రాయచూరు రూరల్: జిల్లాలోని సాంఘీక, వెనుక బడిన వర్గాల సంక్షేమ శాఖ ఆధీనంలోని హాస్టల్ సమస్యలపై అధికారులు స్పందించడంర లేదని భారత విప్లవాత్మక యువజన సంఘం అధ్యక్షుడు అజీజ్ ఆరోపించారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. శాఖలో అధికారులు, వార్డెన్లు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హాస్టళ్లలో భోజనం సక్రమంగా, నాణ్యతగా లేదన్నారు. అపరిశుభ్రతతో కూడుకొని ఉంటోందన్నారు. హాస్టల్లో అక్రమంగా ఇతర ప్రాంతాల విద్యార్థులు తలదాచుకుంటున్నారన్నారు. హాస్టల్లో విధులు నిర్వహించిన సేవకులకు ఇంతవరకు పారితోషికం చెల్లించక పోవడాన్ని ఖండించారు. సేవా భద్రత లేదని, పీఎఫ్, జీపీఎఫ్లు చెల్లించాలన్నారు. త్వరిత గతిన బకాయి వేతనాలు, గౌరవ ధనాన్ని మంజూరు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment