కామారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(టీఎస్పీటీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దుబాసి నరేందర్, ప్రధాన కార్యదర్శిగా లింబాద్రి, గౌరవ అధ్యక్షుడిగా అనిల్ పటేల్, ఉపాధ్యక్షులుగా విజయ్, సంగయ్య, కార్యదర్శిగా శ్రీను, కార్యవర్గ సభ్యులుగా సతీష్, శ్యాంరావు, యేసురత్నం, మోహన్, సుధారాణిలను ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు అన్నారు.
ట్రాక్టర్స్ యూనియన్ కార్యవర్గం
రాజంపేట: మండల కేంద్రంలో ట్రాక్టర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఆంద్యాల రమే ష్, అధ్యక్షుగాగా కట్లెకుంట్ల సిద్ధరాములు, ఉపాధ్యక్షుడిగా సల్ల నవీన్, కోశాధికారిగా ఆకుల రాజు, సహాయ కోశాధికారిగా ఇమ్రాన్ అలీ, సలహాదారులుగా బోయిని ఆంజనేయులు, పిట్ల నర్సింలు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment