నస్రుల్లాబాద్(బాన్సువాడ) : మండల రైతులకు పురుగు మందులు పిచికారి చేసే డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తహసీల్దార్ బావయ్య అన్నారు. పురుగు మందులను డ్రోన్ల ద్వారా చేయడం వలన సమయం, ఖర్చు, తగ్గుతుందన్నారు. అందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన ఫర్టిలైజర్ దుకాణ దారులను అభినందించారు. మాజి సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్ తదితరులున్నారు.
బస్టాండ్ను
అందుబాటులోకి తెస్తాం
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : ఎల్లారెడ్డి బస్టాండ్ను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి బస్టాండ్ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం బస్టాండ్ నిర్మాణానికి నిధులు కేటాయించినా విడుదల కాలేదన్నారు. తన సహకారంతో బస్టాండ్ నిర్మాణానికి 2.5 కోట్ల నిధులను మంజూరు చేయించానన్నారు. త్వరలోనే బస్టాండ్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఎల్లారెడ్డి సివిల్ సప్లయ్ గోదాముల తనిఖీ
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : ఎల్లారెడ్డి సివిల్ సప్లయ్ గోదాంను సివిల్ సప్లై డీఎం రాజేందర్ శుక్రవారం తనిఖీ చేశారు. గోదాంలోని రికార్డులను, స్టాక్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేషన్ దుకాణాల ద్వారా గత నెలలో బియ్యం సక్రమంగా రాలేదని వచ్చిన ఫిర్యాదు మేరకు బియ్యంను పరిశీలించామన్నారు. ఇకనుంచి బియ్యం సక్రమంగా సరఫరా చేస్తామన్నారు. రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం రవాణా చేయా లని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీటీ సురేష్, సిబ్బంది తదితరులున్నారు.
ఘనంగా ఊర పండుగ
బాన్సువాడ రూరల్ : మండలంలోని బోర్లంలో శుక్రవారం ఊరపండుగను కులసంఘాల ఆ ధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. గ్రామపెద్దలు బసిరెడ్డి హన్మంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దే వేందర్రెడ్డి, నర్సింహులు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment