![ఇంకుడుగుంతను పరిశీలిస్తున్న డీపీఓ - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/6/05drk353-330156_mr.jpg.webp?itok=dk-5cuWs)
ఇంకుడుగుంతను పరిశీలిస్తున్న డీపీఓ
చిన్నగూడూరు: గ్రామాల్లో ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని డీపీఓ (డిప్యూటీ సీఈఓ) నర్మద తెలిపారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి గ్రా మ పంచాయతీని సందర్శించారు. జీపీలోని రికార్డులు, జీపీ ఆవరణలోని ఇంకుడుగుంతను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తాచెదారాన్ని జీపీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. గ్రామంలో పారి శుద్ధ్యంపై దృష్టి సారించాలని పంచాయతీ సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యాంసుందర్, మండల ప్రత్యేకాధికారి విజయ్ కుమార్, ఎంపీఓ యాకయ్య, జీపీ కార్యదర్శులు సోమన్న, స్వరూప తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment