-
ఎవరీ పూబంతి.. అందాల సందళ్లు మోసుకొచ్చింది! (ఫోటోలు)
-
Sanjeeda Sheikh: ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
-
పసుపు పుచ్చకాయలు.. ఇకపై మన దేశంలోనే!
సాక్షి, అమరావతి: వేసవి తాపాన్ని తీర్చే.. రుచికరమైన.. అందరూ ఇష్టంగా తినే ఫలాలలో ఒకటి పుచ్చకాయ. అయితే పుచ్చకాయ ఎలా ఉంటుంది అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? ఆకుపచ్చ చారలుండే తొక్క, లోపల ఎరుపు/గులాబీ రంగు గుజ్జు, అందులో నల్లటి విత్తనాలు.. అనే కదా. కానీ ఈ ‘వెరైటీ’ పుచ్చకాయలో మాత్రం గుజ్జు పసుపు పచ్చ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. అయితే, అది సహజ సిద్ధమైన రంగేనా? లేక రసాయనాలు వాడతారా? అంటే నూటికి నూరుపాళ్లు సహజసిద్ధంగా వచ్చిన రంగే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విత్తన తయారీ సంస్థలు. అంతేకాదు.. ఆకుపచ్చ తొక్క, ఎరుపు, గులాబీ, పసుపు రంగు కండతో విత్తనాలు లేని (సీడ్ లెస్) పుచ్చకాయలు కూడా త్వరలో మార్కెట్కు రానున్నాయని వివరిస్తున్నారు. పసుపు రంగు ఎలా వస్తుందంటే.. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో 1,200కి పైగా పుచ్చ రకాలున్నాయి. వాటిల్లో పసుపు రంగు కాయ ఒకటి. ఈ పసుపు పుచ్చకాయలు కూడా ఎరుపు/గులాబీ రంగు కాయల మాదిరిగానే ఆకుపచ్చ చారలతో ఉంటాయి. లోపల కండ మాత్రం పసుపు రంగులో ఉంటుంది. పసుపు పుచ్చకాయల్లో లైకోపీన్ అనే పదార్థం ఉండదు కనుక అవి ఎప్పుడూ ఎర్రటి రంగును తీసుకోవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చిత్రమేమిటంటే పసుపు పుచ్చకాయల సాగు ఎరుపు/గులాబీ పుచ్చ కంటే ముందు నుంచే ఉంది. ఇదో సంకర విత్తనం. ఆఫ్రికా నుంచి వచ్చింది. సంప్రదాయ పుచ్చకాయలకు ఇదో ప్రత్యామ్నాయం. పర్పుల్ కాలే, ఆరెంజ్ కాలీఫ్లవర్, బ్లూ బంగాళాదుంపలు మాదిరే ఇదీనూ. ఎల్లో గోల్డ్–48 రకం విడుదల.. రెండేళ్ల క్షేత్రస్థాయి ప్రయోగాలు, పరిశోధనల అనంతరం దేశంలో పసుపు పుచ్చ రకాన్ని మార్కెట్కు వాణిజ్యపరమైన వినియోగం కోసం విడుదల చేస్తున్నట్టు జర్మనీకి చెందిన బేయర్ కంపెనీ ప్రకటించింది. ఎల్లో గోల్డ్–48 పేరిట మార్కెట్లో ఈ విత్తనం దొరుకుతుంది. దేశంలో విడుదలైన తొలి పసుపు పుచ్చ వంగడం ఇదే. అత్యున్నత జెర్మీప్లాసమ్ నుంచి ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పంట ప్రయోగాలు నిర్వహించిన అనంతరం దీన్ని మార్కెట్కు విడుదల చేశారు. దీంతో పాటు డిజర్ట్ కింగ్ ఎల్లో, ఎల్లో డాల్, బటర్కప్, ఎల్లో ఫ్లెష్బ్లాక్ డైమండ్ వంటి రకాలను పేరున్న విత్తన కంపెనీలు ఇప్పుడిప్పుడే మార్కెట్కు విడుదల చేస్తున్నాయి. ‘సేంద్రీయ’ సాగు చేస్తే మంచి లాభాలు.. ఎల్లో గోల్డ్–48 అధిక దిగుబడి ఇచ్చే వంగడం. తెగుళ్లను, ఇతర క్రిమికీటకాలను తట్టుకుంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య సాగు చేయవచ్చు. ఏప్రిల్ నుంచి జూలై వరకు దిగుబడి వస్తుంది. పంట కాలం గరిష్టంగా నాలుగు నెలలు. కాయ తియ్యగా, తేనె లాంటి రుచిని కలిగి ఉంటుంది. పోషక విలువలూ ఎక్కువే. పుచ్చ వేసవి కాలపు పంటే అయినా ఇప్పుడు అన్ని కాలాలలోనూ సాగు చేస్తున్నారు. పసుపు పుచ్చను సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఈ రకాన్ని సాగు చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. -
‘పచ్చ’పాతం: ఇదేమి వైపరీత్యం!
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడొకాయన ఆమధ్య పంచాయతీ ఎన్నికలకూ మేనిఫెస్టో విడుదల చేసి ‘చరిత్ర సృష్టించారు’. జనం అంతా విస్తుపోయే వింతను తెరపైకి తెచ్చారు. ప్రజల అదృష్టం బాగుండి.. ఆయన మద్దతు ఇస్తామన్న వారిలో చాలామందిని జనం తిరస్కరించారు. కానీ.. కొద్దిగా ఎన్నికైన వారితో కూడా ఆయన.. ఆయన పార్టీ పెద్దలు అప్పుడే విచిత్రాలు చేయిస్తున్నట్టున్నారు. అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం.. తమ పరిధిలోని పంచాయతీ కార్యాలయాలకు పచ్చ రంగు పులమాలని పెద్దలు ఆదేశించారంటున్నారు. ఇందుకు నిదర్శనంగా.. కొత్త ఉత్సాహం కాస్త అతి కావడంతో ఓ సర్పంచ్ పంచాయతీ ఆఫీసుకు పచ్చ రంగు వేయించేశారు. అధికారులు.. ఆచి తూచి మాట్లాడుతున్నారు. మరి తదనంతర పరిణామాలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పంచాయతీ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన రంగులపై టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లారు. ఆ రంగులన్నీ తొలగించాలని పిటిషన్ వేశారు. రాజకీయంగా పెద్ద రాద్ధాంతమే చేశారు. చీప్ పబ్లిసిటీతో లబ్ధి పొందాలని చూశారు. కానీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. ఇప్పుడు.. టీడీపీ మద్దతుదారులు గెలిచిన గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలకు పసుపు రంగు పూస్తున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారుల అనుమతి లేకుండా ఏకపక్షంగా రంగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆమదాలవలస మండలం కనుగులవలస పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసేశారు. టీడీపీ నేతల ద్వంద్వ నీతి జనాలకు ఈ పనితో అర్థమైంది. ఆ నేతల దుర్నీతిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఏ నిర్ణయమైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న సర్కార్ తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల అనుమతి మేరకే పంచాయతీ కార్యాలయాలకు సంబంధించిన ఏ చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిన పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసేశారు. తాజాగా ఎన్నికైన సర్పంచ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కనీసం పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా చేయలేదు. ఎక్కడా లేని విచక్షణాధికారంతో ఆగమేఘాలపై పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయడం విమర్శలకు తావిస్తోంది. రౌడీషీటర్ బుద్ధి చూపించారా? కనుగులవలస సర్పంచ్గా ఎన్నికైన నూక సూరప్పలనాయుడు (నూకరాజు)పై రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉంది. వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్ర పడ్డారు. గొడవలు, కొట్లాటకు ముందుంటారు. గతంలో ప్రస్తుత శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా సర్పంచ్గా గెలిచిన వెంటనే అదే మూర్ఖత్వం చూపించారు. అధికారుల అనుమతి లేకుండా పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేయించారు. ఎవరొచ్చి ఏం చేస్తారన్నట్టుగా వ్యవహరించారు. అంతటితో ఆగకుండా పసుపు రంగు వేసిన కార్యాలయంలో విధులు నిర్వహించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడికొచ్చి విధులు నిర్వర్తించాలని కూడా సతాయించారు. దీనికి సిబ్బంది ఒప్పుకోలేదు. గ్రామ పంచాయతీ పాలకవర్గమంతా తీర్మానం చేయాలని సుతిమెత్తగా చెప్పారు. మీమాంసలో తెలుగు తమ్ముళ్లు.. సర్పంచ్లుగా టీడీపీ మద్దతుదారులు గెలిచిన పంచాయతీల్లో పసుపు రంగులు వేయాలని ఆ పార్టీ అ ధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీంతో కొందరు అధిష్టానం మాట మేరకు పసుపు రంగు వేసేందుకు యత్నిస్తుండగా, మరికొందరు మనికెందుకని మీమాంసలో పడ్డారు. మొత్తానికి రంగుల రాజకీయం చేసేందుకు టీడీపీ యతి్నస్తుందనేది స్పష్టమవుతోంది. పసుపు రంగు తొలగిస్తాం.. రంగుల విషయం మా దృష్టికి వచ్చింది. రెండు రోజుల క్రితమే పంచాయతీ కార్యాలయానికి రంగులు వేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు పసుపు రంగు తీసేసి తెలుపు రంగు వేయిస్తాం. – పేడాడ వెంకటరాజు, ఎంపీడీఓ, ఆమదాలవలస చదవండి: రేణిగుంట ఎయిర్పోర్టులో చంద్రబాబు హైడ్రామా వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నేత హత్యాయత్నం -
‘పసుపు రంగు’ కోడ్లోకి రాదా?
సాక్షి, దెందులూరు: మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పసుపు రంగు వేయటం ఏమిటని, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి వారం రోజులు కావస్తున్నా పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొమ్మనబోయిన నాని ప్రశ్నించారు. ఆదివారం పోతునూరు గ్రామ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీతంపేట, ఉప్పుగూడెం, పోతునూరు, చల్లచింతలపూడి, దెందులూరు, గోపన్నపాలెం, జోగన్నపాలెం, శ్రీరామవరంలతో పాటు గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు, స్త్రీ శక్తి భవనాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలకు పసుపు రంగు వేశారన్నారు. ఎన్నికల కోడ్ అమలుకు మండల, డివిజన్, జిల్లా అధికారులను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించినప్పటికీ పసుపు రంగుపై పర్యవేక్షణ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్నికల కమిషన్కు ప్రభుత్వ కార్యాలయాలపై పసుపు రంగుపై ఫిర్యాదు చేస్తామన్నారు. -
అప్పుడు అదే డ్రెస్సు.. ఇప్పుడు అదే డ్రెస్సు
చిట్యాల (నకిరేకల్) : నందమూరి హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ప్రచార రథానికి డ్రైవర్గా వ్యవహరించే వారు. ఆ సమయంలో ఎన్టీఆర్తో పాటుగా హరికృష్ణ కూడా ఖాకీ రంగు డ్రెస్ను ధరించేవారు. బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణ వివాహానికి వెళ్తున్నప్పటికీ తన తండ్రి స్థాపించిన పార్టీ రంగైన పసుపు రంగు చొక్కాను, ఖాకీ రంగు ప్యాంట్నే ధరించి ఉన్నారు. -
పచ్చ రంగు ఉంటేనే పథకాలు
ఒంగోలు టౌన్ : రాష్ట్ర ప్రభుత్వానికి పచ్చ రంగు ప్రచారం పీక్ స్టేజీకి చేరుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలపై పచ్చ రంగును బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పథకాలు అందాలంటే పచ్చరంగు తప్పనిసరి అంటూ నిబంధనలు విధిస్తోంది. తాజాగా పచ్చ రంగు ప్రచారం మత్స్యకారులు వేటకు వినియోగించే పడవలపై పడింది. మత్స్యకారులంతా తమ పడవలకు విధిగా పచ్చరంగు వేయించుకోవాలని లేకుంటే పథకాలు వర్తించవంటూ తేల్చిచెప్పింది. సముద్రంలో 61రోజుల పాటు చేపల వేట నిషేధించడంతో మత్స్యకారులు పడవలు, వలలు మరమ్మతులు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా భావించిన ప్రభుత్వం పడవలన్నింటికీ పచ్చరంగు ఉండాలంటూ నిబంధనలు విధించింది. సముద్ర నీటిపై పడవ తేలాడుతున్న భాగమంతా పచ్చరంగు కనిపించాలని, నీటి అడుగుభాగం నీలం రంగుతో ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది. పైపెచ్చు పడవలకు పచ్చరంగు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారంటూ స్పష్టం చేసింది. దీంతో కొంతమంది మత్స్యకారులు విధిలేని పరిస్థితుల్లో తమ పడవలకు పచ్చ రంగు వేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరికొంతమంది మాత్రం ప్రభుత్వ వైఖరిని తూర్పార పడుతుండటం గమనార్హం. ‘రంగు’ పడుద్ది సముద్రంలో వేట సాగించే మత్స్యకారులు తమ పడవలకు తమకు ఇష్టం వచ్చిన రంగులను వేసుకుంటారు. ఆ రంగులను కూడా రకరకాల డిజైన్లతో వేసుకునేవారు. అయితే పడవలన్నింటికీ యూనిఫారంగా ఉండాలన్న సాకుతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పడవలన్నింటికీ పచ్చరంగు తప్పనిసరి చేసింది. జిల్లాలోని పదకొండు మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. 12వేల మంది మత్స్యకారులు మూడురకాల పడవలను ఉపయోగించుకొని సముద్రంలో వేట సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం జిల్లాలోని తీర ప్రాంతాల్లో 42 మెకనైజ్డ్ బోట్లు, 2505 మోటరైజ్డ్ బోట్లు, 1649 సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఈ పడవల ద్వారా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి చేపలను వేటాడుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈనెల 15వ తేదీ జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను నిషేధించారు. ఈ నిషేధ కాలంలో మత్స్యకారులు తమ పడవలు, వలలను మరమ్మతులు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని గమనించిన రాష్ట్ర ప్రభుత్వానికి తమ పార్టీ రంగు గుర్తొచ్చింది. మత్స్యకారులంతా తమ పడవలకు పచ్చ రంగు వేయాలంటూ తీర ప్రాంత జిల్లాలకు సర్క్యులర్ జారీ చేసింది. -
ఇదీ..అసలు రంగు
అంతా అయోమయం.. అధికారుల అవగాహనలోపం.. ప్లాట్లకేటాయింపుల్లో గందరగోళం..కమర్షియల్..రెసిడెన్షియల్ ప్లాట్లు విభజనలో సీఆర్డీఏఅధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైనం.. మాస్టర్ ప్లాన్లో స్థలాలు చూపి హడావుడిగా రిజిస్ట్రేషన్చేసేందుకు యత్నం..అసలుస్థలాలు ఎక్కడున్నాయోతెలియని సందిగ్ధం. ఇదీరాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులువేదనాభరిత జీవనచిత్రం.తాజాగా ప్లాట్ల కేటాయింపులోఅధికారుల డొల్లతనం తేటతెల్లమైంది. రాజధాని ప్రాంతంలోఎక్కడ రెసిడెన్షియల్, ఎక్కడకమర్షియల్ ప్రాంతమో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మందడంలో కమర్షియల్ ప్లాట్లుగావిభజించి బ్లూరంగు రాళ్లుపాతిన వాటికి తిరిగి మాస్టర్ప్లాన్లో అవి రెసిడెన్షియల్గాఉండడంతో పసుపు రంగువేస్తూ తప్పు దిద్దుకుంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా పనులు చేపడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల కేటాయింపుల్లో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ప్లాట్ల కేటాయింపుల్లో అధికారుల అవగాహనాలేమి మరోసారి తేటతెల్లమవుతోంది. ప్లాట్లు ఎక్కడున్నాయో చూపితే ఒట్టు...! రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఒక్కో పరిహారం ఇస్తోంది. జరీభు భూములైతే ఎకరానికి 1450 చ.గజాల స్థలం ఇస్తోంది. ఇందులో 1250 గజాలు నివాసప్రాంతం 200 గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయిస్తోంది. అలాగే అసైన్డ్, మెట్ట భూములకు, సీలింగ్ భూములకు 200 గజాల చొప్పున కమర్షియల్ ప్లాట్లను ఇచ్చింది. రైతులకు ప్లాట్లను పంపిణీ చేసిన సీఆర్డీఏ అధికారులు అవి ఎక్కడున్నాయో చూపలేదు. మాస్టర్ప్లాన్లో చూపించి హడావుడిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. కమర్షియల్ స్థానంలో రెసిడెన్షియల్ సీఆర్డీఏ అధికారులు రైతులకు రెసిడెన్షి యల్, కమర్షియల్ ప్లాట్లను ఇస్తున్నారు. రెసిడెన్షియల్ ప్లాట్లకు సరిహద్దు రాళ్లు పాతి వాటికి పసుపు(ఎల్లో) రంగు వేశారు. అలాగే కమర్షియల్ ప్లాట్లకు హద్దు రాళ్లు పాతి వాటికి నీలం(బ్లూ) కలర్ వేశారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడ కమర్షియల్ ప్రాంతం వస్తుందో.. ఎక్కడ రెసిడెన్షియల్ వస్తుందో సీఆర్డీఏ అధికారులకు ఇంత వరకు స్పష్టం చేయలేదు. తుళ్లూరు మండలం మందడం గ్రామ శివారుల్లో కమర్షి యల్ ప్లాట్ల హద్దు రాళ్లు పాతి వాటిని రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం తీరిగ్గా మాస్టర్ప్లాన్ను పరిశీలించిన అధికారులు ఆ ప్రాంతంలో ఎలాంటి వాణిజ్య సముదా యాలు లేవని నిర్థారణకు వచ్చారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా బ్లూ కలర్ ఉన్న హద్దు రాళ్లకు హడావుడిగా పసుపు రంగు వేయడం ప్రారంభించారు. 29 గ్రామాల్లో చాలా చోట్ల హడావిడిగా కమర్షియల్ ప్లాట్లను రెసిడెన్షియల్స్గా మార్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతా హడావుడిగానే... ప్లాట్ల హద్దు రాళ్లపైన సీఆర్డీఏ ఒక నంబర్ వేస్తుంది. దాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసా ్తరు. రాయిపై ఉన్న నంబర్ రెసిడెన్షియల్ ప్లాట్లుకు సంబంధించినదా... లేక కమర్షియల్ ప్లాట్లకు సంబంధించినదా అన్న అంశం ఆన్లైన్లోనే ఉంటుంది. అయితే మందడంలోని ప్లాట్ల నంబర్లు ఆన్లైన్లో రెసిడెన్షియల్ ప్లాట్లుగా నమోదై ఉన్నాయి. భౌగోళికంగా వచ్చే సరికి హద్దు రాళ్లకు బ్లూ రంగు వేసి వాటిని కమర్షియల్ ప్లాట్లుగా అధికారులు ముందు గుర్తిం చారు. తీరిగ్గా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ను పరి శీలించి తప్పు దొర్లినట్లు గుర్తించి హద్దు రాళ్లకు రంగు మారుస్తున్నారు. ఈ చర్యలతో రాజధాని నిర్మాణం, సమగ్ర స్వరూపంపై అటు ప్రభుత్వానికి ఇటు సీఆర్డీఏకు ఒక స్పష్టత లేదనే విషయం అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
హవ్వ.. నవ్విపోదురు గాక..
ఏలూరు (ఆర్ఆర్ పేట) : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది అధికారుల తీరు.. చివరికి పదో తరగతి పరీక్షలను కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నట్టు ఉంది. జనరల్ విద్యార్థులకు సాధారణ తెలుపు రంగు ప్రశ్నాపత్రాలను ఇచ్చినప్పటికీ కాంపోజిట్ విద్యార్థులకు పసుపు రంగులో ఇచ్చారు. దీంతో పాటు ఈ పేపరులో గద్య ప్రశ్నల్లో 3వ ప్రశ్న ఫక్తు ముఖ్యమంత్రి ప్రచారానికి, స్వోత్కర్షకు వినియోగించుకున్నారు. అమరావతి నిర్మాణంపై ప్రశ్న ఇస్తూ అందులో రాష్ట్ర రాజధాని అమరావతిని 35 సంవత్సరాల్లో దశలవారీగా నిర్మిస్తారని, ఆకాశ హారŠామ్యలు, ఉద్యాన వనాలు, సరస్సులు నిర్మించబడతాయని పేర్కొన్నారు. చివరగా అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమంటూ ముగింపుకొచ్చారు. వర్షం వస్తే కారిపోయే భవనాలు, పూర్తిస్థాయిలో అసెంబ్లీ హాలు, శాసనమండలి నిర్మితం కాకపోయినా శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటూ పదో తరగతి విద్యార్థులకు తప్పుడు సంకేతాలివ్వడం కోసమే ఇటువంటి ప్రశ్నలిచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు. అమరావతిపై ప్రశ్న ఇవ్వడమే అతిగా ఉంటే అందులో ముఖ్యమంత్రి కృషి అని పేర్కొనడం రాజకీయ దివాళాకోరుతనమని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు అదనపు మార్కులివ్వాలి విద్యార్థులను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నను తొలగించి విద్యార్థులందరికీ అదనపు మార్కులివ్వాలి. 35 వేల మంది రైతుల భూములు బలవంతంగా లాక్కొని, వారి పొట్ట కొట్టిన చంద్రబాబు ప్రైవేట్ వర్సిటీలకు తక్కువ ధరకే కట్టబెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోతాం. సొంత డబ్బాతో విద్యార్థుల ఆలోచనలను పక్కదారి పట్టించి తన గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. – కాకి నాని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు -
రంగు పడుద్ది..
జిల్లాలోని ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు పడుతోంది. పంచాయతీ, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు పచ్చరంగు వేయాల్సిందేనని ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తాజాగా ఉపాధి కార్డులు పసుపు రంగులోనే ఉండాలని పాలకులు నిర్ణయించారు. లోటు బడ్జెట్ అంటూ సంక్షేమ పథకాలకు కత్తెర వేస్తూ.. ఏమాత్రం ఉపయోగం లేని అంశాలపై ప్రజాధనాన్ని వెచ్చిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, సాక్షి: రాష్ట్ర ప్రభుత్వానికి రంగు పైత్యం పట్టుకుంది. తమ పార్టీ అధికార రంగు పసుపును ప్రభుత్వ భవనాలకు వేయాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో జిల్లాలోని పంచాయతీ భవనాలు, ఓహెచ్ఎస్ఆర్ (ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్) ట్యాంకులు, ఉపాధి కార్డులపై పచ్చరంగు పడుతోంది. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. పైకి విమర్శలు చేయకపోయినా ఉద్యోగులు కూడా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. మెమో నంబర్ 2754/2017 సీపీఆర్అండ్బీ ఆర్డీ పేరిట పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీపీఓలకు పచ్చరంగు పులమడంపై ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భవనాలకు ఏ రంగు వేయాలి, ఏ కంపెనీ రంగు వాడాలో ఓ నమూనా చిత్రాన్ని పంపారు. పంచాయతీ భవనాలకు.. జిల్లాలో 1,363 పంచాయతీలు ఉన్నా యి. వీటిలో 1,148 పంచాయతీలకు భవనాలు న్నాయి. వీటన్నింటిపై పసుపు రంగు పడనుంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలు స్వపరిపాలన సంస్థలు. వీటికి.. రాజకీయ పార్టీలకు ఎలాంటి సబంధం లేదనే విషయం తెల్సిందే. అయినా పంచాయతీ భవనా లన్నింటికీ తెలుగుదేశం పార్టీ అధికారిక రంగును వేయిం చేందుకు ప్రభుత్వం పూనుకుంది. భవనం మొత్తం పసుపు రంగు, కార్నర్లకు తెలుపు రంగు వేయాలని మెమోలో ప్రభుత్వం సూచించింది. 9600 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు కూడా.. జిల్లాలో 9600 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులున్నాయి. వీటికి కూడా పచ్చరంగు వే యాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ట్యాంకుపైకి ఎక్కడానికి కేటా యించిన వంతెనకు తప్ప మొత్తం ట్యాంకుకు పసుపు రంగు వేయాలని పేర్కొం ది. 6734/2017 సీపీఆర్ ఆర్అండ్డీ పేరుతో ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి కార్డులకూ.. ఇప్పుడు ఉండే ఉపాధికార్డులను రద్దు చేసి పసుపు రంగు కార్డులిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పసుపు జాబ్ కార్డులు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పంపిణీ కూడా చేశారు. మన జిల్లాలో 6,58,914 జాబ్ కార్డులున్నాయి. వీటన్నింటినీ పసుపురంగులో ముద్రించి కొత్తగా పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. కేంద్రం నిధులతో నడిచే ఈ పథకంపై తన ముద్ర వేసుకోడానికే ఈ ప్రయత్నమని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆడంబరాలకు ప్రజాధనం దుర్విని యోగం అవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. -
హలో.. మెషిన్లు ఎల్లో!
కాపు కార్పొరేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రంగు పులుముకుంటున్న కుట్టు మెషిన్లు ప్రకాశం ,గిద్దలూరు : మొత్తానికి అనుకున్నంత పని చేశారు. కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా అందించేందుకు మంజూరైన కుట్టు మెషిన్లు పసుపుగా లేవంటూ అర్ధాంతరంగా పంపిణీ ప్రక్రియ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలు ఆదేశించడం.. అధికారులు జీ హుజూర్ అనండం నిమిషాల్లో జరిగిపోయింది. ఇంకేముందీ మెషిన్ల రంగు మారుతోంది. గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని 162 మంది కాపు, బలిజ మహిళలకు మహిళాభివృద్ధి సంస్థ జిల్లా ప్రాంగణం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఈ నెల 11వ తేదీన కుట్టు మెషిన్లు ఇచ్చేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డిలు మెషిన్లకు పసుపు రంగు లేని కారణంగా పంపిణీని ఆపేశారు. వాటిని మంజూరు చేసిన సమయంలో ప్రభుత్వ జీఓ ప్రకారం పసుపు రంగు లేకుండానే సరఫరా చేయాలని చెప్పడంతో మెషిన్ల సరఫరాకు టెండర్లు దక్కించుకున్న సంస్థ వారు సాధారణ కుట్టు మెషిన్లు సరఫరా చేశారు. పంపిణీ చేసే వరకు బాగానే ఉన్న నాయకులు మాత్రం పసుపు రంగు లేదంటూ పంపిణీ నిలిపేశారు. ప్రస్తుతం జిల్లా ప్రాంగణ మేనేజరు సుధ స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో పెయింటర్ ద్వారా రంగులు వేయిస్తున్నారు. అసలు ఈ రంగు ఎన్ని రోజులు నిలుస్తుందో చెప్పలేం. మెషిన్లపై బట్టలు కుట్టే సమయంలో రంగు లేచిపోవడం వలన లబ్ధిదారులు ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు. మహిళలు ఇబ్బందులు పడినా టీడీపీ నాయకులకు ప్రచారం ఉంటే చాలు అన్న చందంగా వ్యవహరించడంపై అంతా విస్మయం వ్యక్తం చేశారు. -
కొన్ని జంతువుల పాలు పసుపు రంగులో ఎందుకుంటాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ గేదె పాలు తెల్లగా ఉండటాన్ని, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు కదా! ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండటానికి, మరికొన్ని జంతువుల పాలు తెల్లగా లేకపోవడానికి చాలా ముఖ్య కారణమే ఉంది. ఆవు పాలలో ‘బీటా కెరోటిన్’ అనే పదార్థం కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆ పాలకు లేత పసుపు రంగు వస్తుంది. గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి. చిన్నపిల్లలకు గేదె పాల కంటే ఆవుపాలు మంచివని చెప్పడానికి.. వాటిలో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా, ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం కూడా కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం కావడమే కాకుండా వాటిలోని బీటా కెరోటిన్ ‘ఎ’ విటమిన్గా మార్పు చెంది చిన్నారులకు బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తిలో ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో తేడాలు ఉంటాయి. -
మూడ్ను మార్చే కలర్స్
సాక్షి, హైదరాబాద్ : ఇంట్లోని గోడలకు వేసే రంగులు మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంటాయి. ఒంట్లోని పల్స్రేట్ను స్థిమితంగా ఉంచుతాయి. అందుకే నగరంలోని స్టార్స్ హోటళ్లు, స్థితిమంతుల ఇంట్లోనూ రకరకాల రంగుల గోడలు మనకు దర్శనమిస్తాయి. రంగుల్లో ప్రధానంగా కూల్, వామ్ కలర్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. వామ్ కలర్స్లోని ఎరుపు, ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చలోని పలు రకాలు ప్రధానంగా మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎరుపు రంగు మనిషిని ఉత్సాహ పర్చడమే కాదు ఉత్తేజితుల్ని చేస్తుంది. ఈ రంగును చిన్న పిల్లల గదుల్లో ఉపయోగించడం మంచిది కాదు. మనుస్సు బాగోలేనప్పుడు ఏదైనా రెస్టారెంట్కు వెళ్లే ఈ రంగుకు దూరంగా కూర్చోవడం మంచిది. నీలం రంగు శరీరంలో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనిషి మెదడు స్థిమితంగా ఉంటుంది. అయితే కొన్ని ముదురునీలం రంగులు జాగ్రత్తను సూచిస్తాయి. లివింగ్రూమ్, పెద్ద వంట గదిలో ఈ రంగును ఉపయోగించొచ్చు. {పకృతి సహజ శోభిజ వర్ణం ఆకుపచ్చ. ఇది ప్రశాంతతకు, విశ్రాంతికి చిరునామా. ఈ రంగును బెడ్ రూమ్లో వినియోగించడం మంచిది. చిన్నారుల గదుల్లో ఏర్పాటు చేయడం వల్ల వారి చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది. పసుపు రంగు మెదడులో పాజిటివ్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడిలో ఉన్న వారికి ఈ రంగు మంచి ఔషదంగా పనిచేస్తుంది. వంట గది, డైనింగ్, బాత్ రూమ్లలో ఈ రంగును ఉపయోగించుకోవచ్చు. ఈ రంగు చిన్నారులలో వ్యతిరేకభావాలను కలిగిస్తుంది. అత్యంత ప్రశాంతమైన రంగు పింక్. ఈ రంగు ప్రేమ, మనసులోని భావాలను పెంపొందించేలా చేస్తుంది. యువత బెడ్రూమ్లలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. సంప్రదాయమైన రంగు తెలుపు. అందుకే పెళ్లిళ్లు, సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ అంశాలలో ఈ రంగును అధికంగా వినియోగిస్తుంటారు. తెలుపు రంగు కోపంగా ఉన్న మూడ్ని ప్రశాంతంగా మార్చేస్తుంది. మనకు తెలియకుండానే సాంత్వన చేకూరుతుంది. -
భలే భలే బైక్ ట్యాక్సీ
సౌలభ్యం: గోవాలో బైక్ ట్యాక్సీ డ్రైవర్లను పైలట్లు అంటారు. వాస్కోడాగామా ప్రాంతంలో స్టాండ్ల మీద పసుపు రంగు బైకులతో సిద్ధంగా ఉంటారు పైలట్లు. కొందరు యూనిఫామ్ కూడా ధరిస్తారు. మీరు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డులో నడుస్తున్నారు. సోమాజిగూడకు పోవాలి. నడిచేందుకు ఓపికుండదు. సమయానికి బస్సుండదు. ఆటో ఎక్కుదామంటే నలభయ్యో యాభయ్యో ఇమ్మంటాడు. జేబులో అంత ఉండదు. ఉన్నా అంతివ్వడానికి మనసొప్పుకోదు. అలాంటి సమయంలో బైకు మీద ఓ వ్యక్తి వచ్చి, పది రూపాయలిస్తే డ్రాప్ చేస్తా అంటే ఎలా ఉంటుంది? ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ తరహా ‘టూ వీలర్ ట్యాక్సీ’ కాన్సెప్ట్ జోరందుకుంటే భవిష్యత్తులో మనకూ అందుబాటులోకి కావచ్చు. టూ వీలర్ ట్యాక్సీ... ఈ కాన్సెప్ట్ ఇండియాకు కొత్త కావచ్చు. కానీ విదేశాల్లో చాలా పాపులర్. చైనాలో 1980 ప్రాంతంలోనే టూ వీలర్ ట్యాక్సీలు నడిచాయి. 90ల్లో ఊపందుకున్నాయి. ప్రస్తుతం చైనాలోని ప్రధాన నగరాలన్నింట్లో బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. 2008 ఒలింపిక్స్ సమయంలో మన అథ్లెట్లు బీజింగ్ నగరంలో బైక్ ట్యాక్సీల మీద షికార్లు చేశారు కూడా. అక్కడ బైక్ ట్యాక్సీ మీద ఐదు కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు మన కరెన్సీ ప్రకారం 50 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆటోలు, ట్యాక్సీలతో పోలిస్తే ఇది చాలా చవక. చైనాలో బైక్ ట్యాక్సీలు ఊపందుకుంటున్న సమయంలోనే బ్రెజిల్లోనూ ఈ సంప్రదాయం మొదలైంది. ఒక బ్యాంకు ఉద్యోగి పది బైకులు కొని ముందుగా టూ వీలర్ ట్యాక్సీ ప్రయాణాలకు శ్రీకారం చుట్టాడు. ఈ ఆలోచన సూపర్హిట్ అయి, దేశంలోనే పలు నగరాలకు విస్తరించింది. ప్రస్తుతం బ్రెజిల్ దేశవ్యాప్తంగా టూ వీలర్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్లోనూ బైక్ ట్యాక్సీ కాన్సెప్ట్ ఉంది. అయితే అక్కడ ఇది కూడా ఖరీదైన వ్యవహారమే. అక్కడి డ్రైవర్లు ఖరీదైన లగ్జరీ బైకులు వాడతారు. కాబట్టి ప్రయాణం కూడా ఖరీదైందే. ఇంకా కంబోడియా, కామెరూన్, ఇండోనేషియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో బైక్ ట్యాక్సీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈ దేశాల్లో బైక్ ట్యాక్సీల కోసం స్టాండ్లు కూడా ఉన్నాయి. మన దగ్గర ఆ రెండు చోట్లే! ఇండియాలో టూ వీలర్ ట్యాక్సీకి ముందుగా శ్రీకారం చుట్టింది గోవానే. ఈ సాగర నగరంలో బైకుల్ని అద్దెకిచ్చే కాన్సెప్ట్ ఎప్పట్నుంచో ఉండగా, కొన్నేళ్ల క్రితం బైక్ ట్యాక్సీ స్టాండ్లు మొదలయ్యాయి. గోవాలో బైక్ ట్యాక్సీ డ్రైవర్లను పైలట్లు అంటారు. వాస్కోడాగామా ప్రాంతంలో స్టాండ్ల మీద పసుపు రంగు బైకులతో సిద్ధంగా ఉంటారు పైలట్లు. కొందరు యూనిఫామ్ కూడా ధరిస్తారు. ఈ బైకులపై ప్రయాణం చేయడానికి మినిమమ్ ఛార్జి రూ.10. రెండు కిలోమీటర్ల తర్వాత కి.మీ.కి రూ.4 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టూరిజం ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఆటోలు, ట్యాక్సీలతో పోలిస్తే 25 శాతం డబ్బులతో బైక్ ట్యాక్సీలపై గోవా నగరమంతా చుట్టేయచ్చు. దేశంలో గోవా తర్వాత పర్యాటక ప్రాంతంగా మంచి పేరున్న కేరళలోనూ బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. కొచ్చిలో ‘టాప్ గేర్ రెంట్ ఏ బైక్’ అనే పేరుతో ఓ సంస్థ ఐదు టూ వీలర్ ట్యాక్సీల్ని అందుబాటులోకి తెచ్చింది. వీటికి మంచి స్పందనే వచ్చింది. కిలోమీటరుకు రూ.4 ఖర్చు చేసి వీటిపై ప్రయాణం చేయొచ్చు. విశేషమేంటంటే... ఈ బైక్ నడిపే డ్రైవర్తో పాటు ప్రయాణికుడికి రూ.లక్ష చొప్పున ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది. మెహబూబ్... బ్రాండ్ అంబాసిడర్! కేరళలో బైక్ ట్యాక్సీ కాన్సెప్ట్కి మంచి పేరు తెచ్చింది అశ్వక్ మెహబూబ్. దుబాయిలో చేస్తున్న ఉద్యోగం బోర్ కొట్టేసి, ఇండియాకు వచ్చిన మెహబూబ్ కొన్నాళ్లపాటు ఏ పనీ లేకుండా గడిపాడు. ఖాళీగా ఉన్న అతణ్ని డ్రాపింగ్ కోసం స్నేహితులు పిలిచేవాళ్లు. వేరే ఉద్యోగం ఏం చేద్దామా అనుకుంటున్న సమయంలో ఎక్కడో టూ వీలర్ ట్యాక్సీ గురించి చదివి, అదే తనకు జీవనోపాధి కాగలదని ఆలోచించాడు మెహబూబ్. తనను డ్రాపింగ్ కోసం పిలిచే మిత్రులకే తన ఆలోచన చెప్పాడు. వాళ్లంతా ప్రోత్సహించారు. క్రమంగా తనుండే ప్రాంతంలో మెహబూబ్ బైక్ ట్యాక్సీ డ్రైవర్గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. మొదట మెహబూబ్ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆటోవాలాలు తర్వాత అతణ్ని అర్థం చేసుకుని, తమ స్టాండ్లోనే అతనికి చోటిచ్చారు. అనుమతులకు సంబంధించి పోలీసుల నుంచి కూడా ఓ దశలో ఇబ్బందులు ఎదురైనా, నేరుగా పోలీస్ కమిషనర్నే కలిసి గ్రీన్సిగ్నల్ తెచ్చుకున్నాడు మెహబూబ్. పేషెంట్లను ఉచితంగా ఆసుపత్రులకు చేరవేస్తూ... లాంగ్ డ్రైవ్లకు డిస్కౌంట్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ మంచి పేరే తెచ్చుకున్నాడు మెహబూబ్. నిరుద్యోగులు తనను సంప్రదిస్తే, వాళ్లకూ ఇదే ఉపాధి కల్పిస్తానంటున్నాడు మెహబూబ్. -
ఈ కాంతి అమోఘం..
లండన్: మన సూర్యుడితో పోలిస్తే 1,300 వందల రెట్లు పెద్దదైన పసుపు రంగు నక్షత్రాన్ని ఫ్రాన్స్కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘హెచ్ఆర్ 5171 ఏ’గా నామకరణం చేసిన ఈ నక్షత్రం ఇచ్చే వెలుతురు ఎంతో తెలుసా.. ఏకంగా సూర్యుడికి పది లక్షల రెట్లు..! ఇంతవరకూ గుర్తించిన అతిపెద్ద పది నక్షత్రాల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. భూమికి 12,000 కాంతి సంవత్సరాల దూరంలో సెంటారస్ నక్షత్ర సమూహంలో ఈ నక్షత్రం ఉంది. అంతేకాదు.. దీనికి ఓ జోడీ నక్షత్రం కూడా ఉంది. ఆ నక్షత్రం దీని చుట్టూ 1,300 రోజులకోసారి పరిభ్రమిస్తుంది. ఈ రెండు నక్షత్రాలు ఒకదానికొకటి దాదాపు తాకుతున్నట్లుగా ఉన్నాయని వాటిని గుర్తించిన బృందంలోని శాస్త్రవేత్త ఒలివర్ చెస్న్యూ చెప్పారు. సాధారణంగా పసుపు రంగు నక్షత్రాలు అతి పెద్దగా ఉండడం అరుదని తెలిపారు. -
అన్వేషణం: పసుపు పూసిన నేల... హాజాంగ్
‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా చూశారా? కాజల్కి మాండలిన్ సంగీతం వినిపిస్తుంది. షారుఖ్ వచ్చాడని అర్థమై పరుగు పరుగున వెళ్తుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో గుర్తుందా? పసుపు రంగు పూల తోటలోకి. అటు పెద్దవీ ఇటు చిన్నవీ కాని మొక్కలకు పూచిన పసుపు రంగు పూలు తెరమీద ఎంత బాగా కనిపించాయో కదా! మరి వాటిని ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుంది! ఆ అనుభూతిని సొంతం చేసుకోవడానికి సరిైయెున చోటు... చైనాలోని హాజాంగ్. చైనాలోని ల్యోపింగ్ కౌంటీలో ఉన్న హాంజాంగ్ గ్రామంలో... కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది పసుపు, బంగారు వర్ణాలు కలగలసిన కనోలా పూలతోట. నేలకు పసుపు రంగు పూశారా అన్నంత అందంగా ఉన్న ఆ పూల సౌందర్యాన్ని చూడ్డానికి వేయి కనులు కావాలి. నిజానికి ఈ మొక్కలు చైనా అంతటా ఉంటాయి. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఉండేది మాత్రం ఇక్కడే. దాదాపు అరవై ఆరు ఎకరాల్లో ఉన్న కనోలా మొక్కలు ఆ ప్రాంత స్వరూపాన్నే మార్చేశాయి. అందుకే హాంజాంగ్ను ‘గోల్డెన్ సీ ఆఫ్ కనోలా’ అంటారు. కనోలా మొక్కలు కేవలం పూలమొక్కలు కావు. ఇవి నూనెను అందిస్తాయి. కనోలా పూల నుంచి గింజలు వస్తాయి. వాటి నుంచి నూనెను తీస్తారు. అక్కడ కనోలా నూనె వ్యాపారం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇన్ని వేల ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు. ఈ పూలు వసంత కాలంలో విచ్చుకుంటాయి. అందుకే ఆ సమయంలో సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం యేటా వసంత మాసంలో ‘హాంజాంగ్ టూరిస్ట్ ఫెస్టివల్’ను నిర్వహిస్తోంది. ఫొటోగ్రాఫర్లకి, సినిమా వాళ్లకి అత్యంత ఇష్టమైన ప్రదేశమిది. కనోలా అందాలను కెమెరాలో బంధించేందుకు వాళ్లంతా పోటీ పడుతూ ఉంటారు! ఏ ఇల్లు ఎవరిదో తెలిసేదెలా! ఇటలీలోని బారి ప్రావిన్స్లో ఉన్న అల్బెరోబెల్లో గ్రామ జనాభా దాదాపు పదకొండు వేలు. ఊరిలో ఏ ఇల్లు ఎవరితో గుర్తు పెట్టుకోవడం తలకు మించిన పని. ఎందుకంటే, ఎక్కడైనా ఒకట్రెండు ఇళ్లు తప్ప మిగతావన్నీ ఒకేలా (ఫొటోలో చూపినట్టుగా) ఉంటాయి. రాతితో నిర్మించి, సున్నం వేసిన ఇంటిమీద ఆకులతో వేసిన పైకప్పు, పైన సూదిగా ఉండి దాని మీద పిడిలా ఉండే విచిత్రమైన నిర్మాణ శైలితో ఉంటాయి ఆ ఇళ్లు. వాటిని స్థానికులు ‘ట్రుల్లీలు’ అంటారు. ట్రుల్లీ అంటే ‘రాళ్లతో కట్టిన ఇల్లు’అని అర్థం. ఈ ట్రుల్లీలను కొన్ని శతాబ్దాల క్రితం గోడౌన్లుగా వాడేవారు. అందుకోసమే ఈ ప్రాంతంలో చాలా ట్రుల్లీలను నిర్మించారు. అయితే ఆధునిక పద్ధతులు వచ్చాక వీటి వాడకం తగ్గింది. ఆ తర్వాత వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన కొందరు వీటిని తమ నివాసాలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఎవరు ఇల్లు నిర్మించుకున్నా, ఈ ఆకారంలోనే కట్టుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఆ ఊరిలో ఇళ్లన్నీ ఒకేలా ఉంటాయి. అందుకే కొత్తవాళ్లు వెళ్తే, ఏ ఇల్లు ఎవరిదో తెలీక కన్ఫ్యూజ్ అవుతుంటారు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
కారుపై పెద్దపులి దాడి..
టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్..?
హనీరోజ్ 'రాహేలు' టీజర్ విడుదల
సీరియస్గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
ఇద్దరూ టెకీలే: క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా 'రా రాజా'.. టీజర్తోనే భయపెట్టారు!
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
Advertisement