పూలు, పండ్లు, పత్రి కోనుగోలు చేయడంతో కూడళ్లు జాతరను తలపించాయి. కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లకు జనం పోటెత్తడంతో ఆ ప్రాంతాలు కిటకిటలాడారుు. ప్రధాన మార్గాలతో పాటు గల్లీలలోనూ వినాయక ప్రతిమలు విక్రరుుంచే దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారుు. ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగింది. ఫలితంగా మట్టితో తయూరు చేసిన వినాయక ప్రతిమలకు ఈ ఏడాది గిరాకీ బాగా పెరిగింది. ఈ విషయంలో పర్యావరణవేత్తల కృషి కొంతమేరకు ఫలించిందనే చెప్పాలి. జోరుగా పూల విక్రయాలు గుడిమల్కాపూర్లోని హోల్సేల్ పూల మార్కెట్ వినియోగదారులతో బుధవారం కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది పెద్దమొత్తంలో పూలు దిగుమతయ్యాయి. హోల్సేల్ మార్కెట్లో ధరలు అందుబాటులో ఉన్నా... రిటైల్ మార్కెట్లో మాత్రం భగ్గుమన్నాయి. ఉదయం పూట కిలో రూ.60-50 ధర పలికిన బంతిపూలు... సాయంత్రానికి రూ.20-30కి దిగివచ్చాయి. ఉదయం 11 గంటల తర్వాత పెద్దమొత్తంలో సరుకు మార్కెట్కు రావడంతో ఒక్కసారిగా ధర పడిపోయింది. బంతి, చామంతి, గులాబీ, కాగడామల్లె, సన్నజాజి, కనకాంబరాలు వంటివి సుమారు 150 టన్నులు దిగుమతయ్యాయి. బుధవారం ఒక్కరోజే రూ.కోటికి పైగా వ్యాపారం సాగినట్లు కమీషన్ వ్యాపారులు తెలిపారు. ధరలు తగ్గినా కొనేవారు లేకపోవడంతో సుమారు 25-30 టన్నులు పారబోసినట్టు వివరించారు. రిటైల్ మార్కెట్లో మాత్రం బంతిపూలు కేజీ రూ.90-100 వంతున విక్రయించారు. విడిపూలతో పాటు దండలూ విక్రయించారు. వివిధ కాలనీల యువకులు వాహనాలతో తరలివచ్చి మండపాల్లో ప్రతిష్టించేందుకు పెద్ద విగ్రహాలను కొనుగోలు చేశారు. -
‘చెత్త’ పనికి రూ. లక్ష లంచం
రూ.50 వే లకు కుదిరిన బేరం డబ్బు తీసుకుంటూ పట్టుబడ్డ మార్కెటింగ్శాఖ అధికారులు చాదర్ఘాట్: కూరగాయల మార్కెట్ నుంచి చెత్త తరలింపు పని అనుమతి (వర్క్ అలాట్మెంట్) ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు మార్కెటింగ్శాఖ అధికారులు ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ)కి పట్టుబడ్డారు. బుధవారం ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ (ఎస్జీఎస్) కల్పన గుడిమల్కాపూర్ మార్కెట్లోని చెత్త తరలింపునకు సంబంధిత కాంట్రాక్టర్ రాంబాబు నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఈనెల 22న ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఎస్జీఎస్ను పట్టుకొనేందుకు పథకం వేశారు. కాంట్రాక్టర్ రాంబాబు ఇచ్చిన లంచం డబ్బును సీనియర్ అసిస్టెంట్ మహేశ్ ద్వారా ఎస్జీఎస్ కల్పన తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం పట్టుకుంది. కల్పన, మహేష్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి లంచం డబ్బు రూ. 50 వేలను స్వాధీనం చేసుకుంది. విచారణ అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఇదే సమయంలో దోమలగూడలో ఉన్న కల్పన ఇంటి వద్ద కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాడుల్లో సీఐలు మంజుల, సుదర్శన్రెడ్డి, రాజేశ్, ఎస్ఐ రాజవర్ధన్ పాల్గొన్నారు. -
ఆమదాలవలస కమిషనర్కు కూర‘గాయం’
ఆమదాలవలస: పెను వివాదం రేపి.. సంచలనం సృష్టించిన ఆమదాలవలస కూరగాయల మార్కెట్ అక్రమ తరలింపు, కూల్చివేతపై అక్కడి వర్తకులు, వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన పోరాటం ఫలించింది. మార్కెట్ తరలింపు విషయంలో తప్పు జరిగిందని మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు స్వయంగా హైకోర్టులో అంగీకరించడంతో కోర్టు ఆయనకు రూ. 10వేల జరిమానా విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టు న్యాయవాది వి.సుధాకర్రెడ్డి చెప్పినట్లు వర్తకుల తరఫున పోరాడిన స్థానిక న్యాయవాది చింతాడ సత్యనారాయణ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పొట్ట కూటికోసం దశాబ్దాలుగా ఆమదాలవలస రైల్వేస్టేషన్ ఎదుట ఉన్న కారగాయల మార్కెట్లో పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సిద్ధమైన స్థానిక టీడీపీ పెద్దలు కమిషనర్పై ఒత్తిడి తెచ్చి కూరగాయల మార్కెట్ను అక్కడి నుంచి తరలించేందుకు కుట్ర పన్నారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించగా, వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలిచింది. దీనిపై వర్తకులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కాగా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయకుండా, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ పోలీసులను మోహరించి పొక్లెయిన్తో మార్కెట్లోని షాపులను కూలగొట్టారు. ఆ మరునాడే హైకోర్టు మార్కెట్ తరలింపుపై స్టే ఇస్తూ, యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగానే ‘వారం రోజులు గడువిచ్చాం.. షాపులు ఖాళీ చేయండి’ అంటూ అక్టోబర్ 10న మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు వర్తకులకు నోటీసులు జారీ చేశారు. ఈ చర్య కోర్టు ధిక్కారం కిందికి వస్తుందంటూ మళ్లీ వర్తకులు హైకోర్టు తలుపుతట్టారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎం.రామచంద్రరావు అక్టోబర్ 27న విచారణకు హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్కు సమన్లు జారీ చేశారు. ఆ మేరకు హాజరైన కమిషనర్ తప్పు జరిగిందని అంగీకరిస్తూ, దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. దాంతో కేసును ఈ నెల 11వ తేదీ(మంగళవారం)కి వాయిదా వేశారు. మంగళవారం విచారణ సందర్భంగా కమిషనర్ లిఖితపూర్వకంగా తప్పును అంగీకరించారు. వర్తకులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు కూడా కోర్టుకు వివరించారు. ఈ తప్పునకు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా, క్షమించాలని వేడుకున్నారు. దాంతో కమిషనర్కు రూ. 10 వేల జరిమానా విధిస్తూ.. దాన్ని నష్టపోయిన కూరగాయల వర్తకులకు అందించాలని తుది ఆదేశాలు జారీ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ పోరాట ఫలితం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీడీపీ నేతలు, అధికారులకు బుధ్ధి చెప్పే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మంగళవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. కూరగాయల మార్కెట్లో పొట్టకూటి కోసం కష్టపడుతున్న వారి కడుపులు కొట్టేందుకు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ ఎన్ నూకేశ్వరరావుకు రూ.10 వేల జరిమానా విధించడం హర్షనీయమన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ చేసిన పోరాట ఫలితమని వ్యాఖ్యానించారు. -
ప్రకృతి ఆహారంతో ఎలర్జీ పరారీ!
అద్దె ఇంట్లో నివాసం ఉంటూనే.. స్ఫూర్తిదాయకంగా ఇంటిపంటల సాగు 21 రోజులకోసారి జీవామృతం తప్ప ఖర్చే లేదు ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కానీ, వ్యవసాయ రసాయనాలతో కలుషితమైన ఆకుకూరలు, కూరగాయలే మార్కెట్కు వస్తుంటే ఏమిటి పరిష్కారం? వీలైనంతలో కుండీలో, మడులో ఏర్పాటు చేసుకొని ఇంటిపట్టునే పండించుకోవడం కన్నా తెలివైన పని మరొకటేమి ఉంటుంది? అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూడా అన్నపరెడ్డి శివరామరెడ్డి (94932 74948) కుటుంబం మక్కువతో ఇంటిపంటలు పండించుకుంటున్నది. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో జన్మించిన ఆయన తెనాలిలో హోటల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు. సమీపంలోని కటివరంలో అద్దె ఇంట్లో వారి కుటుంబం నివసిస్తున్నది. రెండేళ్ల క్రితం ఇంటి ముందు రెండు సెంట్ల పెరట్లో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతో ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. అయితే, అప్పటికి సేంద్రియ పద్ధతుల్లో మొక్కల పెంపకంపై అవగాహన లేదు. ఏడాది క్రితం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఒక రైతు పరిచయం కావడంతో శివరామరెడ్డి ఇంటిపంటల సాగు పద్ధతి పూర్తిగా మారిపోయింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా ఘన జీవామృతం, జీవామృతంతో పంటలు సాగు చేయడం చూసినప్పుడు విచిత్రంగా అనిపించిందని ఆయన చెప్పారు. సావధానంగా వివరాలు అడిగి తెలుసుకొని అనుసరిస్తున్న తర్వాత గొప్ప సంతోషం కలిగిందన్నారు. ఈ ఆహారం తింటున్నందున ఫుడ్ ఎలర్జీ మాయమైందన్నారు. అంతకుముందు వంగ, గోంగూర తింటే దురదలు వచ్చేవని, ఇప్పుడు ఆ ఊసే లేకుండాపోయిందని ఇంట్లో అందరం హ్యాపీగా వీటిని వారానికి మూడు రోజులు తింటున్నామన్నారు. వంగ, మిరప, టమాటా, గోంగూర(4 రకాలు), గోరుచిక్కుడు, చిక్కుడు, బీర, బెండ, కొత్తిమీర, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. 2 సెంట్ల పెరట్లో, మేడమీద 30 కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. అన్నీ దేశవాళీ విత్తనాలే సాగు చేస్తున్నారు. మేడ మీద కుండీల్లో బీర, దొండ, కాకర పాదులు చక్కగా కాస్తున్నాయి. 40 కుండీల్లో చామంతులు, మరో 40 కుండీల్లో గులాబీలనూ వేశారు. 21 రోజులకోసారి జీవామృతం! నల్ల రేగడి మట్టి, ఎర్రమట్టి, పశువుల ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని కుండీల్లో వేశారు. 21 రోజులకోసారి జీవామృతం(1:10 పాళ్లలో నీటిలో కలిపి) మొక్కల మొదళ్లలో పోయడంతోపాటు, మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేస్తున్నారు. కుండీల్లో 3 రోజులకోసారి నీరు పోస్తున్నామన్నారు. నల్లరేగడి నేలలో పెరట్లో పెరుగుతున్న మొక్కలకు 21 రోజులకోసారి పోసే జీవామృతం సరిపోతున్నదన్నారు. ఎండాకాలంలో 10-15 రోజులకోసారి నీరు పోయాల్సి వస్తుందన్నారు. రసాయనిక ఎరువులు వాడినప్పుడు నేల రాయిలా గట్టిపడేదని, జీవామృతం వాడుతున్న దగ్గర్నుంచి నేల సారవంతమై, గుల్లబారి మెత్తగా చేతితో గుంత తీయడానికి అనువుగా మారిందన్నారు. ఈ రుచే వేరు! జీవామృతంతో పండిన కూరగాయల రుచే వేరని, స్వల్పంగా తీపి రుచి ఉంటుందన్నారు. ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మామూలు కూరగాయలు తినలేరని, తామూ ఇంటిపంటలు పండించుకోవాలన్న ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక కాపునకు మరో కాపునకు మధ్యకాలంలో టమాటాలతోపాటు బంగాళదుంపలు తప్ప బయట కొనాల్సిన అవసరం లేకుండా 90% వరకు ఇంటిపంటలపైనే ఆధారపడుతున్నామని శివరామరెడ్డి సంతృప్తిగా చెప్పారు. తమ ఇంటి యజమాని కూడా ఇంటిపంటలపై మక్కువతో సహకరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్లో యాక్టివ్ మెంబర్ అయిన శివరామరెడ్డి సంతోషకరమైన తన ఇంటిపంటల అనుభవాలతోపాటు తపాలా ద్వారా విత్తనాలనూ పంచిపెడుతూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. శివరామరెడ్డి కొందరు మిత్రులతో కలసి పది సెంట్ల స్తలంలో ఉమ్మడి ఇంటిపంటల క్షేత్రాన్ని ప్రారంభించనుండడం అభినందనీయం. -
మున్సిపల్ కమిషనర్పై ప్రశ్నల దాడి
కూరగాయల మార్కెట్ కూల్చివేతపై మంగళవారం వైఎస్ఆర్సీపీ కౌన్సిల ర్లు మున్సిపల్ కమిషనర్ ఎన్.నూకేశ్వరరావు చాంబర్కు వెళ్లి నిలదీశారు. ప్రశ్నాస్త్రాలతో ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. కౌన్సిలర్లు సంధించిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ఈ నెల 11, 16, 20 తేదీల్లో మిమ్మల్ని కలిసి కూరగాయల మర్కెట్ పునర్నిర్మాణంపై చర్చకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం. దీనికి స్పందించకుండా ఏ అధికారంతో రాత్రిపూట షాపులను కూలదోశారు. అభివృద్ధికి మేం అడ్డుకాదు. షాపింగ్ కాం ప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం పెరుగుతుందని తెలుసు. అలాగని 80 ఏళ్లుగా ఆ మార్కెట్నే నమ్ముకొని జీవిస్తున్న 42 మంది కూరగాయ ల వర్తకులకు ప్రత్యామ్నాయం చూపకుండా షాపులు కూలగొట్టడం న్యాయమేనా.. ఈ నెల 30న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశపు ఎజెండాలోనూ మార్కెట్ అంశాన్ని ఎందుకు చేర్చలేదు.. సమావేశానికి నాలుగు రోజుల ముందే హడావుడిగా కూలగొట్టాల్సిన అవసరమేముంది. ఈ వివాదంపై చర్చకు కౌన్సిల్ సమావేశం ఎందుకు పెట్టలేదో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. వీటికి కమిషనర్ స్పందిస్తూ.. సమావేశం ఏర్పాటు చేసే అధికారం నాకు లేదు. దీనిపై చైర్పర్సన్ తమ్మినేని గీతకు ఫైల్ పెట్టాను. మీరు లేవనెత్తిన ప్రశ్నలను రాతపూర్వకంగా ఇస్తే.. నేను కూడా రాతపూర్వకంగా సమాధానం ఇస్తాను.. అని చెప్పారు. దాంతో కౌన్సిలర్లు ఒక డిమాండ్ల పత్రం రూపొందించి కమిషనర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వైస్ ఫ్లోర్లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, కౌన్సిలర్లు బొడ్డేపల్లి అజంతాకుమారి, బొడ్డేపల్లి ఏకాసమ్మ, పొన్నాడ కృష్ణవేణి, గురుగుబెల్లి వెంకటప్పలనాయుడు, దుంపల శ్యామలరావు, దుంపల చిరంజీవులు, మరాఠి వెంకటేష్, సంపదరావు మురళీధరరావు లతోపాటు మాజీ కౌన్సిలర్లు జె.వెంకటేశ్వరరావు, జె.నాగభూషణరావు, తదితరులు పాల్గొన్నారు. -
గద్వాల మార్కెట్లో అగ్నిప్రమాదం
గద్వాల : మహబూబ్నగర్ జిల్లా గద్వాల కూరగాయల మార్కెట్లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 కూరగాయల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో పది దుకాణాలు సగంపైగా కాలిపోయాయి. అర్థరాత్రి రాజుకున్న మంటలు క్షణాల్లో పెద్దఎత్తున వ్యాపించాయి. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ ప్రమాదం షార్ట్సర్క్యూట్ వల్ల జరిగిందా ? లేక ఎవరైనా దుండగులు కక్ష సాధింపు కోసం నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
కూరగాయల మార్కెటలో భారీ అగ్నిప్రమాదం
-
గద్వాల మార్కెట్లో అగ్ని ప్రమాదం
-
కల్వకుర్తి కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం
మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలోని కూరగాయల మార్కెట్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అగ్నికీలలు అదుపులోకి తీసుకువచ్చారు. ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 45 దుకాణాలకు పైగా అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ. 25 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదం చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
గోదావరి ఖనిలో అగ్ని ప్రమాదం: రూ.30 లక్షల ఆస్తి నష్టం
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని కొత్త కూరగాయాల మార్కెట్లో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో దాదాపు 18 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఇరు శాఖలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎగసిపడుతున్న అగ్నికీలలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అగ్నిప్రమాదంలో సరుకులు, కూరగాయలు అన్ని కాలిపోయాయని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో రూ.30 లక్షల అస్తి నష్టం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేక ఎవరైన కావలసి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
ఉల్లికిపాటు
సాక్షి, ముంబై: ఉల్లి కోయకుండానే నగరవాసులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్కెట్లో దీని రేటు వింటేనే కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. హోల్సేల్ మార్కెట్లోకి వచ్చే సరఫరా తగ్గిపోవడంతో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.45కు చేరుకుంది. స్థానిక వ్యాపారులు రూ.55 నుంచి 65 మధ్యలో విక్రయిస్తున్నారు. ‘భారీ వర్షాల వల్ల గత రెండు నెలలుగా ఉల్లి కొరత ఉంది. ప్రతిరోజూ సుమారు 100కుపైగా వచ్చే ఉల్లి లారీలు ప్రస్తుతం 60 వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో సరఫరా తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఉల్లిగడ్డ ధరలకు రెక్కలొచ్చాయ’ని నవీముంబైలోని ఏపీఏంసీ ఉల్లి టోకు వ్యాపారి మనోహర్ తోత్లానీ సాక్షికి తెలిపారు. శనివారం పరిశీలిస్తే కేవలం 60 లారీలు ఉల్లిని తీసుకుని ఏపీఎంసీ మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఈ రోజు ధరలు సాధారణ ఉల్లి రూ. 35 వరకు పలుకగా, నాణ్యమైన ఉల్లి రూ. 45 వరకు పలికిందని ఆయన వివరించారు. మరింత పైపైకే... ముంబై, ఠాణే, నవీముంబైలలో నాణ్యమైన ఉల్లిని రూ. 60 నుంచి రూ. 65 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మనోహర్ తోత్లానీ చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, గతంలో ఏర్పడిన కరువు పరిస్థితి కారణంగానే ఉల్లి దిగుబడి తగ్గిందన్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొత్త పంట వచ్చే వరకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాసిక్ జిల్లాల్లో లాసల్గావ్తో పాటు ఇతర మార్కెట్లలో కూడా నిల్వలు చాలా తగ్గాయని తెలిపారు. మార్కెట్లోకి వచ్చే ఉల్లి లారీల సంఖ్య ఎంత తగ్గితే అంత ధరలు పెరిగే అవకాశముందన్నారు. ఇక చిల్లర మార్కెట్లో ఉల్లిని డిమాండ్ను బట్టి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ముంబై, ఠాణే, నవీ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ. 50 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తుండడం విశేషం. నగరవాసుల మండిపాటు రోజురోజుకు ఉల్లిగడ్డ ధరలు పెరుగుతుండటంపై నగరవాసులు మండిపడుతున్నారు. ప్రతిరోజూ వంటకంలో తప్పక ఉపయోగించాల్సిన ఈ ఉల్లిగడ్డ ధరల రెక్కలకు కళ్లెం వేసేందుకు సర్కార్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అక్రమ నిల్వదారులపై కొరడా ఝళిపించాలన్నారు. సామాన్యుడికి తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా స్టాళ్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో ఉల్లి అమ్మకాలు ముంబై: ఉల్లిగడ్డ ధరలు ఆకాశన్నంటుతుండటంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తక్కువ ధరకు విక్రయించారు. తమ వార్డుల్లోని 16,000 కుటుంబాలకు ఉల్లిగడ్డలు అమ్మామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో ఎమ్మెన్నెస్ పక్ష నేత దిలీప్ లాండే తెలిపారు. రైతుల నుంచి రూ.22కు కేజీ ఉల్లిగడ్డను కొనుగోలు చేసి రూ.25లకి అమ్మామని తెలిపారు. హోల్సేలర్లే ఉల్లిగడ్డలను అక్రమంగా నిల్వచేసి పరోక్షంగా ధరలను పెరిగేలా చేస్తున్నారని విమర్శించారు. గురువారం వరకు రూ.30 నుంచి రూ.32 మధ్యలో ఉన్న ఉల్లి ఆదివారం రూ.60లకు ఎగబాకిందని వివరించారు. పెరిగిన ధరల వల్ల రైతులకు ఏమీ లభం చేకూరడం లేదన్నారు. అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైతే వాషి వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ గోడౌన్లపై దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఉల్లికిపాటు
సాక్షి, ముంబై: ఉల్లి కోయకుండానే నగరవాసులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్కెట్లో దీని రేటు వింటేనే కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. హోల్సేల్ మార్కెట్లోకి వచ్చే సరఫరా తగ్గిపోవడంతో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.45కు చేరుకుంది. స్థానిక వ్యాపారులు రూ.55 నుంచి 65 మధ్యలో విక్రయిస్తున్నారు. ‘భారీ వర్షాల వల్ల గత రెండు నెలలుగా ఉల్లి కొరత ఉంది. ప్రతిరోజూ సుమారు 100కుపైగా వచ్చే ఉల్లి లారీలు ప్రస్తుతం 60 వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో సరఫరా తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఉల్లిగడ్డ ధరలకు రెక్కలొచ్చాయ’ని నవీముంబైలోని ఏపీఏంసీ ఉల్లి టోకు వ్యాపారి మనోహర్ తోత్లానీ సాక్షికి తెలిపారు. శనివారం పరిశీలిస్తే కేవలం 60 లారీలు ఉల్లిని తీసుకుని ఏపీఎంసీ మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఈ రోజు ధరలు సాధారణ ఉల్లి రూ. 35 వరకు పలుకగా, నాణ్యమైన ఉల్లి రూ. 45 వరకు పలికిందని ఆయన వివరించారు. మరింత పైపైకే... ముంబై, ఠాణే, నవీముంబైలలో నాణ్యమైన ఉల్లిని రూ. 60 నుంచి రూ. 65 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మనోహర్ తోత్లానీ చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, గతంలో ఏర్పడిన కరువు పరిస్థితి కారణంగానే ఉల్లి దిగుబడి తగ్గిందన్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొత్త పంట వచ్చే వరకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాసిక్ జిల్లాల్లో లాసల్గావ్తో పాటు ఇతర మార్కెట్లలో కూడా నిల్వలు చాలా తగ్గాయని తెలిపారు. మార్కెట్లోకి వచ్చే ఉల్లి లారీల సంఖ్య ఎంత తగ్గితే అంత ధరలు పెరిగే అవకాశముందన్నారు. ఇక చిల్లర మార్కెట్లో ఉల్లిని డిమాండ్ను బట్టి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ముంబై, ఠాణే, నవీ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ. 50 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తుండడం విశేషం. నగరవాసుల మండిపాటు రోజురోజుకు ఉల్లిగడ్డ ధరలు పెరుగుతుండటంపై నగరవాసులు మండిపడుతున్నారు. ప్రతిరోజూ వంటకంలో తప్పక ఉపయోగించాల్సిన ఈ ఉల్లిగడ్డ ధరల రెక్కలకు కళ్లెం వేసేందుకు సర్కార్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అక్రమ నిల్వదారులపై కొరడా ఝళిపించాలన్నారు. సామాన్యుడికి తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా స్టాళ్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో ఉల్లి అమ్మకాలు ముంబై: ఉల్లిగడ్డ ధరలు ఆకాశన్నంటుతుండటంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తక్కువ ధరకు విక్రయించారు. తమ వార్డుల్లోని 16,000 కుటుంబాలకు ఉల్లిగడ్డలు అమ్మామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో ఎమ్మెన్నెస్ పక్ష నేత దిలీప్ లాండే తెలిపారు. రైతుల నుంచి రూ.22కు కేజీ ఉల్లిగడ్డను కొనుగోలు చేసి రూ.25లకి అమ్మామని తెలిపారు. హోల్సేలర్లే ఉల్లిగడ్డలను అక్రమంగా నిల్వచేసి పరోక్షంగా ధరలను పెరిగేలా చేస్తున్నారని విమర్శించారు. గురువారం వరకు రూ.30 నుంచి రూ.32 మధ్యలో ఉన్న ఉల్లి ఆదివారం రూ.60లకు ఎగబాకిందని వివరించారు. పెరిగిన ధరల వల్ల రైతులకు ఏమీ లభం చేకూరడం లేదన్నారు. అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైతే వాషి వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ గోడౌన్లపై దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఉప్పెనలా ఉద్యమం
‘సమైక్య ఉద్యమ ఉధృతి తీవ్రరూపం దాల్చింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా...కూలీల నుంచి ఉద్యోగుల వరకు, చిరు వ్యాపారుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల దాకా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆరు దశాబ్దాలుగా కలిసి ఉన్న తెలుగువారిని విడదీస్తున్నారనే ఆవేదన ..విభజనతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందనే ఆందోళన ...ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు ఉద్యమంలోకి రాలేదనే ఆగ్రహం ..వెరసి ఎనిమిదోరోజు ఉద్యమంలో మరింత వేడిని రగిల్చాయి. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా జిల్లాలోని అన్ని చోట్ల ఎవరికి తోచిన రీతిలో వారు నిరసనలు చేపట్టారు. సాక్షి, కడప: రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ ఎనిమిదిరోజులుగా జిల్లాలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమసెగలు నింగికెగశాయి. బుధవారం జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్, ఆస్పత్రులు, అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ మీదుగా సెవెన్రోడ్స్ వరకూ సాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. చెక్కభజన చేసుకుంటూ, సమైక్యాంధ్రకు మద్దతుగా పాటలు పాడుతూ నిరసన తెలిపారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అన్ని రాజకీయపార్టీల నేతలు జెండాలను, పార్టీ అజెండాలను పక్కనపెట్టి ఉద్యమంలోకి వచ్చి కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం చేయాలని శివానందరెడ్డి పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నేతలు తెలుగుజాతికి ద్రోహం చేశాయని రాజమోహన్రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్కాంగ్రెస్పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సురేశ్బాబు, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి, నగర సమన్వయకర్త అంజద్బాషా సందర్శించారు. దీక్షకు సంఘీభావంగా వంశీధర్రెడ్డి ఆధ్వర్యంలో వంటా-వార్పు చేపట్టారు. ఉరితీసేవారిని కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ కాంగ్రెస్పార్టీ నిరంకుశత్వంగా విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని అవినాష్రెడ్డి విమర్శించారు. న్యాయవాదులు, టీచర్ల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రగతిభవన్ ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ ఉద్యోగులు వంటా-వార్పు చేపట్టారు. సాధారణ ప్రజలు కూడా కాలనీల వారీగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఏడురోడ్ల కూడలిలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. రిమ్స్ జే ఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. కాలేజీ పేరులో రాజీవ్ పేరును తొలగించి రాయలసీమ అని స్టిక్కర్ అంటించారు. ప్రొద్దుటూరులో పుట్టపర్తి సర్కిల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టాభిరామ మండీమర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వేల మందికి వంటా-వార్పు నిర్వహించారు. బైక్ మెకానిక్, ఎల్ఐసీ, వస్త్రభారతి, ఎరువులు, పురుగుమందులు, చిల్లర అంగళ్ల వ్యాపారులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. న్యాయవాదులు, ప్రైవేటు, ఏయిడెడ్ ఉపాధ్యాయుల నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. శివాలయం వీధిలో ఆందోళన కారులు పలు ఆటోల అద్దాలను ధ్వంసం చేశారు. మునిసిపల్ ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. రాయచోటిలో ద్విచక్రవాహనాలను కూడా తిరగనివ్వకుండా ఆందోళన కారులు పట్టణాన్ని దిగ్బంధనం చేశారు. ఓ పెట్రోలు బంకుపై ఆందోళన కారులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. జమ్మలమడుగు పాతబస్టాండ్లో కొనసాగుతున్న నిరసనదీక్షలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వేర్వేరుగా సందర్శించి సంఘీభావం తెలిపారు. పట్టణంలో మునిసిపల్, నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ ఉద్యోగులు పెన్డౌన్ చేశారు. ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఎర్రగుంట్లలో జువారీ ఉద్యోగులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. చెక్కభజన చేశారు. ఆర్టీపీపీ ఉద్యోగులు రోడ్డుపై ఖో..ఖో, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. మైదుకూరులో ైవె ఎస్ఆర్సీపీ క్రమశిక్షణకమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. డీసీసీబీ చైర్మన్ తిరుపాల్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న రిలేదీక్షలను వైఎస్ అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డి సందర్శించారు. అక్కడే వంటా- వార్పు చేపట్టారు. అవినాష్రెడ్డి రోడ్డుపై క్రికెట్ ఆడారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ శవపేటికకు మహిళలు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. బద్వేలులో జేఏసీ నేతలు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. కలసపాడులో వంటావార్పు చేపట్టారు. రాజంపేటలో పట్టణ పురోహితుల ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్సింగ్లకు పిండ ప్రదానం చేశారు. బోయినపల్లిలో వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పాల్గొన్నారు.