సౌండ్ చేస్తే ఇంతే!
సైలెన్సర్లను రోడ్డ్డు రోలర్తో తొక్కిస్తున్న ఎస్పీ బిందుమాధవ్
వాహనదారులు ధ్వని కాలుష్యానికి పాల్పడితే సహించేది లేదంటూ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు. అధిక శబ్దం చేసే బైక్ల సైలెన్సర్లను గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు ఎదుట రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పద్ధతిలో అధిక శబ్దాలు చేస్తున్న వాహనాలను గుర్తించి 50 సైలెన్సర్లను సీజ్ చేశారన్నారు. భారీ సౌండ్ చేసే సైలెన్సర్లను విక్రయించే దుకాణ యజమానులు, వాటిని అమర్చే మెకానిక్లపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు మన్సురుద్దీన్, నాగరాజురావు, రామయ్య నాయుడు, మురళీధర్రెడ్డి పాల్గొన్నారు. – కర్నూలు (టౌన్)
● 110 బైక్ సైలెన్సర్లు ధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment