Election News
-
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది: Kishan Reddy
-
అధికార మదంతో రెచ్చిపోతున్నారు టీడీపీపై యనమల కృష్ణుడు ఫైర్
-
పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓటమి పాలయినప్పటి నుంచి ఆయన భవిష్యత్ కార్యాచరణపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఈ ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్ పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చెక్ పెట్టారు. ఇవన్నీ ఊహాగానాలేనని, కేవలం నిరాధార వార్తలేనని, వాటిలో ఎటువంటి నిజం లేదని కొట్టిపడేశారు. ఫిబ్రవరి 8న వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలు దక్కించుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్తో పాటు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఓటమిపాలయ్యారు. ఈ నేపధ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేత రాజీనామా చేయించి, ఆ రాష్ట్రానికి సీఎం అవుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇది కూడా చదవండి: Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్తో పరుగు ఖాయం -
వైఎస్ఆర్ సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
-
కాకినాడ జిల్లా తునిలో పరాకాష్టకు చేరిన టీడీపీ దౌర్జన్యం
-
మరోసారి తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
-
మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయం
-
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అతిషి రియాక్షన్
-
ఢిల్లీలో బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీ! కేటీఆర్ అదిరిపోయే సెటైర్
-
కాంగ్రెస్ సృష్టించిన భస్మాసురుడు కేజీవాల్
-
Delhi Election Results 2025: ఆ రెండు కారణాలే AAP ను కొంపముంచింది
-
బీజేపీ ఖాతాలోకే మిల్కిపూర్?
యూపీలోని అయోధ్య పరిధిలోగల మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఆధిక్యాన్ని సాధించింది. ఎన్నికల సంఘం అందించిన డేటా ప్రకారం బీజేపీ 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో అందరి దృష్టి ఈ సీటుపైనే ఉంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అవధేష్ ప్రసాద్ ఎంపీ అయిన తర్వాత ఈ సీటు ఖాళీ అయింది. ఈ సీటు కోసం సమాజ్వాదీ పార్టీ, బిజెపి మధ్య గట్టి పోటీ నెలకొంది. సమాజ్వాదీ పార్టీ అజిత్ ప్రసాద్ను బరిలోకి దింపగా, బీజేపీ చంద్రభాను పాస్వాన్ను ఎన్నికల్లో నిలబెట్టింది.అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉన్నారు . ఉప ఎన్నికల్లో 10 మంది ఎన్నికల బరిలో దిగారు. కాగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఎస్పీ నిరాకరించింది. మిల్కిపూర్ అసెంబ్లీ స్థానం రిజర్వ్డ్ సీటు. ఈ స్థానంలో పెద్ద సంఖ్యలో దళిత ఓటర్లు ఉన్నారు. వారు మద్దతు ఇచ్చే పార్టీ గెలవడం దాదాపు ఖాయమనే అంచనాలున్నాయి. -
ఈ రోడ్లో డీఎంకే ముందంజ
ఈ రోడ్: తమిళనాడులోని ఈ రోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ ఓట్లు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలోని ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ ముందంజలో ఉన్నారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 51 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ స్థానం 20028లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పడింది. అప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఏడుపార్లు ఎన్నికలు జరిగాయి, వాటిలో మూడు లోక్సభ ఎన్నికలు కాగా 2023 ఫిబ్రవరిలో ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్ పార్లమెంటరీ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్ 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలన్నింటిలోనూ ఏఐడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. 2016 డిసెంబర్లో పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాతే అన్నాడీఎంకే పరాజయాలను ఎదుర్కొంటూ వస్తోంది. ఇక డీఎంకే విషయానికొస్తే, ఆ పార్టీ 2011, 2016లో రెండుసార్లు ఆ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థి వీసీ చంద్రకుమార్ 2011లో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే ఈరోడ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
మిల్కిపూర్లో బీజేపీ ముందంజ
ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు (ఫిబ్రవరి 8) జరుగుతోంది. తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి చెందిన చంద్రభాన్ పాశ్వాన్ ముందంజలో ఉన్నారు. ఈ సీటును గెలుచుకునేందుకు అటు బీజేపీ, ఎస్పీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ సీటు గెలుపు బాధ్యతను సీఎం యోగి ఆదిత్యనాథ్ తన భుజస్కందాలపై వేసుకున్నారు.ఎస్పీకి చెందిన అజిత్ ప్రసాద్, బీజేపీకి చెందిన చంద్రభాన్ పాస్వాన్ సహా 10 మంది అభ్యర్థులు మిల్కిపూర్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాశ్వాన్ ముందంజలో ఉన్నారు. ప్రారంభ ట్రెండ్స్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ కౌంటింగ్కు ముందు పార్టీ నేతలకు, ఏజెంట్లకు హల్వా అందించారు.ఇంతలో ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ విజయ నినాదం చేశారు. మిల్కీపూర్ చరిత్ర సృష్టించబోతోందని, ఎస్పీ అభ్యర్థి 35 వేల ఓట్ల తేడాతో గెలుస్తారన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు చంద్రభాన్ పాస్వాన్ తన ఇంట్లో పూజలు నిర్వహించారు. మిల్కిపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. ఉదయం 10 గంటల నుండి ట్రెండ్స్ రావడం ప్రారంభంకానుంది. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 30 రౌండ్లలో పూర్తవుతుంది. 76 మంది ఉద్యోగులతో కూడిన 19 పార్టీలు ఓట్ల లెక్కింపు కోసం పనిచేస్తున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష -
భూమనను పట్టుకొని ఏడ్చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు
-
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను బెదిరించే ప్రయత్నం చేసిన టీడీపీ గూండాలు
-
ఇవాళ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు
-
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
chandigarh: మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
చండీగఢ్: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. బీజేపీకి చెందిన హర్ప్రీత్ కౌర్ బాబ్లా మేయర్గా ఎన్నికయ్యారు. ఈ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా క్రాస్ ఓటింగ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు మొత్తంగా 17 ఓట్లు వచ్చాయి. మొత్తం 36 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ పార్టీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు క్రాస్ ఓట్ చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 13, కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 6. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చండీగఢ్ మేయర్ ఎన్నికల(Chandigarh Mayoral Election) కేసులో సుప్రీంకోర్టు పంజాబ్- హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జైశ్రీ ఠాకూర్ను స్వతంత్ర పరిశీలకునిగా నియమించింది. ఈసారి చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూస్తామని ఆ సమయంలో కోర్టు చెప్పింది.గత ఏడాది ఫిబ్రవరి 20న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు కీలక తీసుకుంది. నాడు సుప్రీంకోర్టు(Supreme Court) ఓట్ల లెక్కింపును తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యేవిగా ప్రకటించారు. బ్యాలెట్ పత్రాలను పరిశీలించి, వీడియో చూసిన తర్వాత ఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ను మందలించి, షోకాజ్ నోటీసు జారీ చేశారు.ఇది కూడా చదవండి: ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్ సందేహం -
Delhi Assembly Election: కేంద్రం ముందు 7 డిమాండ్లు పెట్టిన కేజ్రివాల్
-
ఢిల్లీ ప్రజలపై బీజేపీ హామీల వర్షం
-
ట్రంప్ను ఓడించేవాడిని: బైడెన్ పశ్చాత్తాపం
వాషింగ్టన్: ఇలీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై అధ్యక్షుడు జోబైడెన్ పశ్చాత్తాపపడ్డారు. నాడు తాను తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి చెందారు. మీడియా సమావేశంలో అధ్యక్షుడు బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో తాను పోటీ చేసి ఉంటే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను తప్పకుండా ఓడించేవాడినన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో అధ్యక్షుడు బైడెన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ ‘ఎన్నికల్లో పోటీ చేయకూడదని మీరు నిర్ణయించుకున్నందున, అది ట్రంప్కు మళ్లీ అధికారం అప్పగించడంలో సహాయపడిందని, ఇటువంటి భావన మీకు కలిగిందా? అని అడిగారు. దీనికి బైడెన్ సమాధానమిస్తూ ‘నేను పూర్తిగా అలా అనుకోవడం లేదని, కానీ నేను గనుక పోటీ చేసి ఉంటే, ట్రంప్ను కచ్చితంగా ఓడించేవాడిననే నమ్మకం నాకు ఉంది’ అని అన్నారు. JUST IN: President Biden says he could have and would have won the 2024 election, says Kamala Harris could have and would have won too.Someone should tell him that Kamala did in fact run and did not win."I would have beaten Trump, could have beaten Trump, and I think that… pic.twitter.com/7oOWeSJ2hs— Collin Rugg (@CollinRugg) January 10, 2025డొనాల్డ్ ట్రంప్ను ఓడించే విషయంలో కమలా హారిస్ (Kamala Harris) కూడా సమర్థురాలని బైడెన్ పేర్కొన్నారు. ఆమె అద్భుతంగా పని చేస్తారని, అందుకే ఆమె ట్రంప్ను ఓడించగలరనే నమ్మకం తనకు కలిగిందని, అటువంటి నమ్మకంతోనే ఆమెకు మద్దతునిచ్చానని బైడెన్ పేర్కొన్నారు. అయితే డెమోక్రటిక్ పార్టీ(Democratic Party)లో ఐక్యత కోసమే తాను పోటీ నుంచి తప్పుకున్నాట్లు బైడెన్ తెలిపారు.బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించినప్పటికీ ఆరోగ్య సమస్యలు, సొంత పార్టీ లోని వ్యతిరేకత రావడంతో పోటీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం తమ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్కు మద్దతు ప్రకటించారు. నిరంకుశత్వం కంటే దేశం గొప్పదని బైడెన్ వ్యాఖ్యానించారు. కమలా హ్యారిస్ 2028లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా మళ్లి పోటీ చేస్తారని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: మదురో అరెస్టుకు ఆధారాలందించండి: బైడెన్ -
ఫిబ్రవరి 15తో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ
-
నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే
దేశరాజధాని డిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు తొలుత రూ. 1,000, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 2,100 ఇస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఎన్నికలకు ముందు మహిళలను ఆకట్టుకునేందుకు ఇలాంటి పథకాలను ప్రారంభించిన నాల్గవ రాష్ట్రం ఢిల్లీ. ప్రస్తుతం ఈ పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఎన్నికల్లో విజయానికి..మహిళలకు ప్రతినెలా ఆర్థికసాయం(Financial assistance) అందించే పథకాలు ఇటీవలి కాలంలో ఎన్నికల్లో గెలుపొందడానికి ఉపకరిస్తున్నాయని నిరూపితమయ్యింది. మధ్యప్రదేశ్లో ఎన్నికలకు ముందు బీజేపీ నేత శివరాజ్ ఈ పథకాన్ని ప్రారంభించి, బీజేపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడంలో విజయం సాధించారు. ఇదేవిధంగా మహారాష్ట్రలోని ఏకనాథ్ షిండే ఇదే పథకం ఆధారంగా మహాయుతి కూటమికి మెజారిటీని అందించారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ కూడా మయ్యా సమ్మాన్ పథకం ఆధారంగా వరుసగా రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా..మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలలో మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పథకాలు ఒకేలా కనిపించినప్పటికీ వీటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. ప్రధాన వ్యత్యాసం ఆయా రాష్ట్రాల్లోని మహిళలు స్వీకరించే నగదు మొత్తం. మరొకటి వారి వయసు. ఈ నాలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలలో తేడాను ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో లాడ్లీ బహన్ యోజన కింద తొలుత మహిళలకు ప్రతినెలా రూ.1,000 ఇవ్వగా, ఇప్పుడు రూ.1,250 అందజేస్తున్నారు. మహారాష్ట్రలో ఇదే పథకం కింద మహిళలకు రూ.1,500 ఇస్తున్నారు. జార్ఖండ్లో ఈ తరహా పథకంలో మహిళలకు తొలుత రూ.1,000, తర్వాత రూ.2,500 అందజేస్తున్నారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్(Kejriwal) ఇదే హామీనిచ్చారు.ఏ రాష్ట్రంలో ఎంతమొత్తం?మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav) రాష్ట్రంలోని మహిళలకు ప్రతినెలా రూ.5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. కాగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మొదటి విడతగా రూ.1,000 అందించగా, మహారాష్ట్రలో మొదటి విడతగా రూ.1,500 అందించారు. ఢిల్లీలో ఈ పథకంపై ఇంకా చర్చ నడుస్తోంది. జార్ఖండ్లో ఎన్నికల అనంతరం ఈ మొత్తాన్ని రూ.2,500కు పెంచారు. మధ్యప్రదేశ్లో ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో లాడ్లీ బహన్ యోజనలో మహిళల వయోపరిమితి 21 నుంచి 60 ఏళ్లుగా ఉంది. జార్ఖండ్లో 21నుంచి 49 ఏళ్ల వయస్సు గల మహిళలు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు.ఢిల్లీలో చర్చనీయాంశంగా..ఢిల్లీలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతినెలా ఆర్ధికసాయం అందజేయనున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్లలోని ప్రభుత్వ శాఖలు ఈ పథకాలను నోటిఫై చేశాయి. అర్హులైన మహిళలు ఇప్పటికీ ఈ పథకం అందించే ప్రయోజనాలను పొందుతున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అర్హులైన మహిళల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇంతలో ఈ పథకానికి సంబంధించి వెలువడిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే.. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
-
నీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నేతల మధ్య ఘర్షణ
-
దేవినేని ఉమా, ఎమ్మెల్యే వసంత కృష్ణ వర్గీయులు రచ్చ రచ్చ
-
ఎన్నికల షెడ్యూల్ రాకుండానే ఢిల్లీలో ఆప్ దూకుడు
-
మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్..?
-
జమిలికి జై!.. 2027 లోనే ఎన్నికలు
-
YS Jagan: చేయి చేయి కలిపి కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిద్దాం
-
ఎంత మంది చెప్పినా ఆ పని చేయలేదు …….. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
AP: టీచర్ MLC ఎన్నికల పోలింగ్
-
వచ్చే ఎన్నికల్లో.. టీడీపీకి సింగిల్ డిజిట్
-
వైఎస్ జగన్ గూస్బంప్స్ స్పీచ్
-
దేవుడి దయతో గొప్ప విజయాన్ని చవిచూశాం: YS Jagan
-
YS Jagan: ఈసారి దెబ్బ ఎలా ఉండాలంటే..?
-
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ
-
జార్ఖండ్ మ్యాజిక్ చేసిన JMM
-
పెద్దిరెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్
-
PAC పదవిలో కూడా రాజకీయమా? కూటమి నిర్ణయంపై ఎమ్మెల్యే చంద్రశేఖర్
-
పీఏసీ ఎన్నికల విషయంలో YSRCP కీలక నిర్ణయం
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: వారికే ‘ఆప్’ టిక్కెట్లు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశంలోని మహారాష్ట్ర, జార్ఖండ్లలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదే తరుణంలో ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. 2025 ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీతో సహా వివిధ పార్టీలు ఇప్పటికే తమ సన్నాహాలు మొదలుపెట్టాయి.తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతల పనితీరు, విజయావకాశాలను పరిగణలోకి తీసుకుని వారికి టిక్కెట్లు కేటాయించనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు అనే భావనతో ఎవరికీ టిక్కెట్లు కేటాయించేది లేదని ఆయన స్పష్టం చేశారు.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీ సత్య మార్గాన్ని అనుసరించిందని, పార్టీకి దేవునితో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
రాజస్థాన్లో చెలరేగిన హింస.. 60 మంది అరెస్ట్
టోంక్: రాజస్థాన్లోని టోంక్ జిల్లాలోని డియోలీ ఉనియారాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నరేష్ మీనా ఎన్నికల విధుల్లో ఉన్న ఎస్డిఎం అమిత్ చౌదరిని చెప్పుతో కొట్టారు. అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. #WATCH | Rajasthan by-poll independent candidate from Deoli-Uniara, Naresh Meena allegedly physically assaulted SDM at a polling station in Samravata villageVehicles vandalised and torched in Samravata village after the incident. pic.twitter.com/dv8jLnymh2— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 13, 2024ఈ ఉదంతంపై ఫిర్యాదు అందిన దరిమిలా పోలీసులు నరేష్ మీనాను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, సంరవత గ్రామస్తులు పోలీసులపై దాడి చేసి, దౌర్జన్యానికి దిగారు. నరేష్ మీనా మద్దతుదారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఉదంతంలో ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసినట్లు అజ్మీర్ రేంజ్ ఐజీ ఓం ప్రకాశ్ తెలిపారు. టోంక్ హింసాకాండపై జిల్లా అదనపు ఎస్పీ బ్రిజేంద్ర సింగ్ భాటి మాట్లాడుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు నరేష్ మీనా కోసం వెతుకుతున్నామని తెలిపారు. గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. Rajasthan: 60 people have been arrested so far in the case of ruckus, stone pelting, and arson incident in Samravata village last night, when police tried to apprehend Naresh Meena, independent candidate for Deoli Uniara assembly constituency by-polls in Tonk district, after he…— ANI (@ANI) November 14, 2024ఇది కూడా చదవండి: కార్తీకమాసంలో ఉసిరిని పూజిస్తే... -
మళ్లీ ట్రంప్ గెలుస్తాడా?
-
హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు
-
ఈ ఐదు అంశాలే.. అధ్యక్ష పీఠానికి ఆయుధాలు
-
మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా పై ఈసీ వేటు
-
కుదేలైన స్టాక్ మార్కెట్
-
జార్ఖండ్ ఎన్నికలు: 32 సీట్లలో ‘లేడీస్ ఫస్ట్’
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అంతకంతకూ ఆసక్తిరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్యనే ఉంది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈసారి మహిళలే కీలకం కానున్నారు. ఓటర్ల జాబితా లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. ఈ 32 స్థానాల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 కోట్లు. వీరిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న స్థానాలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత హేమంత్ సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం ‘మయ్యా సమ్మాన్ యోజన’ను అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. మరోమారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని నెలకు రూ.2500కు పెంచుతామని ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.ఎన్డీఏలో మొత్తం 14 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఏజేఎస్యూలో ఇద్దరు మహిళా అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇండియా కూటమిలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.ఇది కూడా చదవండి: స్టీల్ ప్లాంట్లో పేలుడు.. 12 మంది మృతి -
మహారాష్ట్రలో "మహా" సమరం .. బీజేపీ మూడో జాబితా విడుదల
-
Jharkhand Election: రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
రాంచీ: త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్పై బార్హెట్ స్థానం నుండి గమ్లియాల్ హెంబ్రోమ్ పోటీకి దిగారు.హెంబ్రోమ్ 2019లో బార్హెత్ నుంచి ఏజేఎస్యూ పార్టీ టిక్కెట్పై పోటీ చేసి 2,573 ఓట్లను పొందారు. తుండి స్థానం నుంచి వికాస్ మహతో అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్లో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సాహిబ్గంజ్ జిల్లాలోని బర్హెట్ (ఎస్జీ)నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన సైమన్ మాల్టోపై 25,740 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఇటీవల బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 66 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీని ధన్వార్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ పెద్ద కోడలు, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ను పార్టీ జమ్తారా నుంచి పోటీకి దింపింది. జంషెడ్పూర్ తూర్పు నుంచి మాజీ సీఎం, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు -
మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన మహావికాస్ అఘాడి, మహాయుతి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం మూడు జాబితాలతో కలిపి కాంగ్రెస్ ఇప్పటివరకు 87 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.కాంగ్రెస్ మూడో జాబితాలో డిగ్రాస్ నుంచి మాణిక్రావ్ ఠాక్రేను పార్టీ బరిలోకి దించింది. బాంద్రా వెస్ట్ నుంచి ఆసిఫ్ జకారియా, అంధేరీ వెస్ట్ నుంచి సచిన్ సావంత్లకు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. మాలెగావ్ సెంట్రల్ నుండి కాంగ్రెస్ ఎజాజ్ బేగ్కు అవకాశం కల్పించింది. అయితే సమాజ్ వాదీ పార్టీ ఈ సీటు కోసం పట్టుపడుతున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ తన రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, తొలి జాబితాలో 48 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.మరోవైపు మహా వికాస్ అఘాడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకానికి సంబంధించిన ఫార్ములాను ప్రకటించింది. దీని ప్రకారం శివసేన (యూబీటీ), కాంగ్రెస్- ఎన్సీపీ (ఎస్పీ) చెరో 85 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కొన్ని సీట్ల విషయంలో ఇంకా ప్రతిష్టంభన నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు -
జార్ఖండ్ ఎన్నికల్లో విచిత్రం.. సక్సెస్ @ 60
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వానికి ఝలక్ ఇస్తూ, అనుభవజ్ఞులకు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గణాకాంలను పరిశీలిస్తే, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.2005 ఎన్నికల్లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 18 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, వీరిలో ఐదుగురు విజయం సాధించారు. గెలుపొందిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో కడియా ముండా, ఇందర్ సింగ్ నామ్ధారి లోక్నాథ్ మహతో తదితరులు ఉన్నారు. నాటి ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన రాజేంద్ర ప్రసాద్ సింగ్, యమునా సింగ్, సమరేష్ సింగ్ (ముగ్గురూ మరణించారు) ఓడిపోయారు. 2005 ఎన్నికలలో కడియా ముండా, హరు రాజ్వర్లు 68 ఏళ్లు దాటిన అభ్యర్థులు వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచారు. అయితే అత్యంత వృద్ధ అభ్యర్థి డాక్టర్ విశేశ్వర్ ఖాన్ (83) నాటి ఎన్నికల్లో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఓటర్లు అనుభవజ్ఞులపై నమ్మకం వ్యక్తం చేశారు. 2005తో పోలిస్తే జార్ఖండ్ అసెంబ్లీలో 60 ఏళ్లు పైబడిన నేతల సంఖ్య పెరిగింది. 2005లో ఈ సంఖ్య ఐదు కాగా, 2009లో ఎనిమిదికి పెరిగింది. ఈ ఎన్నికల్లో రాజేంద్ర సింగ్, సమేష్ సింగ్లు తిరిగి ఎన్నికల్లో పోటీచేశారు. రాజేంద్ర సింగ్ బెర్మో నుంచి, సమరేష్ సింగ్ బొకారో నుంచి గెలుపొందారు. అలాగే మాజీ స్పీకర్ ఇందర్ సింగ్ నామ్ధారి 2007లో తన 63 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో ఛత్ర ఎంపీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో సైమన్ మరాండి (61), నలిన్ సోరెన్ (61), ఫూల్చంద్ మండల్ (66), మన్నన్ మల్లిక్ (64), సవన లక్రా (69), చంద్రశేఖర్ దూబే అలియాస్ దాదాయ్ దూబే (66) తదితరులు ఉన్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక వయసు కలిగిన అభ్యర్థి ఫూల్చంద్ మండల్ (71 సంవత్సరాలు)విజయం సాధించారు. 60 ఏళ్లు పైబడిన అభ్యర్థులు సరయూ రాయ్ (63), రామచంద్ర చంద్రవంశీ (68), రాజ్ కిషోర్ మహతో (68), యోగేశ్వర్ మహతో (60), అలంగీర్ ఆలం (60), స్టీఫెన్ మరాండి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన 20 మంది ప్రధాన అభ్యర్థులు ఉండగా, వారిలో 10 ఎన్నికల్లో విజయం సాధించగా, 10 ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో హాజీ హుస్సేన్ అన్సారీ (66), లాల్ చంద్ మహతో (62), మాధవ్ లాల్ సింగ్ (62), రాజేంద్ర ప్రసాద్ సింగ్ (68), సమరేష్ సింగ్ (73) తదితరులు ఉన్నారు.2019లో 60 ఏళ్లు పైబడిన 27 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో 17 మంది విజేతలుగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులలో రాజేంద్ర ప్రసాద్ సింగ్ (73), రామచంద్ర చంద్రవంశీ (72), డాక్టర్ రామేశ్వర్ ఓరాన్ (72), నలిన్ సోరెన్ (71), హాజీ హుస్సేన్ అన్సారీ (70), అలంగీర్ ఆలం (69), సరయూ రాయ్ (68), లోబిన్ హెంబ్రామ్ (68), డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ (66), స్టీఫెన్ మరాండి (66), చంపై సోరెన్ (63), సిపి సింగ్ (63), ఉమాశంకర్ అకెలా (61), బాబులాల్ మరాండి (61), డా. రవీంద్ర నాథ్ మహతో (60) మరియు కమలేష్ కుమార్ సింగ్ (60) ఉన్నారు.ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు..ఎంతంటే.. -
Jharkhand Elections: నేడు రాహుల్ జార్ఖండ్ రాక.. 20న అభ్యర్థుల ఎంపికపై చర్చ
రాంచీ: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు (శనివారం) జార్ఖండ్ రానున్నారు. రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొని, 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన సంభాషించనున్నారు.రాహుల్ గాంధీ తన జార్ఖండ్ పర్యటనలో పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లాక అక్టోబర్ 20న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అదే రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. అభ్యర్థుల పేర్లపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కొనసాగుతుందన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించామని, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో కూడా చర్చలు జరిగాయన్నారు.ఇది కూడా చదవండి: మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’ -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే
-
పంజాబ్: కట్టుదిట్టమైన భద్రత మధ్య పంచాయతీ ఎన్నికలు
చండీగఢ్: పంజాబ్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు(మంగళవారం) గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం 19 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్ల రద్దీ నెలకొంది. ఈ ఎన్నికల్లో దాదాపు 1.05 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 3,798 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంజాబ్లోని సోహల్ సైన్ భగత్ గ్రామంలో ఓటింగ్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అమృత్సర్కు తరలించారు.గత నెలలో అసెంబ్లీ ఆమోదించిన పంజాబ్ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, 2024 ప్రకారం అభ్యర్థులు రాజకీయ పార్టీల చిహ్నాలను ఉపయోగించకుండా నిషేధం విధించారు. రాష్ట్రంలో మొత్తం 1.33 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 70.51 లక్షల మంది పురుషులు, 63.46 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు -
పేపర్ బ్యాలెట్ వైపు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది
-
హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
-
ఓడినా.. ఆ విషయంలో సత్తా చాటిన హర్యానా కాంగ్రెస్
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల ఓట్ల శాతం దాదాపు సమానంగా ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ తగిన మెజారిటీ సాధించింది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్కు 39.09 శాతం ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెండు పార్టీలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్కు ఈసారి 11 శాతం ఓటింగ్ పెరిగింది. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్ల శాతంలో తగ్గుదల కనిపించింది. దీనిని గమనిస్తే ఓట్ల శాతం విషయంలో కాంగ్రెస్ మరింత మెరుగుపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 40 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆ పార్టీ ఓట్ల శాతం 36.49 శాతంగా ఉంది. అదే సమయంలో 31 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్కు 28.08 శాతం ఓట్లు వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) రెండు స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండూ ఎన్నికల్లో విజయానికి దూరమయ్యాయి. రెండు సీట్లు గెలుచుకున్న ఐఎన్ఎల్డీ 2019తో పోలిస్తే ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది. ఇది కూడా చదవండి: 32 ఓట్లతో దక్కిన విజయం -
హర్యానా ఎన్నికల్లో ‘డేరా బాబా’ ప్రభావమెంత?
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సీఎం పదవికి నాయబ్ సింగ్ సైనీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఇదిలాఉండగా డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్కు బెయిల్ మంజూరు చేయడంపై అనేక విమర్శలు తలెత్తాయి. బీజేపీనే డేరా బాబాకు ఎన్నికలకు ముందు పెరోల్ ఇచ్చిందనే ఆరోపణలు వినిపించాయి.జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్కు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు 20 రోజుల పెరోల్ లభించింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో మద్దతు కోసం రామ్రహీమ్కు పెరోల్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో రామ్రహీమ్ విడుదల ఏ పార్టీకి కలసివచ్చిందనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.డేరా మద్దతుదారులున్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15, బీజేపీ 10, ఐఎన్ఎల్డీ రెండు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు 53.57 శాతం, బీజేపీకి 35.71 శాతం, ఐఎన్ఎల్డీకి 7 శాతం, స్వతంత్రులకు 3.57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పరిణామాలు చూస్తే ఈ 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికంగా ప్రయోజనం పొందింది.మీడియా కథనాల ప్రకారం హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని రామ్రహీమ్ సత్సంగ కార్యక్రమంలో తన అనుచరులను కోరాడు. ప్రతి అనుచరుడు కనీసం ఐదుగురు ఓటర్లను బూత్కు తీసుకురావాలని సత్సంగం సందర్భంగా ఈ సూచించినట్లు పలు వార్తలు వినిపించాయి. డేరా బాబా గతంలో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్లకు మద్దతును అందించారు. 2007 హర్యానా ఎన్నికలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో డేరా బాబా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు పలికారు. అయితే 2014లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు అందించారు. ఇది కూడా చదవండి: గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత -
హర్యానాలో ఆప్ ఓటమికి 10 కారణాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. హర్యానాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్కు నిరాశే ఎదురయ్యేలా ఉంది. హర్యానాలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఆశలు అడియాలసలయ్యాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో ఆప్ అభ్యర్థులు ఒక్క సీటులో కూడా ముందంజలో లేరు. హర్యానాలో ఆప్ ఓటమికి 10 ప్రధాన కారణాలివే..కాంగ్రెస్తో పొత్తు లేదు సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. దీంతో బీజేపీ లబ్ధి పొందింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి.ఐదు సీట్లకు పరిమితమై.. ఆప్ మొదట 10 సీట్లు అడిగింది. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆప్ తన డిమాండ్ను ఐదుకి తగ్గించింది. అయితే కాంగ్రెస్ మూడు సీట్లు ఇచ్చింది. ఆప్ అందుకు అంగీకరించలేదు.ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు హర్యానా కాంగ్రెస్ నేతలలో ముఖ్యంగా భూపేంద్ర సింగ్ హుడా ఆప్ సహకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్ సాయముంటే కాంగ్రెస్కు నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు.పేలవమైన పార్టీ పనితీరు హర్యానాలో ఆప్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాన్ని చూపలేదు. గత ఎన్నికల్లోనూ ఆప్కు విజయం దక్కలేదు. ఓట్ల శాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యింది.బీజేపీకి అనుకూల గాలి హర్యానాలో బీజేపీకి అనుకూలమైన గాలి వీచింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న సీట్లు కాంగ్రెస్కు ఆప్కు ఆఫర్ చేసింది. ఇక్కడ పోటీని ఎదుర్కోవడం ఆప్కు కష్టమయ్యింది.అట్టడుగు నుంచి మద్దతు శూన్యంహర్యానాలో ఆప్కు అట్టడుగు స్థాయి నుంచి మద్దతు దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్లతో పోలిస్తే అంత బలపడని కారణంగా విజయం సాధించలేకపోయింది. స్థానిక నాయకత్వ లోపం కూడా ఏర్పడింది.చీలిన బీజేపీ వ్యతిరేక ఓట్లు హర్యానాలో పలు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లు చీలిపోయి, ఆప్ విజయావకాశాలు మరింత తగ్గాయి.ఆకట్టుకోవడంలో విఫలం ఆప్ నేతలకు సంబంధించిన వివాదాల కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. హర్యానా ప్రజల హృదయాలను ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.వ్యూహాత్మక అంచనా లోపం హర్యానాలో ఆప్ తన బలాన్ని అంచనా వేయడంలో తప్పుగా లెక్కలు వేసుకుంది. ఇది వైఫల్యానికి దారితీసింది.సమయం కేటాయించని నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ నేతలు తమ పూర్తి సమయం కేటాయించలేదు. చివరి క్షణం వరకూ ఆప్కు కాంగ్రెస్తో పొత్తు కుదరలేదు. దీంతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, వ్యూహాలు రచించడం ఆప్కి భారంగా మారింది. ఇది కూడా చదవండి: కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న సీఎం -
Pulwama Assembly: పుల్వామాలో గట్టి పోటీ
పుల్వామా: నేడు(సోమవారం) హర్యానాతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. జమ్ముకశ్మీర్లోని 90 నియోజకవర్గాల్లో పుల్వామా అసెంబ్లీ స్థానం ఒకటి. పుల్వామా అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గంలో భాగం. ఈసారి పుల్వామా సీటుపై గట్టి పోటీ నెలకొంది.నేషనల్ కాన్ఫరెన్స్ పుల్వామా సీటు నుంచి మహ్మద్ ఖలీల్ బంద్ను నిలబెట్టింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వాహిద్ పారాకు టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండడంతో ఈ సీటు నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలో చేరింది. ఈ స్థానానికి 1962లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ మాత్రమే ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తున్నాయి.ఈ సీటుపై బీజేపీ నేటికీ ఖాతా తెరవలేదు.2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీపీకి చెందిన మహ్మద్ ఖలీల్ విజయం సాధించారు. పుల్వామా జిల్లా మొత్తం జనాభా 5.60 లక్షలు. జిల్లా పరిపాలనా కేంద్రం శ్రీనగర్కు 31 కిలోమీటర్ల దూరంలో పుల్వామాలో ఉంది. జిల్లాలో 85.65శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో, 14.35శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం వరితో పాటు నాణ్యమైన కుంకుమపువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.ఇది కూడా చదవండి: Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి -
Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి
చండీగఢ్: హర్యానాలోని మొత్తం 90 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది. నేడు(మంగళవారం) ఆయా స్థానాల ఫలితాలు వెల్లడికానున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందా? అనేది నేడు తేలనుంది. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అదేవిధంగా బరిలో ఉన్న పలువురు బడా నేతల ఫలితంపై అందరి దృష్టి నిలిచింది.భూపేంద్ర సింగ్ హుడాహర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటుపై ఆయనకు గట్టి పట్టు ఉంది. హుడా రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్కు మెజారిటీ వస్తే సీఎం పదవికి ఆయనే బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.నాయబ్ సింగ్ సైనీమనోహర్ లాల్ ఖట్టర్ను హర్యానా నుండి ఢిల్లీకి పంపిన తరువాత, బీజేపీ నాయబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ఆయన కురుక్షేత్రలోని లాడ్వా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్కు చెందిన మేవా సింగ్ పోటీనిస్తున్నారు. గత ఎన్నికల్లో మేవా సింగ్ లాడ్వా స్థానం నుంచి గెలుపొందారు.అనిల్ విజ్హర్యానా బీజేపీలో విజ్ కీలక నేతగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన విజ్ అంబాలా కాంట్ అభ్యర్థి. 1967 నుంచి 2019 వరకు పంజాబీ వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.దుష్యంత్ చౌతాలాఉచానా స్థానం నుంచి జేజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా పోటీ చేస్తున్నారు. గతంలో ఐదేళ్ల పాటు ఆయన బీజేపీ ప్రభుత్వంతో జతకట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల పంపకంపై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పొత్తు తెగిపోయింది. 2019లో ఉచానా స్థానం నుంచి దుష్యంత్ చౌతాలా గెలుపొందారు.వినేష్ ఫోగట్పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి తిరిగి వచ్చిన తరువాత, వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. జులనా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. వినేష్పై బీజేపీ తరపున మాజీ పైలట్ యోగేష్ బైరాగి పోటీ చేస్తున్నారు.సావిత్రి జిందాల్దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి. సావిత్రి జిందాల్ హర్యానాలో మంత్రిగా కూడా పనిచేశారు.ఇది కూడా చదవండి: కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు -
Haryana Elections-2024: ఆ సీట్లపైనే అందరి దృష్టి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టి హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై నిలిచింది. ఈ రాష్ట్రం రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్నందున ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకం కానున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఈసారి బీజేపీతో పాటు కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జేజేపీ, బీఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) పోటీలో ఉన్నాయి. జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.రాష్ట్రంలో మొత్తం 1,031 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక కోటి 5 లక్షల మంది పురుషులు, 95 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే తపనతో ఉండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉంది. హర్యానా ఎన్నికల్లో తొలిసారిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత హర్యానా ఎన్నికల్లో ఆప్ సత్తాను చాటాలని ప్రయత్నిస్తున్నారు. కాగా హర్యానాలోని కొన్ని సీట్లు అధికార పీఠానికి చేరువ చేసేవిగా పరిగణిస్తారు. వాటి వివరాల్లోకి వెళితే..లాడ్వాలాడ్వా స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కురుక్షేత్ర లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీకి 47 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ సీటు బీజేపీకి సురక్షితమైన సీటుగా చెబుతారు. ఈ సీటు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జోగా సింగ్, ఐఎన్ఎల్డీకి చెందిన షేర్ సింగ్ బర్సామి, కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్, జేజేపీకి చెందిన వినోద్ శర్మ పోటీపడుతున్నారు.జులానాహర్యానాలోని జులనా సీటు కూడా అధికారానికి కీలకమైనదని చెబుతారు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యోగేష్ బైరాగికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. గత ఎన్నికల్లో 49 శాతం ఓట్లతో గెలిచిన అమర్జీత్ ధండాకు జేజేపీ టికెట్ ఇచ్చింది. సురేంద్ర లాథర్కు ఐఎన్ఎల్డీ టికెట్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కైత దలాల్కు టికెట్ కేటాయించింది.హిసార్ఈసారి అందరి చూపు హిసార్ స్థానంపైనే నిలిచింది. ఇక్కడి నుంచి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తా ఇక్కడి నుంచి ఎన్నికల పోరులో దిగారు. ఆయన 2014 ఎన్నికల్లో జిందాల్ కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. నాడు సావిత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ రామ్ నివాస్ రారాను బరిలోకి దింపింది. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: మాగ్నైట్కు ఎగుమతి కేంద్రంగా భారత్ -
నేడే హరియాణా ఎన్నికల సమరం
చండీగఢ్: హరియాణా శాసనసభ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని హరియాణా ఎన్నికల కమిషనర్ పంకజ్ అగర్వాల్ శుక్రవారం చెప్పారు. 20,623 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 101 మంది మహిళలు ఉన్నారు.అలాగే ఈసారి ఏకంగా 464 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్ఎల్డీ–బీఎస్పీ, జేజేపీ–ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీ, కాంగ్రెస్ నేత భూపీందర్సింగ్ హుడా, రెజ్లర్ వినేశ్ ఫోగాట్, జన నాయక్ జనతా పార్టీ అగ్రనేత దుష్యంత్ చౌతాలా తదితరులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. -
పెరోల్పై డేరా బాబా విడుదల.. ఆశ్రమంలో సందడి
రోహ్ తక్(హర్యానా): డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)పెరోల్ పై విడుదలయ్యారు. రోహ్తక్లోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన పోలీసు భద్రత మధ్య యూపీలోని తన బర్నావా ఆశ్రమానికి చేరుకున్నారు. దీంతో ఆశ్రమంలో సందడి వాతావరణం నెలకొంది.రామ్ రహీమ్కు ఇరవై రోజుల పెరోల్ మంజారయ్యింది. ఈ పెరోల్ వ్యవధిలో రామ్ రహీమ్ ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, హర్యానాలోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉంది. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ 20 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అతనికి పెరోల్ మంజూరైంది. పెరోల్ నిబంధనల ప్రకారం డేరా చీఫ్ హర్యానా ఎన్నికలకు దూరంగా ఉండాలి. #WATCH हरियाणा: डेरा सच्चा सौदा प्रमुख गुरमीत राम रहीम सिंह को 20 दिन की पैरोल मिलने के बाद रोहतक की सुनारिया जेल से रिहा कर दिया गया। pic.twitter.com/0pUomsdRrt— ANI_HindiNews (@AHindinews) October 2, 2024రామ్ రహీమ్ పెరోల్ దరఖాస్తును జైలు అధికారులు ఎన్నికల కమిషన్కు పంపారు. పెరోల్ లభిస్తే తాను ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఉండేందుకు సిద్ధమని డేరా చీఫ్ తెలిపారు. 2017లో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్ను దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 16 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో రామ్ రహీమ్తో పాటు మరో ముగ్గురికి కూడా 2019లో జైలు శిక్ష పడింది.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
Jammu and Kashmir Assembly Polls: సాయంత్రం 5 గంటల వరకు 65.84 శాతం ఓటింగ్ నమోదు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడవ, చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అత్యంత ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జమ్ము ప్రాంతంలోని జమ్ము, ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలు, ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాలకు చెందిన 39.18 లక్షల మంది ఓటర్లు 5,060 పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకు 65.84 శాతం ఓటింగ్ నమోదైంది. ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 72.91%, సాంబా (72.41%), కథువా (70.53%), జమ్ము (66.79%), బండిపోరా (63.33%), కుప్వారా (62.76%), బారాముల్లా (55.73%) పోలింగ్ నమోదైంది.నియోజకవర్గాలలో జమ్మూ జిల్లాలోని ఛంబ్ మొదటి 10 గంటల్లో 77.35% పోలింగ్తో ముందంజలో ఉంది. ఒకప్పుడు తీవ్రవాద, వేర్పాటువాదుల కోటగా ఉన్న సోపోర్ సెగ్మెంట్లో అత్యల్పంగా 41.44% పోలింగ్ నమోదైంది.#JKAssemblyPolls2024Voting percentage upto 05:00 pm for #PhaseII: 65.48%#NoVoterToBeLeftBehind #IVote4Sure #Trends #MyVoteMyPride pic.twitter.com/FCPCPnohga— CEO UT OF J&K (@ceo_UTJK) October 1, 2024జమ్ము కశ్మీర్ చివరి దశ పోలింగ్: మధ్యాహ్నం 1 గంట వరకు 44 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు 28.12 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఉదంపూర్లో 33.84 శాతం ఓటింగ్ నమోదైంది. బారాముల్లాలో 23.20 శాతం ఓటింగ్ నమోదైంది. #WATCH | Baramulla, J&K: National Conference candidate from Sopore, Irshad Rasool Kar casts his vote in the third and the last phase of Assembly elections today pic.twitter.com/DIbJ3iHvqQ— ANI (@ANI) October 1, 2024జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తుదివిడత పోలింగ్లో మొత్తం 415 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ దశ ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజానికి చెందినవారు, గూర్ఖా కమ్యూనిటీవారు ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఏడు జిల్లాల్లో 20,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.#WATCH सांबा: जम्मू-कश्मीर विधानसभा चुनाव के तीसरे चरण का मतदान शुरू हो गया है। लोग भारी संख्या में मतदान करने के लिए पहुंच रहे हैं। वीडियो सांबा के एक मतदान केंद्र से है। pic.twitter.com/iyDIei160g— ANI_HindiNews (@AHindinews) October 1, 2024శాంతియుతంగా ఓటింగ్ జరిగేందుకు పోలింగ్ ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్ము రీజియన్ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 61.38 శాతం పోలింగ్ నమోదుకాగా, సెప్టెంబర్ 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్ నమోదయ్యింది. నేడు జరగనున్న తుదివిడత ఎన్నికల్లో 18 నుండి 19 ఏళ్ల మధ్య వయసు గల 1.94 లక్షల మంది యువకులు, 35,860 మంది వికలాంగ ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన 32,953 మంది వృద్ధ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రహేళిక -
‘కేజ్రీవాల్ జైల్లో ఎందుకు రాజీనామా చేయలేదు?’
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ నేత సంజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి హర్యానాలో బీజేపీ అధికారం నుండి దిగిపోతుందని, ఆమ్ ఆద్మీ పార్టీ సాయం లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదన్నారు. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కింగ్ మేకర్ అవుతారని, అధికార రిమోట్ కేజ్రీవాల్ చేతుల్లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఎందుకు రాజీనామా చేయలేదో కూడా సంజయ్ సింగ్ వివరించారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ తాము సీట్ల విషయంలో కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకోలేదని, వారు, తాము విడివిడిగానే పోటీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వారి ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకోవాల్సి ఉందని, అయితే రిమోట్ కేజ్రీవాల్ చేతిలో ఉంటుందనే నమ్మకం తనలో ఉందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 90 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.గత పదేళ్ల పాలనలో సీఎం ఖట్టర్ హర్యానాను పూర్తిగా దిగజార్చారని, ఇప్పుడు నిరుద్యోగం విషయంలో భారతదేశంలో హర్యానా మొదటి స్థానంలో ఉందన్నారు. అగ్నివీర్ పథకంపై గ్రామాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ప్రభుత్వ పనితీరుపై రైతులు మండిపడుతున్నారన్నారు.జైల్లో ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని సంజయ్ సింగ్ను మీడియా ప్రశ్నించగా అదేగనుక జరిగివుంటే, బీజేపీ వ్యూహం ఫలించేదని.. ఆ తర్వాత మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, పి. విజయన్.. ఇలా అందరినీ జైల్లో పెట్టి, బీజేపీ వారి రాజీనామాలను తీసుకుని ఉండేదని అన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేసి, అతిశీని ముఖ్యమంత్రిని చేశారని, ఢిల్లీ ప్రజలు నాలుగు నెలల తర్వాత మళ్లీ కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా ఎన్నికుంటారని సంజయ్ సింగ్ దీమా వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ -
జమిలి ఎన్నికలకు కేంద్రం ఓకే.. త్వరలో దేశం మొత్తం ఎన్నికలు..
-
హర్యానా ఎన్నికల్లో సమాజ్వాదీ ఒంటరి పోరు?
యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ పార్టీని మరో ముందడుగు వేయించనున్నారు. పార్టీని ప్రాంతీయానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అఖిలేష్ యాదవ్ సమాయత్తమవుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, మధ్యప్రదేశ్లో మాదిరిగా హర్యానాలో కూడా ఒంటరిగా పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టి యూపీలో 37 సీట్లు గెలుచుకుంది. ఈ ఫలితాల అనంతరం పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించేదిశగా కసరత్తు ప్రారంభించారు.హర్యానాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో అహిర్ ఓటర్లు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. ఎనిమిది నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీనికితోడు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ఓటర్లు ఉత్తరప్రదేశ్కు చెందినవారు కావడం విశేషం. ఇవన్నీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలసివచ్చే అంశాలని సమాజ్వాదీ పార్టీ భావిస్తోంది. -
UP By Election : సంఘ్ చేతికి బీజేపీ ఉప ఎన్నికల బాధ్యతలు
మొన్నటి యూపీ లోక్సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గత పోరు చోటుచేసుకుంది. ఇప్పుడు దీనిని ఆపేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ నేత అరుణ్కుమార్ల సమక్షంలో సమావేశం జరిగింది.ప్రభుత్వం- సంఘ్ మధ్య మెరుగైన సమన్వయంతో పాటు ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ ప్రతినిధుల నియామకం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల సన్నాహాల్లో బీజేపీతో పాటు సంఘ్ కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు.దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు బీజేపీ నష్టపోవాల్సి వస్తుందని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు ప్రభుత్వం, సంఘ్ మధ్య పరస్పర సమన్వయంపై చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలను సంఘ్కు అప్పగించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ వ్యూహమిదే?
హర్యానాలో ఈ ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పలు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన రాజకీయ అనుభవజ్ఞులు హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ ఎన్నికలకు బీజేపీ పటిష్టమైన వ్యూహం సిద్ధం చేస్తోంది. దీనిలో కుల సమీకరణలకు ప్రాధాన్యతనివ్వనున్నారని సమాచారం.ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ఢిల్లీకి చెందిన ఏడుగురు బీజేపీ ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాట్లు, గుర్జర్లు, వాల్మీకులు, వ్యాపార వర్గాలతో సహా పూర్వాంచలిలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. హర్యానా ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ కీలకపాత్ర పోషించనున్నారు.దక్షిణ ఢిల్లీ ఎంపీ రామ్వీర్ సింగ్ బిధూరి హర్యారాలోని గుర్జర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు, పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జిత్ సెహ్రావత్ జాట్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు. నార్త్-వెస్ట్ ఢిల్లీ ఎంపీ యోగేంద్ర చందోలియా రిజర్వ్డ్ తరగతిని ఆకట్టుకునేందుకు ప్రచారం సాగించనున్నారు. చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ వ్యాపార వర్గాల్లో తన పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈయనకు ఎంపీగా మారకముందు నుంచే వ్యాపార వర్గాలవారితో సన్నిహిత సంబంధాలున్నాయి. కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా హర్యానాలోని పంజాబీ కమ్యూనిటీ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముందుకు కదులుతున్నారు. -
Jammu and Kashmir: కింగ్మేకర్గా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు
జమ్ముకశ్మీర్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వు చేసిన 16 స్థానాలు కింగ్మేకర్ పాత్రను పోషించనున్నాయి. వీటిలో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఏడు సీట్లు, షెడ్యూల్డ్ తెగకు చెందిన తొమ్మిది సీట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్పై ఈ వర్గానికి చెందిన ఓటర్లలో ఉత్సాహం నెలకొంది.జమ్ముకశ్మీర్లోని ఈ 16 స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెండుగా అవకాశాలుంటాని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, బీజేపీ ఖాతాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎన్సీ ఖాతాలో ఏడు, కాంగ్రెస్ ఖాతాలో రెండు, అప్నీ పార్టీ ఖాతాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. 16 రిజర్వ్డ్ సీట్లలో 13 జమ్మూ డివిజన్లో ఉండగా, మూడు కాశ్మీర్లో ఉన్నాయి. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆరింటిలో, కాంగ్రెస్కు ఒక చోట ఆధిక్యం లభించింది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన తొమ్మిది స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు ఏడు స్థానాల్లో, ఎన్సీ ఒకదానిలో, కాంగ్రెస్ ఒకదానిలో ఆధిక్యం దక్కించుకుంది.తొలిసారిగా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన కారణంగా ముఖ్యంగా రాజోరి-పూంచ్ జిల్లాలో ఇప్పుడున్న సమీకరణలు మారిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో పహారీ, గుజ్జర్ వర్గాల వారికి అధికారం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్లో కూడా మూడు సీట్లు ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఇక్కడ పహారీ, గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలనూ ఎన్సీ కైవసం చేసుకుంది. -
యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన మాయావతి, ఆజాద్
ఉత్తరప్రదేశ్లోని పది అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొననున్నదనే మాట వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించుకుంది. లోక్సభలో విజయం సాధించిన చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోరులోకి దూకారు. ఇప్పటి వరకూ మాయావతి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఘజియాబాద్ సదర్ స్థానం నుండి చౌదరి సత్పాల్, ముజఫర్నగర్లోని మీరాపూర్ స్థానం నుండి జాహిద్ హసన్, మీర్జాపూర్లోని మజ్వాన్ స్థానం నుండి ధీరజ్ మౌర్యలను ఎన్నికల బరిలోకి దించినట్లు ప్రకటించింది. మిగిలిన ఏడు స్థానాల్లో పోటీకి దిగే అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని పార్టీ తెలిపింది.ఇక బీఎస్పీ విషయానికొస్తే మిల్కిపూర్, మిరాపూర్ నుండి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. మిల్కీపూర్ టిక్కెట్ను రామ్ గోపాల్ కోరికి ఇవ్వగా, మీరాపూర్ నుండి చంద్రశేఖర్ ఆజాద్కు సన్నిహితుడైన షా నాజర్ను అభ్యర్థిగా నిలబెట్టారు. షా నాజర్ ప్రస్తుతం బీఎస్పీ జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ పార్టీలో సభ్యునిగా ఉన్నారు. -
ఓటమి ఒప్పుకున్న టీడీపీ.. పోటీ నుంచి ఔట్..
-
నకిలీ నారా.. మళ్లీ ఓటుకు నోటు
-
‘ఎలక్టోరల్ బాండ్’ పై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల (ఇబి) ఎలక్టోరల్ ఫైనాన్సింగ్పై న్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది. ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ ద్వారా రాజకీయ పార్టీలు, పలు కార్పొరేట్ కంపెనీల మధ్య క్విడ్ ప్రోకో జరిగాయని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇదే అంశంపై సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాయి.ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం..శుక్రవారం (ఆగస్ట్2న)విచారించింది. సిట్ ఏర్పాటుకు నిరాకరించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం కూడా తొందరపాటే అవుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. Supreme Court declines petitions seeking a probe by a Special Investigation Team (SIT) into the alleged instances of quid pro quo arrangements between corporates and political parties through Electoral Bonds donations.In February, the Supreme Court had struck down the Electoral… pic.twitter.com/0bnAC6TwIE— ANI (@ANI) August 2, 2024రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. -
కంగనా ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీంతో పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. మండి లోక్సభ స్థానం నుంచి ఆమె ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కంగనా ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను రద్దు చేయాల్సిందేనని కిన్నౌర్కు చెందిన లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను(రామ్ నేగి) వేసిన నామినేషన్ పత్రాన్ని అసంబద్ధంగా తిరస్కరించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు.. ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కంగనా రనౌత్కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆదేశాలు జారీ చేశారు. మండీ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లాయక్ రామ్ నేగి తాను పోటీచేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ, తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు చెల్లవని, అందుకే కంగనా రనౌత్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.లాయక్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారికి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ను కూడా సమర్పించారు. విద్యుత్, నీరు, టెలిఫోన్ తదితర శాఖల నుంచి ఎలాంటి బకాయిలు లేవని చూపేందుకు ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒకరోజు సమయం ఇచ్చారు. అయితే నేగి ఈ సర్టిఫికెట్లను గడువులోగా సమర్పించినప్పటికీ, రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించినట్లు నేగి ఆరోపిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం.. నేగి దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా తిరస్కరించినట్లు రుజువైతే, మండీ లోక్సభ ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి. మండి లోక్సభ స్థానం నుంచి రనౌత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
ఆప్ ఖాతాలో పంజాబ్ అసెంబ్లీ సీటు
ఇటీవల పంజాబ్లోని ఒక శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితం వెలువడింది. జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 13 దశల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మొహిందర్ భగత్ బీజేపీ అభ్యర్థి శీతల్ అంగురాల్పై విజయం సాధించారు.మొహిందర్ భగత్ 37325 ఓట్లతో విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శీతల్ అంగురాల్ రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ కౌర్ మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జలంధర్లోని మొహిందర్ భగత్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి మొహిందర్ భగత్ ముందంజలో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సూర్జిత్ కౌర్ నాలుగో స్థానంలో ఉండగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి బిందర్ కుమార్ ఐదో స్థానంలో నిలిచారు.ఆప్ ఎమ్మెల్యే అంగురల్ రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయ్యింది.ఈ నేపధ్యంలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జూలై 10న పోలింగ్ జరగగా, 54.98 శాతం ఓటింగ్ నమోదైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో 67 శాతం ఓటింగ్ నమోదయ్యింది.