● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే సీ్త్ర నిధి రుణాల్లో అవినీతి, అక్రమాల కు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాకేంద్రంలోని టీటీడీసీలో డీఆర్డీఏ పరిధిలోని ఏపీఎంలు, సీసీలు, జి ల్లా అధికారులతో సీ్త్ర నిధి అమలుపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వా రీగా సీ్త్ర నిధి రుణ లక్ష్యాలు, రుణాల మంజూరు, రి కవరీ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రనిధి రుణా లు సద్వినియోగం చేసుకుని మహిళలు అర్థికంగా అభివృద్ధి సాధించేలా చూడాలన్నారు. ప్రతీ మండలంలో రుణాల రికవరీ వందశాతం జరగాలన్నారు. ఎవరైన సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ సభ్యురాలికి రుణాలందించేలా ఏపీఎంలు, సీసీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో సాయన్న, మెప్మా పీడీ మమత, పశు సంవర్ధకశాఖ అధికారి కిషన్, విజయ డైరీ డీడీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment