కామారెడ్డి క్రైం : జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో చక్కని ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్ధాయిలో సత్తా చాటాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్ధులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజానోత్సవాలను కలెక్టర్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువజనోత్సవాల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సైన్స్ఫేర్, కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చక్కని ప్రదర్శనలు రూపొందించిన విద్యార్ధులను కలెక్టర్ అభినందించారు. అనంతరం బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, డీఈవో రాజు, జిల్లా యువజన అధికారి జగన్నాథ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా సైన్స్ఫేర్ అధికారి సిద్దిరామి రెడ్డి, పలువురు అధికారులు, వివిధ పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రతిభ
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : మండలంలోని భూంపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొని ప్రతిభ చూపారు. చంద్రయాన్ ప్రయోగం వర్కింగ్ మోడల్ను ప్రదర్శించారు. ఈ ప్రయోగాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించి సైన్స్ టీచర్ హైమవతిని, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, లింగం పాల్గొన్నారు.
లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
కామారెడ్డి క్రైం : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీని వాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి అధికారి చందర్ నా యక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, అధికారు లు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment