కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సబ్బండ వర్గాలకు న్యాయం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సబ్బండ వర్గాలకు న్యాయం

Published Tue, May 7 2024 11:05 AM

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సబ్బండ వర్గాలకు న్యాయం

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి

బాన్సువాడ రూరల్‌: కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిస్తేనే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కొల్లూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలన్నా, రాజ్యాంగ పరిరక్షణ జరగాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం అనివార్యమని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్‌ పార్టీ అని, అలాంటి కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ఉపాధి హామీ కూలీల రోజువారీ కూలి రూ.400కు పెంచుతుందన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్సే

నస్రుల్లాబాద్‌(బాన్సువాడ): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, మాటలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీకి సాటి లేరని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీదర్‌ రెడ్డి అన్నారు. సోమవారం దుర్కి గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. చేయి గుర్తుకు ఓటు వేసి సురేష్‌ షెట్కార్‌ను గెలిపించాలని కోరారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు నందు రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దివిటి శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీటీసీ కుమ్మరి నారాయణ, మాజీ జెడ్పీటీసీ కిషోర్‌ యాదవ్‌, తదితరులున్నారు.

Advertisement
 
Advertisement