బాన్సువాడ : తహసీల్ కార్యాలయంల్లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం బాన్సువాడలో సబ్కలెక్టర్ కిరణ్మయికి కంప్యూటర్ ఆపరేటర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆపరేటర్ సంఘం నేతలు శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ తహసీల్ కార్యాలయాల్లో ఏడు నెలలుగా పెండింగ్లోఉన్న ధరణి ఉద్యోగుల వేతనాలను మంజూరు చేయాలని కోరారు. 2018నుంచి తహసీల్ కార్యాలయాల్లో పనిచేస్తున్నామన్నారు. ఆరేళ్లలో ఏ ఒక్కనెల కూడా జీతాలు సక్రమంగా ఇవ్వలేదని, ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వ ఖజానా ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు ఎండీ ఫిరోజ్, రాజశేఖర్, హన్మంతు, ప్రవీణ్, రమేష్, మధు, గజానంద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment