ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టండి | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టండి

Published Tue, May 7 2024 10:15 AM

ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టండి

నిండ్ర : వివక్ష లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టాలని మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌కే రోజా పిలుపునిచ్చారు. సోమవారం నిండ్ర మండలం శ్రీరాంపురం, కావనూరు, నిండ్ర, చవరంబాకం, కేఆర్‌ పురంలో ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. మంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలిచిన తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పకు ఓటేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ దీప, వైస్‌ ఎంపీపీ శుభ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్‌, జిల్లా కార్యదర్శి మేరీ, నగరి నియోజకవర్గ పరిశీలకుడు మధుసూదన్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ వేణురాజు, కో–ఆప్షన్‌ సభ్యుడు అనిల్‌, సర్పంచ్‌ బాబురెడ్డి, ఆర్‌బీకే చైర్మన్‌ వీరయ్య, నేతలు గౌరి, దామోదరం, చంద్రబాబు, బసవయ్య, దినకర్‌, సుబ్రమణ్యం యాదవ్‌, శివలింగాచ్చారి, సంపత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement