న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి

Published Tue, Apr 23 2024 8:20 AM

వినతిపత్రం అందజేస్తున్న బాధిత రైతులు  - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: జంగేడు శివారులో అక్రమంగా భూములను కబ్జాచేసి పట్టాలు చేసుకున్న వారిని తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మండలంలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జంగేడు శివారులోని 1630, 1631, 1632, 1647 సర్వే నంబర్లలోని 14మంది రైతులకు చెందిన 40 ఎకరాల వ్యవసాయ భూమిని మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు, అతని అనుచరులు బొంతల సతీష్‌, మేనం రాజేందర్‌, మాడ ప్రతాప్‌రెడ్డి, వారి బంధువుల పేర్లమీద అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని పేర్కొన్నారు. కొత్త హరిబాబు బెదిరించి 23మంది రైతులతో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకొని భూమిని అక్రమంగా లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలని రైతులు ఉడత రాయమల్లు, రాయలింగు, స్వరూప, జోరు కొమురయ్య, రాజు, లక్ష్మి, భూమయ్య, పెద్ద సమ్మయ్య కోరారు.

Advertisement
Advertisement