అకాల ముంపు ఆయువు తీసింది. విగతజీవిని మోసుకెళ్లేందుకు సాయం కరువైంది. కనుచూపు మేరలో పడవలు రాక.. గంటల కొద్దీ నీళ్ల మధ్య మృతదేహాలు కనిపిస్తున్నాయి. తమలో ఒకరు దూరమయ్యారనే కన్నీటి ఘోషలో.. అంతిమ సంస్కారం చేయలేక ఆ కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. సోమవారం సింగ్నగర్ ఫ్లైఓవర్ వద్ద థర్మాకోల్ పెట్టెలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఓ మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యమే దీనికి నిదర్శనం.
కనీసం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్, సమీపంలో అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేని అమానవీయ పాలనకు అద్దం పట్టింది. ఓ వృద్ధురాలు మృతిచెంది 12గంటలైనా మృతదేహం పాడైపోతున్నా.. వరద నుంచి బయటకు తీసుకురాలేక మరో కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది.
– సాక్షి బృందం, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment