woman molested
-
ఫాంహౌజ్లో బంధించి.. సామూహిక అత్యాచారం కేసులో ఏడుగురికి రిమాండు
జడ్చర్ల: సామూహిక అత్యాచార ఘటనకు పాల్పడిన ఏడుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ రమేశ్బాబు విలేకరులకు వెల్లడించారు. మండలంలోని కోడ్గల్ గ్రామ శివారులో రవికుమార్కు చెందిన మలబార్ తోటలో ఏపీలోని గుంటూరు జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన చెందిన లక్ష్మి నాలుగేళ్లుగా కూలీగా పనిచేస్తుంది. అలాగే జడ్చర్ల మండలం నెక్కొండకు చెందిన కాటమోని బాలస్వామి సైతం ఇదే తోటలో సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో బాలస్వామి, లక్ష్మి మధ్య కొంత చనువు ఏర్పడింది. రెండు నెలల కిందట లక్ష్మి అక్కడి నుంచి బాలానగర్ మండలం నేరళ్లపల్లి శివారులోని మరో తోటలో పనిచేసేందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తోటలో పనుల కోసం పల్నాడు ప్రాంతానికి చెందిన బంధువులు రమణమ్మ, రమేశ్ కలిసి లక్ష్మి దగ్గరకు వచ్చారు. తమకు బంగారు దొరికిందని, దానిని ఎవరికై నా అమ్మాలని లక్ష్మిని కోరారు. దీంతో లక్ష్మి బాలస్వామికి చెప్పింది. అప్పటికే తన దగ్గర భూమి అమ్మిన డబ్బులు ఉండడంతో తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మిన బాలస్వామి రూ.2 లక్షలు ఇచ్చి అర కిలో నకిలీ బంగారు బిస్కెట్ తీసుకున్నాడు. బంగారు విక్రయం తర్వాత లక్ష్మి ఇక్కడి తోటలోనే పనులు చేసుకుంటుండగా రమణమ్మ, రమేశ్లు స్వగ్రామానికి వెళ్లిపోయారు. తర్వాత బాలస్వామి తాను కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్ను పరీక్షించగా అది నకిలీగా తేలడంతో లక్ష్మిని నిలదీశాడు. తమను మోసం చేసిన వారిని ఎలాగైనా ఇక్కడికి రప్పించి డబ్బులు వసూలు చేసుకోవాలని భావించిన బాలస్వామి గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి రమేశ్కు ఫోన్ చేసి తమకు మరికొంత బంగారు కావాలని నమ్మబలికారు. దీంతో రమేశ్, రమణమ్మ, బయ్యా గంగమ్మతో కలిసి ఈ నెల 8న వచ్చారు. అదే రోజు బాలస్వామి, లక్ష్మి, నరేష్, శ్రీశైలం మార్గమధ్యలో కల్వకుర్తి సమీపంలోని జేపీనగర్ దగ్గర వేచి ఉన్నారు. వారు బైక్పై రాగానే ముందస్తు పథకం ప్రకారంగా ఏర్పాటు చేసుకున్న స్కార్పియోలో రమేశ్, రమణమ్మ, గంగమ్మలను కిడ్నాప్ చేసి కోడ్గల్లోని తోటలో ఫాంహౌజ్కు తీసుకువచ్చి బంధించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా రమేశ్ నిరాకరించడంతో బాలస్వామి మరికొందరు చితకబాదారు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఒక గదిలో రమణమ్మపై బాలస్వామి, కుర్వ నర్సింహ అత్యాచారం చేయగా మరో గదిలో గంగమ్మపై కుర్వ వంశీ, శ్రీశైలంలు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో రమేశ్ వారి నుంచి తప్పించుకుని గ్రామస్తులకు విషయం చెప్పి జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారం జరిపిన వారితోపాటు ఘటనకు సహకరించిన లక్ష్మి, శేఖర్, కుమ్మరి గణేష్, ప్రవీణ్గౌడ్, డ్రైవర్ వంశీలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిలో లక్ష్మి, డ్రైవర్ వంశీ పరారీలో ఉన్నారు. నిందితులకు సంబంధించిన మూడు బైక్లు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఖాదర్, సిబ్బంది పాల్గొన్నారు. -
క్యాబ్లోంచి పాపను విసిరేసి.. తల్లిపై వేధింపులు!
ముంబై: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు దారుణాలు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. క్యాబ్లో ప్రయాణిస్తున్న ఓ వివాహితను వేధించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆమె ఒడిలోని పది నెలల పాపను క్యాబ్ నుంచి బయటకు విసిరేశారు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వారి చర్యను ప్రతిఘటించటంతో బాధితురాలిని సైతం క్యాబ్ నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ముంబై-అహ్మదాబాద్ హైవేలో పెల్హార్ నుంచి పోషేర్కు వెళ్తున్న క్రమంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వడా తాహసీల్లోని పెల్హార్ నుంచి పోషేర్కు ఓ వివాహిత తన పాపతో క్యాబ్లో వెళ్తోంది. మార్గమధ్యలో డ్రైవర్తో పాటు తోటి ప్రయాణికులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో.. పాపను లాక్కొని, క్యాబ్ నుంచి బయటకు విసిరేశారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమెను బయటకు నెట్టేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకుని మాండ్వీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: వ్యభిచార ముఠా పట్టివేత.. మహిళ అరెస్ట్ -
బంజారాహిల్స్లో దారుణం.. యువతిపై అత్యాచారం
బంజారాహిల్స్: పక్కింట్లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. అస్సామ్ రాష్ట్రానికి చెందిన యువతి(22) బంజారాహిల్స్ రోడ్ నెం. 5లోని దేవరకొండ బస్తీలో అక్కాబావల వద్ద ఉంటూ ఓ మలీ్టఫ్లెక్స్లో టికెట్ బుకింగ్ కౌంటర్లో పనిచేస్తోంది. అదే రాష్ట్రానికి చెందిన చిన్మయ్ సైకియా(24) అనే యువకుడు కూడా అదే ప్రాంతంతో నివాసం ఉంటూ బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఓ షాపింగ్ మాల్లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న యువతి తన గదిలో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన చిన్మయ్ సైకియా లోనికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పటి నుంచి తీవ్రంగా ఏడుస్తూ ఇంట్లోనే ఉంటోంది. శనివారం రాత్రి బాధితురాలి సోదరి ఏంజరిగిందని ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో బాధితురాలితో కలిసి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఎంత దారుణం: అయిదేళ్లలో దేశంలో ఇన్ని అఘాయిత్యాలా!
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (ఉపా) కింద 2019 లో 1,948 మంది అరెస్టయ్యారని, 34 మంది దోషులుగా తేలారని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. అలాగే 2015-2019 మధ్య దేశంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుండి అత్యధికకేసులు నమోదుకాగా, తర్వాత రాజస్థాన్, యూపీ తరువాతి స్థానాల్లో నిలిచాయి డీఎంకే సభ్యుడు అడిగి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డీఎంకే సభ్యుడు తిరుచి శివ ఈ ప్రశ్నను అడిగారు. అయిదేళ్లలో 1.71 లక్షల అత్యాచారాలు.. 2015-19 మధ్య దేశంలో 1.71 లక్షల అత్యాచారాలు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈ వివరాలను రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లోనే నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లో 22,753, రాజస్తాన్లో 20,937, ఉత్తరప్రదేశ్లో 19,098, మహారాష్ట్రలో 14,707, ఢిల్లీలో 8,051 అత్యాచారాలు జరిగాయి. సీఏఏ సవరణ లేదు.. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి సవరణలు చేసే ప్రతిపాదనలేవీ లేవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. మార్పులేమైనా తీసుకొచ్చి ఇతర మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తారా అన్న ప్రశ్నకు ఆయన రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాంటి ప్రతేపాదనేదీ తమకు లేదని స్పష్టం చేశారు. 2019 చట్టం ప్రకారం అర్హులైన వారందరికీ పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. 12,600 శత్రు ఆస్తులు.. దేశంలో 12,600కు పైగా శత్రు ఆస్తులను కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా (సీఈపీఐ) స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర మంత్రి అజయ్కుమార్ మిశ్రా ఈ వివరాలను రాజ్యసభలో వెల్లడించారు. భారత్ వదలి పాకిస్తాన్, చైనాలకు వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్న వారి ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు. ఇందులో పాకిస్తాన్కు వెళ్లిన వారి ఆస్తులు 12,485కాగా, 126 చైనాకు వెళ్లిన వారివి. శత్రు ఆస్తుల్లో అధికంగా ఉత్తరప్రదేశ్లోనే (6,255) ఉన్నాయి. ఆర్నెళ్లలో 12,001 సైబర్ ఘటనలు.. ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో 12,001 సైబర్ సెక్యూరిటీ ఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం 2020లో 11,58,208, 2021 (జూన్ వరకు) 6,07,220 సైబర్ సెక్యూరిటీ ఘటనలు జరిగినట్లు తెలిపారు. సీఏపీఎఫ్లో 680 ఆత్మహత్యలు.. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) గత ఆరేళ్లలో మొత్తం 680 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ విషయాలను రాజ్యసభకు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రమాదాల కరాణంగా 1,764 మంది, ఎన్కౌంటర్లలో 323 మంది మరణించారని తెలిపారు. ఆత్మహత్యలకు ఆర్థిక కారణాలు, అనారోగ్యం వంటివి ఉండొచ్చని అన్నారు. 183 మంది రైతులు అరెస్టు.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల వద్ద గత ఏడాది నుంచి నిరసనలు చేపట్టిన ఘటనల్లో ఢిల్లీ పోలీసులు మొత్తం 183 మంది రైతులను అరెస్టు చేశారని కేంద్రం రాజ్యసభలో తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ దీనికి సంబంధించి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశద్రోహ చట్టం, ఉపా చట్టం వంటి వాటిని వారిపై ప్రయోగించలేదని పేర్కొన్నారు. 630 మంది ఉగ్రవాదులు హతం మూడేళ్లలో జమ్మూకశ్మీర్లో జరిగిన 400 ఎన్కౌంటర్లలో 630 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ వివరాలను లిఖితపూర్వకంగా అందించారు. ఎన్కౌంటర్లలో 85 మంది భద్రతా బలగాలకు చెందిన సైనికులు కూడా మరణించారన్నారు. 2018 మే నుంచి 2021 జూన్ వరకు సంబంధించిన వివరాలు ఇవి అని తెలిపారు. 4,046 మందిదరఖాస్తులు పరిశీలనలో.. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు చెందిన హిందువులు 4,046 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని, అవి పలు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ విషయాలను రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. వీటిలో రాజస్తాన్ ప్రభుత్వం వద్ద 1,541 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2016-2020ల మధ్య మొత్తం 4,171 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు. -
27 ఏళ్ల క్రితం అత్యాచారం..కొడుకు ప్రశ్నించడంతో కేసు
షాజహాన్పూర్: సుమారు 12 సంవత్సరాల వయసులో తనపై అత్యాచారానికి పాల్పడ్డవారిపై 27 సంవత్సరాల తర్వాత ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తన తండ్రెవరని ఆమె కుమారుడు ఆమెను ప్రశ్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 27 సంవత్సరాల క్రితం తన సోదరితో కలిసి నివసిస్తుండగా, స్థానికంగా ఉండే నకి హసన్ అనే వ్యక్తి ఇంట్లోకి జొరపబడి అత్యాచారం జరిపాడని, అనంతరం అతని సోదరుడు గుడ్డు అనే వ్యక్తి కూడా అత్యాచారం చేశాడని, హసన్, గుడ్డు ఆ తర్వాత పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొనట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమెకు 12సంవత్సరాలున్నట్లు తెలిపారు. ఈ దుశ్చర్య ఫలితంగా 13ఏళ్లకే ఆమె గర్భం దాల్చి 1994లో ఒక బాలుడికి జన్మనిచి్చంది. తొలుత పోలీసులు ఈ కేసు నమోదుకు అంగీకరించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించి ఫిర్యాదును రిజిస్టర్ చేయించారు. చదవండి: దారుణం: ఇంటికి నిప్పు.. అత్యాచార బాధితురాలు మృతి -
దారుణం: ఆదమరిచి నిద్రిస్తున్న మహిళపై..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అలసిసొలసి రైలు బోగీలో ఆదమరిచి నిద్రిస్తున్న మహిళపై ఇద్దరు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లాకు చెందిన 40 ఏళ్ల వివాహిత జీవనాధారం కోసం లోకల్ రైలు బోగీలో పళ్లు అమ్ముతుంది. చెంగల్పట్టు–చెన్నై తాంబరం మధ్య తిరిగే లోకల్ రైల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మకాలు సాగించి తిరిగి ఇంటికి చేరుకునేందుకు తాంబరంలో చెంగల్పట్టు రైలు ఎక్కింది. (చదవండి: ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం) ఉదయం నుంచి కష్టం చేయడంతో నిద్రపట్టేయగా చెంగల్పట్టు వచ్చినా దిగలేదు. దీంతో అదే రైలు చివరి ట్రిప్పుగా అర్ధరాత్రి వేళ మళ్లీ తాంబరానికి చేరుకుంది. రైలు బోగీలను శుభ్రం చేసేందుకు వచ్చిన ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు ఆమెను తట్టిలేపి నోరుగట్టిగా మూసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే రైల్వే సొత్తును చోరీ చేస్తున్నావని కేసులు బనాయిస్తామని బెదిరించారు. శనివారం తెల్లారగానే తాంబరం రైల్వేపోలీసు స్టేషన్కు వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేయగా, కాంట్రాక్టు కార్మికులు సురేష్ (31), ఖలీల్ (30)లను ఆదివారం అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు.(చదవండి: పక్కింటి మహిళతో సంబంధం.. సొరంగం తవ్వి మరీ..) -
యువతిపై అత్యాచారం.. మార్చురీలో మృతదేహం
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని చింతపాలెం మండలం పిక్లానాయక్ తండాకు చెందిన ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో యువతి బంధువులు ఆస్పత్రి ముందే ధర్నాకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ గురుకుల కళాశాలలో డిగ్రీ చదువుతున్న యువతి.. పీజీ కోచింగ్ కోసమని గత గురువారం హైదరాబాద్కు వెళ్లారు. ఆ తర్వాతి రోజే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగాలేదని, ఇంటికి వస్తున్నాని చెప్పారు. మొదట ఖమ్మం ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. యువతిపై అత్యాచారం జరిగిందని, మెరగైన చిక్సితకు హైదరాబాద్కు తరలించాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు యువతిని హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందారు. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. అయితే తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని యువతి బంధువులు ఆస్పత్రి ముందు భైఠాయించారు. దీంతో యువతి మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
మరో ట్విస్ట్: 36 మంది అత్యాచారం వాస్తవం
సాక్షి, హైదరాబాద్ : తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన మిర్యాలగూడకు చెందిన యువతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసి పోలీసుల శాఖను ముప్పుతిప్పలు పెట్టి.. రెండు రోజులకే మాట మార్చింది. ఆ తరువాత తనపై ఎవరూ అత్యాచారానికి పాల్పడలేదని రాజశేఖర్రెడ్డి అలియాస్ డాలర్ భాయ్ కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పేర్కొని కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం మరో ప్రకటన చేసింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని, 36 మంది మాత్రమే అత్యాచారం చేశారని పేర్కొంది. మొత్తం 53 మంది తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు తెలిపింది. డాలర్ బాయ్ తనను చిత్రహింసలకు గురిచేశాడని, తన బలవంతం మేరకే సెలబ్రిటీల పేర్లు చెప్పాల్సి వచ్చిందని వివరించింది. (ఎన్జీఓ డాలర్ భాయ్ ప్రధాన నిందితుడు!) తొలుత డాలర్ బాయ్ కంపెనీలో ఉద్యోగం నిమిత్తం వెళ్లానని, అప్పటి నుంచి తన గురించి తెల్సుకుని ఈ విధంగా వాడుకున్నాడని తెలిపింది. డాలర్ బాయ్ తన మీద అనేక రకాలుగా చిత్రహింసలకు పాల్పడ్డాడని, 36 మంది అత్యాచారం చేయడం మాత్రం వాస్తవమని స్పష్టం చేసింది. అతనితో తనకు ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్ భాయ్పై సీసీఎస్ మహిళా ఠాణాలో ఇదివరకే ఓ కేసు నమోదై ఉంది. ఇటీవల జరిగిన ఫోన్ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో తాజాగా మరో కేసు నమోదైంది. అయితే అప్పుడు ఆమె చెప్పిన వివరాలకు, తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన వాటికి చాలా తేడా ఉంది. దీంతో బాధితురాలి నుంచి మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేయాలని అధికారులు నిర్ణయించారు. (డాలర్ బాయ్ వ్యవహారంలో సంచలన విషయాలు) -
రేప్ కేసు: అతడే ప్రధాన నిందితుడు!
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడకు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇప్పటి వరకు బాధితురాలికి ‘అండగా’ ఉండి, ఆమెతో ఫిర్యాదు చేయించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడే ప్రధాన నిందితుడిగా మారనున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. న్యాయస్థానంలోనూ స్టేట్మెంట్ రికార్డు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదకొండేళ్ళుగా 143 మంది తనపై అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో కొందరు ప్రముఖులు కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సుకత రేపిన ఈ కేసు దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళ ఠాణా ఏసీపీ శ్రీదేవిని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా నియమించారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా చేస్తుండగానే సోమవారం బాధితురాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు కొత్త ట్విస్ట్కు కారణమయ్యాయి. సోమాజిగూడలో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ, తనకు సాయం చేస్తున్నట్లు నటించిన రాజశేఖర్రెడ్డి అలియాస్ డాలర్ భాయ్ కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది. అతగాడు చెప్పిన పేర్లు తన ఫిర్యాదులో పొందుపరిచానంటూ వెల్లడించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఈ కేసులో డాలర్ భాయ్ని ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. బాధితురాలి నుంచి గతంలో ఓసారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే అప్పుడు ఆమె చెప్పిన వివరాలకు, తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన వాటికి చాలా తేడా ఉంది. దీంతో బాధితురాలి నుంచి మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఈ కేసు నిందితుల జాబితాలో మార్పు చేయనున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆమెతో న్యాయస్థానంలోనూ 164 స్టేట్మెంట్ రికార్డు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్ భాయ్పై సీసీఎస్ మహిళా ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఇటీవల జరిగిన ఫోన్ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో తాజాగా మరో కేసు నమోదైంది. -
డాలర్ బాయ్ వ్యవహారంలో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి చేత కేసు పెట్టించిన డాలర్ బాయ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భద్రాద్రి జిల్లాలో రాజ శ్రీకర్రెడ్డి అలియాస్ డాలర్ బాయ్పై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. పదేళ్ల క్రితమే డాలర్ బాయ్పై రామవరంలో కేసు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. చీటీల పేరుతో తన స్వస్థలంలోని రామావరంలో డబ్బులు డిపాజిట్ చేయించి మోసం చేశారు. 10 లక్షల రూపాయలను తీసుకొని హైదరాబాద్కు పారిపోయాడు. (చదవండి : ఎవరీ డాలర్ బాయ్? ) బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకొని వస్తుండగా ఓ వ్యక్తి నుంచి ఏడు లక్షల రూపాయలు దొంగిలించిన కేసులో డాలర్ బాయ్పై కేసు ఫైల్ అయింది. ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా డాలర్భాయ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో రాజశ్రీకర్ అలియాస్ డాలర్భాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి : 139 మంది అత్యాచారం కేసులో ట్విస్టు) -
చెకప్ కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..
ముజఫర్నగర్ : వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన ఓ మహిళపై ఇద్దరు వైద్యులు లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్నగర్కు చెందిన ఓ మహిళ శుక్రవారం అనారోగ్యానికి గురికావడంతో, వైద్య పరీక్షల నిమిత్తం తల్లి, సోదరుడితో కలిసి నగరంలోని ఓ క్లీనిక్కు వెళ్లారు. మహిళపై కన్నేసిన ఇద్దరు యువ డాక్టర్లు.. వైద్య పరీక్షల కోసం గదిలోకి రావాలని చెప్పి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. (చదవండి : భర్త వదిలేస్తాడని: గర్భిణి కడుపు కోసి..) ఈ సమయంలో ఆమె తల్లి, సోదరుడు గది బయటే ఉన్నారు. డాక్టర్ల ప్రవర్తన పట్ల విసుగు చెందిన మహిళ.. పరీక్షలు వద్దని చెప్పి ఇంటికి వెళ్లారు. అనంతరం డాక్టర్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు.. శనివారం క్లినిక్ వద్దకు వెళ్లి వైద్యులపై దాడి చేశారు.అనంతరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అశోక్, అనిల్ అనే ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితులు పరారిలో ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. -
పెళ్లి సాకుతో రెండేళ్లుగా యువతిపై..
రాంచీ : పెళ్లి పేరుతో యువతిని వంచించి, అత్యాచారానికి పాల్పడి, ఆపై పలుమార్లు అబార్షన్లు చేయించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోహర్దగా జిల్లా కురుబ్లాక్కు చెందిన ఓ యువతి చదువు నిమిత్తం అమ్మమ్మగారి ఊరైనా సెన్హా ఏరియాలో నివాసం ఉంటోంది. ఇదే ప్రాంతలో శివరాజ్పూర్ గ్రామానికి చెందిన యువకుడు అజిత్ కూడా నివాసముంటున్నాడు. చదువు విషయంలో సహాయం చేసే క్రమంలో వీరిద్దరికి స్నేహం ఏర్పడింది. కాలక్రమంలో ఆ స్నేహం కాస్త క్రమంగా ప్రేమగా మారింది. ( చదవండి : ఢిల్లీలో ‘బాయ్స్ లాకర్ రూమ్’ వికృత చర్చలు) పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై అజిత్ గత రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో పలుమార్లు అబార్షన్ కూడా చేయించాడు. కాగా, ఇటీవల యువతి మరోసారి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని అజిత్ని పట్టుబట్టింది. పెళ్లికి నిరాకరించిన అజిత్.. అక్కడి నుంచి పరారయ్యాడు.దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి సెన్హా పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారిలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకొని విచారణ చేస్తామని పేర్కొన్నారు. -
క్వారంటైన్లో ఉన్న మహిళపై అత్యాచారం
జైపూర్ : రాజస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. లాక్డౌన్ కారణంగా కాలినడకన సొంతూరుకు బయలుదేరి మార్గమధ్యలో ఓ పాఠశాలలో విశ్రమించిన మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు ముగ్గురు దుండగులు. ఈ ఘటన రాజస్తాన్లోని సవాయి మాధోపూర్ బటోడా పోలీసు స్టేషన్ పరిధిలో గత గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్కు చెందిన ఓ మహిళ లాక్డౌన్ కారణంగా మాధోపూర్లో ఉండిపోవాల్సి వచ్చింది. నెలరోజులు అయినా లాక్డౌన్ తొలగించకపోవడంతో చివరకు చేసేదేమిలేక కాలినడకన సొంతూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె మాధోపూర్ చేరుకోగా, స్థానికులు అడ్డుకొని బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంచారు.ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు అర్థరాత్రి పాఠశాలకు చేరుకొని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మహిళను క్వారంటైన్కు తరలించి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. -
ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి యువతిపై..
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి నిందితులు రైలులో పరిచయం అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. నగరానికి రప్పించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. -
ప్రత్యేక కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచార కేసులను విచారించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి. 11 ప్రత్యేక కోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేస్తూ హైకోర్టు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు ఈ నెల 28 లోగా బాధ్యతలను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్టు–న్యాయమూర్తుల వివరాలు.. హైదరాబాద్–బి.శ్రీనివాసరావు, ఎల్బీనగర్ –కె.మారుతిదేవి, ఆదిలాబాద్–వై.జయప్రసాద్, వరంగల్–పి.ముక్తి దా, మహబూబ్నగర్–పి.ఆనీరోజ్, నల్లగొండ –వి.శారదాదేవి,ఖమ్మం–కె.అరుణకుమారి, కూకట్పల్లి(రంగారెడ్డిజిల్లా) –జె.మైత్రేయి,కరీంనగర్–డి.మాధవికృష్ణ, సంగారెడ్డి (మెదక్ జిల్లా)–ఎం.శ్యాం శ్రీ, నిజామాబాద్–టి.నర్సి రెడ్డి. -
ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి
చీపురుపల్లి రూరల్: ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వాంఛ తీర్చుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి మాయమాటల్లో పడి ఆ యువతి మోసపోయింది. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు వీరద్దరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొని శారీరక వాంఛ తీర్చాలంటూ ఆ యువతిని భయపెట్టాడు. వారి ప్రేమ వ్యవహారాన్ని గ్రామంలో చెప్పి బయట పెడతానని చెప్పి బెదిరించాడు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిస్తే తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనని భయపడిన ఆ యువతి ఆ యువకుడికి కూడా లొంగిపోయింది. ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఆ యువతిలో శారీరక మార్పులు రావటంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువతిని ఏమయ్యిందని ఇంట్లో నిలదీశారు. విషయం తెలుసుకొని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా ఆమె గర్బవతి అయిందని తేలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ పరిధి పుర్రేయవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుర్రేయవలస గ్రామానికి చెందిన వివాహితుడు సంగిరెడ్డి రామారావు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు బూటు పైడిరాజు ఆ యువతిని బెదిరించి వాంఛ తీర్చుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో గ్రామ పెద్దలకు తెలియజేసింది. అక్కడ న్యాయం జరగకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అత్యాచారం.. ఆపై నిప్పు
బండా (ఉత్తరప్రదేశ్): ఉన్నావ్లో అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవ దహనం చేసిన ఘటన మరవకముందే అలాంటి దారుణం శనివారం యూపీలోని ఫతేపూర్ జిల్లాలో జరిగింది. ఫతేపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు దూరపు బంధువు ఒకరు ఆమెను రేప్ చేసి, ఆమెకు నిప్పంటించాడు. బాధితురాలి ఆక్రందనలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను దగ్గరలోని ఓ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితురాలు కాన్పూర్లోని ఓ ఆస్పత్రిలో 90% కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. -
హైదరాబాద్లో మరో దారుణం..
సాక్షి, హైదరాబాద్ : షాద్నగర్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనను మరువక ముందే హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. నిజాంపేటలో ఓ అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై జయచంద్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో బాధితురాలు ఉండగా, ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి తన సోదరితో కలిసి నిజాంపేటలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. వారికి 20 రోజుల క్రితం మాట్రిమోని ద్వారా జయచంద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారం రోజుల క్రితం సుజనాఫోరమ్ మాల్ వద్ద బాధితురాలి సోదరితో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బాధితురాలి సోదరి చెప్పారు. ఈ పరిచయాన్ని అవకాశంగా తీసుకున్న జయచంద్.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం గదిలో ఉన్న నగలతో పరారయ్యాడు. సాయంత్రం బాధితురాలు సోదరి ఇంటికి రాగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మహిళా టీచర్పై ఇంటి ఓనర్ కొడుకు..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో దారుణం జరిగింది. ఇంట్లో కిరాయికి ఉంటున్న 50 ఏళ్ల మహిళా టీచర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని కొడుకు. కాఫీలో మత్తుమందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్లోని జిన్నాపార్క్ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయ జంట అదే ప్రాంతంలో ఓ ఇంటిని కిరాయికి తీసుకొని నివాసం ఉంటుంది. వృత్తి రిత్యా వేరు వేరు ప్రాంతాలకు వెళ్తునందున.. సెలవు దినాల్లో మాత్రమే వచ్చి అక్కడ గడిపేవారు. కాగా, అక్టోబర్ 1న ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఇంటి యజమాని కుమారుడే దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో దొంగతనం విషయాన్ని ఆ యువకుడు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇంటి యజమాని ఆ వస్తువులు తిరిగి కొనిస్తాని చెప్పడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. వారం రోజుల అయినప్పటికీ వస్తువులు కొనివ్వకపోవడంతో మహిళా టీచర్ భర్త ఇంటి యజనమానిని నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన యజమాని.. వారి కూతురిని కిడ్నాప్ చేసి హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో వస్తువులను అడగడం మానేశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 15న ఇంటి యజమాని పెద్ద కుమారడు, యువకుడు మహిళా టీచర్ ఇంటికి వెళ్లాడు. తన తమ్ముడు దొంగిలించిన వస్తువులను తిరిగి ఇస్తానని తన ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం కాఫీలో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళా టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని యుకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
బైక్ టాక్సీ బుక్చేసిన యువతితో డ్రైవర్..
లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సికందర్ బాగ్ నుంచి బైక్ టాక్సీపై న్యూ హైదరాబాద్లోని కార్యాలయానికి వెళుతున్న 27 ఏళ్ల అమెరికా యువతిని డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. ప్రైవేట్ భాగాల దగ్గర టచ్ చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె బైక్ నుంచి దిగిపోయి, తన తోటి ఉద్యోగులకు విషయం తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బైక్ టాక్సీ డ్రైవర్ విజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాకు చెందిన ఒక యువతి హజరత్ గంజ్లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ, న్యూ హైదరాబాద్లోని మేథా లెర్నింగ్ ఫౌండేషన్లో పనిచేస్తోంది. ఉదయం ఆమె తన కార్యాలయానికి వెళ్లేందుకు బైక్ టాక్సీ బుక్ చేసుకుంది. ఆమెను బైక్పై తీసుకు వెళుతుండగా డ్రైవర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. శృంగారం గురించి మాట్లాడుతూ.. ఆమెను వేధించడం మొదలెట్టాడు. వద్దని వారించినా వినకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో బైకి దిగి వెళ్లిపోయిన యువతి.. తోటి ఉద్యోగుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విజయ్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!
సాక్షి, న్యూఢిల్లీ : లండన్లోని సెయింట్ నియోట్స్ పట్టణానికి చెందిన క్రిష్టఫర్ స్కూబర్ట్కు 44 ఏళ్లు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ‘మ్యాచ్ డాట్ కామ్’ వెబ్సైట్ను ఆశ్రయించారు. ఓ అమ్మాయి నచ్చింది. ఇరువురు ప్రేమ సందేశాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పెళ్లయితే జంటగా పడుకునేందుకు ఓ మంచి మంచం, మెత్తటి పరువు ఉందని ఆమె చెప్పింది. అంతకన్నా పెద్ద మంచం, పెద్ద పరువు తనింట్లో ఉందని స్కూబర్ట్ సందేశం ఇచ్చారు. ముఖాముఖి కలుసుకునేందుకు, ప్రేమించుకునేందుకు ఓ సాయంత్రం సంధ్య వేళ ఆ అమ్మాయి తేనీరు విందు కోసం స్కూబర్ట్ను రమ్మని ఇంటికి ఆహ్వానించింది. నల్లకోటు, నల్లప్యాంట్, బ్లూ టీషర్టు ధరించి స్కూబర్ట్ ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ స్కూబర్ట్ ఆకారాన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారి షాక్ గురైంది. ‘మ్యాచ్ డాట్ కామ్’లో పెట్టిన ప్రొఫైల్ ఫొటోకు నాలుగింతులు ఆయన ఆకారం ఉండడమే ఆమె షాక్కు కారణం. ఇంటికొచ్చిన అతిథిని అవమానించ కూడదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి స్కూబర్ట్ను లోపలికి పిలిచి ముందు చెప్పినట్లుగా తేనేరు అందించింది. ఆయన అంత లావుగా ఉంటారని తాను ఊహించలేదని చెప్పింది. ఆమె తన ప్రేమ సందేశంలో పేర్కొన్న మంచం, పరుపును స్కూబర్ట్కు చూపిస్తూ, ఆ మంచం, పరువు తమరొక్కరికి కూడా సరిపోదని, ఇంకా తనకు ఆ మంచం మీద చోటు ఎక్కడ ఉంటుందని, మంచం మీదనైనా సరే తనకంటూ ఓ ప్రత్యేక చోటును కోరుకుంటానని తెలిపింది. మొత్తానికి స్కూబర్ట్ నచ్చ లేదని చెప్పింది. ఇక సెలవు తీసుకోవాల్సిందిగా కోరింది. ప్రేమకు, లావుకు, పెళ్లికి, మంచానికి సంబంధం ఏమిటంటూ కోపోద్రిక్తుడైన స్కూబర్ట్ ఆమెను అమాంతం ఎత్తుకెళ్లి ఆమె చూపించిన పరుపు పైనే పడేసి రెండు, మూడు సార్లు రేప్ చేశారు. అప్పటికి తెల్లారడంతో స్కూబర్ట్ ఇంటికెళ్లి పోయారు. ఆమె పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేసింది. 2018, జనవరి 30వ తేదీన ఈ సంఘటన జరగ్గా ఈ మరుసటి రోజే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారు ఇద్దరిని వైద్య పరీక్షలకు పంపించారు. బలవంతపు సెక్స్ జరిగినట్లు వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దాంతో స్కూబర్ట్పై పోలీసులు రెండు రేప్లు, ఒక లైంగిక దాడి కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ 2019, అక్టోబర్ 8వ తేదీన (మంగళవారం) ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు ముందుకు మొదటిసారి విచారణకు వచ్చింది. పరస్పర అంగీకారంతోనే ఇద్దరి మధ్య సెక్స్ జరిగిందని స్కూబర్ట్ న్యాయవాది వాదించారు. వైద్యుల సర్టిఫికెట్ ప్రకారం బలవంతపు సెక్స్ జరిగినట్లు తెలుస్తోందని ప్రాసిక్యూటర్ వార్డ్ జాక్సన్ వాదించారు. తనను బాగా రెచ్చ గొట్టడం వల్ల, తాను రెచ్చిపోవడం వల్ల బలవంతపు సెక్స్ ముద్రలు పడి ఉంటాయని, వాస్తవానికి పరస్పర అంగీకారంతోనే సెక్స్ జరిగిందని స్కూబర్ట్ పేర్కొన్నారు. కోర్టు తదుపరి విచారణ కోసం కేసును వాయిదా వేసింది. ఇంగ్లండ్ చట్టం నిబంధనలకు కట్టుబడి ఆ అమ్మాయి పేరు, వివరాలు వెల్లడించలేదు. -
తమ్ముడి భార్యపై నాలుగేళ్లుగా...
గురుగ్రామ్ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. బంధుత్వాన్ని మరచి తమ్ముడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన గురుగ్రామ్ నగరంలోని బజ్గేరా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజ్గేరా గ్రామానికి చెందిన ఓ వ్యాపారి భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అతని ఇంటి సమీపంలోనే వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తరచూ తమ్ముడి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో తమ్ముడి భార్యపై కన్నేశాడు. వ్యాపారం రీత్యా తమ్ముడు ప్రతి రోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వాడు. ఇదే అదునుగా భావించిన అన్నయ్య.. ఓ రోజు ఒంటరిగా ఉన్న మరదలు దగ్గరకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించకుంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. తన పిల్లలకు, భర్తకు ఎక్కడ హాని తలపెడుతాడో అనే భయంతో ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. అయితే ఇటీవల అతని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేది ఏమిలేక గత శుక్రవారం ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పారు. దీంతో ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇచ్చారు. చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పిచ్చితల్లిని కాటేసిన కామాంధుడు
సాక్షి, సిరిసిల్ల : మానసిక స్థితి సరిగాలేని ఓ యువతిని లోబర్చుకుని గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. తనకు ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో దాదాపు 7 నెలలు తన కడుపులోనే శిశువు మోస్తూ చివరకు బాత్రూంలో ప్రసవానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పుట్టిన ఆడశిశువు వెంటనే మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాలలో ఆదివారం జరిగింది. చిన్నబోనాలలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఇండ్ల నర్సయ్య, వజ్రవ్వలకు 22 ఏళ్ల కూతురు ఉంది. చిన్ననాటి నుంచి ఆమె కాస్త మతిస్థిమితం లేనట్లు ఉండేదని స్థానికులు తెలిపారు. ఇంట్లోని వారందరూ కూలి పనులకు వెళ్లడం గమనించి స్థానికంగా ఉండే రాజు అనే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి యువతిని లోబర్చుకున్నాడు. ఇటీవల యువతికి ఆరోగ్యం బాగాలేకపోవడం, శారీరకంగా మార్పులు రావడంతో సిరిసిల్ల వెంకంపేటలోని ఓ ఆర్ఎంపీకి కుటుంబీకులు చూపించినట్లు స్థానికులు వివరించారు. యువతి శరీర ఆకృతిపై అనుమానం వచ్చిన చుట్టుపక్కల మహిళలు అడిగితే డాక్టర్ ఇచ్చిన మందులతో ఇలా జరిగిందని నిరాక్ష్యరాస్యులైన తల్లిదండ్రులు వివరించినట్లు తెలిసింది. కానీ ఆ యువతి గర్భందాల్చి దాదాపు ఏడు నెలల అవుతోందని, సమయం దగ్గరపడిన విషయం తెలియక యువతి బాతురూం వెళ్లిన క్రమంలో వచ్చిన నొప్పులకు కడుపులోని పాపను తానే బయటకు లాగినట్లు బాత్రూంలో ప్రసవించిన విధానాన్ని బట్టి మహిళలు వెల్లడించారు. యువతిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్, ఐసీడీఎస్ సిరిసిల్ల సీడీపీవో ఆలేఖ్య తెలిపారు. -
మహిళని అపహరించి నెల రోజుల పాటు..
జైపూర్ : రాజస్తాన్లో దారుణం జరిగింది. ఓ వివాహిత మహిళను అపహరించి నెల రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగౌర్ జిల్లాకు చెందిన ఓ మహిళను ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమెను వివిధ ప్రదేశాలకు తరలిస్తూ నెల రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నెల రోజుల తర్వాత వదిలేసి ఈ విషయం బయట చెప్తే చంపుతామని బెదిరించారు. ఇంటికి వచ్చిన మహిళ కుటుంభ సభ్యులతో కలిసి నాగౌర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురి దుండగుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మహిళపై గ్యాంగ్ రేప్.. సజీవ దహనం
సంభాల్: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై గ్యాంగ్రేప్నకు పాల్పడ్డ దుండగులు ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా గున్నార్ ప్రాంతం పాతక్పూర్లో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ(30) తన కూతురితో కలిసి ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన ఆరామ్ సింగ్. మహావీర్, చరణ్ సింగ్, గుల్లూ, కుమార్పాల్ అనే వ్యక్తులు బలవంతంగా లోపలికి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు తెలిపింది. దీంతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా ఈ అఘాయిత్యాన్ని వివరించింది. ఇంతలోనే తిరిగి వచ్చిన నిందితులు ఆమెను సమీపంలో ఉండే ఆలయ ప్రాంగణంలో యజ్ఞశాలగా భావిస్తున్న గుడిసెలోకి ఈడ్చుకెళ్లి నిప్పుపెట్టారు. మంటల్లో ఆమె మృతి చెందగా నిందితులు పరారయ్యారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితులపై గ్యాంగ్రేప్, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి నేరాలకుగాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో అకీల్ అహ్మద్ తెలిపారు. మృతురాలి భర్త కూలి పనులు చేసుకుంటూ ఘజియాబాద్లో ఉంటుండగా కొంతకాలంగా నిందితులు మృతురాలిని వేధిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. అయితే, ఆమెపై గ్యాంగ్రేప్ జరిగినట్లు నిర్ధారించేందుకు పోస్ట్మార్టం నివేదిక సరిపోదనీ, అందుకే అవసరమైన నమూనాలను మొరాదాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నామని సంభాల్ ఎస్పీ భరద్వాజ్ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
చావుబతుకుల మధ్య కూడా ఇదేం బుద్ధి
ముంబయి : దసరా పండుగ వేళ విషాదం నింపిన ముంబయి ఎల్ఫిన్స్టోన్ రోడ్డులోని రైల్వే స్టేషన్ పాదచారుల వంతెనపై ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఒక వైరల్ వీడియో ఓ కొత్త నేర విచారణ ప్రారంభించడానికి కారణం అయింది. సహాయం చేసే పేరిట వచ్చి వంతెనపై చిక్కుకుపోయిన ఓ మహిళను లైంగికంగా ఓ యువకుడు వేధించినట్లుగా ఆ వీడియోలో ఉంది. నిజంగా అతడు సహాయం చేస్తున్నాడా లేక ఆ పేరుతో అడ్వాన్టేజ్ తీసుకొని అలాంటి భయానక పరిస్థితుల్లో కూడా అనుచితంగా ప్రవర్తించాడా అనే విషయం స్పష్టంగా తేలాల్సి ఉంది. ప్రస్తుతం లభించిన ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అలాగే, ఆ సమయంలో తమ ఫోన్లలో తీసిన వీడియోలను, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించనున్నారు. పాదచారుల వంతెనపై తొక్కిసలాట జరిగినప్పుడు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ సమయంలో ఓ మహిళ కొంతమంది మధ్య ఇరుక్కుపోయింది. అయితే, సహాయం చేసేందుకంటూ వెళ్లిన ఓ యువకుడు ఆమెను అసభ్యంగా తాకుతూ కనిపించాడు. పోలీసులు కూడా అదే విషయం నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ఎవరో పట్టుకొని విచారిస్తేగానీ అంతిమ నిర్ణయానికి రాలేమని అంటున్నారు. -
బార్లో భర్త ఎదుటే మహిళపై అఘాయిత్యం!
పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్కతాలో మరో ఘోరం జరిగింది. అక్కడి ప్రఖ్యాత పార్క్స్ట్రీట్లోని ఓ నైట్ క్లబ్బులో భర్త కళ్లెదుటే తనపై లైంగిక దాడి జరిగిందని ఓ మహిళ ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు బాగా తాగేసి తనపై దాడి చేశారని ఆమె చెప్పారు. తాను తన భర్తతో కలిసి ఓ బార్కు వెళ్లినప్పుడు అక్కడి స్థలాన్ని తాము రిజర్వు చేసుకున్నామని, అక్కడికెందుకు వచ్చారంటూ కొందరు వ్యక్తులు తమతో గొడవ పడినట్లు ఆమె తెలిపారు. వాళ్లు తనను ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా తాకారని, నేల మీదకు పడేశారని అన్నారు. ఇలా వేధించిన వాళ్లలో కోల్కతాలోని బాగా డబ్బున్న వ్యాపారవేత్త కొడుకు కూడా ఉన్నాడని దంపతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడే ఈ దాడి వెనక ప్రధాన నిందితుడని చెప్పారు. తన మీద దాడి చేసిన వ్యక్తి చాలా ఎక్కువగా తాగేశాడని, తనకు పెద్ద పెద్దవాళ్లు తెలుసంటూ తమను బెదిరించాడని అన్నారు. 'మా నాన్న ఎవరో నీకు తెలియదు. నాతో పెట్టుకోకు జాగ్రత్త' అని అతడు హెచ్చరించాడన్నారు. తమ స్నేహితులైన వేరే జంటతో కలిసి తాము ఆ బార్కు వెళ్లామని తెలిపారు. చివరకు క్లబ్బు యజమానులు, బౌన్సర్లు వచ్చి జోక్యం చేసుకోవడంతో ఎలాగోలా బయటపడినట్లు చెప్పారు. ఇటీవలే పిల్లాడికి జన్మనిచ్చిన తాను.. ఈ దాడితో ఒక్కసారిగా షాకయ్యానని, ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పారు. మహిళలకు నగరంలో రక్షణ లేదా అని ప్రశ్నించారు. పోలీసులు త్వరగా స్పందించాలని కోరారు. ఇదంతా కేవలం డబ్బుందన్న మదం తప్ప మరోటి కాదని, వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
‘మొకాళ్లపై కూర్చొని వేడుకోండి.. లేదంటే రేప్!’
బెంగళూరు: ఉత్తర బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కన్నడ భాష రానందుకు ఓ మహిళపై నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను ఇష్టమొచ్చినట్లు తిట్టి చేయిచేసుకొని అసభ్యంగా తాకారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆమె తన స్నేహితురాలు రాత్రి 9.30గంటల ప్రాంతంలో తమ ఇంటికి తిరిగొస్తుండగా వారితో ఓ వీధిలో కొంతమంది గొడవపడ్డారు. వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. వారి వద్దకు వచ్చి కన్నడంలో ఏదైనా మాట్లాడాలని అడిగాడు. అనంతరం కన్నడ భాషలోనే వారిని ఏదో అనకూడని మాటలు అన్నాడు. అది వారికి అర్థం కాకపోవడంతో మిగితావారు కూడా వారి వద్దకు వచ్చి కర్ణాటకలో తింటూ కర్ణాటకలో ఉంటూ ఎందుకు కన్నడం మాట్లాడలేకపోతున్నారని తిట్టారు. ‘మీరు స్థానికులు కాదు. మీకు కన్నడ ఎలా మాట్లాడాలో తెలియదు. అందుకే మీరు మొకాళ్లపై కూర్చుని క్షమించాలని ప్రార్థించండి లేదంటే లైంగికదాడి చేసి వేధిస్తాం అని బెదిరించారు. నాకు ఈ నగరంలో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతాను’ అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకల్లో పెద్ద మొత్తంలో లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకున్న అనంతరం జరిగిన ఈ విద్వేషపూరిత ఘటన కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. -
విజయవాడలో దింపుతామని చెప్పి..
- క్యాబ్లో యువతిపై లైంగికదాడికి యత్నం - ఎల్బీనగర్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన - నిందితులను అరెస్టు చేసిన పోలీసులు - నిందితుల్లో ఒకరు ఇటీవల కానిస్టేబుల్గా ఎంపిక సాక్షి, హైదరాబాద్: క్యాబ్లో ప్రయాణిస్తున్న యువతిపై డ్రైవర్, మరో యువకుడు లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ కేసును ఛేదించిన రాచకొండ కమిషరేట్ పరిధిలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు నిందితు లిద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో ఏఆర్ విభాగానికి ఎంపిక య్యాడు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు వెళ్లేందుకు బయలుదేరి... గుంటూరుకు చెందిన ఓ యువతి మాదాపూర్లో హెయిర్ స్టైలిస్ట్గా పనిచే స్తోంది. ఆమె బుధవారం తెల్లవారు జామున మాదాపూర్ నుంచి రిజిస్టర్డ్ క్యాబ్లో బయలుదేరి ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంది. విజయవాడ వెళ్లేందుకు వాహనాల కోసం ఎదురు చూస్తుండగా ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న నాగోల్ జయపురికాల నీకి చెందిన దంతూరి వేణు (25), నేరేడ్ మెట్కు చెందిన బి.ఇమ్మానియేల్(25) ఆమెను గమనించారు. ఆమె విజయవాడ వెళ్ళే ప్రయ త్నాల్లో ఉన్నట్లు గమనించి కుట్ర పన్నారు. సమీపంలోని హోటల్లో ఉన్న తమ స్నేహి తుడు నిల్సన్, అతడి స్నేహితుడైన క్యాబ్ డ్రైవర్ రవితేజ వద్దకు వెళ్లారు. వారి వద్ద ద్విచక్ర వాహనం వదిలి బలవంతంగా క్యాబ్ తీసుకున్నారు. డ్రైవింగ్ సీటులో ఉన్న వేణు తాము విజయవాడ వెళ్తు న్నామని యువతితో చెప్పాడు. ఆ క్యాబ్లోనే ఉన్న ఇమ్మానియేల్ను మరో ప్రయాణికుడిగా భావించి ఆమె అందులోకి ఎక్కింది. కారు విజయవాడ హైవే పైకి చేరిన తర్వాత వేణు, ఇమ్మానియేల్ మాట్లాడుకోవడం ఆమె గమనించింది. దీంతో కారు ఆపాలని కోరినా వారు పట్టించు కోలేదు. హయత్నగర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి య త్నించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఇమ్మానియేల్ కారు దిగి పారిపోయాడు. కారు ను ముందుకు తీసుకు వెళ్ళిన వేణు నల్లగొండ జిల్లా పంతంగి టోల్గేట్ సమీపంలోకి చేరు కున్నాడు. అక్కడ టోల్ట్యాక్స్ చెల్లించడానికి కారు ఆపాల్సి వస్తుం దని, అప్పుడు యువతి గోల చేస్తే ఇబ్బందని భావించి టోల్గేట్కు కాస్త దూరంలో యువ తిని బలవంతంగా రోడ్డు పైకి తోసేసి వెనక్కి వచ్చేశాడు. రంగంలోకి దిగిన ఎస్వోటీ బాధితురాలు ఆ కారు నంబర్ను ఏపీ28టీవీ0051గా నమోదు చేసుకుని కంట్రోల్ రూమ్ ద్వారా చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్వోటీ ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు కారు చిరునామాను ఛేదించి యజమానిని గుర్తించారు. కొత్తూరులో ఉండే యజమాని శివకుమార్ రెండు రోజుల క్రితమే కారును రవితేజకు లీజుకు ఇచ్చారు. శివకుమార్ ద్వారానే రవితేజకు ఫోన్ చేయించి దిల్సుఖ్నగర్కు పిలిపించారు. రవితేజ ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఇమ్మానియేల్, వేణులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. పోలీసులు కేసును ఎల్బీనగర్ ఠాణాకు బదిలీ చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. కారుతోపాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
ఢిల్లీలోనూ ‘షేమ్’ సీన్
-
ఢిల్లీలోనూ ‘షేమ్’ సీన్
న్యూఢిల్లీ: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగళూరులో జరిగిన కీచకపర్వం తరహా ఘటన దేశ రాజధాని ఢిల్లీలోనూ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజి ఆలస్యంగా వెలుగు చూసింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకునేందుకు దాదాపు 250 మంది విద్యార్థులు ఓ చోట గుమికూడారు. కొందరు మద్యంమత్తులో ఉన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తితో కలసి ఓ మహిళ బైకుపై అటుగా వెళ్తోంది. అందరూ చూస్తుండగానే కొందరు ఆకతాయిలు బైకును ఆపి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బైకుపై నుంచి ఆమెను లాగేందుకు ప్రయత్నించగా, ఆమె అరుస్తూ గట్టిగా పట్టుకుంది. అక్కడున్న పోలీసులు వెంటనే పరిగెత్తుకెళ్లి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా, ఆకతాయిలు వారిపై దాడి చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు గాయపడగా, అక్కడ పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంతో అదనపు పోలీసు బలగాలు వెళ్లి ఆకతాయిలను అదుపు చేశాయి. బాధితురాలు ఫిర్యాదు చేయలేదని, నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు. బెంగళూరులో పార్టీ హబ్గా పేరొందిన ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో న్యూ ఇయర్ సంబరాల్లో వేలాది మంది మధ్యలో యువతులు, మహిళలపై ఆకతాయిలు అసభ్య ప్రవర్తనకు, లైంగిక వేధింపులకు పాల్పడన సంగతి తెలిసిందే. కొందరు మహిళలపై భౌతికదాడులకూ దిగారు. రాత్రి 11:45 గంటల నుంచి అర్ధరాత్రి 12:05 గంటల మధ్య యువతులపై అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. -
ప్రయాణికురాలిపై వేధింపులు.. ఉబర్ డ్రైవర్ అరెస్టు
ఢిల్లీ ఎయిర్పోర్టు సమీపంలో ఒక మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా మాట్లాడి, ఆమెపై దాడి చేసినందుకు ఉబర్ క్యాబ్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. 32 ఏళ్ల మహిళ ఎయిర్పోర్టు నుంచి పాలమ్ ప్రాంతానికి వెళ్లేందుకు సాయంత్రం 5 గంటలకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. డ్రైవర్ రాజీవ్ (36) అక్కడకు ఆలస్యంగా రావడంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఏరోసిటీ మీదుగా వెళ్లడానికి బదులు ఆ డ్రైవర్ ఆమెను మహిపాల్పూర్ రోడ్డుకు తీసుకెళ్లాడు. అదేంటని అడిగితే అతడికి కోపం వచ్చి, ఆమె మీద హ్యాండ్ బ్యాగ్ విసిరేసి తిట్టడమే కాక.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంటు సమీపంలోనే ఆమెను కారు నుంచి దిగిపోవాలని చెప్పాడు. ఆమె వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను అరెస్టు చేశారు. -
విమానాల్లో మహిళలపై వికృత చేష్టలు
‘ఇండిగో’లో వ్యక్తి అసభ్య ప్రవర్తనపై మహిళ ఫిర్యాదు హైదరాబాద్: విమానంలో ఓ మహిళా ప్రొఫెసర్తో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చినరోజే.. మరో విమానంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. శుక్రవారం బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానంలో వస్తుండగా తన పక్కసీట్లో కూర్చున్న వ్యక్తి సెల్ఫోన్లో ఫొటోలు తీస్తూ వికృతంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ శనివారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రయాణం చేస్తున్నంతసేపూ అతడి ప్రవర్తనతో విసిగిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏడాది కిందట మద్యం మత్తులో విమానంలోని ఎయిర్హోస్టెస్ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. అలాగే తోటి ప్రయాణికురాలితో మరో వ్యక్తి కూడా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలపై ఫిర్యాదులందాయి. -
బస్సులో వివాహితపై లైంగిక వేధింపులు
అనంతపురం జిల్లా కదిరిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వివాహితపై ఓ ప్రయాణికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో సదరు మహిళ పక్కనే ఉన్న భర్తకు విషయం వెల్లడించింది. మహిళ భర్త వెంటనే బస్సు ఆపి... ప్రయాణికులతోపాటు మహిళ భర్త నిందితుడికి దేహశుద్ది చేశారు. అనంతరం నిందితుడిని కదిరి పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితుడిపై పోలీసులు నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చేసుకోకపోతే ముక్కు కోసేసిన దుండగులు
పెళ్లి చేసుకోను అన్న పాపానికి పాకిస్తాన్ లో ఒక యువతి ముక్కు కోసేశారు కొందరు మూర్ఖులు. ఆమెను క్రూరంగా హింసించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పాకిస్తాన్ లోని పంజాబ్ లోని బస్తీ షేర్ వాలీలో జరిగింది. ఇరవై ఏళ్ల ఫరీదా బీబీ తండ్రి బస్తీ షేర్వాలీ భూస్వామి జంషీద్ ఇంట్లో కూలీగా పనిచేస్తూంటాడు. ఆయన కుమారుడు నదీమ్ ఫరీదాపై మనసుపడ్డాడు. అయితే అతడిని వివాహం చేసుకునేందుకు ఫరీదా నిరాకరించింది. దీంతో భగ్గుమన్న నదీమ్ తన మిత్రులతో కలిసి ఆమెను అపహరించుకువెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత ఆమె మరెవరినీ వివాహం చేసుకోకుండా ఉండాలని ముక్కు కోసేశాడు. పంజాబ్ హైకోర్టు ఈ కేసును స్వీకరించిన తరువాత కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు.