మంత్రాలయం.. భక్తజనసంద్రం | Sakshi
Sakshi News home page

మంత్రాలయం.. భక్తజనసంద్రం

Published Fri, May 24 2024 10:20 AM

మంత్రాలయం.. భక్తజనసంద్రం

శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల కోలాహలం

మంత్రాలయం: ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం భక్తులతో పోటెత్తింది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు. వేసవి సెలవులు కలిసి రావడం, రాఘవేంద్రుల ప్రత్యే క దినం గురువారం కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి మూల బృందావన దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. తుంగాతీరం, కారిడార్‌, శ్రీమఠం ప్రాంగణం, ప్రధాన దారులు భక్తులతో కోలాహలంగా మారాయి. రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణభోజన శాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తుల తాకిడితో కిక్కిరిశాయి. వసతి నిలయాలు, ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లు సందడిగా మారాయి. మఠం మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, ఐపీ నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement