ఉద్యోగుల కరువు భత్యం విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కరువు భత్యం విడుదల చేయాలి

Published Mon, Oct 28 2024 1:26 AM | Last Updated on Mon, Oct 28 2024 1:26 AM

ఉద్యోగుల కరువు భత్యం విడుదల చేయాలి

ఉద్యోగుల కరువు భత్యం విడుదల చేయాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌/జఫర్‌గఢ్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బకాయి ఉన్న ఆరు విడతల కరువు భత్యాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఘన్‌పూర్‌ డివిజన్‌కేంద్రం, జఫర్‌గఢ్‌ మండలంలోని తిమ్మంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన యూటీఎఫ్‌ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బకాయి ఉన్న ఆరు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతుంటే ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ఒక్క విడత విడుదల చేసి చేతులు దులుపుకోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం యూటీఎఫ్‌ అహర్నిశలు కృషి చేస్తుందని, వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డినే టీఎస్‌యూటీఎఫ్‌ బలపరుస్తుందన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తాడురి సుధాకర్‌, శ్రీనాథ్‌, కోరుకొప్పుల రాజు, పిట్టల మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement