బనశంకరి: భక్తుల మొక్కులు తీర్చే కల్పవల్లిగా పూజలందుకునే బనశంకరీ దేవి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్.. బనశంకరీదేవి మూలవిరాట్కు విశేష అర్చనలు, అభిషేకం చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారికి దీపారాధన చేసి పూజించారు.
చెన్నపట్టణ జేడీఎస్దే: యడ్డి
శివాజీనగర: చెన్నపట్టణ జేడీఎస్ నియోజకవర్గం. వారికి ఎవరు కావాలో వారు పేరు ప్రకటిస్తారని బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. ఆదివారం బెంగళూరులో నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చెన్నపట్టణలో జేడీఎస్ వారి అభ్యర్థిని ప్రకటిస్తారు. చెన్నపట్టణలో జేడీఎస్ పోటీ చేస్తుందని మా నేత అమిత్ షా చెప్పారన్నారు. రెండు పార్టీలు కలసి మూడు నియోజకవర్గాల్లో గెలుపొందాలని తీర్మానం చేశామన్నారు. సీపీ యోగేశ్వర్ భవితవ్యం గురించి హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. జేడీఎస్ గుర్తుతో బీజేపీవారు పోటీ చేసే యోచన లేదన్నారు. యడ్డి మాటలతో చెన్నపట్టణ టికెట్ జేడీఎస్దేనని తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment