-
చివరి శ్వాస వరకు మీ కోసమే పనిచేస్తా
● మీరు మరింత అండగా ఉండాలి ● సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుసిద్దిపేటజోన్: ‘నా చివరి శ్వాస వరకు మీ కోసమే పనిచేస్తా. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మీరు మరింత అండగా ఉండాల’ని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం తారస్థాయిలో ఉండేదని, ఇప్పుడు కుదేలు అయ్యిందని విమర్శించారు. సిద్దిపేట అంటే గౌరవం ఉందని, దాన్ని కాపాడే బాధ్యత మీదేనన్నారు. వెంకట్రామిరెడ్డి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే మన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందన్నారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలని, మీరే ప్రచార సారథులని అన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ మాట్లాడారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హుస్నాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, పంట నష్టంపై సర్వే చేయించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా హుస్నాబాద్ పట్టణంలో చాడ బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు. -
No Headline
దుబ్బాకటౌన్: బీసీ బిడ్డనైనా తనకు మెదక్ ప్రజలు ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. బుధవారం రాత్రి దుబ్బాకలో తెలంగాణ తల్లి చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు చేసిందేమీలేదని ఆరోపించారు. దేశంలో ప్రయివేటీకరణ ప్రోత్సహిస్తున్న బీజేపీ తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఎంపీగా గెలువగానే నియోజకవర్గ నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీనిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేసిందన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు -
కేసీఆర్కు నీరాజనం
గజ్వేల్లో ఘన స్వాగతం గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు గజ్వేల్లో ఘన స్వాగతం లభించింది. నర్సాపూర్ ఎన్నికల ప్రచారసభకు వెళ్లే క్రమంలో బుధవారం సాయంత్రం పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా బస్సులో నుంచే కార్యకర్తలు, నాయకులు అభివాదం చేశారు. అప్పటికే గంటకుపైగా వేచి చూస్తున్న ప్రజలు కేసీఆర్ రావడంతో ఒక్కసారిగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి బస్సులోకి వెళ్లి కొద్దిసేపు మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సరళిని కేసీఆర్ ప్రతాప్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ శీరీష మంగళ హారతులతో స్వాగతం పలికారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ రజిత, మరికొంత మంది మహిళలు కేసీఆర్ను కలిశారు. అంతకుమందు మాజీ మంత్రి హరీశ్రావు సైతం చౌరస్తాలో కొద్దిసేపు ఆగి అభివాదం చేసి వెళ్లారు. -
రేవంత్రెడ్డి, కేసీఆర్ మాటలు నమ్మొద్దు
● గెలిపిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా ● మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావువర్గల్(గజ్వేల్): ‘హామీలు అమలుచేయని సీఎం రేవంత్రెడ్డి, కేసీఆర్ అసత్యపు మాటలు నమ్మొద్దు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే ఇక్కడి భూములన్నీ లాక్కుని, రాజ్ పుష్ప బోర్డులు పెడతారు’అని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. బుధవారం వర్గల్లో సీనియర్ నాయకులు రాంరెడ్డి, నందన్గౌడ్, బాల్రెడ్డిలతో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ డబుల్బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి దక్కించుకుని ఏనాడు కన్పించని వెంకట్రామిరెడ్డికి, మళ్లీ ఎంపీ పదవెందుకని నిలదీశారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గెలిపిస్తే పార్లమెంట్లో గళం వినిపిస్తా ములుగు(గజ్వేల్): ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంట్లో గళం వినిపిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. బుధవారం రాత్రి ములుగు మండలంలో రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు. -
చేనేత పరిశ్రమను నాశనం చేసింది బీఆర్ఎస్సే
● రూ.100 కోట్ల సబ్సిడీ సైతం ఇవ్వలేదు ● మంత్రి కొండా సురేఖదుబ్బాక: చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. నేతన్నల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేతన్నలకు ఇవ్వాల్సిన రూ.100 కోట్ల సబ్సిడీని ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం దగాకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డితో చర్చించి చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. వచ్చేది ‘ఇండియా’ కూటమే.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ‘ఇండియా’ కూటమేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీజేపీ ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. కుటుంబ పాలనతో తెలంగాణను లూటీ చేసిన బీఆర్ఎస్కు బుద్ధి చెప్పినట్లుగానే బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, చెరుకు శ్రీనివాస్రెడ్డి, మద్దుల గాల్రెడ్డి ఉన్నారు. రైతుల ఉసురు తీసిండ్రు తొగుట(దుబ్బాక): గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితుల ఉసురు తీసిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా బుధవారం తొగుటలో కార్నర్ మీటింట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా గత ప్రభుత్వం మోసంచేసిందని ఆరోపించారు. అవ్వా.. నేను చేనేత బిడ్డనే.. దుబ్బాక: బాగున్నావా అవ్వా.. నేను మీ చేనేత బిడ్డనే.. అంటూ రాట్నం చుడుతున్న 80 ఏళ్ల వృద్ధ కార్మికురాలిని మంత్రి కొండా సురేఖ ఆప్యాయంగా పలకరించారు. ‘మీ కష్టాలు స్వయంగా తెలుసు. ఇప్పుడు మంత్రిని అయ్యా.. మీ కష్టాలు తీరుస్తా’ అంటూ మనోధైర్యం ఇచ్చారు. నీ ఓటు కాంగ్రెస్కు వేయాలని మంత్రి కోరారు. -
సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కలిసిన కలెక్టర్
కొండపాక (గజ్వేల్): దుద్దెడ శివారులో నాగులబండ వద్ద సుప్రీంకోర్టు మాజీ జడ్జి, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కమిషన్ చైర్మన్ పినాక చంద్రఘోష్ను బుధవారం కలెక్టర్ మనుచౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు. రామగుండం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో ఓ హోటల్లో తేనీటి విందు స్వీకరించే క్రమంలో కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కలిశారు. కలెక్టర్ వెంట పోలీస్ అదనపు డీసీపీ (అడ్మిన్) మల్లారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరాం తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన సీపీ సిద్దిపేటకమాన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవిని పోలీసు కమిషనర్ అనురాధ బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పెండింగ్లో ఉన్న కేసుల గురించి చర్చించారు. న్యాయమూర్తిని కలిసిన వారిలో అదనపు డీసీపీ మల్లారెడ్డి ఉన్నారు.మల్బరీ తోటల పరిశీలన నంగునూరు(సిద్దిపేట): ముండ్రాయిలో వర్షానికి దెబ్బతిన్న మల్బరీ తోటలను బుధవారం పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పరిశీలించారు. రైతు రాగుల రాజు రెండెకరాల మల్బరీ సాగు చేయగా అకాల వర్షానికి పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షానికి పురుగులు చనిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడీఏ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందజేసి రైతుకు పరిహారం అందేలా చూస్తామన్నారు.ఆయిల్పామ్ సాగుతో ఆర్థికాభివృద్ధి మిరుదొడ్డి(దుబ్బాక): ఆయిల్పామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాఽధించవచ్చని ఆయిల్ ఫెడ్ డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెప్యాలలో ఆయిల్పామ్ సాగుపై హార్టికల్చర్ అధికారులు బుధవారం రైతులకు క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారు. డ్రిప్, స్ప్రింక్లర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ సాగుపై అవగాహన పెంచుకోవాలని చూచించారు. కార్యక్రమంలో డీఐ శంకర్, హార్టికల్చర్ ఏఈ అనిల్కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రేణుక, ఆయిల్ఫెడ్ డీసీఓ ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. ‘బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానంసిద్దిపేటరూరల్: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరేళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సున్న బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆపదలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటంలో ధైర్యసాహసాలు చూపినవారు, సాంస్కృతిక కళలు, క్రీడలు, సమాజసేవ, పాండిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనభరిచిన వారు అర్హులని తెలిపారు. వారి వివరాలను ఉపాధ్యాయులు, బాలలు, సంస్థలు అన్ని పత్రాలతో ఆన్లైన్లో జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న బాలలకు డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ పురస్కరించుకుని అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ వెబ్సైట్ http://awards.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
తండాలను పంచాయతీలు చేశాం..
దశాబ్దాల పాటు పరిపాలించిన ఏ ప్రభుత్వం తండాలను పట్టించుకోలేదని, తాము తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేశామని కేసీఆర్ అన్నారు. మన రిజర్వేషన్లు మనకు ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని పిలుపునిచ్చారు. కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్హుస్సేన్, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, కార్మిక బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మన్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, జెడ్పీటీసీ బబియానాయక్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, చంద్రాగౌడ్, గోపి, వెంకట్రెడ్డి, నయిమోద్దీన్, సత్యంగౌడ్, పంబాల భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
No Headline
పటాన్చెరుకు రైల్వే కోచ్ సాధిస్తాం పటాన్చెరు: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే పటాన్చెరుకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నియోజకవర్గంలో పదేళ్ల కిందట రెండు లక్షల ఓటర్లు ఉండేవారని, ఇప్పుడు నాలుగు లక్షలకు చేరిందన్నారు. తమ ఇండస్ట్రియల్ పాలసీ కారణంగా పటాన్చెరులో అనేక పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక అవసరాలకు నిరంతరం విద్యుత్తును సరఫరా చేశామని గుర్తు చేశారు. దీంతో దేశంలోని నలు మూలల నుంచి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడంతో వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు, ఉద్యోగులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని కేసీఆర్ వివరించారు. కాలుష్య ప్రాంతంగా ఉన్న పటాన్చెరులో స్వచ్ఛమైన మంచినీటి మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి మంచినీరు సరఫరా చేశామని తెలిపారు. -
No Headline
హుస్నాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు సందర్భంగా కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. పాల్గొన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ అన్ని కులాలను కలుపుకొని పావాలని, అందరి సహకారం ఉంటేనే రాజకీయ నాయకుడిగా ఎదుగుతారని తెలిపారు. రెడ్డి కమ్యూనిటీ భవనం కోసం రూ.50లక్షలు కేటాయించిన ప్రొసిడింగ్ను అందజేశారు. ఎన్నికల తర్వాత మరో రూ.50లక్షలు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు కాలాల పాటు సమాజానికి సేవ చేయడానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. త్వరలోనే వరి కి రూ.500 బోనస్, రూ.2లక్షల రుణ మాఫీ, కొత్త పెన్షన్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామన్నారు. సమావేశంలో రెడ్డి సంఘం నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి, మడప జైపాల్ రెడ్డి, అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా బుధవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో, హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్లో రెడ్డి సంఘం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లె మోహన్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మల్లన్న జలాలతో సిరులే..
నర్సాపూర్/నర్సాపూర్రూరల్: మల్లన్నసాగర్ కాలువల ద్వారా సాగు నీరు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ను లింకు చేయడానికి శంకరంపేట నుంచి కాలువల తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీరు రావడం మొదలైతే నర్సాపూర్ సస్యశ్యామలం అవుతుందన్నారు. కాలువల నిర్మాణం పూర్తయి నీళ్లు రావాలంటే మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. మనమంతా కలిసి యుద్ధం చేస్తేనే ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలిచినప్పటి నుంచి కాలువల నిర్మాణంలో స్పీడ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. నర్సాపూర్ పొలాలు గోదావరి జలాలతో పారాలన్నదే నా కల అన్నారు. నర్సాపూర్ను ఎంతో అభివృద్ధి చేశామని, మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల నిధులు ఇచ్చామని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సైతం నిధులు ఇవ్వగా ఈ ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ వెనక్కి తీసుకుపోయిందని ఆరోపించారు. కొల్చారంలో మల్లినాథసూరి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తాను నిర్ణయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ హయాంలో హల్దీ వాగు, మంజీరాపై 10 చెక్ డ్యాంలు నిర్మించామని, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించారని చెప్పారు. సస్యశ్యామలం చేయడమే నా కల అందుకు ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ -
సీపీఎం అభ్యర్థిని గెలిపించాలి
కొమురవెల్లి(సిద్దిపేట): భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ సమగ్ర అభివృద్ధి కోసం సీపీఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య అన్నారు. మంగళవారం జహంగీర్కు మద్దతుగా మర్రిముచ్చాల అయినాపూర్, తపాసుపల్లి, గురువన్నపేట గ్రా మాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోని నాయకులను ఓడించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్య దర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి ఏపీడీ మధుసూదన్ చిన్నకోడూరు(సిద్దిపేట): కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని ఏపీడీ మధుసూదన్ ఆదేశించారు. మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు శీర్షిక సోమవారం సాక్షిలో ప్రచురితమైంది. స్పందించిన ఏపీడీ మంగళవారం చిన్నకోడూరు, పెద్దకోడూరు గ్రామాల్లోని ఽఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. కొనుగో లు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కరపత్రం ఆవిష్కరణ మిరుదొడ్డి(దుబ్బాక): ఈనెల 8వ తేదీన సిద్దిపే ట జిల్లా కేంద్రంలో నిర్వహించే డీఎస్పీ ఎన్నిక ల ప్రచారసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రోల్ల దీపక్ మహారాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం మిరుదొడ్డి లో ప్రచార సభ కరపత్రాలను ఆవిష్కరించారు. వసతులు కల్పించాలి సిద్దిపేటరూరల్: పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోలింగ్ కేంద్రాలలో వసతులు కల్పించాలని కోరుతూ పీఆర్టీయూ నాయకులు మంగళవారం కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శశిధర్ శర్మ మాట్లాడుతూ దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారు విధులు నిర్వహిస్తారని, ఇందుకు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. -
హామీల అమలులో కాలయాపన
చేర్యాల(సిద్దిపేట): పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూపరాణి కోరారు. మంగళవారం పట్టణ పరిధిలోని పలువార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో అందిన సంక్షేమ పథకాల ను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం.. కొమురవెల్లి(సిద్దిపేట): బీఆర్ఎస్ భువనగిరి పార్ల మెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఏర్పాలు మహేష్ ప్రజలను కోరారు. మంగళవారం ఆయనకు మద్దతుగా మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ సీని యర్ నాయకుడు గొల్లపల్లి కిష్టయ్య, గ్రామ అధ్యక్షులు కనకమల్లేశం, మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
దుబ్బాకటౌన్: సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు కిష్టమ్మగారి సుభాష్ రెడ్డి అన్నారు. పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా మంగళవారం పట్ట ణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేళ్ల కేంద్ర బీజేపీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మెదక్ అభివృద్ధి కేవలం రఘునందన్ రావుతోనే సాధ్యమన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి ఆయనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి బీజేపీ ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు సిద్దిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మా ట్లాడారు. దేశం కోసం, ధర్మకోసం, ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రఘు నందన్రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కోడూరి నరేష్, సిద్దిపేట ఎన్నికల ప్రచార కమిటీ కోకన్వీనర్ తొడుపునూరి వెంకటేశం, సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు కెమ్మసారం సంతోష్కుమార్, పిట్ల నరేష్, బొడ్డు సునీల్, పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి బొమ్మగోని పద్మ తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట నంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ నాయకుల వాగ్దానాలను ప్రజలు నమ్మొ ద్దని బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దుతుగా మంగళవారం ప్రచారం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రతీ అభివృద్ధి పనిలో .. గజ్వేల్రూరల్: ప్రతీ అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వ నిధులున్నాయని, ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్న బీజేపీకి ఓటువేయాలని ఆ పార్టీ గజ్వేల్ మండల అధ్యక్షుడు పంజాల అశోక్గౌడ్ అన్నారు. మండల పరిధిలోని రిమ్మనగూడలో మంగళవారం బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రిమ్మనగూడ గ్రామ బూత్ అధ్యక్షుడు నవీన్ పాల్గొన్నారు. -
వసతులు కల్పించాలి
దుబ్బాక: 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ స్టేషన్లలో అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్, దుబ్బాక అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గరీమా అగర్వాల్ అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులను సిబ్బంది బాధ్యతతో నిర్వహించాలన్నారు. పోలింగ్స్టేషన్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇద్దరు వలంటీర్లు, వీల్చైర్ అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డీపీఓ దేవకీదేవి, డీఎల్పీఓ మల్లికార్జున్, ఏఎఆర్ఓ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్, దుబ్బాక ఏఆర్ఓ గరీమా అగర్వాల్ -
తల్లిపాలపై అవగాహన కల్పించాలి
డీఎంహెచ్ఓ శ్రీనివాస్సిద్దిపేటకమాన్: తల్లిపాల ప్రాముఖ్యత, వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్పై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ వైద్యాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న ఆయుష్ వైద్యాధికారులు, ఎమ్ఎల్హెచ్పీలకు ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవల కోసం వచ్చే వారితో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించి కారణాలు తెలుసుకుని నివేదికను పీహెచ్సీ వైద్యాధికారికి అందజేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ విజయరాణి, డాక్టర్ రజని, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న బాలసంస్కార్ వేసవి శిక్షణా శిబిరం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలో బాల సంస్కార్ వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. మంగళవారం విద్యార్థులకు కార్టూన్ చిత్రకళలో ప్రముఖ కార్టూనిస్ట్ నెల్లుట్ల రమణారావు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతలతో నవరసాలను, భావోద్వేగాలను కార్టూన్ ద్వారా వ్యక్తీకరించవచ్చన్నారు. సమకాలీన సమస్యలపై అవగాహనతో కార్టూన్లు వేస్తే ఎందరినో ఆలోచింపజేయ వచ్చని సూచించారు. బాల సంస్కార్ కోర్స్ డైరెక్టర్ తోట సంధ్య, సిద్దిపేట జిల్లా యోగా సన స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, ప్రముఖ యోగా శిక్షకుడు సతీష్, కవి బసవరాజ్ రాజ్కుమార్ రామణారావును సన్మానించారు. నెమలిని రక్షించిన అధికారులు మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని గాగ్గిళ్లాపూర్లో రైతు బండి స్వామికి చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు నెమలి పడిపోయింది. గమనించిన స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాముడు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బావిలో పడిన నెమలిని వెలికితీశారు. నీళ్లు తాగించి అడవిలోకి వదిలారు. -
నూతన పోస్టల్ బ్యాలెట్ విధానంపై హర్షం
గజ్వేల్రూరల్: పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సులభతరం చేయడంపై టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐవోసీ)లో పోస్ట ల్ బ్యాలెట్ వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. గతంలో ఓటుహక్కు విని యోగంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. పాత నిబంధనలు మార్చి నూతన విధానంలో ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతంలోనే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాట చేయడం అభినందనీయమన్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందుగా ఓటుహక్కును వినియోగించుకోవడం వల్ల సిబ్బందికి ఇబ్బంది ఉండదన్నారు. ఈ విధానాన్ని రూపొందించడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఓటుతో గుణపాఠం చెప్పాలి
అక్కన్నపేట(హుస్నాబాద్): బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అభివృద్ధి సాధకుడని, ఆయన గెలుపు ఖాయమైందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పెర్యాల రవీందర్రావు, ఎంపీపీ మాలోతు లక్ష్మీ అన్నారు. అక్కన్నపేట మండలం మోత్కులపల్లి, పెద్దతండా, పంజాగుట్టు తండా గ్రామాల్లో మంగళవారం వినోద్కుమార్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. బెజ్జంకి(సిద్దిపేట): కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్కు మద్దతుగా మండలంలోని దాచారం, గాగిళ్లాపూర్ గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలిసి వినోద్కుమార్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. -
విద్యార్థులు కథల పుస్తకాలు చదవండి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు కథల పుస్తకాలు చదువుతూ సంస్కృతి, సభ్యత అలవర్చుకోవాలని పుస్తక పఠనంతో వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవాలని సుగుణ సాహితీ సమితి కన్వీనర్ బైతి దుర్గయ్య అన్నారు. స్మార్ట్ ఫోన్ వీడియో గేమ్లకు బానిసలు కాకూడదన్నారు. మంగళవారం సిద్దిపేట శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో డాక్టర్ సిరి రాసిన సిల్వర్ ఫీతర్ కథల పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోతుకు నరేష్కుమార్, బాలసాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సుగణ సాహిత సమితీ కన్వీనర్ దుర్గయ్య -
కాంగ్రెస్ని నమ్మొద్దు
మర్కూక్(గజ్వేల్): సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని, ఓటుతో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మంగళవారం మండలంలోని వర్దరాజ్పూర్, దామరకుంట గ్రామంలో ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఓటు వేసి మోసపోవద్దు నంగునూరు(సిద్దిపేట): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేసి మోసపోవద్దని మాజీ ఎంపీపీలు శ్రీకాంత్రెడ్డి, సారయ్య, మల్లయ్య అన్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మంగళవారం మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రామంచ, గంగాపూర్ గ్రామాల్లో పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. -
డబ్బు రాజకీయాలను తిప్పి కొట్టాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి చేర్యాల(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి చేర్యాల కేంద్రంగా నడుపుతున్న డబ్బు రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎంపీ ఎన్నికలను ప్రతాప్రెడ్డి తన ఇంటిని కేంద్రంగా చేసుకొని బూతు కమిటీ సభ్యుల సమావేశం పేరుతో డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
డీబీఎఫ్ కార్యదర్శికి పరామర్శ
మిరుదొడ్డి(దుబ్బాక): డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ తండ్రి మరణ వార్త తెలుసుకొని హైదరాబాద్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట నుంచి మండల పరిధిలోని లింగుపల్లికి ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, దళిత నేతలు, జర్నలిస్టు యూనియన్ నాయకులు మంగళవారం తరలివచ్చి పరామర్శించారు. శంకర్ తండ్రి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. శంకర్ను పరామర్శించిన వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మైస రాములు, కొడకండ్ల కృష్ణ, జాతీయ మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షుడు కళ్ళూరి సంజీవ్ తదితరులు ఉన్నారు. -
కెప్టెన్ శిక్షణ పూర్తి
గజ్వేల్రూరల్: గజ్వేల్ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర అధ్యాపకురాలు ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ భవానీ కెప్టెన్ శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.శ్రీనివాస్రావు, అధ్యాపకులు అభినందించారు. మంగళవారం కళాశాలలో ఆమెను సన్మానించారు. అనంతరం డాక్టర్ భవానీ మాట్లాడుతూ 2014లో లెఫ్టినెంట్ శిక్షణ పూర్తిచేసి పదేళ్లయ్యిందన్నారు. పదోన్నతికి రిఫ్రెషర్ కోర్సు గత ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకు 20 రోజులపాటు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోగల ఎన్సీసీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కెప్టెన్ శిక్షణ పొందినట్లు చెప్పారు. పదోన్నతి శిక్షణ పొందేందుకు సహకరించిన కళాశాల బృందానికి, సంగారెడ్డి బెటాలియన్ అధికారులకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రేస్లో చేరిక మర్కూక్(గజ్వేల్): రగామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మాజీ సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి మాజీ సర్పంచ్ భాగ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ములుగు(గజ్వేల్): మండలంలోని బహిలంపూర్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు, మండల యాదవ సంఘం అధ్యక్షుడు యాంజాల అయిలేష్ యాదవ్ మంగళవారం కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. దుబ్బాకరూరల్: అక్బర్పేట–భూంపల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యులు, వారితో పాటు మరో 150 మంది మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, గుండా శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీచంద్రమౌళీశ్వర స్వామి కల్యాణం వర్గల్(గజ్వేల్): వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో మంగళవారం శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి కల్యా ణం వైభవంగా జరిగింది. క్షేత్రంలో చంద్రమౌళీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 40 రోజులైన సందర్భంగా మండల ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో వేద పండితులు తెల్లవారు జామున చంద్రమౌళీశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. అనంతరం రుద్రహోమం, స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి తొగుట(దుబ్బాక): మండలంలోని రాంపురం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ ఆ కళాశాల అధ్యాపకులు తల్లిదండ్రులను కోరారు. మండలంలోని చందాపూర్లో మంగళవారం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ కళాశాలలో అనుభవజ్ఞలైన అధ్యాపకులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని చెప్పారు. ప్రైవేటు కళాశాల్లో చేర్పించి ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడొద్దని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ప్రైవేటు కళాశాలల ప్రకటనలను చూసి మోసపోవద్దన్నారు. నగదు సీజ్ సిద్దిపేటరూరల్: పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో వాహనంలో తగిన ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ అపూర్వ రెడ్డికి తెలిపారు. మంగళవారం నారాయణరావుపేట మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు. మొహినిపురకు చెందిన రిజ్వాన బేగం తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.1,82,000 తీసుకెళ్తోంది. దీంతో ఆ నగదును సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు దుబ్బాకరూరల్: అక్బర్పేట–భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామ కేదారేశ్వరస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. -
‘కారు’దిగి కాంగ్రెస్లోకి..
కొండపాక(గజ్వేల్): సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి అన్నా రు. కుకునూరుపల్లి మండల పరిధిలోని కోనాయిపల్లికి చెందిన బీర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి, ఉపేందర్గౌడ్, సాయిరెడ్డి, అంజిగౌడ్ తదితరులు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ మెదక్ లోక్సభ అభ్యర్థిగా నీలం మధు విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి, రుషీ, నరేశ్, దేవానందం, రమేశ్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హస్తం గూటికి మాజీ సర్పంచ్ వర్గల్(గజ్వేల్): మండల పరిధిలోని గిర్మాపూర్ మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. డీసీసీ అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సందీప్రెడ్డి, సీనియర్ నాయకులు తోట ముత్యాలు, శ్రీరాంనర్సింలు తదితరులు పాల్గొన్నారు. పాలనకు ఆకర్షితులై చేరికలు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement