జిల్లాలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో అక్షయపాత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం ఆ ట్రస్టు నిర్వాహకులకు నిధులను మంజూరు చేస్తుంది. ట్రస్టు నిర్వాహకులు కార్మికులకు జీతాలు ఇవ్వాలి. ఆ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో అక్కడి కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఫలితంగా అక్షయపాత్ర ట్రస్టుకు సైతం నిధులు ఇవ్వలేదు. నిధులు రాకపోవడం వల్ల అక్షయపాత్ర ట్రస్టు నిర్వాహకులు చేతి నుంచి డబ్బులు ఖర్చు చేయలేక సర్కారు పాఠశాలల విద్యార్థులకు నాసిరకంగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. సీఎం ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment