ప్రతి ఇంటా బీజేపీ సభ్యత్వం చేయించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటా బీజేపీ సభ్యత్వం చేయించాలి

Published Mon, Oct 21 2024 2:14 AM | Last Updated on Mon, Oct 21 2024 2:14 AM

ప్రతి ఇంటా బీజేపీ సభ్యత్వం చేయించాలి

కామారెడ్డి టౌన్‌: నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి బీజేపీ సభ్యత్వం చేయించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద మంది ప్రాథమిక సభ్యత్వం చేస్తేనే క్రియాశీల సభ్యత్వానికి అర్హులని అన్నారు. ప్రతి బూత్‌కి వంద మంది చొప్పున సభ్యత్వం తప్పనిసరి చేయాలని ఆదేశించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండో దశకి పూర్తి కావస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోదీ సుపరిపాలన ప్రజలకు వివరించి జాతీయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరితో సభ్యత్వం చేయించాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ కుంట లక్ష్మారెడ్డి, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్‌, నాయకులు శ్రీధర్‌, రమేష్‌, రంజిత్‌, సురేష్‌, అనిల్‌, ఆనందరావు, రవీందర్‌, రఘు, రజినీకాంత్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కేవీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement