అతిథి అధ్యాపకుల వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: కళాశాలలు ప్రారంభమై 5 నెలలు గడిచినా.. వేతనాలు లేక అతిథి అధ్యాపకులు అవస్థలు పడుతున్నారని, తక్షణమే వేతనాలు చెల్లించాలని అతిథి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు యాదయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 42 మంది విధులు నిర్వహిస్తున్నారని, చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతుండగా వచ్చే వేతనాలు సకాలంలో రాక కుటుంబాలు గడక అప్పుల పాలు అవుతున్నారన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి అధ్యాపకులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సిందుజా, స్రవంతి, రాజు, ఇస్సాక్, వసీమా, సుల్తానా, సత్యనారాయణ, దేవేందర్, వెంకటేష్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment