సైక్లింగ్తో ఆరోగ్యం
వరంగల్ క్రైం: ప్రతీ రోజు సైక్లింగ్ చేయడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండి రోజంతా ఉత్సహంగా విధుల్లో రాణించవచ్చని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఏ.జే పెడల్స్, ట్రై సిటీ సైకిల్ రైడర్స్ సంయుక్తంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీని సీపీతోపాటు సెంట్రల్ జోన్ డీసీసీ షేక్ సలీమా ప్రారంభించారు. కమిషనరేట్ నుంచి హన్మకొండ చౌరస్తా, ఎంజీఎం, మట్టేవాడ పోలీస్స్టేషన్ వరకు.. తిరిగి అదే మార్గం నుంచి బాలసముద్రం, నక్కలగుట్ట మీదుగా కమిషనరేట్ చేరుకున్న ఈ ర్యాలీలో యువత, చిన్నారులు, వృద్ధులు, పోలీసులు ఉత్సహంగా పాల్గొన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న సైకిల్ రైడర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు జితేందర్ రెడ్డి, అనంతయ్య, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
● సీపీ అంబర్ కిషోర్ ఝా
Comments
Please login to add a commentAdd a comment