ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంపై సీఎం రేవంత్ ఆదేశాలతో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మే 23న ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో లక్షలాది రూపాయల విలువైన పరికరంపై గుడ్డ కప్పి ఉండడం చూసి ఏమిటి అని ప్రశ్నించారు. ఇది ఆపారాసిస్ పరికరం అని, కొన్ని నెలల క్రితం ఆస్పత్రికి చేరుకుందని అడిషనల్ ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ఎందుకు అందుబాటులోకి తేలేదని ప్రశ్నించగా ఆస్పత్రిలో సరైన గది లేదని పేర్కొనడంతో ఎమ్మెల్యే నాయిని అవాక్కయ్యారు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసి కమీషన్ల కోసం రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించవద్దని, పరికరాన్ని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కానీ, ఎమ్మెల్యే సందర్శించి నెల రోజులు పూర్తయినా నేటికీ ఆ పరికరాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇలా ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కోట్లాది రూపాయల విలువైన పలు పరికరాలను నిరుపయోగంగా ఉంచడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై నా పరిపాలన అధికారులు స్పందించి ఆపారాసిస్ పరికరాన్ని వినియోగంలోకి తెచ్చి మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎమ్మెల్యే ఆదేశించినా అంతే..
Published Fri, Jun 28 2024 1:28 AM | Last Updated on Fri, Jun 28 2024 1:28 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఆదాయం పెంచాల్సిందే.. ఖజానా నింపేందుకు సంస్కరణలు: సీఎం రేవంత్రెడ్డి
- స్టీల్ ప్లాంట్కు అన్ని విధాలా సహకారం
- రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
- ఇంధన సర్దు‘బాదుడు’కు బ్రేక్ !
- ఇంజనీరింగ్ సీట్లు పెరగవా?
- Kruthika Kumaran: సహజమైన గెలుపు
- ఈవీలపై రోడ్ట్యాక్స్ బాదుడు
- టీడీపీ నేతల నిర్వాకానికి తల్లి, కూతురు బలి
- కేంద్రానికి బ్యాంకుల భారీ డివిడెండ్ @ రూ. 6,481 కోట్లు
- లంచాల బాగోతంలో టీడీపీ కీలక నేత!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment