హస్తినాపురం: స్పా మసాజ్ సెలూన్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకునితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సి.ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పనామా చౌరస్తా దగ్గర ఉన్న ఓ కాంప్లెక్స్లో గ్లోయునిక్స్ సెలూన్ పేరుతో క్రాస్ మసాజ్, స్పా మసాజ్ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యబిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో దాడిచేసినట్లు సి.ఐ తెలిపారు.
రెండు వేర్వేరు గదులలో ఉన్న సాయి కల్యాణ్, ఎడ్ల సుధాకర్లతో పాటు ఇద్దరు యువతులను, నిర్వాహకుడు ఏరుకొండ రవీందర్లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి రూ.1500 నగదు, నాలుగు సెల్ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రాణాలు తీసిన ఈత సరదా
Comments
Please login to add a commentAdd a comment