ముందస్తు మొక్కులు | - | Sakshi
Sakshi News home page

ముందస్తు మొక్కులు

Published Mon, Feb 3 2025 1:40 AM | Last Updated on Mon, Feb 3 2025 1:40 AM

-

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు ఇంకా 10 రోజులే ఉంది. వనదేవతలను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వాహనాల్లో మేడారం చేరుకున్నారు. జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్‌ల కింద స్నానాలు చేసి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పూజలు చేసి కానుకలు సమర్పించారు. ఒక్కరోజే సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. దేవాదాయ శాఖ ఈఓ రాజేంద్రం భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు.

మొదలైన భక్తుల తాకిడి

ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు పూజారులు మినీజాతర నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా వనదేవత దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఎస్పీ శబరీష్‌ ఆదేశాల మేరకు పస్రా సీఐ రవీందర్‌, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యాన భారీ బందోబస్తు నిర్వహించారు.

మేడారంలో వైద్య సేవలు

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు ఆదేశాల మేరకు మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. ఆదివారం శిబిరాన్ని తాడ్వాయి పీహెచ్‌ఏసీ వైద్యాధికారి ఆడెపు చిరంజీవి సందర్శించారు. భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర కేసులుంటే తాడ్వాయి పీహెచ్‌సీకి రెఫర్‌ చేయాలని సూచించారు. డీపీఎంఓ సంజీవరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

పకడ్బందీగా

పోలీసుల బందోబస్తు

ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈఓ రాజేంద్రం

మేడారానికి తరలివచ్చిన భక్తులు

గంటల మోతతో మార్మోగిన గద్దెల ప్రాంగణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement