ఉసురు తీసిన అనుమానం ● | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన అనుమానం ●

Published Mon, Sep 9 2024 1:18 AM | Last Updated on Mon, Sep 9 2024 1:18 AM

ఉసురు తీసిన అనుమానం ●

భార్యను హతమార్చిన భర్త

హొసపేటె: అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తర కర్ణాటక కొప్పళ జిల్లా అరకేరి గ్రామంలో చోటు చేసుకుంది. అంతేకాదు.. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు అర్థరాత్రి మృతదేహాన్ని తగుల బెట్టాడు. తాలూకాలోని అరకేరి గ్రామానికి చెందిన దేవరెడ్డప్ప, శీలా దంపతులు. సంతానం లేకపోవడంతో పాటు తరచూ భార్యను అనుమానించేవాడు. ఈనెల 7న ఇదే విషయంపై భార్యను తీవ్రంగా కొట్టాడు. కర్రతో బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి హత్య విషయాన్ని కప్పిపుచ్చి మృతురాలి తండ్రి, తల్లికి మాయమాటలు చెప్పి హడావుడిగా మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లి కాల్చేశారు. ఈ విషయంపై మృతురాలి అన్న అనుమానంతో కుకునూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడు దేవరెడ్డప్పతో పాటు అతని తండ్రిని అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement