సచివాలయ ఉద్యోగులకు మనోవేదన | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులకు మనోవేదన

Published Thu, Oct 10 2024 2:46 AM | Last Updated on Thu, Oct 10 2024 2:46 AM

-

చీరాల టౌన్‌: సచివాలయాల ఉద్యోగులకు తిప్పలు వచ్చి పడ్డాయి. కలెక్టర్‌ బదిలీ ఉత్వర్వులు సరిపోవని..ఎమ్మెల్యేల రిఫరెన్స్‌ లెటర్లు తీసుకు రావాలనే విచిత్ర నిబంధనలతో మనో వేదనకు గురవుతున్నారు. మంగళ, బుధవారాల్లో కలెక్టర్‌ ఉత్తర్వులతో గ్రామ సచివాలయాల ఉద్యోగులను బదిలీ చేసి.. రిలీవ్‌ ఆర్డర్లు కూడా అందజేశారు. మండల పరిషత్‌ అధికారులు మాత్రం స్థానిక ఎమ్మెల్యే రిఫరెన్స్‌ లెటర్లు తీసుకురావాల్సిందేనంటూ పేచీ పెట్టారు. సచివాలయాల ఉద్యోగులను విధుల్లోకి చేరనివ్వకుండా మోకాలు అడ్డుపెడుతూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు.

ఇదీ సంగతి..

కూటమి ప్రభుత్వం ఇటీవల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసింది. నియోజకవర్గంలోని చీరాల మండలంలో 22, వేటపాలెం మండలంలో 18 గ్రామ సచివాలయాలున్నాయి. వీటిలో పనిచేస్తున్న వెల్ఫేర్‌, ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లకు కలెక్టర్‌ బదిలీ ఉత్తర్వులు అందించారు. జిల్లా కలెక్టర్‌ రిలీవ్‌ ఆర్డర్లు ఇచ్చి వారికి కేటాయించిన సచివాలయాలకు పంపించారు. అయితే, ఇక్కడే సచివాలయాల ఉద్యోగులకు.. టీడీపీ ముఖ్య నేత ఆర్డర్‌ వ్యవహారం అడ్డు పడింది. సచివాలయాల ఉద్యోగులంతా విధిగా స్థానిక ఎమ్మెల్యే నుంచి రిఫరెన్స్‌ లెటర్‌ తీసుకువస్తేనే విధుల్లో చేర్చుకుంటామని మండల పరిషత్‌ అధికారి ఆదేశాలిచ్చారు దీంతో నివ్వెరపోయిన సచివాలయ ఉద్యోగులు ‘‘మాకేం కర్మ..ఉద్యోగంలో జాయిన్‌ అవ్వడానికి కలెక్టర్‌ ఆర్డర్‌ కంటే ఎమ్మెల్యే రిఫరెన్స్‌ లెటర్‌ తీసుకురావాలా?’’ అని తెల్లమొఖాలు వేశారు. చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో సుమారు 45 మంది సచివాలయాల ఉద్యోగులు పోస్టింగ్‌ల కోసం ఎంపీడీవో కార్యాలయం ముందు ఎదురుచూపులు చూస్తున్నారు.

విధుల్లోకి చేర్చుకోని ఎంపీడీఓలు బదిలీ అయిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇబ్బందులు కలెక్టర్‌ ఉత్వర్వులు చిత్తు కాగితాలేనా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement