తాడ్వాయి: ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలో కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముగింపునకు వచ్చినా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. రైతు బంధుకు సంబంధించిన నిధులను రుణమాఫీకి వాడుకున్నారని ఆరోపించారు. వెంటనే రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులకు అన్యాయం చేస్తోందని సురేందర్ ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వా లని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఇవ్వకపోయినా, రైతులందరి రుణాలను మాఫీ చేయకపోయినా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తాడ్వాయి ఏఎస్సై సంజీవులు సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి, రాస్తారోకోను విరమింపజేశారు. ఆందోళనలో సింగిల్విండో చైర్మన్ కపిల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయిరెడ్డి, ముదాం నర్సింలు, రవీందర్రెడ్డి, మంగారెడ్డి, రాజుగౌడ్, ధర్మారెడ్డి, వెంకట్రాంరెడ్డి, తాడ్వాయి, రాజంపేట్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సురేందర్ డిమాండ్
తాడ్వాయిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
రాస్తారోకో
Comments
Please login to add a commentAdd a comment