ఆస్పత్రి వైద్యం వద్దే వద్దు | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి వైద్యం వద్దే వద్దు

Published Fri, Sep 27 2024 3:26 AM | Last Updated on Fri, Sep 27 2024 3:26 AM

ఆస్పత్రి వైద్యం వద్దే వద్దు

కొయ్యూరు: అనారోగ్యానికి గురైన గిరిజన విద్యార్థిని ఆస్పత్రిలో చేర్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్‌, హెచ్‌ఎం ప్రభుదాస్‌ కలిసి తల్లిదండ్రులకు నచ్చచెప్పినా ఆస్పత్రికి బదులు నాటు వైద్యం చేయిస్తామని మొండి కేశారు. చివరకు ఎలాగైతేనేం ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని డౌనూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న కొర్రా సురేష్‌ వినాయక చవితికి సొంతూరు చింతపల్లి మండలంలో కుడిసింగి వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురయ్యాడు. సురేష్‌ పాఠశాలకు రాకపోవడంతో బుధవారం సాయంత్రం వార్డెన్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేనందున నాటువైద్యం చేయించి తగ్గిన తరువాత పాఠశాలకు పంపిస్తామని వారు బదులిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్‌, హెచ్‌ఎం కుడిసింగి వెళ్లారు. ఆస్పత్రిల్లో చేర్పిద్దామని వారు చెప్పినా తల్లిదండ్రులు గొడవచేశారు. ఎట్టకేలకు వారు నచ్చచెప్పడంతో తాజంగి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం సురేష్‌ను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడికి వచ్చేది లేదని తల్లిదండ్రులు అధికారులతో గొడవకు దిగారు. నాటు వైద్యం చేయిస్తామన్నారు. వారికి నచ్చజెప్పడంతో తాజంగి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి గురువారం తెల్లవారుజామున తీసుకువచ్చారు. ఇక్కడ కూడా తల్లిదండ్రులు ఏటీడబ్ల్యూవోతో గొడవకు దిగారు.పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో విద్యార్థిని తీసుకుపోతారన్న అనుమానంతో పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. పీవో చొరవతో విద్యార్థిని ఆస్పత్రిలో చేర్పించగలిగామని ఏటీడబ్ల్యూవో తెలిపారు.

అధికారులతో గొడవకు దిగిన

అనారోగ్య విద్యార్థి తల్లిదండ్రులు

పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌

చొరవతో ఎట్టకేలకు తరలింపు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement