భీమారం: నరేంద్రమోదీని మరోసారి దేశ ప్ర ధానిగా చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పెద్దపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి రోడ్షో నిర్వహించారు. బస్టాండ్ వద్ద మాట్లాడుతూ బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో స్కాంలు పెద్దయెత్తు న జరిగేవని విమర్శించారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అభివృద్ధితోపాటు దేశ ప్రతిష్టత పెంచే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ కుటుంబ పాలనను అంతం చేయాలని, బీజేపీ అభ్యర్థిగా తనను భారీ మో జార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, పార్టీ మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్, ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘మరోసారి ప్రధానిగా మోదీ’
Published Mon, May 6 2024 11:55 PM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా బుమ్రా
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement