ధర్మారం(బి) గ్రామంలో విషాదం
డిచ్పల్లి: మండలంలోని ధర్మా రం(బి) గ్రామానికి చెందిన కర్రోళ్ల జయ(35) నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో స్నా నం చేస్తుండగా నీటి ప్రవాహానికి గల్లంతైంది. కుటుంబీకు లు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జయ తల్లి కోటగిరి లక్ష్మి ఇటీవల చనిపోయింది. శుక్రవారం తన తమ్ముడు రవి, అతడి భార్య కృష్ణవేణి వారి పి ల్లలతో కలిసి జయ బాసర గోదావరిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం పుష్కర ఘాట్ వద్ద జయ ముందుగా తమ్ముడి పిల్లలకు స్నానాలు చేయించి వారిని ఒడ్డున కూర్చోబెట్టి నదిలోకి దిగింది. అప్పటికే నదిలో తమ్ముడి భార్య కృష్ణవేణి స్నానం చేస్తోంది. ఇద్దరూ కలిసి స్నానాలు చేస్తుంటే రవి ఒడ్డున ఉండి తన మొబైల్లో వీడియో చిత్రీకరిస్తున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా జయ, కృష్ణవేణి నీటిలో మునుగుతూ కొట్టుకుపోసాగారు. అది చూసి షాక్కు గురైన రవి కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న జాలర్లు వెంటనే ఇద్దరిని కాపాడేందుకు యత్నించారు. కృష్ణవేణిని కాపాడారు కానీ జయ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. జయ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. జయ భర్త గతంలోనే మృతి చెందడంతో తల్లి వద్దే ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే జయ మృతితో ధర్మారం(బి) గ్రామంలో విషాదం నెలకొంది. బాసర పోలీసులు కేసు నమోదు చేసి జయ మృతదేహాం కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment