దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Oct 26 2024 1:30 AM | Last Updated on Sat, Oct 26 2024 1:30 AM

దరఖాస

దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో పలు పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కే. రాము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రఘునాథపల్లి, తరిగొప్పుల కేజీబీవీల్లో ఏఎన్‌ఎం ఒక్కక్క పోస్టు ఖాళీ ఉన్నాయని, లింగాలఘణపూర్‌, పాలకుర్తి నర్మెట, తరిగొప్పులలో అకౌంటెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు నవంబర్‌ 5వ తేదీలోపు విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏఎన్‌ఎంకు శిక్షణ సర్టిఫికెట్ల్‌, అకౌంటెంట్‌కు బీకాం కంప్యూటర్‌, బేసిక్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌ సర్టిఫికెట్స్‌ ఉండాలన్నారు.

అధ్యాపక పోస్టులకు..

స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని మైనార్టీ గురుకుల బాలికల కళాశాలలో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ బోధించేందుకు అధ్యాపక పోస్టుకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ అధికారి రవీందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోపు కలెక్టరేట్‌లోని ఎఫ్‌25 కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు. వివరాలకు 9951933034, 9059679793 నంబర్‌లను సంప్రదించాలని కోరారు.

పారా మెడికల్‌ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు..

జనగామ: జనగామ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా 2024–25 విద్యాసంవత్సరంలో పారా మెడికల్‌ డిప్లొమా కోర్సులను ప్రారంభించేందకు ప్రభుత్వం పరిపాలనా అనమతులను జారీ చేసిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోపాల్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌ కోర్సు (రెండేళ్లు), డిప్లొమా ఆప్తాల్మిక్‌ అసిస్టెంటు కోర్సు (రెండేళ్లు)లు మెడికల్‌ కళాశాల అనుబంధంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను ఇంటర్మీడియట్‌ స్థాయిలో బైపీసీ అభ్యసించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.

ఎకై ్సజ్‌ అధికారులను

కదిలించండి

జనగామ: జిల్లాలో గుడుంబా అమ్మకాలు పెరిగిపోతూ, విచ్చలవిడిగా బెల్ట్‌ దుకాణాలు పుట్టుకు వస్తున్నా.. పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న ఆబ్కారీ అధికారులను కదిలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలను జోడిస్తూ జేఏసీ కన్వీనర్‌ మంగళపల్లి రాజు ఎక్స్‌లో సీఎంఓ, సీఎస్‌కు శుక్రవారం పోస్టు చేశారు. వందశాతం గుడుంబా రహిత జిల్లాగా ఉన్న జనగామలో మళ్లీ నాటుసారా వాసన గుప్పుమంటున్నా, ఎకై ్సజ్‌ శాఖ పట్టించుకోవడం లేదని అందులో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో గుడుంబా ఏరులై పారే ప్రమాదం ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దరఖాస్తుల ఆహ్వానం1
1/1

దరఖాస్తుల ఆహ్వానం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement