‘మరోసారి ప్రధానిగా మోదీ’ | Sakshi
Sakshi News home page

‘మరోసారి ప్రధానిగా మోదీ’

Published Mon, May 6 2024 11:55 PM

‘మరోసారి ప్రధానిగా మోదీ’

భీమారం: నరేంద్రమోదీని మరోసారి దేశ ప్ర ధానిగా చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పెద్దపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద మాట్లాడుతూ బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో దేశంలో స్కాంలు పెద్దయెత్తు న జరిగేవని విమర్శించారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అభివృద్ధితోపాటు దేశ ప్రతిష్టత పెంచే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ కుటుంబ పాలనను అంతం చేయాలని, బీజేపీ అభ్యర్థిగా తనను భారీ మో జార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌, పార్టీ మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్‌, ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement