దైవంతో ఆటలాడటం చంద్రబాబుకు తగదు | - | Sakshi
Sakshi News home page

దైవంతో ఆటలాడటం చంద్రబాబుకు తగదు

Published Sat, Sep 28 2024 1:48 AM | Last Updated on Sat, Sep 28 2024 1:48 AM

దైవంతో ఆటలాడటం  చంద్రబాబుకు తగదు

మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

రైల్వేకోడూరు అర్బన్‌: ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ దేవదేవుడు వెంకటేశ్వరస్వామి. రోజుకు 90 వేల మందికి పైగా దర్శించుకునే ఆరాధ్య దైవంతో రాజకీయ కుట్రలో భాగంగా ఆటలాడటం చంద్రబాబుకు తగదని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం రైల్వేకోడూరులోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ , దైవంతో ఆటలాడటం సబబు కాదని తెలిపారు. ముఖ్యంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాం నుంచి ఎన్నోమార్లు సంప్రదాయబద్దంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆయనపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి 40శాతం పైబడి ఓట్లు వచ్చాయన్న ద్వేషంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరితంగా తన అనుచరులతో విమర్శలు చేయిస్తూ వైఎస్‌ జగన్‌ను ప్రజల్లో తక్కువ చేయాలనే ఉద్దేశంతోనే డిక్లరేషన్‌ వంటి అంశాలు తెచ్చారన్నారు. సీఎం హోదాలో ఉంటూ సున్నితమైన విషయమైనటువంటి తిరుమల లడ్డూ గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కల్తీ జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలే తప్పా మత విద్వే షాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా కులాలకు, మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటున్నారన్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్‌ సిహెచ్‌ రమేష్‌, మందల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement