సామాజిక న్యాయం కోసం బీజేపీని ఓడించాలి | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయం కోసం బీజేపీని ఓడించాలి

Published Tue, May 7 2024 1:00 AM

సామాజిక న్యాయం కోసం బీజేపీని ఓడించాలి

కోరుట్ల: దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కొనసాగాలంటే బీజేపీని ఓడించాలని ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా కోరుట్లలో పర్యటించారు. పట్టణంలోని జువ్వాడి భవన్‌లో మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, సీఎంలను ఐటీ, ఈడీ దాడులతో జైలుపాలు చేస్తోందని విమర్శించారు. దేశాన్ని మతోన్మాదం వైపు నడిపించిన వ్యక్తికి భారతరత్న బిరుదును ఇంటికెళ్లి ఇవ్వడం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. దేశంలో సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ ఎక్కడుందో మోదీ చెప్పాలన్నా రు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ తిరుమల గంగాధర్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

Advertisement
 
Advertisement