రాయచూరు రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ఉపాధ్యాయులు పునాది కావాలని మంత్రి బోసురాజు అన్నారు. ఆదివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో సంకుల కళా సంస్థ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లల సంక్షేమ కోసం పాటు పడాలని, అప్పుడు ఉత్తమ సమాజం నిర్మాణమవుతున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మారుతి, అక్షర సంత అధ్యక్షుడు హరకేళ హజ్జబ్బ, నటి రజనీ, కార్యదర్శ రేఖ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
హొసపేటె: శ్రీ గజానన్ సేవా సమితి వార్షికోత్సవం సందర్భంగా సంతే మార్కెట్ మైదాన్ కమాల్పూర్, బళ్లారి మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ బళ్లారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత రక్తదానం చేశారు. వైద్యాధికారులు, సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment