బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Published Thu, May 9 2024 4:50 AM

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

వనపర్తిటౌన్‌: తనను గెలిపిస్తే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయనతో పాటు వాసవి సేవాసమితి జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. 50 ఏళ్లు అఽధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ చేయని అభివృద్ధిని కేవలం రెండుసార్లు గెలిచి ప్రధాని మోదీ చేసి చూపించారన్నారు. బీజేపీతోనే ప్రగతి సాధ్యమని ప్రజలు గుర్తించి ఓటేయాలని కోరారు. అనంతరం పూరి సురేష్‌ మాట్లాడుతూ.. గతంలో అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని విస్మరించాయని, మోదీ పాలనలోనే సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆర్యవైశ్యుల మద్దతు బీజేపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌కే ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆకుతోట దేవరాజు, లక్ష్మీనారాయణ, గోనూరు యాదగిరి, బచ్చు వెంకటేష్‌, బాసెట్టి శ్రీనివాసులు, బచ్చు రాము, కొండా కిషోర్‌, మారం గోవిందు, నవీన్‌, సుమన్‌, భాగ్యలక్ష్మి, వసంత, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement