పాడేరు : వికసిత్ భారత్ 2047 అంతర్జాతీయ సదస్సులో రాజ్యాంగం అమలుతీరుపై పరిశోధన పత్రాన్ని సమర్పించినట్టు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ వి.రమేష్బాబు తెలిపారు. ఈనెల 18,19 తేదీల్లో రాజస్థాన్లోని బికనీర్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సెమినర్లో ఆయన హాజరయ్యారు. 78 సంవత్సరాల భారత రాజ్యంగ అమలు తీరుపై సదస్సులో ప్రసంగించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయ్, సహచర అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment