మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తేవాలి
జనగామ రూరల్: పట్టణంలో ఏర్పాటు చేస్తున్న మోడల్ మార్కెట్ను పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. ఆది వారం పట్టణంలోని మైనార్టీకాలనీలో సీపీఎం శాఖ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మార్కెట్ స్థలా న్ని ఆక్రమించుకోవాలని చూస్తే సీపీఎం పోరా టంతో ప్రభుత్వానికి అప్పగించారన్నారు. ప్రస్తుతం మోడల్ మార్కెట్ నిర్మాణానికి పనులు ప్రారంభించగా ఏళ్ల గడుస్తున్న ఇంకా పూర్తి కావడం లేదని అధికారులు, కలెక్టర్ స్పందించి నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. మైనార్టీ కాలనీ వాసులకు పీహెచ్సీ ఏర్పాటు చేసి వైద్యం అందించాలన్నారు. అనంతరం 14 వార్డు శాఖ కార్యదర్శుగా దూసరి నాగమణి, గుగ్గిళ్ల లక్ష్మి, కాంగోరి రేణుక, చింతల శ్రీలత ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జోగు ప్రకాష్, కల్యాణ లింగం, కనకాచారి, యాకన్న, నాగమణి, ఫాతిమా, షబాన, రేణుక, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఫొటో
ముద్రించాలి
జనగామ రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కూతురు, మాజీ పార్లమెంట్ స్పీకర్ మీరా కుమారికి అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆదివారం ఢిల్లీలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించకుండా చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా న్యాయమైన డిమాండ్ సాధనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, సమస్యను పీఎం దృష్టికి తీసుకెళ్తానని మీరాకుమారి హామీ ఇచ్చారని పరశురామ్ తెలిపారు.
శ్రీను ఆత్మహత్య
కారకులను శిక్షించాలి
పాలకుర్తి: శ్రీను నాయక్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ అన్నారు. ఆదివారం పాలకుర్తి బీఆర్ఎస్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును విమర్శించే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. శ్రీను నాయక్ ఫొటో పెట్టి కనీసం సంతాపం తెలుప లేదు, కానీ విమర్శలు చేస్తున్నారన్నారు. శ్రీను నాయక్ ఆత్మహత్య ప్రభుత్వ వైపల్యమేనన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు మహేందర్ నాయక్, వెంకట నాయక్ తదితరులు ఉన్నారు.
ఐఎన్టీయూసీ రాష్ట్ర
ఉపాధ్యక్షుడిగా రాజిరెడ్డి
జనగామ: ఐఎన్టీయూసీ(ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొగుళ్ల రాజిరెడ్డిని నియమిస్తూ ఆ సంస్థ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. జనగామకు చెందిన రాజిరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ జల మండలి, యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, ఐఎన్టీయూసీ స్టేట్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన సంజీవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత, కార్మికుల సంక్షేమం గురించి పని చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment