రథోత్సవంలో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

రథోత్సవంలో అపశ్రుతి

Published Mon, Sep 9 2024 1:18 AM | Last Updated on Mon, Sep 9 2024 1:18 AM

రథోత్సవంలో అపశ్రుతి

సాక్షి,బళ్లారిః విజయపుర జిల్లా దేవరహిప్పరగిరి తాలూకా బిబి ఇంగళగి గ్రామంలో గురు సిద్దేశ్వర జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథం లాగే సమయంలో దేవేంద్ర బడిగేర్‌ (24) అనే యువకుడు రథం చక్రాలు కిందపడి తీవ్ర గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వేడుకగా నిమజ్జనం

కోలారు : నగరంలో ఆదివారం పలు కాలనీలలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు నగరంలో వినాయక విగ్రహాలను ఊరేగించారు. అనంతరం నగర సమీపంలోని కోలారమ్మ చెరువు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటికుంటలో విగ్రహాలను నిమజ్జనం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement