షేర్లపై జియో ఫైనాన్స్‌ రుణాలు | Jio Finance launches loan against security offering for customers | Sakshi
Sakshi News home page

షేర్లపై జియో ఫైనాన్స్‌ రుణాలు

Apr 9 2025 2:56 AM | Updated on Apr 9 2025 7:54 AM

Jio Finance launches loan against security offering for customers

రూ. 1 కోటి వరకు రుణం 

9.99 శాతం నుంచి వడ్డీ రేటు

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో భాగమైన నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ జియో ఫైనాన్స్‌ (జేఎఫ్‌ఎల్‌) తాజాగా డిజిటల్‌ విధానంలో సెక్యూరిటీస్‌పై రుణాల (ఎల్‌ఏఎస్‌) విభాగంలోకి ప్రవేశించింది. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లపై తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందడానికి ఈ సాధనం ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రక్రియంతా పూర్తి డిజిటల్‌ రూపంలో పది నిమిషాల్లోనే పూర్తవుతుందని వివరించింది. 

జియోఫైనాన్స్‌ యాప్‌ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీని ద్వారా రూ. 1 కోటి వరకు, గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితికి రుణాలు పొందవచ్చు. వ్యక్తిగత రిస్క్‌ సామర్థ్యాలను బట్టి వడ్డీ రేటు 9.99 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఫోర్‌క్లోజర్‌ చార్జీలు ఉండవు. షేర్లను విక్రయించాల్సిన అవసరం లేకుండా తనఖా పెట్టి, అవసరమైన నిధులను పొందేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని జియో ఫైనాన్స్‌ ఎండీ కుశల్‌ రాయ్‌ తెలిపారు. యూపీఐ చెల్లింపులు, నగదు బదిలీ సర్విసులు, డిజిటల్‌ గోల్డ్‌ మొదలైన వాటిల్లో పెట్టుబడులు తదితర సేవలను కూడా జియోఫైనాన్స్‌ యాప్‌తో పొందవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement