గుజరాత్ సదస్సులో ఎస్పీ శివకిషోర్
ఏలూరు టౌన్: నేర పరిశోధనల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కీలకపాత్ర పోషించనుందని.. అనుమానితుల గుర్తింపు, దర్యాప్తు వేగవంతానికి ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుజరాత్లోని గాంధీనగర్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో ఎదురయ్యే సవాళ్ళపై ప్రతిష్టాత్మక జాతీయ సదస్సుకు ప్యానెల్ స్పీకర్గా ఎస్పీ హాజరై ప్రసంగించారు. పోలీసుల నేర పరిశోధనలో లీగల్ డాక్యుమెంటేషన్ సిస్టమ్స్, ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీతో నేరస్తుల గుర్తింపులో ఏలూరు జిల్లా పోలీస్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే సాధనాలపై వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment