భారీగా నగదు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

భారీగా నగదు సీజ్‌

Published Fri, Nov 3 2023 1:44 AM | Last Updated on Fri, Nov 3 2023 10:18 AM

- - Sakshi

చేగుంట చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన నగదుతో పోలీసులు

గద్వాల క్రైం: జిల్లావ్యాప్తంగా గురువారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.3,22,500 నగదును గుర్తించి సీజ్‌ చేసినట్లు ఎస్పీ రితిరాజ్‌ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలికూడదని తెలిపారు.

వనపర్తి: జిల్లావ్యాప్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.4 లక్షల నగదు, 9 లీటర్ల మద్యం, 51 కేజీల నల్లబెల్లం పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్పీ రక్షితా కె.మూర్తి వెల్లడించారు. పెద్దమందడి మండలం వెల్టూరు చెక్‌పోస్టు వద్ద రూ. 4లక్షల నగదు, ఖిల్లాఘనపురంలో 9 లీటర్ల మద్యం, వనపర్తి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 51 కేజీల నల్లబెల్లం పట్టుబడినట్లు తెలిపారు.

జడ్చర్ల: పట్టణంలోని క్లబ్‌ రోడ్డులో తరలిస్తున్న రూ.9లక్షల నగదును పట్టుకుని సీజ్‌ చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. బ్యాంకులో డ్రా చేసిన నగదును బాదేపల్లికి చెందిన వంశీధర్‌రెడ్డి తన వాహనంలో తరలిస్తుండగా, పట్టుకుని ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

కృష్ణా: మండలంలోని చేగుంట చెక్‌పోస్టు వద్ద రూ.2,47,479 నగదును పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ విజయభాస్కర్‌ తెలిపారు. రాయచూర్‌ నుంచి గుర్మిట్‌కల్‌కు నీలకంఠ పాటిల్‌ అనే వ్యక్తి నగదును తరలిస్తుండగా, పట్టుకుని నారాయణపేట్‌ గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు.

మాగనూర్‌: మరికల్‌ మండలం మాదారం గ్రామానికి చెందిన ఉప్పు రాము తన వాహనంలో రూ.లక్ష 40వేలు తరలిస్తుండగా, మాగనూర్‌లో పట్టుకున్నట్లు ఎస్‌ఐ మల్లేష్‌ తెలిపారు.

ఊట్కూర్‌: పగిడిమారికి చెందిన వెంకటేష్‌ తన వాహనంలో రూ.లక్ష నగదు తరలిస్తుండగా, మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ గోకారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement