రైతుల పక్షపాతిగా పనిచేస్తున్న కాంగ్రెస్
స్టేషన్ఘన్పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పని చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కడియం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ యాకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.25 వేల కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. డిసెంబర్ 9వ తేదీలోపు 42 లక్షల మందికి రూ.31వేల కోట్లు పంటరుణాలు మాఫీ చేసేదిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మ న్ దూదిపాల నరేందర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, డీసీఓ రాజేందర్రెడ్డి, డీఏఓ రామారావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
లింగాలఘణపురంలో..
లింగాలఘణపురం: అర్హులైన ప్రతీఒక్కరికి రుణమాఫీ జరిగి తీరుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని గుమ్మడవెల్లిలో కళ్లెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం చైర్మన్ ఉపేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిస సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గోదావరి జలాలతో మండలంలోని గ్రామాలకు యాసంగికి సాగునీరు అందిస్తామన్నారు. ఆర్డీఓ కొమురయ్య, శివకుమార్, గుడి వంశీధర్రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా కేజీబీవీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సరుకుల నాణ్యతను పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలన్నారు. 6వ తరగతి చదువుతున్న కల్పన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారికి విషేష్ చెప్పి రూ.1000 గిఫ్ట్గా ఇచ్చి అ ప్యాయతగా అక్కున చేర్చుకున్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment