బాన్సువాడ : బీర్కూర్ మండలం బైరాపూర్, మల్లాపూర్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని శుక్రవారం బాన్సువాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయికి లబ్ధిదారులు వినతి పత్రం అందజేశారు. బైరాపూర్, మల్లాపూర్ గ్రామాల్లో 8 ఏళ్లకిత్రం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారని, అప్పటి నుంచి ఇళ్లల్లోనే నివసిస్తున్న తమకు హక్కు పత్రాలు మాత్రం ఇవ్వలేదన్నారు. అంతకు ముందు లబ్ధిదారులు బీర్కూర్ తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ లతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం బాన్సువాడలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment