డీఈఓగా శామ్యూల్ పాల్
కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎస్.శామ్యూల్ పాల్ను నియమిస్తూ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఈఓగా పని చేస్తున్న కాగిత శామ్యూల్ను పాఠశాల విద్య డైరెక్టరేట్లో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో ఉంది. కర్నూలు డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్–1గా పని చేస్తున్న శ్యామూల్ పాల్ విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్గా ప్రస్థానం మొదలైంది. విధి నిర్వహణలో నికచ్చిగా ఉంటూ పలుమార్లు ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై గతేడాది ఢిల్లీలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఈయన ఇచ్చిన ప్రజెంటేషన్కు జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. వివాద రహితుడుగా గుర్తింపు ఉన్న అధికారికి ప్రభుత్వం డీఈఓగా బాధ్యతలు అప్పగించడంపై ప లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీ అయిన డీఈఓ కె.శామ్యూల్ వైఎస్ఆర్ జిల్లా పాఠశాల విద్య ప్రాంతీయ కార్యాలయ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఈఓ బదిలీల్లో భాగంగా డైరెక్టరేట్లో రిపోర్ట్ చేసుకున్న తరువాత వైఎస్ఆర్ జిల్లా డీఈఓగా నియమిస్తూ, ఆర్జేడీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment