ఫార్మసిస్ట్‌లకు త్వరలోనే మంచి వేతనాలు | Sakshi
Sakshi News home page

ఫార్మసిస్ట్‌లకు త్వరలోనే మంచి వేతనాలు

Published Tue, May 7 2024 6:45 AM

-

ఎంజీఎం: ఫార్మసిస్టులకు త్వరలోనే మంచి వేతనాలు అందుతాయని తెలంగాణ గవర్నమెంట్‌ ఫార్మసిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్‌ అన్నారు. సోమవారం సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందకట్ల శరత్‌బాబు అధ్యక్షతన డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగిన హనుమకొండ, వరంగల్‌ జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 ఏళ్లుగా పీఆర్‌సీలలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌లకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్హతలు, విధులను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని పీఆర్‌సీ కమిటీ విన్నవించామని, దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం సుదర్శన్‌గౌడ్‌ను సన్మానించారు. సమావేశంలో సంఘం వరంగల్‌ జిల్లా అధ్యక్షులు దేవంభట్ల ప్రకాశ్‌రావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అవినాష్‌, నాయకులు నార్ల వేణు, సూరయ్య, విజయలక్ష్మి, ఝాన్సీలక్ష్మి, శ్రీదేవి, సునీత పాల్గొన్నారు.

Advertisement
Advertisement